రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ట్రాక్టర్ బోల్తా : 8మందికి గాయాలు
Published on Thu, 07/30/2015 - 16:06
కర్నూలు (గడివాముల) : అతి వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో.. మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నవారు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా గడివాముల మండలం తిరుపాడు సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వేల్పనూరు గ్రామానికి చెందిన షబ్బీర్ తన కొడుకూ, కూతురుకి పుట్టు వెంట్రుకలు తీయించడానికి గోరుకల్లులోని దర్గాకు ట్రాక్టర్లో వెళ్తున్నారు.
ఈ క్రమంలో ట్రాక్టర్ తిరుపాడు కొరుటమద్ది మధ్యకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో షఫివుల్లా(34) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో నంద్యాల ఆస్పత్రికి తరలించారు.
#
Tags