amp pages | Sakshi

‘కాషాయం’ చాటున భూదందాలు!

Published on Tue, 09/10/2019 - 10:48

సాక్షి, కావలి (నెల్లూరు): పట్టణంలో బీజేపీ భూదందాలు శృతిమించుతున్నాయి. కావలి పట్టణంలోని ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములను ఆక్రమించుకోవడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం అనంతరం పార్టీ ముసుగులో అధికారులను బెదిరించడం కావలిలో నిత్యకృత్యమైపోయాయి. పనిలో పనిలో అధికార వైఎస్సార్‌సీపీ నాయకులపై విమర్శలు చేసి తమ దందాలో ఎక్కడా జోక్యం చేసుకొని తమకు అడ్డు పడకుండా కట్టడి చేసే విధంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

బీజేపీ నాయకుల తీరు!
పట్టణంలోని బాలకృష్ణారెడ్డి నగర్‌లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాలను బీజేపీ నాయకురాలు పేదలు వద్ద వసూళ్లకు పాల్పడి వారికి నకిలీ పట్టాలు ఇచ్చింది. ఆ స్థలాలు వద్దకు వెళ్లిన పేదలను అసలు యజమానులు అడ్డుకొన్నారు. దీంతో రెక్కల కష్టాన్ని బీజేపీ నాయకురాలుకు ఇచ్చిన పేదలు ఆందోళన చెంది, తమల్ని ఇలా చేశారేమిటని ప్రశ్నిచడంతో, ఆమెకు పార్టీలో ఒకరిద్దరు నాయకులు అండగా నిలబడ్డారు. బీజేపీ నాయకురాలు బాధితులైన పేదలు నేరుగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కలిసి తమగోడు చెప్పకొన్నారు. అలాగే అధికారులను కలిసి తాము మోసపోయిన వైనాన్ని కన్నీటిపర్యంతమై తెలియజేశారు. దీంతో అధికారులు విచారించి పేదలు మోసపోయారని గుర్తించి, న్యాయం చేయాలని నిర్ణయించారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా అధికారులను కలిసి...‘జరిగిందేదో జరిగిపోయింది పేదలకు న్యాయం చేయాలి’ అని కోరారు. చివరిగా రెవెన్యూ అధికారులు బీజేపీ నాయకురాలి బాధితులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.

వ్యూహాత్మకంగా కమిషన్‌ ఏర్పాటు
బీజేపీ నాయకులు అధికారులను భయపెట్టి తమకు అనుకలూంగా మలుచుకోవాలని వ్యూహాత్మకంగా జాతీయ ఎస్సీ, బీసీ కమీషన్‌ సభ్యులను కావలికి తీసుకొచ్చి విచారణ జరిపించారు. వారు కూడా ఇంటి పట్టాలు కావాలంటే అధికారులు ఇవవాలే కాని, ప్రవేటు వ్యక్తులు ఎలా ఇస్తారని అసహనం వ్యక్తం చేయడంతో స్థానిక బీజేపీ నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయి పడినట్లు అయింది. ఇది ఇలా ఉండగా చివరి అస్త్రంగా సాక్షత్తూ ఐఏఎస్‌ అధికారి అయిన కావలి సబ్‌ కలెక్టర్‌ను బెదిరించి తొంగదీసుకోవాలని బీజేపీ నాయకులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించినప్పటికీ ఆయన బెదరలేదు. దీంతో చేసేది ఏమీ లేక ఆ వ్యహారాన్ని పక్కనపెట్టేశారు.

ఇక పట్టణంలోని మద్దూరుపాడు వద  1986   రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఫ్లాట్లుగా అమ్మేసిన స్థలాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. వాటిపై కన్నుపడిన ఒక బీజేపీ నాయకుడు మరో ఇద్దరిని కలుపుకొని అక్కడ  10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దీంతో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు తమ స్థలాలను బీజేపీ నాయకుడు, మరికొందరు కలిసి ఆక్రమించుకొని కంచె వేసి మళ్లీ ఫ్లాట్లుగా తయారు చేసి అమ్మకాలకు సిద్ధమౌతున్నారని అధికారులను కలిసి మొర పెట్టుకొన్నారు. ఫ్లాట్ల యజమానులను తీవ్రస్థాయిలో బెదించారు. ఈ స్థలాలు విషయంలో పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ సమస్యను ను నేటి వరకు అధికారులు తేల్చనే లేదు.

ముసునూరులోనూ భూదందా
ముసునూరులోనే పమిడి స్కూలును ఆనుకొని ఎకరా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి బీజేపీ నాయకుడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్వాధీనం చేసుకొన్నాడు. వీటిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ భూములన్నీ కూడా బహిరంగ మార్కెట్‌లో రూ. కోట్లు విలువ చేసేవి కావడం గమనార్హం. ఈ పరిణామాల నేపధ్యంలో కావలి బీజేపీలో భూదందాలు చేసే వారిలో తీవ్ర అసహనం నెలకొంది. అధికారులు తమకు లొంగి అణిగిమణిగి ఉండి తమకు అడ్డు రాకుండా ఉండాలంటే, మొదట అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యేను, ఆ పార్టీ నాయకులు గురించి ఏదో ఒక విధంగా రోడ్డెక్కి గోల చేస్తే కాని పరిస్థితులు తమకు అనుకూలంగా ఏర్పడవనే అభిప్రాయానికి వచ్చారు.

ఈ నేపధ్యంలో వారికి డబ్బును ఇవ్వగలిగిన కొత్త వ్యక్తి చేతిలో ఉండటంతో ఆయనకు నాయకత్వం పెంచుతామని చెప్పి, సోమవారం కావలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద భూదందాలు, బెదింపులు అంటూ  ధర్నా చేసారు. ఇందుకోసం కావలి టౌన్, కావలిరూరల్, జలదంకి, బోగోలు మండలాలాల్లోని పేదలకు కావలికి ఆటోలో వచ్చి వెళ్లితే రూ.100 ఇస్తామని చెప్పడంతో, పలువురు వచ్చారు. వయోభారంతో ఉన్న వారు కూడా బీజేపీ వారు సమకూర్చిన ఆటో ఎక్కి కావలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)