amp pages | Sakshi

కోవిడ్‌పై రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు

Published on Mon, 03/23/2020 - 05:27

సాక్షి, అమరావతి: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోవిడ్‌–19ని మహమ్మారిగా ప్రకటించడంతో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జీవో జారీ చేసింది. అవి..  
- అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద స్క్రీనింగ్‌ చేయాలి. 
- సాధారణ సమావేశాలు వాయిదా. అత్యవసర సమయంలోనే సమావేశాలు. 
- అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి వ్యాధి నిరోధానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి.  
-  ప్రజారవాణా వాహనాలు, ప్రైవేటు వాహనాలతోపాటు రాష్ట్ర సరిహద్దుల మూసివేత. 
- అత్యవసర సేవలు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. నిత్యావసరాలను ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు. జిల్లాల కలెక్టర్లు ధరలు నిర్ణయిస్తారు. అధిక ధరలకు అమ్మితే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. 
-  ప్రభుత్వం రొటేషన్‌ పద్ధతిలో ఉద్యోగులతో పనిచేయిస్తుంది. 
- ప్రతి పేద కుటుంబానికి ఈ నెల 29న రేషన్‌ సరుకులను కేజీ పప్పుతోపాటు ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది. 
- ఏప్రిల్‌ 4న రేషన్‌ కార్డు ఉన్న కుటుంబానికి రూ.1,000 ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది. గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఇస్తారు.  
- ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఐసొలేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. 
- ప్రతి జిల్లా కేంద్రంలో హై ఎండ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం 200 పడకల సెంటర్‌ ఏర్పాటు 
- ఎవరికైనా గొంతు నొప్పి, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినవారు, వారితో కలిసిన వారు ఈ లక్షణాలతో బాధపడితే వెంటనే 104కి ఫోన్‌ చేస్తే డాక్టర్లు వైద్య సేవలు అందిస్తారు. 
- పదో తరగతి పరీక్షలు యధావిధిగా జరుగుతాయి. దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారికి వేరే రూములు కేటాయిస్తారు.  
- సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్స్, సోషల్‌ ఈవెంట్‌ సెంటర్లు, బంగారం షాపులు, బట్టల దుకాణాలను ఈ నెల 31 వరకు మూసివేస్తారు.   
- ఆటోలు, ట్యాక్సీలను అత్యవసర సమయంలో మాత్రమే వినియోగించాలి. అప్పుడు కూడా కేవలం ఇద్దరిని మాత్రమే ఎక్కించుకోవాలి. 
- విదేశాల నుంచి వచ్చే వారంతా తప్పనిసరిగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 
- పోలీసులు విదేశాల నుంచి వచ్చిన వారిపై గట్టిగా పర్యవేక్షణ చేయాలి.  
- అత్యవసర, నిత్యావసరాలు.. పెట్రోల్, గ్యాస్, ఔషధాల షాపులు, పాలు, కూరగాయలు, కిరాణా షాపులు తెరిచే ఉంటాయి.  

ధరలు పెంచితే కేసులు: సీఎస్‌ 
నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని, నిర్ణయించిన ధరలకు మించి అమ్మితే పోలీసు కేసులు నమోదుచేయాలని చీఫ్‌ సెక్రెటరీ నీలం సాహ్ని ఆదేశించారు. కరోనాపై ఆదివారం రాత్రి ఆమె జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)