amp pages | Sakshi

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ

Published on Thu, 01/23/2020 - 02:28

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ భూ కుంభకోణంపై ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రాథమి కంగా 4,070 ఎకరాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్టు నిర్ధారించి దీనిపై మరింత సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసర ముందని సూచించిందని తెలిపారు. రాజధాని ప్రకటన వెలువడకముందే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అమరావతిలో రాజధాని వస్తుందని తెలు సుకుని భారీగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. దీనిపై రెండు రోజుల క్రితం సభలో సమగ్ర చర్చ జరిగిందని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించమని స్పీకర్‌ కూడా ఆదేశాలిచ్చారని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై తగిన ఏజెన్సీతో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. 

భూములను దోచిపెట్టారు..
తీర్మానంపై చర్చలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 4,070 ఎకరాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎలా జరిగిందో అన్ని ఆధారాలతో సభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వివరిం చారని, ఈ నేపథ్యంలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. కంచే చేను మేసేలా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరించారని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. కావాల్సిన వాళ్లకు భూములను చంద్రబాబు దోచిపెట్టారన్నారు. రాజధాని గురించి ముందే తెలుసుకుని ఈ ప్రాంతంలో తక్కువ ధరలకు భూములు కొని.. తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకుందామని చూశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దోచుకోవాలనే చూస్తారని మండిపడ్డారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని నూజివీడులో రానుందని, మరో ప్రాంతమని చెబుతూ తొలుత లీకులిచ్చారని, అయితే చంద్రబాబు, ఆయన అనుచరులు మాత్రం అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. చంద్రబాబుకు కొట్టే బుద్ధి ఉంటే.. జగన్‌కు పెట్టే బుద్ధి ఉంటుందని వ్యాఖ్యానించారు. బాబు దోచుకునే, దాచుకునే విధానానికి అలవాటు పడ్డారన్నారు. సీబీఐతో విచారణ జరిపించి ఈ దొంగలందర్నీ లోపల వెయ్యాలన్నారు. 

భూసమీకరణను విధ్వంసం సృష్టించేలా చేశారు
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌కమిటీలో తానూ సభ్యుడినని, ప్రాథమికంగా 4,070 ఎకరాల మేరకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్టు గుర్తించామని మంత్రి కన్నబాబు తెలిపారు. దీన్ని సమర్థిస్తూ టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌ భూములు కొంటే తప్పేముందనడం దారుణమన్నారు. బినామీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేశవ్‌ అడిగారని, ఆయన వినతి మేరకు ఆ చట్టం కింద కూడా చర్యలు చేపట్టాలని కోరారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిపిన వారిపై అసైన్డ్‌ ల్యాండ్‌ 1977 యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్‌ యాక్ట్‌ కింద చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్డ్‌ భూములు కొనడమే తప్పంటుంటే వాటిని లీకువీరుడు చంద్రబాబు తనకు, తన బినామీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. రాజధాని భూసమీకరణను విధ్వంసం సృష్టించే విధంగా చేశారన్నారు. అనంతరం తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)