amp pages | Sakshi

పది పరీక్షలపై.. డేగ కళ్ల నిఘా

Published on Sun, 02/14/2016 - 02:55

పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమేరాల ఏర్పాటు
మాస్‌కాపీయింగ్, అక్రమాలు అరికట్టేందుకు విద్యాశాఖ సమాయత్తం
జిల్లాలోని 304 సెంటర్లలో ఏర్పాటుకు ప్రతిపాదనలు
ప్రారంభం కానున్న పరీక్షలు

 
గుంటూరు ఎడ్యుకేషన్
   పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అక్రమాలకు తావు లేకుండా అనుక్షణం డేగ కళ్లతో పర్యవేక్షించేందుకు సమాయత్తమవుతోంది. పరీక్ష కేంద్రాల పరిధిలో తొలిసారిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా సీసీ కెమేరాల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు చర్యలు వేగవంతం చేసింది. విద్యాశాఖ నిర్ణయం అమల్లోకి వస్తే పరీక్ష కేంద్రాల్లో తొలిసారిగా సీసీ కెమేరా వ్యవస్థ అమల్లోకి  జిల్లాలో పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్న 304 విద్యాసంస్థలు సీసీ కెమేరా వ్యవస్థతో అనుసంధానం కానున్నాయి. పబ్లిక్ పరీక్షల్లో ఏటా మాల్ ప్రాక్టీసులకు పాల్పడి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నారు.


జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే మారుమూల ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని నివారించేందుకు పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పరీక్షాల విభాగంలోని మెయిన్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్షలకు హాజరైన విద్యార్థులు, ఇన్విజిలేటర్ల కదలికలు, పరీక్షలు జరుగుతున్న తీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుంటుంది. అవకతవకలు చోటు చేసుకుంటే వీడియే పుటేజీ ఆధారంగా బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)