amp pages | Sakshi

ఏపీకి రూ.21,000 కోట్ల ఏఐఐబీ రుణం

Published on Fri, 02/07/2020 - 04:57

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్‌ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఏఐఐబీ వైస్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ డి.జె.పాండియన్, డైరెక్టర్‌ జనరల్‌–ఇన్వెస్ట్‌మెంట్‌ ఆపరేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ యీ–ఎన్‌–పంగ్, ప్రిన్సిపల్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషలిస్ట్‌ సోమనాథ్‌ బసు భేటీ అయ్యారు.

ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, 62 శాతం మంది ప్రజలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని, ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగమేనని సీఎం జగన్‌ ఈ సందర్భంగా వారికి వివరించారు. అందుకే ఇరిగేషన్‌ ప్రాజెక్టులు తమకు అత్యంత ప్రాధాన్యమైనవని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రాధాన్యత అనుకుంటే దానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు అందగానే వెంటనే ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని బ్యాంకు ప్రతినిధులు స్పష్టం చేశారు.

ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఎన్నో కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నవరత్నాలు సహా పలు కార్యక్రమాలపై ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు ఆరా తీశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, అట్టడుగున ఉన్న వర్గాల వారిని ఆదుకోవడానికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎం జగన్‌ వారికి వివరించారు. స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు – నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం, మధ్యాహ్న భోజనంలో చేపట్టిన మార్పుల గురించి తెలిపారు. నిరక్షరాస్యతను నిర్మూలించడానికి, ఆ దిశగా పిల్లలను బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ‘అమ్మఒడి’ కింద నేరుగా నగదు బదిలీ చేసిన అంశాన్ని కూడా బ్యాంకు అధికారులకు స్పష్టంగా వివరించారు.

ఉపాధే లక్ష్యంగా ఉన్నత విద్యా కోర్సుల్లో తీసుకువస్తున్న మార్పులను, ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని, ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పూర్తి స్థాయి రీయింబర్స్‌మెంట్, విద్యా వసతి పథకం గురించి కూలంకషంగా వివరించారు. ఈ కార్యక్రమాలపై ఏఐఐబీ ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. నాలెడ్జ్‌ మీద పెడుతున్న పెట్టుబడులుగా అభివర్ణించారు. భవిష్యత్తు తరాలకు ఇవ్వగలిగే ఆస్తి చదువేనన్న సీఎం వ్యాఖ్యలతో వారు ఏకీభవించారు.

మీ ప్రణాళికలు బాగున్నాయి. 20 ఏళ్లుగా ప్రైవేటైజేషన్‌ మాటలు విన్నాం. ప్రజల కేంద్రంగా, వారి సంక్షేమం, నాణ్యమైన జీవన ప్రమాణాల సాధన ధ్యేయంగా చేపట్టిన కార్యక్రమాల గురించి మళ్లీ ఇప్పుడే వింటున్నాం. మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా తప్పక సాయం చేస్తాం.  – సీఎం జగన్‌తో ఏఐఐబీ ప్రతినిధులు 

ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులకు తప్పక సాయం 
వైద్య విద్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై బ్యాంకు ప్రతినిధులు సీఎంను ఆరాతీశారు. ప్రతి పార్లమెంటు స్థానానికి ఒక బోధనాసుపత్రి ఉండేలా చూస్తున్నామని, దీనికోసం మరో 16 మెడికల్‌ కాలేజీలు కొత్తగా పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తగా నిర్మించదలచుకున్న పోర్టుల గురించి వారు  సీఎంను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో పోర్టులను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

ఒక పోర్టుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఇరిగేషన్, రోడ్లు, వాటర్‌ గ్రిడ్, ఎయిర్‌ పోర్టుల నిర్మాణాలకు తమ సహాయం ఉంటుందని తెలిపారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం గురించి కూడా సీఎం వారికి వివరించారు. సముద్రంలో కలిసిపోతున్న నీటిని తరలించడం ద్వారా శాశ్వతంగా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించుకున్న ఏ ప్రాధాన్యతలకైనా తమ సహాయం ఉంటుందని ఏఐఐబీ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించడానికి ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