-
No Headline
ఒంటిమిట్ట: లోక కళ్యాణార్థం జగమేలే వైకుంఠరాముని జగత్ కళ్యాణం ఆంధ్రభద్రాద్రి ఏకశిలానగరి ఒంటిమిట్టలోని జగదభిరాముడి దివ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. కోదండ రామయ్య సీతమ్మవారిని పరిణయమాడిన వేళ శిల్పకళాశోభితమైన కళ్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరపున సతీసమేతంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని మూల మూర్తులకు రాష్ట్ర స్పెషల్ సీఎస్ కరికలవల్లన్ కల్యాణ వేదిక వద్ద ఉన్న కల్యాణ దంపతులైన సీతారాములకు ముత్యాలతలంబ్రాలు, పట్టువస్త్రాలు సంప్రదాయం ప్రకారం స్వామి వారికి సమర్పించారు. సంప్రదాయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు సీతారామచ్రందులకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ఉత్సవ వరులను పల్లకీపై కొలువు తీర్చి ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాల మధ్య భక్తుల జయజయ ధ్వనాలతో శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపం వద్దకు తీసుకు వచ్చారు. వేదిక పైన రంజిత సింహాసనంపై కళ్యాణ మూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం పూజా సామగ్రిని సంప్రోక్షణ జరిపి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా విశ్వక్షేన పూజ నిర్వహించారు. ‘కర్మణ్యేపుణ్యాహవచనం’ అనే మంత్రంతో మండప శుద్ధి జరిపి కళ్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. ముంజానకీ ప్రథమం అనే మంత్రం జపిస్తూ వేద పండితులు స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చో పెట్టి కన్యావరణ జరిపించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోప వీత ధారణం చేశారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదకస్నానం నిర్వహించి, వర పూజ చేశారు. బంగారు ఆభరణాలను సీతమ్మకు అలంకరించి సకలోపచారాలు చేశారు. మధుపర్కపాసన అనంతరం పెరుగు, తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించగా నును సిగ్గుల మొలకై న సీతమ్మ నోసటన కళ్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్క పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్పెషల్ సీఎస్ కరికాలవలవన్ సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ధరించి పెళ్లికూతురిగా ముస్తాబైంది. అమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తి అదే రీతిలో సర్వాభరణ భూషితుడై సీతమ్మ ఎదుట కూర్చున్నాడు. తరువాత లోక క్షేమం కోసం మహా సంకల్పం పఠించి కణ్యాదానం, గోదానం చేశారు. సీతమ్మకు రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళకాష్టం చదివారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల చతుర్వేద పఠనం భక్తుల రామనామ ధ్వనుల మధ్య హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరిదేవి, సరస్వతి దేవి, మహాలక్ష్మీ అమ్మవార్లను ఆహ్వానించి సకల మంగళాలకు ఆలవాలమైన మంగళసూత్రానికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర వేదపండితులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించి సాక్షాత్తూ లక్ష్మీనారాయణుడైన శ్రీరామ చంద్రమూర్తి చేత, శ్రీ మహాలక్ష్మీ స్వరూపినీ సీతాదేవికి శాస్త్రోక్తంగా మంగళసూత్రాధారణ నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన ముత్యాల తలంబ్రాలు కళ్యాణమూర్తుల శిరస్సుపై వేసి కనుల పండువగా కళ్యాణం జరిపారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహాదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కళ్యాణ క్రతువు ముగిసింది. ● స్వామి వారి కల్యాణాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్తోపాటు టీటీడీ యంత్రాంగం, జిల్లా ఉన్నతాధికారులు, ప్రముఖులు, లక్షలాది మంది భక్త జనం వీక్షించారు. భక్తుల రామనామ సంకీర్తనలు.. పండితుల చతుర్వేద పఠనం..మంగళవాయిద్యాల నడుమ.. సోమవారం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో దశరథ మహారాజు తనయుడు శ్రీ రామచంద్రమూర్తి , జనకుని గారాల పట్టి.. నునుసిగ్గుల మొలక సీతమ్మను పరిణయమాడాడు. కమనీయం..రమణీయమైన ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో తడిసిముద్దయ్యారు. కమనీయం..దాశరథి కల్యాణం ఏకశిలానగరిలో పండు వెన్నెలలో రాములోరి కల్యాణం కనులారా వీక్షించిన చంద్రుడు పోటెత్తిన భక్తజనం మార్మోగిన రామనామం -
No Headline
ఎయిడెడ్ 768 650 84.64 బీసీవెల్పేర్ 210 208 99.05 ప్రభుత్వ 707 590 83.45 కేజీబీవీ 613 593 96.74 మున్సిపాలిటీ 1776 1425 80.24 మోడల్స్కూల్స్ 254 253 99.61 ఏపీ రెసిడెన్షియల్ 156 154 98.72 సోసియల్ వెల్ఫేర్ 839 816 97.26 ట్రైబల్ వెల్ఫేర్ 99 93 93.94 జెడ్పీ 9389 8147 86.77 ప్రైవేటు 12918 12609 97.61 -
●గజేంద్రుడిపై జగదభిరాముడు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తర్వాత స్వామివారు గజవాహనంపై విహరించారు.అంతకు ముందు ఉదయం 7 నుంచి 9గంటల వరకు శివధనుర్భంగాలంకారంలో రాములోరు భక్తులకు దర్శనం ఇచ్చారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది.బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు రథారోహణం, 10:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రథోత్సవం నిర్వహిస్తారు. -
టెన్త్లో తీన్మార్
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా మెరిసింది. గతంతో పోల్చితే ఓ స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఉత్తీర్ణతశాతం కూడా మెరుగైంది. గతేడాది 79.43 శాతం ఉండగా ఈ ఏడాది 92.10 శాతం పెరిగింది. అంటే గతేడాది కంటే ఈఏడాది 12.67 శాతం పెరగడం విశేషం. జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా విద్యాశాఖ అధికారులు చాలా పకడ్బందీగా పది పరీక్షలను నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 153 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన పది పరీక్షలకు 27729 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాయగా ఇందులో 25538 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ప్రభుత్వ మ్యానేజ్మెంట్కు సంబంధించి ఏపీ మోడల్ స్కూల్స్ 99.61 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో మొదటిస్థానంలో నిలువగా బీసీ వెల్పేర్ 99.05 స్థానం సాధించి ద్వితీయస్థానంలో, ఏపీ రెసిడెన్సియల్ స్కూల్స్ 98.72 శాతం ఉత్తీర్ణత సాధించి తృతీయస్థానంలో నిలిచాయి. ప్రభుత్వ చొరవతోనే.. