గుండెపోటుతో ‘ఆశ’ వర్కర్‌ మృతి

Published on Sat, 11/24/2018 - 08:22

తూర్పుగోదావరి, వేండ్ర (పెదపూడి): విధి నిర్వహణలో శిక్షణ పొందుతూ ఆశ వర్కర్‌గా పని చేస్తున్న పలివెల చిట్టెమ్మ(50) గుండెపోటుతో మృతి చెందిందని సంపర ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ  వేండ్ర గ్రామానికి చెందిన పలివెల చిట్టమ్మ ఈనెల 20 సామర్లకోటలోని టీటీడీసీ సెంటర్‌కు శిక్షణ నిమిత్తం వెళ్లిందని, గురువారం అర్ధరాత్రి సమయంలో ఆమెకు అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో వెంటన్‌ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయిందన్నారు. 

ఆశ వర్కర్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి
సామర్లకోట టీటీడీసీలో శిక్షణ పొందుతూ మృతి చెందిన ఆశ వర్కర్‌ పలివెల చిట్టెమ్మను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, మండల సీఐటీయూ నాయకురాలు ఎం.రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామంలో చిట్టెమ్మ భౌతికకాయాన్ని వారు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యురాలైన కోడలకు ఆశ వర్కర్‌ ఉద్యోగం ఇవ్వాలని, ఆశవర్కర్‌కు చంద్రన్న బీమా పథకం  వర్తింపజేయాలన్నారు. అలాగే తగిన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మండల ఆశవర్కర్ల నాయకురాలు రెడ్డి వెంకటలక్ష్మి, సంపర పీహెచ్‌సీ నాయకురాలు సుందరపల్లి మణిరత్నం, డీ.రత్నం, కె.పద్మవతి, సీహెచ్‌ మంగయమ్మ, జి.ఈశ్వరి తదితరులు ఉన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