వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లక్షన్నర కంటే ఎక్కువ అప్పుంటే బినామీలే: బాబు
Published on Fri, 07/25/2014 - 14:14
లక్షన్నర కంటే ఎక్కువ పంట రుణాలు ఉన్నవాళ్లు బినామీలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కదిరిలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజమైన రైతులు ఎవరికీ లక్షన్నర కంటే ఎక్కువ అప్పు ఉండదని, అంతకంటే ఎక్కువ అప్పులు ఉన్నవాళ్లు బినామీలే అవుతారని అన్నారు. తనకు ఏది న్యాయం అనిపిస్తే అదే చేస్తానని కూడా ఆయన చెప్పారు.
ఇదే సందర్భంలో డీఈడీ అభ్యర్థులపై కూడా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉద్యమాలు చేస్తే ఉద్యోగాలు రావంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం అనిపిస్తే మాత్రం వాళ్లకు డీఎస్సీలో అవకాశం కల్పిస్తానని, లేకుంటే చేసేదేమీ లేదంటూ అసహనం వెళ్లగక్కారు. తనకు మొదట కార్యకర్తలే ముఖ్యమని, ఆ తర్వాతే ఓటేసిన ప్రజలని ఆయన అన్నారు.
#
Tags