amp pages | Sakshi

ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలం

Published on Sat, 04/30/2016 - 04:03

ఆయనొక అసమర్థ సీఎం
మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్

 
విజయవాడ (మధురానగర్) : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి హెచ్‌బీ చౌదరి పార్లమెంట్ ఆవరణలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని నీతి ఆయోగ్ చెప్పిందని పేర్కొనడం తెలుగు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.  ప్రత్యేక హోదాపై కేంద్రంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని,  కేంద్ర మంత్రివర్గం నుంచి తమ మంత్రులను ఉపసంహరించుకోవాలని కోరారు.

తాను 22 సార్లు ఢిల్లీ వెళ్లానని, ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూలంగా ఉందంటూ సీఎం ప్రజలను మాయ చేస్తున్నారన్నారు.  హెచ్‌బీ చౌదరి ప్రకటనతో సీఎం చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రిగా నిలిచిపోయారన్నారు. సీఎం, కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు, ఎంపీలు కనీసం ప్రత్యేక హోదా కావాలంటూ అడగలేని దుస్థితిలో ఉన్నారని జోగి రమేష్ పేర్కొన్నారు. తాను ప్రత్యేక హోదాపై పోరాడలేని దద్దమ్మను అని సీఎం ఒప్పుకుంటే.. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే ప్రాణత్యాగం చేసైనా ప్రత్యేక హోదా సాధించటానికి తాము సిద్ధమేనని జోగి రమేష్ చెప్పారు.

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
ప్రత్యేక హోదా ఆంధ్రుల  హక్కు అని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తెలుగు ప్రజల వాడీవేడిని కేంద్రానికి చూపిస్తామన్నారు. హోదాపై వెంకయ్యనాయుడు నోరు మెదపకపోవటం విచారకరమన్నారు.  అమరావతి నిర్మిస్తున్నామంటూ నగరంలోనే మకాం వేసిన సీఎం రాజకీయ వ్యభిచారం చేస్తూ రోజుకో ఎమ్మెల్యేలను కొంటూ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం అంటే ప్రజలు అని, ఎంతమంది ఎమ్మెల్యేలను కొన్నా ప్రజల మనస్సుగెలవలేరని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 

ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు పదేళ్లపాటు హైదరాబాద్‌పై హక్కు ఉన్నప్పటికీ కేసీఆర్‌కు భయపడి ఆరునెలలకే పారిపోయి  ఇక్కడికి మకాం మార్చారన్నారు. చైనా, జపాన్, సింగపూర్ తదితర దేశాల నాయకులను ప్రాధేయపడుతున్న చంద్రబాబు రాష్ట్రానికి  ప్రత్యేక హోదా తీసుకువస్తే వారే మన వద్దకు వచ్చి పెట్టుబడులు పెడతారని జోగి రమేష్ చెప్పారు. ప్రత్యేక హోదాపై ఇప్పటికే వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష చేశారని, రాష్ట్రంలోని యువతను జాగృతం చేశారని, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)