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలకు నాడు –నేడు కింద సకలసౌకర్యాలను సమకూర్చింది. విద్యార్థుల చదువు కోసం అవసరమైన అన్ని రకాల వస్తువులను విద్యాకానుక పేరిట సకాలంలో అందించింది. దీంతోపాటు పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించింది. అలాగే అమ్మ ఒడిని అందించింది. దీంతో పిల్లలు ఏ చీకూచింత లేకుండా చదువుకున్నారు. పది ఫలితాలను అదరగొట్టారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమకూరిన వసతుల కారణంగా ఈ ఏడాది పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెరిగిందని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలికలదే హవా.. ఈ సారి ఫలితాల్లోనూ బాలురపై బాలికలే పై చేయి సాధించారు. జిల్లావ్యాప్తంగా 14214 మంది బాలురు, 13515 మంది బాలికలు పరీక్ష రాశారు. వీరిలో బాలురు 12929 మంది పాసై 90.96 శాతం ఉత్తీర్ణతను సాధించగా.. బాలికలు 12609 మంది పాసై 93.3 శాతం ఉత్తీర్ణతను సాధించారు. 22255 మందికి ప్రథమస్థానం: పది పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 27729 మంది విద్యార్థులు పరీక్షను రాయగా ఇందులో 25,538 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 22255 మంది విద్యార్థులు ప్రథమస్థానంలో ఉత్తీర్ణత సాధించగా 2378 ద్వితీయస్థానంలో ఉత్తీర్ణతను సాధించారు. అలాగే మరో 905 మంది తృతీయస్థానంలో నిలిచారు. సంవత్సరం పరీక్షలు రాసిన పాసైన పాస్ రాష్ట్రంలో విద్యార్థులు వారు శాతం స్థానం 92.10 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 3వ స్థానం గతేడాది కంటే ఒక స్థానం ముందుకు జిల్లావ్యాప్తంగా 27729 మందికిగాను 25538 మంది పాస్ గతేడాదికంటే 12.67 శాతం పెరిగిన ఉత్తీర్ణత వందశాతం ఉత్తీర్ణత సాధించిన 200 ప్రభుత్వ పాఠశాలలు 2017–18 35660 34008 95.37 10 2018–19 36536 33943 92.90 11 2019–20 37,600 37600 100 – 2020–21 37955 37,955 100 – 2021–22 38035 27018 71.03 06 2022–23 27097 21524 79.43 04 2023–24 27729 25538 92.10 03 -
నాలుగోరోజు నామినేషన్ల జోరు
కడప సెవెన్రోడ్స్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాల్గవరోజైన సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో కడప లోక్సభ స్థానానికి ఆరు నామినేషన్లు రాగా, ఏడు అసెంబ్లీ స్థానాలకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. కడప లోక్సభ: కడప లోక్భ స్థానానికి కుంచెం వెంకట సుబ్బారెడ్డి రాయలసీమ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఒకటి, ఇండిపెండెంట్గా ఒక నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల తరఫున మూడు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరఫున వేణుగోపాల్ ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఖాజా హుసేన్ ఒకటి, ఇండిపెంట్ అభ్యర్థిగా వెంకట సుబ్బారెడ్డి రెండు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలకు... బద్వేలు: కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్డీ విజయజ్యోతి ఒక సెట్, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా దాసరి సుధ ఒక సెట్, సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా వెంకట సుబ్బరాయుడు ఒకటి, బీజేపీ అభ్యర్థిగా రోశన్న ఒకటి, బీజేపీ అభ్యర్థిగా అరుణరాజి ఒకటి, ఇండిపెండెంట్గా మల్లికార్జున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కడప: రీఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా సుబ్రమణ్యం ఒకటి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థిగా అలీషేర్ ఒకటి, నేషనల్ మహా సభ అభ్యర్థిగా పట్టుపోగుల పవన్కుమార్ ఒకటి, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా అవ్వారు మల్లికార్జున నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఒకటి, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా దాసరి రవిశంకర్ ఒకటి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గవిరెడ్డి రామేశ్వర్రెడ్డి ఒకటి, బహుజన సమాజ్ పార్టీ తరఫున బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి ఒక నామినేషన్ దాఖలు చేశారు. కమలాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి.రవీంద్రనాథ్రెడ్డి రెండు సెట్లు, ఇండిపెండెంట్గా నర్రెడ్డి కిశోర్రెడ్డి ఒకటి, సీపీఐ తరఫున గాలి చంద్ర ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాముల బ్రహ్మానందరెడ్డి ఒకటి దాఖలు చేశారు. జమ్మలమడుగు: ఇండిపెండెంట్గా రామేశ్వర్రెడ్డి ఒకటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మూలె సుధీర్రెడ్డి రెండు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క్రాంతి ప్రియ ఒకటి, ఇండిపెండెంట్గా ప్రమోద్కుమార్రెడ్డి ఒకటి, ఇండిపెండెంట్గా రామాంజనమ్మ ఒకటి, ఇండిపెండెంట్గా వెంకట సుబ్బారెడ్డి ఒక నామినేషన్ దాఖలు చేశారు. ప్రొద్దుటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమల్లు శివస్రాద్రెడ్డి ఒకటి, బీఎస్పీ అభ్యర్థిగా సుబ్బరాయుడు ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ ఒకటి, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా సురేష్బాబు ఒక నామినేషన్ దాఖలు చేశారు. మైదుకూరు: తెలుగుదేశం పార్టీ తరఫున పుట్టా సుధాకర్ ఒకటి, పుట్టా రవికుమార్ యాదవ్ ఒకటి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామిరెడ్డి ఒకటి, బీఎస్పీ తరఫున డీఎస్ జయరాం ఒకటి, ఇండిపెండెంట్గా ఆవుల వెంకట రమణ ఒకటి, బీఎస్పీ అభ్యర్థిగా డీఎస్ కల్యాణ్ ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా గుండ్లకుంట శ్రీరాములు ఒకటి, జయభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా లెక్కల శ్రీనివాసులురెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 44 నామినేషన్లు దాఖలు -
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
