amp pages | Sakshi

డిసెంబర్‌లోగా హైకోర్టు భవనం

Published on Tue, 10/02/2018 - 05:03

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యే దశలో ఉందని, ఈ ఏడాది డిసెంబర్‌లోగా నిర్మాణం పూర్తవుతుందని, అప్పటివరకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆ రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేయాలని 2015లో ధన్‌గోపాల్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను గత ఆగస్టు 30న విచారించిన ధర్మాసనం వివరణ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టు రిజిస్ట్రీకి నోటీసులు ఇచ్చింది. తాజాగా సోమవారం జస్టిస్‌ ఎ.కె.సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం వద్దకు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది.

ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ఫాలీ ఎస్‌.నారీమన్‌ వాదనలు ప్రారంభించారు. జస్టిస్‌ సిక్రీ జోక్యం చేసుకుని.. ‘మీరు ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి ఎంత సమయం అవసరం?’ అని ప్రశ్నించారు. ‘హైకోర్టు భవనం, న్యాయమూర్తులు, సిబ్బంది వసతి గృహాల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. డిసెంబరులోగా పూర్తవుతుంది..’ అని నారీమన్‌ నివేదించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ స్పందిస్తూ.. ‘ప్రస్తుత హైకోర్టు భవనాన్ని ఏపీకి వదిలిపెట్టి తాము తాత్కాలికంగా మరోచోట ఏర్పాటు చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం గత విచారణలో ప్రతిపాదించింది...’ అంటూ గుర్తుచేశారు. జస్టిస్‌ సిక్రీ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు అక్టోబర్‌లోకి వచ్చాం. డిసెంబర్‌ దగ్గర్లోనే ఉంది.

ఇప్పుడు ఆ ప్రతిపాదన అవసరం లేదు కదా..’ అని వ్యాఖ్యానించారు. అయితే ఏపీ గత మూడేళ్లుగా ఇదే చెబుతోందని కేకే వేణుగోపాల్, తెలంగాణ ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేస్తుందని, అప్పటివరకు పరిష్కారం కానిపక్షంలో తిరిగి తమను ఆశ్రయించవచ్చని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అఫిడవిట్‌ సిద్ధంగా ఉంది.. ఇప్పుడే సమర్పిస్తామని నారీమన్‌ చెప్పగా.. ‘ఇన్నేళ్లుగా చెబుతున్నది ఇదే కదా..’ అంటూ వేణుగోపాల్‌ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ‘ఏంటి ఇబ్బంది’ అంటూ జస్టిస్‌ సిక్రీ ఏపీ న్యాయవాదిని ప్రశ్నించారు. ‘ఏమీ లేదు.

ఇప్పుడు ఏపీలోని అధికార పార్టీ ఎన్డీయేలో లేదు..’ అని ఆయన బదులిచ్చారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేదని, కేంద్రం రాజధాని నిర్మాణానికి, హైకోర్టు భవనాలు, ఇతర భవనాల నిర్మాణానికి నిధులు ఇచ్చిందని వేణుగోపాల్‌ తెలిపారు. ఇప్పుడు ఏపీ అఫిడవిట్‌ ఇస్తే కేసు పరిష్కారమైనట్టే కదా? అని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. వాదనల అనంతరం పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలుకు 2 వారాల గడువిస్తూ ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ తరఫున అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ ఎస్‌.ఉదయకుమార్‌ సాగర్, ఏపీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాసరావు విచారణకు హాజరయ్యారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)