మృతిచెందిన కోళ్ల విక్రయం

Published on Sat, 03/21/2020 - 13:13

విజయనగరం, సాలూరు: కరోనాపై అవగాహన కల్పించేందుకు, సాధారణ తనిఖీల నిమిత్తం శుక్రవారం పెదబజారులో మున్సిపల్‌ కమిషనర్‌ నూకేశ్వరరావు సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ క్రమంలో ఓ చికెన్‌ దుకాణం సమీపంలో వేలాడదీసి ఉన్న మృతిచెందిన కోళ్లను గుర్తించారు. కమిషనర్‌ను చూసిన సదరు దుకాణదారుడు పారిపోయాడు. వెంటనే సిబ్బందితో కలిసి కమిషనర్‌ దుకాణంలోకి వెళ్లి పరిశీలించారు. మరణించిన కోళ్లను శుభ్రపరిచి ఐస్‌బాక్స్‌లో పెట్టి ఉండడాన్ని గమనించారు. ఆ కోళ్లను  సిబ్బందితో ప్రత్యేక మున్సిపల్‌ వాహనంలో స్థానిక డంపింగ్‌ యార్డ్‌కు తరలించి, వాటిని పాతిపెట్టారు. సదరు చికెన్‌ వ్యాపారి కొలిసి అక్కయ్యకు రూ.10 వేల జరిమానా విధించినట్లు కమిషనర్‌ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేయాలని పట్టణ ఎస్సై శ్రీనువాసరావును కోరారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