కాశినాయన : మండలంలోని వరికుంట్ల గ్రామానికి చెందిన వివాహిత జాగిరిమున్ని (36) తన ఇంట్లో ఉరి వేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. వారి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మున్నికి గత 18 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన పీరావలితో వివాహమైంది. భర్త కువైట్లో పనిచేసేవాడు. మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. భార్యభర్తలు అన్యోన్యంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. అయితే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆమె ఉరి వేసుకుని మృతిచెందింది. కాశినాయన ఏఎస్ఐ రమణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి వలసల వెల్లువ
కమలాపురం : కమలాపురం మండలంలో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి 240 కుటుంబాలు చేరాయి. సోమవారం మండల పరిధిలోని టి.చదిపిరాళ్లలో నియోజకవర్గ నాయకుడు సాయినాథ శర్మ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ వెంకట సుబ్బారెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, టీడీపీ తరపున గెలిచిన ఒకే ఒక వార్డు మెంబర్ ఆంజనేయులు, భాస్కర్ తదితర 100 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. అలాగే సింగిల్ విండో అధ్యక్షుడు చల్లా మునీంద్రారెడ్డి, ఎంపీటీసీ జయ సుబ్బారెడి, సర్పంచ్ చిన్ని ఆధ్వర్యంలో సుబ్బరాయుడు, విజయ, స్టీవన్, మనోహర్, జాన్, ప్రసాద్, జార్జి తదితర 100 కుటుంబాలు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. అలాగే కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని వికలాంగుల కాలనీలో వైఎస్సార్ సీపీ నాయకురాలు డి.సరోజమ్మ ఆధ్వర్యంలో ఉత్తమయ్య తదితరులు 40 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి 240 కుటుంబాలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సంక్షేమం కోసం జగనన్న ఇప్పటికి 130 సార్లు బటన్ నొక్కారని, మీరు కేవలం రెండు సార్లు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కితే చాలన్నారు. సాయినాథ శర్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి శాంతి కోరుకునే వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, సుబ్బారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, క్రిష్ణారెడ్డి, ఆర్వీఎన్ఆర్, నిఖిల్రెడ్డి, దేవదానం, జెట్టి నగేష్, బాబు, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ మైదుకూరు : మండలంలోని పప్పనపల్లెకు చెందిన 40 కుటుంబాల వారు సోమవారం టీడీపీని వీడి ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో పప్పనపల్లెకు చెందిన పాలూరు ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఇల్లూరు యోహాన్, ఇల్లూరు పెద్ద వెంకటేష్, ఇల్లూరు వెంకటేష్, పసల యోహాన్, పసల పుల్లన్న, శ్రీపతి ఓబన్న, శ్రీపతి సుబ్బరాయుడు, పసల వరప్రసాద్, చిత్తరాల జార్జి, కామనూరు చిన్న వీరయ్య, పసల కమలాకర్, పిల్లి బాలయ్య, ప్రసన్న కుమార్, వెంకటయ్య, ప్రేమ్ కుమార్, రామయ్య, నవీన్, చంద్ర తదితర 40 కుటుంబాల వారికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పార్టీ కండువాలను వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ ప్రభుత్వ సలహాదారుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. 40 కుటుంబాలు చేరిక జమ్మలమడుగు రూరల్ (మైలవరం) : మైలవరం మండలంలోని పలు గ్రామాల్లో 40 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. సోమవారం మైలవరం మండల కేంద్రంలో నక్కా శ్రీనివాసులు, తలారి గురప్ప, భార్గవ్, భీముడు నాయక్లతో కలపి 20 కుటుంబాలు చేరాయి. అలాగే చిన్న కొమెర్ల గ్రామంలో కె. భరత్రెడ్డి, కె, వెంకటసుబ్బారెడ్డి, కె. గోపాల్రెడ్డి, కె.బి. వెంకటసుబ్బారెడ్డి, రవీంద్రారెడ్డి, జయరామిరెడ్డి, ప్రసాద్రెడ్డి, చిన్న కృష్ణారెడ్డి, పెద్ద కృష్ణారెడ్డిలతో కలిపి 20 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వీరిని ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ సంబటూర్ ప్రసాద్రెడ్డి, మండల కన్వీనర్ మహేశ్వర్రెడ్డి, సర్పంచ్ నారపురెడ్డి జగదీశ్వర్రెడ్డి, ఎంపీటీసీ రామసుబ్బారెడ్డి, నాయకులు దొడియం విష్ణువర్దన్రెడ్డి, వినయ్ కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పది ఫలితాల్లో ప్రతిభ
పదో తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభకనబరిచారు. ఉపాధ్యాయులు ఉత్తమ బోధన అందజేయడంతో పాటు విద్యార్థులను పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశారు. దీంతోపాటు తల్లిదండ్రుల ప్రత్యేక పర్యవేక్షణతో పట్టుదలతో చదివిన పిల్లలు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మెరుగైన మార్కులతో సత్తా చాటారు. ప్రతిభచూపిన విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు. కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ ఏడాది ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు మార్కుల పరంగా భళా అనిపించారు. జిల్లాలో 200 ప్రభుత్వ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణతను సాధించాయి. ఎర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి జెడ్పీ హైస్కూల్కు చెందిన జత్వంత్కుమార్రెడ్డి 577 మార్కులు సాధించాడు. అదే పాఠశాలలో శ్రవంతి 570, హర్షీన్ 565 మార్కులు సాధించారు. ఎర్రగుంట్ల బాలికల పాఠశాలలో మేఘన 563, గులాబ్చాంద్ 556 , బాలుర పాఠశాలలో మంజుల యోగీశ్వర్ 561, అబ్థుల్ రఫీ 552 , ఎర్రగుంట్ల మండలం చిలమకూరు జెడ్పీ హైస్కూల్లో సునీతకుమారి 516 మార్కులను సాధించారు. ● మైదుకూరు బాలికల పాఠశాలలో శ్రావణి ధనలక్ష్మి 588, బాలుర పాఠశాలలో బ్రహ్మసాగర్ 560, యో గీంద్రకుమార్ 555, జీవీసత్రం జెడ్పీ హైస్కూల్లో శ్రీనివాసులు 530, లెక్కలవారిపల్లె జెడ్పీ హై స్కూల్లో వెంకట ఆశ్వని 530, వనిపెంట జెడ్పీ హైస్కూల్కు చెందిన సమీరా 587, శెట్టివారిపల్లె జెడ్పీ హైస్కూల్లో యశ్వంత్ 558, అనుషాదేవి 558, మైదుకూరు పూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన దీక్షిత 578 మార్కులను సాధించారు. ● చాపాడు మండలానికి సంబంధించి అన్నవరం జెడ్పీ హైస్కూల్లో సిద్దిక్ 539, చాపాడు జెడ్పీ హైస్కూల్లో కావ్య 537, లక్ష్మిపేట జెడ్పీ హైస్కూల్లో వీరరాజేష్ 529 మార్కులను సాధించారు. ● పెండ్లిమర్రి మండలంలో గంగనపల్లె జెడ్పీ హైస్కూల్కు చెందిన చంద్రకళ 573 మార్కులు సాధించింది. ● పెద్దముడియం మండలం పెద్ద పసుపుల జెడ్పీ హైస్కూల్కు చెందిన శ్రవంతి 576, ఉదయ శ్రీ 572, కేజీబీవీకి చెందిన అక్ష్య 569 మార్కులు సాధించారు. ● చక్రాయపేట మండలానికి సంబంధించి నాగులపల్లె జెడ్పీ హైస్కూల్కు చెందిన జస్వంత్ 585 , అంజలి 583, అబ్బాస్ 581 