వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉపాధి హామీలో 70 లక్షలు స్వాహా...అరెస్ట్
Published on Fri, 03/27/2015 - 11:29
తూర్పుగోదావరి: జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను స్వాహా చేసిన కేసులో ఎనిమిది మంది నిందితులు శుక్రవారం ఉదయం అరెస్టయ్యారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉపాధి హామీ పథకంలో రూ.70 లక్షల నిధుల స్వాహాపై గతేడాది డిసెంబర్లో కేసు నమోదు అయింది. మిగిలిపోయిన నిధులను కొల్లగొట్టేందుకు.... పనులు చేయకపోయినా చేసినట్టు చూపించి రూ.70 లక్షలు స్వాహా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఉపాధి హామీ పథకం ఏపీవో నాగేంద్ర, కంప్యూటర్ ఆపరేటర్లు బాబు, బుల్లెబ్బాయిలతో పాటు నిధులు మళ్లించేందుకు ఖాతాలను సమకూర్చిన మరో ఐదుగురిని ఏఎస్పీ ఫకీరయ్య ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
(రంపచోడవరం)
#
Tags