amp pages | Sakshi

ఆరిన ఆశా దీపం

Published on Mon, 03/30/2015 - 03:28

ఆయనది మధ్య తరగతి కుటుంబం.. బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. పిల్లలు తన లాగా కాష్టపడకూడదనున్నాడు.. ఎంత శ్రమైనా సరే తనే పడి ఉన్నత చదువులు చదివించాలనుకున్నాడు.. పెద్ద కుమారుడిని సీఏ చదివిస్తున్నాడు.. పెద్ద ఉద్యోగం చేయాలని ఆశపడ్డాడు.. అయితే ఆయన కలలు కల్లలయ్యాయి.. చేతికొచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
 
ప్రొద్దుటూరు క్రైం: రూరల్ పరిధిలోని ఖాదర్‌బాద్ గ్రామ సమీపంలో లారీ ఢీ కొన్న సంఘటనలో మోటార్‌సైకిల్‌పై వస్తున్న యనమల రాజేశ్వరరెడ్డి (17) అక్కడికక్కడే మృతి చెందాడు. అతను చాపాడులో శ్రీరామనవమిని ముగించుకుని వస్తుండగా ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ఎర్రగుంట్లలోని శ్రీరాములపేటకు చెందిన విజయభాస్కర్‌రెడ్డి బేల్దారి పని చేసుకుని జీవనం సాగించేవాడు. అతనికి రాజేశ్వరరెడ్డి, అమరనాథరెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

పెద్ద కుమారుడు రాజేశ్వరరెడ్డి గుంటూరులోని మాస్టర్ మైండ్ కాలేజీలో సీఏ, అమరనాథరెడ్డి 9వ తరగతి చదువుతున్నారు. విజయభాస్కర్‌రెడ్డిది మధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ తనలాగా పిల్లలు కష్టపడకూడదని బాగా చదివిస్తున్నాడు. వారిద్దరిని ఎలాగైనా పెద్ద చదవులు చదివించి ప్రయోజకులను చేయాలని ఎప్పుడూ ఇంట్లో చెప్పేవాడు. ఈ క్రమంలోనే రాజేశ్వరరెడ్డిని సీఏ చదివిస్తున్నాడు. కొడుకులు ప్రయోజకులు అవుతున్నారని ఎన్నో కలలు కన్నారు. తమ జీవితాలను బాగు చేస్తారని ఆశపడ్డారు. ఈ క్రమంలో ఇటీవల మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న పెద్ద కుమారుడు సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చాడు.
 
అవ్వగారింటికి పండుగకు వెళ్లివస్తుండగా:
చాపాడులో జరిగే శ్రీరామనవమి పండుగకు రావాలని రాజేశ్వరరెడ్డి అవ్వ ఫోన్ చేయడంతో అతను బంధువులతో కలిసి శనివారం అక్కడికి వెళ్లాడు. పండుగ వేడుకలు ముగించుకుని ఆదివారం ఉదయం ఎర్రగుంట్లకు మోటార్‌సైకిల్‌లో తన మామ రఘురామిరెడ్డితో కలిసి బయల్దేరాడు. వారి వాహనం ఖాదర్‌బాద్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొంది.

ఈ సంఘటనలో రాజేశ్వరరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలియడంతో చాపాడు, ఎర్రగుంట్లలో ఉన్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ ముసలయ్య జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. రూరల్ ఏఎస్‌ఐ శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
 
ఎర్రగుంట్లలో విషాదం:
 ఎర్రగుంట్ల: రాజేశ్వరరెడ్డి మృతితో ఎర్రగుంట్లలో విషాదం నెలకొంది. ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రికి ఎర్రగుంట్ల ఎంపీపీ లక్ష్మీదేవి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఎర్రగుంట్ల టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సంతాపం ప్రకటించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)