amp pages | Sakshi

చదువుల తల్లి ముద్దుబిడ్డ

Published on Tue, 01/23/2018 - 07:56

కాసుల తల్లి కటాక్షం లేకున్నా.. చదువుల తల్లి ముద్దుబిడ్డగా ఎదిగాడు. ఉన్నత విద్య అభ్యసనకు ఆర్థిక స్థోమత లేకున్నా.. చిన్నాచితక పనులు చేసుకుంటూ పీజీ వరకు చదువుకున్నాడు. బోధనా వృత్తిలో స్థిర పడాలనుకుని నిర్ణయించుకుని అందుకోసం అహర్నిశం శ్రమించాడు. డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్టిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్‌ సాధించి విజయకేతనాన్ని ఎగురవేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులపై కొందరు నమ్మకం లేకుండా మాట్లాడుతున్న ప్రస్తుత రోజుల్లో అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని అనూహ్య స్థానాలకు ఎదిగిన మారుమూల గ్రామానికి చెందిన ఓ నిరుపేద విజయగాథ ఇది. వివరాల్లోకి వెళితే..

తనకల్లు: తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన ఆదిరెడ్డి, గిరిజమ్మ దంపతులకు మూడు ఎకరాల పొలం ఉంది. కరువు ప్రాంతం కావడంతో నీటి వనరులు లేక పంట సాగుకు చాలా ఇబ్బంది పడుతున్న నిరుపేద రైతు దంపతులకు మహేశ్వరరెడ్డి, మంజునాథరెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలు తమలా ఇబ్బందులు పడకుండా ఉండాలని భావించిన తల్లిదండ్రులు.. వారికి చదువులు చెప్పించాలని భావించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలోని మండల పరి షత్‌ ప్రాథమిక పాఠశాలల్లో పూర్తి చేసుకున్న మంజునాథరెడ్డి.. తర్వాత పదో తరగతి వరకు చిత్తూరు జిల్లా మొలకలచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాడు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదో తరగతిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై.. అక్కడే ఇంటర్మీడియట్‌ చ దుకున్నాడు. అనంతరం కదిరిలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో 2005–08లో యూ జీ, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎంఎస్సీ., పూర్తి చేశాడు. ఆ సమయంలో బోధనావృత్తిపై మక్కువ పెంచుకున్న అతను 2011–12లో బీఎడ్‌., పరీక్షలో రాష్ట్రస్థాయిలో పదో ర్యాంక్‌తో మెరిసాడు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హత
పట్టుదలతో చదువుల్లో రాణించిన మహేశ్వరరెడ్డి... ఈ మూడేళ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించారు. బోధనావృత్తిపై ఉన్న మక్కువతో ఆయా ఉద్యోగాల్లో చేరేందుకు అతను విముఖత చూపించారు. సీఎస్‌ఐఆర్‌లో ఉద్యోగాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో 39వ ర్యాంక్‌ని సాధించారు. 2016లో ఎఫ్‌సీఐలో ఉద్యోగాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో జోనల్‌ స్థాయిలో మూడో ర్యాంక్‌ను పొందారు. ఓసీ అభ్యర్థులకు ప్రభుత్వ కొలువులు దక్కవనే ఆత్మనూన్యతతో నలిగిపోతున్న పలువురికి ఆదర్శంగా నిలుస్తూ నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించినా.. బాధ్యతలు స్వీకరించకుండా లెక్చరర్‌ కావాలనే తపనతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆయూష్‌ విభాగంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ (చెన్నై)గా విధుల్లో చేరారు. డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో (వృక్షశాస్త్రం) మూడో ర్యాంక్‌ సాధించి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయి. బోధనావృత్తిలో కొనసాగే అవకాశం దక్కడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందంటూ  మంజునాథరెడ్డి పేర్కొన్నారు. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)