వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పేదల ఇళ్లకు ప్రభుత్వ భూములు కేటాయిస్తాం..
Published on Thu, 10/17/2019 - 20:28
సాక్షి, అమరావతి : ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారని మంత్రి తెలిపారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ భూములు కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లో 11 వేల ఎకరాల భూమి అవసరమని గుర్తించామని, అవసరమైతే భూములు కొనుగోలు చేసి పేదలకు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్థలాల కొనుగోలుకు రూ. 12 వేల కోట్లు ఖర్యు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఎక్కడా అవినీతికి తావులేకుంగా పేదలకు ఇచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని, అంతేగాక ఇళ్ల స్థలాన్ని లబ్ధిదారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
#
Tags