మార్కులను సాధించారు. ● కాశినాయన మండలంలో వెంకట ఇందు 571, శ్యామ్కుమార్ 566 మార్కులను సాధించారు. ● ముద్దనూరు మండలం జెడ్పీ హైస్కూల్కు చెందిన తుమ్మలూరు అజంత 590 మార్కులను సాధించింది. స్థానిక జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలకు చెందిన శివమణి 578, నందిని 572 మార్కులు సాధించారు. ఈ పాఠశాలలో 20 మందికిపైగా విద్యార్థినులు 500 మార్కులు అధిగమించారని హెచ్ఎం శ్రీనివాసులు తెలిపారు. మండలంలో 94.34 శాతం ఉత్తీర్ణత పొందినట్లు ఎంఈఓలు సుబ్బారావు, నాగేశ్వరరావు నాయక్ తెలిపారు. ● చెన్నూరు మండలం జెడ్పీ హైస్కూల్కు చెందిన తస్లీమ బాను 566, కొండపేట హైస్కూల్కు చెందిన ప్రత్యూస 544, రామనపల్లె జెడ్పీ హైస్కూల్కు చెందిన శివ మనోజ్ఞ 549 మార్కులను సాధించారు. ● బద్వేల్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన జస్వంత్ 586 మార్కులను సాధించారు. ● గోపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి పెంచలకార్తీక్ 560 మార్కులు సాధించాడు. పెంచలకార్తీక్ను హెచ్ఎం నాగమణి, ఉపాధ్యాయులు అభినందించారు. కాగా పది ఫలితాల్లో 92 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ రఘురాములు తెలిపారు. ● దువ్వూరు మండలంలోని మాచనపల్లె జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని గడ్డం సుమిత్ర 588 మార్కులు సాధించింది. మండలంలోని 8 ప్రభుత్వ పాఠశాలల్లో 265 మంది పరీక్షలు రాయగా 244 మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా పుల్లారెడ్డి పేట జెడ్పీ హైస్కూల్, గుడిపాడు జెడ్పీ హైస్కూల్, పుల్లారెడ్డి పేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈఓ రవిశంకర్ తెలిపారు. ● రాజుపాళెం మండలంలోని వెలవలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అల్అర్ఫా 540 మార్కులు సాధించింది. మండల వ్యాప్తంగా 88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ రామస్వామి రెడ్డి తెలిపారు. బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో కె.సాయిప్రియ 537 మార్కులు, ఐ.శృతి 531 మార్కులు సాధించింది. -
ఘనంగా ప్రారంభమైన ఉరుసు
కమలాపురం : పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా ఉరుసు మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దర్గా పీఠాధిపతి (ముతవల్లి), సజ్జాద్–ఏ–నషీన్ మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో, అశేష భక్త జన సందోహం నడుమ ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. గంధం ఇంటి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన చాందినిలో నషాన్ జెండాను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. జెండా ఊరేగింపు తాళిం, మార్కెట్, చౌక్ సెంటర్ మీదుగా దర్గాకు చేరుకుంది. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెచ్చిన బాణా సంచా పెద్ద ఎత్తున పేల్చుతూ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు అనంతరం నషాన్ జెండాను దర్గా ఆవరణంలో ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ ఉరుసు ఉత్సవాల ప్రారంభానికి సూచిక. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అశేష భక్త జనుల సమక్షంలో హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, దస్తగిరిషా ఖాద్రి, మౌలానా మౌల్వి మొహిద్ధీన్ షా ఖాద్రి, హాజీ హజరత్ జహీరుద్ధీన్ షా ఖాద్రిల మజార్లపై పూల చాదర్లు సమర్పించారు. ప్రత్యేక ఫాతెహ చేశారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా ఖాద్రి, గౌస్ పాక్, జియా, ఇస్మాయిల్, సర్ఫరాజ్, గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి టి. హుసేన్ మియా కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. నేడు గంధం : మంగళవారం రాత్రి గంధం మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి ప్రముఖ ఖవ్వాల్ల మధ్య గొప్ప ఖవ్వాలీ పోటీ నిర్వహించనున్నారు. గంధోత్సవాన్ని తిలకించడం శుభదాయకం: ఉరుసు మహోత్సవాల్లో భాగంగా గంధోత్సవాన్ని తిలకించడం శుభదాయకం అని పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉరుసు ఉత్సవాల్లో గంధోత్సవం అతి ముఖ్యమైన ఘట్టం అని, ఈ ఘట్టాన్ని భక్తులందరూ తప్పక వీక్షించాలన్నారు. -
కౌన్సిలర్ అనుమానాస్పద మృతి
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు మున్సిపాలిటీ వైఎస్సార్సీపీకి చెందిన 4వ వార్డ్ కౌన్సిలర్ జ్ఞాన ప్రసూన (32) సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు పట్టణానికి చెందిన వంగల నాగేంద్ర కుమార్తె అయిన జ్ఞాన ప్రసూన వివాహం అయినప్పటి నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉంటోంది. అప్పుడప్పుడు జమ్మలమడుగుకు వస్తూ ఉండేది. కాగా సోమవారం రాత్రి కోయంబత్తూర్లోని ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 100 శాతం ఫలితాలు
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడాపాఠశాల పదోతరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. పాఠశాల నుంచి 34 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 33 మంది ఫస్ట్క్లాస్లోను, ఒకరు సెకండ్క్లాస్లో ఉత్తీర్ణులు కావడం విశేషం. పాఠశాల విద్యార్థిని ఎస్. రిచిత 573 మార్కులు, జి. శ్రీలక్ష్మి 560, కె. అనూరాధ 555, వి.హేమలత 553తో పాటు పలువురు విద్యార్థినులు 500 పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి కె. జగన్నాథరావు అభినందించారు. -
అభివృద్ధి కుంటుపడకుండా సంక్షేమం
