amp pages | Sakshi

‘గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన’

Published on Mon, 09/30/2019 - 15:05

సాక్షి, కడప : గాంధీ జయంతి సందర్భంగా ఆయన కన్న కల ‘గ్రామ స్వరాజ్యాన్ని’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేశారని ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా అన్నారు. కడప ఆర్ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెత్తం 1.60 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానిదే అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఉద్యోగాలు ఇచ్చామని, ప్రతి గ్రామ సచివాలయంలో 10మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. అలాగే గ్రామ సచివాలయం ద్వారా ప్రజల వద్దకే పాలన వెళ్లనుందని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో నవరత్నాల పథకాలు అమలు చేయాలని కృషి చేస్తున్నామన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్‌ ఒక్కరేనని పేర్కొన్నారు.

కౌలు రైతులకు మేలు కలిగేలా ప్రత్యేక చట్టం తీసుకువచ్చామని, భూ చట్టం ద్వారా రీ సర్వే చేయించనున్నామని, దీని ద్వారా భూ సమస్యలను తగ్గించడానికి సులభంగా ఉంటుందని అనుకుంటున్నామన్నారు. మానిఫేస్టోలో ఇచ్చిన ప్రతి పథకాన్ని 100 రోజుల్లో అమలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్‌ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ ఉగాదికి 25 లక్షల మందికి రిజిస్ట్రేషన్‌ చేసిన భూములను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

అలాగే  రాష్ట్ర చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కూడా మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకుని చారిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తీసుకున్నారని అన్నారు. గాంధీ కలలు కన్న స్వరాజ్యాన్ని సీఎం జగన్‌ నేరవేరుస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో పేజీ పేజీలు లేదని... రెండు పేజీల మ్యానిఫెస్టో మాత్రమే ఇచ్చామన్నారు. మూడు నెలల లోపే 85 శాతం మానిఫెస్టోని అమలు చేసామని, జగన్‌ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు తన పచ్చమీడియా ద్వారా దుష్పచారం చేస్తున్నారని.. బాబు అక్రమ ఇంట్లో ఉంటూ ఇప్పటి వరకు దానిపై నోరు తెరవలేదని అన్నారు. చంద్రబాబు కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా పనికి రాడని విమర్శించారు.  ఇప్పటికిప్పుడు జగన్‌ పేరు, చంద్రబాబు పేరు మీద ఓటింగ్‌ పెడితే 99 శాతం ఓట్లు జగన్‌కే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన మధ్యపాలసీ అమలు చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక అందించాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు.

Videos

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)