amp pages | Sakshi

గ్రామ స్వరాజ్యానికి నేడే అంకురార్పణ

Published on Wed, 10/02/2019 - 03:21

సాక్షి, అమరావతి: గ్రామ స్థాయి పరిపాలనలో భారీ మార్పునకు శ్రీకారం చుడుతూ గ్రామ సచివాలయాల వ్యవస్థ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి చోటా 10–12 మంది దాకా ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది. దాదాపు ప్రతి ఊరిలో ఒక గ్రామ సచివాలయం.. జనాభా అత్యధికంగా ఉన్న గ్రామంలో ఆరేడు సచివాలయాలు కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటు రానున్నాయి. ఈ సచివాలయాల్లో పని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే విడతలో 1,34,918 లక్షల ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది. 

ప్రతి సేవకు నిర్ధిష్ట కాలపరిమితి 
పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇంటి పట్టా వంటి వాటికి కోసం పేదల మండలాఫీసులు, కలెక్టరేట్, రాజధానిలో ఉండే శాఖాధిపతుల కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. ప్రస్తుతం గ్రామ స్థాయిలో కేవలం 19 రకాల సేవలు పంచాయతీల ద్వారా అందజేసే అధికారం ఉంది. ఈ పరిస్థితిని మార్చేస్తూ 500 రకాల ప్రభుత్వ సేవలను గ్రామ సచివాలయ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రతినెలా కొన్ని సేవల చొప్పున గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందజేస్తారు. జనవరి 1వ తేదీ కల్లా 500 రకాల సేవలను ప్రజలు పూర్తిగా గ్రామ సచివాలయంలోనే పొందేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సేవలు అందజేసే విషయంలో నిర్ధిష్ట కాలపరిమితి విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఆయా శాఖల పరిధిలో జరిగే పనులను గ్రామ సచివాలయం అనుమతితో చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలిసేలా.. 
గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే ప్రతి అభివృద్ది పని, ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారుల పేర్లను అక్కడి ప్రజలందరి సమక్షంలో చర్చించి, నిర్ణయించాలని, ఏడాదిలో తప్పనిసరిగా ఎనిమిది సార్లు గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను అదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా పారదర్శకంగా అర్హులకే వాటిని అందించడానికి గాను ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాను అందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో ఉంచుతారు. ఏ శాఖ ద్వారా ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారనే వివరాలను సచివాలయంలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు. 

సచివాలయంతో వలంటీర్ల అనుసంధానం 
ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమించారు. వీరు పింఛన్, రేషన్‌ సరుకులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తారు. వలంటీర్లు గ్రామ సచివాలయంతో అనుసంధానమై పని చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామీణ ప్రాంతంలో 1,93,421 మంది గ్రామ వలంటీర్లు.. పట్టణ ప్రాంతాల్లో 74,659 మంది వార్డు వలంటీర్లు... మొత్తం 2,68,080 మంది వలంటీర్లను రాష్ట్ర సర్కారు నియమించింది.  

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)