కడప సెవెన్రోడ్స్: వైఎస్సార్ జిల్లాలో అభివృద్ధి ఎక్కడా కుంటుపడకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచిన ఘనత జగనన్న ప్రభుత్వానిదేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప లోక్సభ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాలు కోవిడ్ కలిగించిన నష్టాలను ఎదుర్కొంటూనే సంక్షేమం, అభివృద్ధిని ప్రభుత్వం కొనసాగించిందన్నారు. సెంచురీ ప్లైబోర్డు పరిశ్రమ ఏర్పాటుకు ప్రోత్సాహం అందించడం ద్వారా 1200 మందికి ఉపాధి లభించిందన్నారు. కొప్పర్తి లే అవుట్లో మూడు వేల మందికి ఉపాధి లభించిందన్నారు. కొప్పర్తి కారిడార్ను అభివృద్ధి పరిచి లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఎంఓయూ కుదర్చుకుందని తెలిపారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, 2026 ఉగాది నాటికి తొలి దశ నిర్మాణం పూర్తి కానుందని చెప్పారు. రూ. 900 కోట్లు ఖర్చు చేయడం వల్ల గండికోట రిజర్వాయర్లో 27 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నీటి నిల్వ సాధ్యపడిందన్నారు. అలాగే రూ.256 కోట్లు ఖర్చు చేయడంతో సీబీఆర్లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయగలుగుతున్నామన్నారు. గత 18 నెలలుగా వర్షాలు లేకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయన్నారు. దీంతో లింగంపల్లె, గండి వాటర్వర్క్స్కు తాగునీరు గండికోట నుంచి అందిస్తున్నామన్నారు. కడప రిమ్స్లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్, కేన్సర్ ఆస్పత్రి, ఐ ఇన్స్టిట్యూట్ వంటివి ఏర్పాటు చేశామని తెలిపారు. రూ. 250 కోట్లతో కడప విమానాశ్రయ టెర్మినల్ను అభివృద్ధి చేశామన్నారు. మరో రూ. 75 కోట్లతో భూ సేకరణ చేశామని, ఎయిర్పోర్టులో నైట్ ల్యాండింగ్ సౌకర్యం కలిగిందన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో జిల్లా కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగపడ్డాయి తప్ప చంద్రబాబు ఇచ్చిందంటూ ఏమీ లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు భరించే విధంగా చేపట్టిన కడప–బెంగుళూరు రైల్వే లైన్ పనులు చంద్రబాబు వైఖరి వల్ల అటకెక్కాయన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల తమ వాటాగా 50 శాతం నిధులు ఇవ్వలేమంటూ నాటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిందన్నారు. కర్ణాటకలో భూ సేకరణ చాలా కష్టంతో కూడుకున్నది కనుక పెండ్లిమర్రి–పుట్టపర్తి వరకు అలైన్మెంట్ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. నిపుణుల బృందం సర్వే నిర్వహించి కొత్త అలైన్మెంట్ ఫీజీబిలిటీ రిపోర్టు తయారు చేసి సమర్పించిందన్నారు. ఇక కడప–బెంగుళూరు రైల్వే లైన్ పనులు ముందుకు సాగేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కడప స్టీల్ ప్లాంటు, రాష్ట్రానికి స్పెషల్ క్యాటగిరి స్టేటస్, కృష్ణా జలాల రీ అలాకేషన్ వంటి అంశాలను తాను పార్లమెంటులో ప్రస్తావించానన్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపాలంటూ పార్లమెంటులో కేంద్రాన్ని కోరానన్నారు. కోవిడ్ రెండు సంవత్సరాల కాలాన్ని మినహాయిస్తే కేవలం మూడేళ్లలోనే తమ ప్రభుత్వ హయాంలో జిల్లా ఇంతగా అభివృద్ది చెందిందని ఎంపీ అవినాష్రెడ్డి వివరించారు. ప్రజలు, కార్యకర్తల ఆశీస్సులతో తాను విజయం సాధిస్తానని ఽధీమా వ్యక్తం చేశారు. గండికోట, సీబీఆర్లో నీటి నిల్వ పెంచాం కొప్పర్తి కారిడార్ ద్వారా లక్ష మందికి ఉపాధి లక్ష్యం బాబు లేఖ వల్లే ఆగిన కడప–బెంగుళూరు రైల్వే లైన్ మీడియాతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
రామా.. కరుణజూపుమా
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్వామి వారి ఊరేగింపు జరిగింది.భక్త బృందాల భజనలు, కళాకారుల కోలాటా నడుమ స్వామివారు పురవీధుల్లో విహరించారు. గ్రామోత్సవం అనంతరం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనే, చందనంతో శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్రలేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో సోమరితం నశించి, పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను , నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామి వారు నిరూపిస్తున్నారు. ఒంటిమిట్ట ఆలయ డిప్యూటి ఈఓ నటేష్ బాబు ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శనివారం ఉదయం నవనీత కృష్ణాలంకారంలో జగదభిరాముడు భక్తులకు దర్శనమిస్తారు. 7 నుంచి 9 గంటల వరకు పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉంటుంది. 11 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9:00 గంటలకు హనుమంత వాహనం సేవ ఉంటుంది. వాహనసేవల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కోలాటాలు, కేరళ వాయిద్యాలు, తాళం భజన ప్రదర్శనలు ఉంటాయి. వటపత్రశాయిగా దాశరథి దర్శనం మూడోరోజు చూడ ముచ్చటగా సీతాపతి బ్రహ్మోత్సవం -
పోలీసులకు అభినందన
కడప అర్బన్ : పోలీస్ సిబ్బందిని ప్రోత్సహించే క్రమంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి ‘వీక్లీ బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డు’ను అందచేస్తున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం నలుగురు సిబ్బందిని ఎంపిక చేసి నగదు రివార్డు, ప్రశంసాపత్రం అందచేసి ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల నేపథ్యంలో పి.పి కుంట చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో బొలెరో క్యాంపర్ వాహనంలో ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 5.07 కోట్ల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన బి. కోడూరు హెడ్ కానిస్టేబుల్ (హెచ్.సి..702) పి.పి. యాదవ్, బద్వేల్ రూరల్ కానిస్టేబుల్ పి. సిద్దారెడ్డిలను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ప్రత్యేకంగా అభినందించారు. ఆర్.కె వ్యాలీ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల వాహన తనిఖీల్లో ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.12,39,430 నగదును స్వాధీనం చేసుకోవడంలో కీలకపాత్ర వహించిన హోంగార్డ్ కె. కృష్ణయ్య(హెచ్జి 596)ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్ను అరెస్ట్ చేసి 35 గ్రాముల బంగారు చైన్ను స్వాధీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన కానిస్టేబుల్ పి.వి శ్రీనివాసులు (పిసి 1640)ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
No Headline
