amp pages | Sakshi

అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం

Published on Mon, 03/04/2019 - 12:09

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని ఆ పార్టీ మేనిఫెప్టో కమిటీ సభ్యులు, డోన్‌ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్‌ సంజీవకుమార్‌ తెలిపారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన మేనిఫెస్టో రూపకల్పన కోసం జిల్లాలోని పార్టీ 19 అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..మేనిఫెస్టోలో రైతులకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు.  గిట్టుబాటు ధరలు, ధరల స్థీరీకరణ నిధి, పెండింగ్, నూతన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి కోసం సిఫారసు చేయనున్నట్లు చెప్పారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌తోపాటు ఇతర ప్రాజెక్టుల నుంచి సమీపంలోని చెరువులకు నీటిని నింపేందుకు కృషి చేస్తామన్నారు. 

వేదవతి, గుండ్రేవుల, రాజోలిబండ డైవర్షన్‌ స్కీంలతోపాటు ఎల్‌ఎల్‌సీ పైపులైన్‌ పనులను కేవలం ఎన్నికల స్టంట్‌గా సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారని విమర్శించారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే వాటిని పూర్తి చేయించడానికి కృషి చేస్తామన్నారు. మేనిఫెస్టోలో మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.  వ్యవసాయం, అనుబంధ రంగాలు, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు సిఫారసులు చేయనున్నట్లు చెప్పారు. యువతీ, యువకులకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నివేదించనున్నట్లు తెలిపారు. అనంతరం పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని క్రోడీకరించిన కమిటీ సభ్యులు నివేదిక రూపంలో రాష్ట్ర కమిటీకి దృష్టికి తీసుకెళ్లన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చెన్నకేశవరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మురళీకృష్ణ, ఆళ్లగడ్డ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి(నాని), చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి, తోట కృష్ణారెడ్డి, ఎస్‌ఏ రెహమాన్, సీహెచ్‌ మద్దయ్య, రుద్రగౌడ్, గోపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, హబీబుల్లా, బుట్టా రంగయ్య, కరుణాకరరెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, భాస్కరరెడ్డి, బెల్లం మహేశ్వరరెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, కొనేటి వెంకటేశ్వర్లు, మహిళలు శశికళ, రేణుకమ్మ, వై.సుధా, విజయకుమారి, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