వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్యను దారుణంగా హతమార్చిన భర్త
Published on Tue, 06/30/2015 - 11:32
అర్ధవీడు (ప్రకాశం): తనను జైలుకు పంపించిందనే కోపంతో.. భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన ఎర్రగుంట రాంబాబుకు అదే గ్రామానికి చెందిన మధవి(27)తో రెండేళ్ల కిందట మూడో వివాహం జరిగింది. వివాహం అయినప్పటినుంచి తన బంగారాన్ని తాకట్టు పెట్టుకొని వచ్చిన డబ్బును జల్సాలకు ఖర్చుచేయడంతో ఆగ్రహించిన మాధవి అతన్ని జైలుకు పంపింది.
ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నరాంబాబు సోమవారం బెయిలు మీద బయటకు రాగానే మాగుటూరుకు వచ్చి భార్య కళ్లలో కారం కొట్టి, వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారైన నిందితుడు.. కొద్దిసేపటి కిందటే కంభం పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.
#
Tags