కడప సెవెన్రోడ్స్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండవ రోజైన శుక్రవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కడప లోక్సభ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాకర్ల షణ్ముఖరెడ్డి ఒక్కొక్క సెట్టు చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ స్థానాలకు: ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బద్వేలు, కమలాపురం, పులివెందులలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కడప అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోనేటి హరి వెంకట రమణ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరుపున సయ్యద్ సలావుద్దీన్ ఒక్కొక్క సెట్ నామినేషన్ దాఖలు చేశారు. జమ్మలమడుగు అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ తరుపున చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి ఒక సెట్, వైఎస్సార్ సీపీ అభ్యర్థి మూలె సుధీర్రెడ్డి తరుపున పార్టీ నాయకులు ఒక సెట్, వైఎస్సార్ సీపీ తరుపున మూలే క్రాంతిప్రియ మరొక సెట్, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ తరపున రామదాసు కాటా ఒక సెట్ దాఖలు చేశారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున నంద్యాల వరదరాజులరెడ్డి, నంద్యాల కొండారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా వెంకట ప్రసాద్రెడ్డి బొల్లవరం, భరోసా పార్టీ అభ్యర్థిగా చింతల శోభన్బాబు ఒక్కొక్క సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. మైదుకూరు అసెంబ్లీ స్థానంలో అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజా రామిరెడ్డి సిరయపురెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున రఘురామిరెడ్డి ఒక్కొక్క సెట్ చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. -
No Headline
రాయచోటి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో రెండవ రోజైన శుక్రవారం 18 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్కిషోర్ తెలిపారు. పార్లమెంటుకు 5 నామినేషన్లు ● రాజంపేట–24 పార్లమెంట్ స్థానానికి శుక్రవారం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పీవీ మిథున్రెడ్డి తరపున జిల్లాలోని మైనార్టీలు రెండో నామినేషన్ దాఖలు చేశారు. ● ఇండిపెండెంట్గా కస్తూరి ఓబయ్యనాయుడు రెండు సెట్ల నామినేషన్లను అందజేశారు. ● ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆసాది వెంకటాద్రి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అసెంబ్లీకి 13 నామినేషన్లు అసెంబ్లీ అభ్యర్థులుగా 13 మంది ఆయా ప్రాంతాలలోని రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్లు దాఖలు చేశారు. 128– రాయచోటి అసెంబ్లీ స్థానానికి ● టీడీపీ అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ● షేక్ అల్లాబకష్ ఐఎన్సీ అభ్యర్థిగా ఒక్కొక్క సెట్టు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. 127 – కోడూరు(ఎస్సీ) ● అరవ శ్రీధర్ జనసేన అభ్యర్థిగా రెండు పత్రాల నామినేషన్లు ● గోసల దేవి ఐఎన్సీ అభ్యర్థిగా ఒక్క సెట్ నామినేషన్ దాఖలు చేశారు. 162 – తంబళ్లపల్లి: ● పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా, దాసరపల్లి జయచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థిగా, మంత్రి కల్పన టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 163 – పీలేరు: ● నల్లారి అమరనాథ్రెడ్డి టీడీపీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. 164 – మదనపల్లి: ఎం.భాస్కర్ ఇండిపెండెంట్ గా, షాజహాన్బాషా టీడీపీ అభ్యర్థిగా, ఇండిపెండెంట్గా కూడా మరో నామినేషన్ ్న దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లాలో.. -
క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి
కడప అర్బన్ : విద్యార్థినులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని, తాము చదివిన సంస్థకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ తెలియజేశారు. శుక్రవారం కడప నగరంలోని మరియాపురంలో వున్న ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహం–2ను జడ్జి బాబా ఫకృద్దీన్ తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. వంట , వసతి గదులను ఆయన పరిశీలించారు. పిల్లలు ఏఏ తరగతులను అభ్యసిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇన్స్ట్రాగామ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, భారత రాజ్యాంగం, మానవ అక్రమ రవాణా, జాతీయ న్యాయసేవాధికార సంస్థ వారి బాలల సంరక్షణ కోసం స్నేహపూర్వక న్యాయసేవల పథకం 2015ను వివరించారు. రిజిస్టర్లను పరిశీలించారు. పిల్లల విద్యా, ఆరోగ్య విషయాలపట్ల తగిన జాగ్రత్తలు వహించాలని సిబ్బందికి సూచించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థ, కడప దృష్టికి తీసుకురావాలన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి. మంజుల పాల్గొన్నారు. జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ -
పార్టీ విజయానికి కృషి చేయండి
ఖాజీపేట : ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డిని, ఎంపీగా నన్ను గెలిపించేందుకు, భారీ మెజార్టీ వచ్చేలా మీ వంతు కష్టపడి పనిచేయాలని పార్టీలో కొత్తగా చేరిన వారికి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సూచించారు. ఖాజీపేటలోని కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ మాజీ అధ్యక్షుడు డీఎల్ శ్రీనివాసులరెడ్డి ఇంటికి ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన తోపాటు రెడ్యం నాగసుబ్బారెడ్డి, కలగారెడ్డి, వెంకట రామిరెడ్డి, డీటీ శ్రీనివాసులరెడ్డి, ఎ. ఉమామహేశ్వర్రెడ్డి, సంగటి శివకుమారరెడ్డి, నాగిరెడ్డిలను ఎంపీ పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తుంపు ఉంటుందని అన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా అందరూ కలసి కట్టుగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషిచేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు శెట్టిపల్లి అశోక్కుమార్రెడ్డి, ఎపీఐఐసీ డైరెక్టర్ గంగాధర్రెడ్డి, ఎంపీపీ సిద్దిక్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లా, అగ్రహారం సోసైటీ అధ్యక్షుడు రాఘవరెడ్డి, మండల కన్వీనర్ మురళీమోహన్రెడ్డి, కేసీకెనాల్ ప్రాజక్టు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు రెడ్యం చంద్ర శేఖర్రెడ్డి, పుల్లూరు మాజీ ఉపసర్పంచ్ నాగేశ్వర్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు మున్వర్ తోపాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వంద మంది విద్యార్థులు వైఎస్సార్సీపీలో చేరిక చాపాడు : వైఎస్సార్సీపీ మైదుకూరు నియోజకవర్గ విద్యార్థి విభాగం కార్యదర్శిగా మండలంలోని చియ్యపాడు గ్రామానికి చెందిన రాయుడు అనే వ్యక్తి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సాయిదత్త, జిల్లా కార్యదర్శి రుద్రసేనారెడ్డి సమక్షంలో రాయుడుకు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాయుడు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో నియోజకవర్గ కార్యదర్శిగా నియమించటం సంతోషంగా ఉందన్నారు. తనకు పదవి రావటానికి కారకులైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎంపీపీ లక్షుమయ్య, మండల వైఎస్సార్సీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే క్రమంలో రాయుడు వివిధ ప్రాంతాలకు చెందిన 100 మంది విద్యార్థులను వైఎస్సార్సీపీలో చేర్పించారు. 