చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, సభ వాయిదా

Published on Thu, 08/28/2014 - 09:34

హైదరాబాద్ : శాసన సభ గురువారం ప్రారంభంతోనే పది నిమిషాలుపాటు వాయిదా పడింది.  డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మాట తప్పుతోందని ప్రధాన ప్రతిపక్షం ఆక్షేపించింది. డ్వాక్రా మహిళల రుణాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజా, ఉప్పులేని కల్పన వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ ...వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి...ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

అయితే అత్యంత ముఖ్యమైన ఈ విషయంపై చర్చ జరగాలని ప్రధాన ప్రతిపక్షం కోరింది.  చర్చకు స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మరో రూపంలో విషయాన్ని ప్రస్తావించాలని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో కాసేపు కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ప్రశ్నోత్తరాలు మొదలు పెట్టాలని స్పీకర్ సూచించారు. దీనిపై ఓవైపు సభ్యులు మాట్లాడుండగా.. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు నిరనస వ్యక్తం చేశారు. దీంతో సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