ప్రేమించలేదని నిప్పంటించాడు..

Published on Sat, 08/19/2017 - 14:57

విశాఖపట్టణం: ప్రేమ త్యాగం కోరుతుంది అంటారు. తాను ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా సంతోషంగా సుఖంగా ఉండాలనే ప్రేమికులు కోరుకుంటారు. కానీ విశాఖ జిల్లాలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదంటూ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. భీమిలి మండలం టీనగరం పాలెంలో శనివారం దారుణం చోటుచేసుకుంది.

నిందితుడు సంతోష్‌ గత ఆరునెలలుగా రూపను ప్రేమిస్తున్నానంటూ వేధించసాగాడు. అయితే రూప సంతోష్‌ ప్రేమను నిరాకరించింది. దీంతో రగిలిపోయిన సంతోష్‌ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న రూపపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో రూప చనిపోగా అడ్డుకోబోయిన రూప సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని బంధువులు వెంటనే కేజీహెచ్ కు తరలించారు. కాగా, సంతోష్ విజయనగరం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు ఫోన్ సమాచారం అందింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