100 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీలో చేరిక మైదుకూరు : మండలంలోని మిట్టమానుపల్లె పంచాయతీ మాచుగారిపల్లెలో శుక్రవారం టీడీపీ నుంచి 100 కుటుంబాల వారు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మాచుగారిపల్లెకు చెందిన 70 కుటుంబాల వారిని టీడీపీ నాయకులు గురువారం ఆ పార్టీలో చేర్చుకున్నారు. అయితే తమను బలవంతంగా టీడీపీలో చేర్చుకున్నారని, వైఎస్సార్సీపీలో చేరాలన్నదే తమ అభిమతమని శుక్రవారం మాచుగారిపల్లె వాసులు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో పేర్కొన్నారు. 70 కుటుంబాల వారికి అదనంగా మరో 30 కుటుంబాల వారు శుక్రవారం ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామానికి చెందిన గుడిసెనపల్లె ప్రసాద్, గుడిసెనపల్లె ఓబులేసు(కారు), గుడిసెనపల్లె కరుణ, జొన్నారం ఓబయ్య, జంపంగి చెండ్రాయుడు, జంపంగి మరియన్న, జంపంగి సూర్యనారాయణ, జంపంగి ఏసురాజా, జొన్నారం నడిపి ఓబయ్య, జొన్నారం రాజా, గంగారం ప్రభాకర్, గుడిసెనపల్లె రాజశేఖర్, గుడిసెనపల్లె బాలస్వామి, పేరుగాని రామచంద్ర, పేరుగాని సుబ్బరాయుడు, గుడిసెనపల్లె ఓబులేసు, గుడిసెనపల్లె అభిషేక్, జంపంగి శ్రీకాంత్, కొట్టం లక్ష్మయ్య, జంపంగి రాజేంద్ర తదితరులకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పార్టీ కండువాలను వేసి వైఎస్సార్సీపీలోకి చేర్చుకున్నారు. కార్యక్రమంలో మైదుకూరు సింగిల్ విండో చైర్మన్ మూలె సుధాకర్రెడ్డి, ఎంపీటీసీ గుడిసెనపల్లె గిరి, రాజోలి రామమోహన్రెడ్డి, నారిబోయిన నారాయణ, రాజోలి రాజారెడ్డి, జంపంగి ప్రసాద్, జంపంగి సంపత్, కానాల చిన్న గోవిందరెడ్డి పాల్గొన్నారు. 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక ప్రొద్దుటూరు : టీడీపీ, బీజేపీ నుంచి 50 కుటుంబాలు శుక్రవారం స్థానిక శ్రీనివాసనగర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. బీజేపీ నాయకుడు పల్లె రఘురామిరెడ్డి, జూటూరు పద్మావతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనకు ఆకర్షితులై వీరు పార్టీలో చేరడం జరిగిందన్నారు. 30 ఏళ్లుగా గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదని, తమ ప్రభుత్వంలో ప్రధాన పనులన్నీ పూర్తి చేశామన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మార్పుతోపాటు సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సరఫరా, బస్టాండ్, కూరగాయాల మార్కెట్ నిర్మాణం, వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజీలో అభివృద్ధి పనులు, పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు సంబంధించి రూ.200 కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. జిల్లాలోనే తొలిమారు శ్రీనివాసనగర్లో కరోనా వచ్చిందని, తనతోపాటు అప్పటి మున్సిపల్ కమిషనర్ వీధుల వెంబడి తిరిగి వ్యాధిని అదుపు చేసేందుకు కృషి చేశామన్నారు. క్వారంటైన్ నడిపామన్నారు. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి ప్రజలకు కనిపించకుండా దాక్కున్నారని తెలి పారు. పల్లె రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రాచమల్లు చేస్తున్న అభివృద్ధి పనులు ప్రశంసనీయమన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, పద్మశాలీయ సంఘం పట్టణాధ్యక్షుడు అగ్గారపు శ్రీనివాసులు, అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ సానపురెడ్డి ప్రతాప్రెడ్డి, అరసం జిల్లా అధ్యక్షుడు విజయసారథి పాల్గొన్నారు. 27 కుటుంబాలు చేరిక వల్లూరు : మండలంలోని తప్పెట్ల, పుల్లారెడ్డి పేట గ్రామాలకు చెందిన 27 కుటుంబాలు శుక్రవారం టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరాయి. తప్పెట్లకు చెందిన పెద్ద సుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, బూచుపల్లె ధర్మారెడ్డి తదితర 12 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరాయి. పుల్లారెడ్డిపేటకు చెందిన సిద్దం హరి, కుమార్, అంకాలయ్య, ప్రభాకర్, అరుణ్, మంచాల్ రెడ్డి, పెద్ద వీరయ్య తదితర 15 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరాయి. ఈ మేరకు వారికి ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర ఛైర్మెన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర పరిశ్రమల సలహాదారులు రాజోలు వీరారెడ్డి కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అబ్బిరెడ్డి వీరారెడ్డి, పార్టీ నేతలు రవీంద్రారెడ్డి, రఘునాథరెడ్డి, రాజారెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి , ముకుందారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి డీఎల్ శ్రీనివాసుల రెడ్డి -
ఖాన్దాదాతో గేమ్స్
● కడపలో సామాజిక కుట్రలకు తెర లేపుతున్న టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి ● ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన అఫ్జల్ఖాన్కు ఎర ● కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించాలని ప్లాన్ ● రూ.5కోట్లు ఫండ్ ఇస్తామని ప్రలోభాలు ● ముస్లీం మైనార్టీల ఓట్లు చీల్చడమేలక్ష్యంగా ఎత్తుగడలు సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ కరువవుతోంది. కుట్రలు, కుయుక్తులతో మద్దతు పెంచుకోవాలనే దిశగా నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారు. సామాజిక సమీకరణలకు తెరలేపుతూ తద్వారా లబ్ధి పొందాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల మధ్య గణనీయంగా చీలికలు తీసుకు రావాలనే ఎత్తుగడలకు తెరలేపారు. ఆమేరకు వైఎస్సార్సీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఓ నాయకున్ని ఎంచుకున్నారు. రూ.5కోట్లు ఫండ్ ఇస్తాను, కాంగ్రెస్ అధ్యక్షరాలితో తానే మాట్లాడి టికెట్ ఇప్పిస్తాను. వారు కూడా మరో రూ.5కోట్లు ఫండ్ ఇస్తారు. పోటీచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. కడప అసెంబ్లీ పరిధిలో త్రిముఖ పోటీ పెట్టించి లబ్ధి పొందాలనే ఆలోచనను అమల్లోకి తెస్తున్నారు. ● వైఎస్సార్సీపీకి