వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి
Published on Sun, 10/11/2015 - 09:33
పాల్వంచ (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా పాల్వంచలో ఆటో డ్రైవర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. వివరాల ప్రకారం... పాల్వంచ పట్టణంలోని నెహ్రూనగర్ వికలాంగుల కాలనీలో భాస్కర్(44) అనే ఆటో డ్రైవర్ నివాసముంటున్నాడు. కాగా కాలనీకి సమీపంలో రాతిచెరువు వద్ద ఆదివారం ఉదయం భాస్కర్ మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు.
అతని శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయి. గొంతుపై కత్తి గాట్లు ఉండడంతో ఎవరో హతమార్చి పడేశారని భావిస్తున్నారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
#
Tags