రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్మగ్లర్ల ఆట కట్టిస్తాం: డీజీపీ గౌతమ్ సవాంగ్
Published on Fri, 11/08/2019 - 16:19
సాక్షి, విజయవాడ: మత్తు పదార్థాలను రవాణా చేసే స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల ఆట కట్టిస్తామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీజీపీ సూచించారు.మత్తు పదార్థాల రవాణాను నిరోధించడానికి దక్షిణాది పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ డాటా ద్వారా గంజాయి పంటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల మధ్య సమన్వయ చర్చల ద్వారా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రవాణాను నివారిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
#
Tags