బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

Published on Mon, 09/09/2019 - 08:49

సాక్షి, తూర్పుగోదావరి(అనపర్తి) : స్థానిక ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన సుమారు పదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు ఆదివారం అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్‌టీఆర్‌ కాలనీ పుల్లారెడ్డి గారి వీధిలో అనుపోజు ప్రసాద్‌ (70) తన భార్య వరలక్ష్మితో కలిసి అద్దె ఇంటిలో ఉంటున్నాడు. గత నెల 25న ఆ ఇల్లు ఖాళీ చేసి రెండు వీధుల ముందర మరో ఇంట్లోకి అద్దెకు వెళ్లారు. ఆ ఇంటికి సమీపంలో ఉన్న కిరాణా షాపు వద్దకు ఆదివారం సాయంత్రం Výæతంలో ప్రసాద్‌ అద్దెకు ఉండే ఇంటికి సమీపంలో నివసించే బాలిక వచ్చింది. ఆమెను ప్రసాద్‌ తమ ఇల్లు చూసేందుకు రమ్మని పిలిచాడు. ఇంట్లోకి ఆమె వచ్చాక తలుపు గడియ వేసి ఆమె నోరు నొక్కి అత్యాచార యత్నం చేశాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన వరలక్ష్మి  కిటికీలోంచి చూసి భర్తపై కేకలు వేయగా ప్రసాద్‌ తలుపులు తెరిచి  పారిపోయాడు. తమకు ఏ విధమైన ఫిర్యాదూ అందలేదని పోలీసులు తెలిపారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