చెందిన మైనార్టీ నాయకుడు అఫ్జల్ఖాన్ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీలో అనుకున్నస్థాయిలో ప్రాధాన్యత దక్కలేదనే భావనను వ్యక్త పర్చారు. అదే అదునుగా భావించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నేరుగా అఫ్జల్ఖాన్తో టచ్లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీ అఽభ్యర్థిగా పోటీ చేయాలని ఆ పార్టీ టికెట్ ఇప్పించే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చినట్లు సమాచారం. వ్యక్తిగతంగా తాను రూ.5కోట్లు ఫండ్ ఇస్తానని, మరో రూ.5కోట్లు కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తుందని, ఆమేరకు రాష్ట్ర అధ్యక్షరాలు షర్మిలతో కూడా హామీ ఇప్పిస్తానని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. కడప అసెంబ్లీకి త్రిముఖ పోటీ ఉండాలని, అందుకు మీరే సరైన నాయకుడంటూ అఫ్జల్ఖాన్తో మంతనాలు నిర్వహించినట్లు సమాచారం. తద్వారా మీకు ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని కూడా వివరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత టీడీపీలో కూడా తగిన ప్రాధాన్యత ఇప్పించే బాధ్యత కూడా తనదేనని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా, మైనార్టీ నేత అఫ్జల్ఖాన్ వైఎస్సార్సీపీకి రాజీనామా చేయకముందు ఆయన సోదరుడు అఫ్సర్ఖాన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో కడప వాసులు ఒకింత ఆశ్చర్యానికి గురైనా తాజా పరిణామాల నేపథ్యంలో వ్యూహాత్మక ఎత్తుగడలకు ఆనాడే బీజం పడినట్లుగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మొన్న జయాగార్డెన్లో వాసు, అఫ్జల్ఖాన్, సునీతారెడ్డి సమావేశమైనట్లు సమాచారం. కుటుంబంలో ఏకాకిగా మిగలడంతో.... రెడ్డెప్పగారి కుటుంబంలో శ్రీనివాసులరెడ్డి ఏకాకి అయ్యారు. ఆయన వ్యవహార శైలి నచ్చకపోవడం, చంద్రబాబునాయుడు కుటుంబాలను విభజించి పాలించు అనే సూత్రాన్ని అమలు చేయడం ఇలాంటి కారణాలతో సోదరుడు మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్కుమార్రెడ్డి టీడీపీ వీడారు. అలాగే మేనమామ కుమారుడు మాజీ శాసనమండలి సభ్యుడు ఎస్వీ సతీష్కుమార్రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీ వదిలేశారు. సుదీర్ఘకాలం చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ ఉన్నతికి పనిచేసిన వారిని జిల్లా అధ్యక్షుడిగా పొలిట్బ్యూరో సభ్యుడుగా శ్రీనివాసులరెడ్డి నిలుపుకోలేకపోయారు. ఈపరిస్థితుల్లో కడపలో పట్టు సాధించుకోవాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తద్వారా అటు పార్టీలో ఇటు కుటుంబంలో పట్టు నిలుపుకోవచ్చనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎలాగైనా మైనార్టీ ఓటర్లుల్లో చీలిక తీసుకొచ్చి, రెడ్డి సామాజిక వర్గానికి దగ్గరగా ఉంటూ లబ్ధిపొందాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ప్రతి చిన్న అంశాన్ని సైతం రెచ్చగొట్టి రాజకీయం చేస్తూ లబ్ధి పొందే ఎత్తుగడలను పాటిస్తున్నారు. ఆమేరకు చలమారెడ్డిపల్లె, మాసాపేట సర్కిల్లో చోటు చేసుకున్న ఉదంతాలనను పరిశీలకులు ఉదహరిస్తున్నారు. -
సుగవాసిపై బత్యాల చిర్రుబుర్రు
రాజంపేట: రాజంపేట అసెంబ్లీ టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి సుగవాసిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు శివతాండవం చేసిన అంశం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. గురువారం బత్యాల కార్యాలయానికి టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం మద్దతు కోరేందుకు వెళ్లారు. అక్కడ జరిగిన సంభాషణలు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బత్యాల ఇంటివద్ద ప్రత్యక్షమైన సుగవాసి.. టికెట్ తనకు ఇవ్వలేదన్న కసిలో ఉన్న బత్యాల నివాసానికి ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నఫళంగా సుగవాసి వెళ్లారు. తన నివాసానికి తీసుకొచ్చిన మున్సిపల్ కౌన్సిలర్ తుపాకుల అశోక్పై బత్యాల విరుచుకు పడ్డారు. టికెట్ ప్రకటించిన 24 రోజుల తర్వాత నన్ను కలుస్తావా? కళ్లకు ఏమైనా చత్వారీ వచ్చిందా? తిరుపతి ఎయిర్పోర్టులో కలిసినప్పుడు నీవు, నీ తమ్ముడు ప్రసాద్ నాతో ఏమన్నారు.. మేము ఎంపీ సీటుకు పోటీ చేస్తాం.. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయండి అన్నారు కదా. ఇప్పుడు రాజంపేట సీటు కోసం ఎందుకువచ్చారు అని గట్టిగా ప్రశ్నించారు. అసలు నీకు బుద్ది ఉందా? నేనేమైనా మీ సీటు కోసం రాయచోటికి వచ్చానా.. అంటూ నిలదీశారు. అధిష్టానం చెబితే ఎలా మార్చుకుంటావు? రాయచోటి సీటు మీకు పెళ్లాం లాంటిదని, రాజంపేట సీటు నాకు పెళ్లాం లాంటిదని.. అధిష్టానం చెబితే ఎలా మార్చుకుంటామని, కొంచైమెనా మనకు పౌరుషం ఉండాలని ఊదరగొట్టారు. అధిష్టానం చెబితే నేను పోటీ చేస్తున్నాని చెప్పిన క్రమంలో బత్యాల తీవ్ర స్వరంతో స్పందించారు. దీంతో సుగవాసి మనస్థాపానికి గురై మారు మాట్లాడకుండా బయటికి వచ్చేశారు. కాగా ముందుగా బత్యాల, సుగవాసిని ఒకటి చేసేందుకు కమ్మ, బలిజ నాయకులు చేసిన మధ్యవర్తిత్వం బెడిసికొట్టింది. ఆ నేతలకు బత్యాల నుంచి అక్షింతలు పడ్డాయి. నేను ఏమైనా బ్రహ్మయ్య అనుకున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కమ్మనేత కూడా ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా గట్టిగా మందలించారు. ఈ విధంగా బత్యాల, సుగవాసి మధ్య చోటుచేసుకున్న పరిణామాలు, సంభాషణలపై టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తనను కలిసేందుకు వచ్చిన సుగవాసిపై బత్యాల ఆగ్రహం అధిష్టానం చెబితే రాజంపేటకు ఎలా వస్తావంటూ నిలదీత మనస్థాపానికి గురై వెనుదిరిగిన సుగవాసి -
నేడు డయల్ యువర్ ఆర్ఎం
కడప కోటిరెడ్డిసర్కిల్: ఆర్టీసీ సమస్యలపై డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. ప్రయాణీకులు తమ సూచనలు, సలహాలు 9959225848 నంబరుకు లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాలన్నారు. చిన్న పిల్లలను ప్రచారానికి వినియోగించరాదుకడప కోటిరెడ్డిసర్కిల్: ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీల నాయకులు 14 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన చిన్నారులను రాజకీయ ప్రచారానికి వినియోగించరాదని జిల్లా ఉప కార్మికశాఖ కమిషనర్ శ్రీకాంత్నాయక్ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసి ఉందన్నారు. ఒకవేళ చిన్నారులను రాజకీయ ప్రచారానికి వినియోగిస్తే సెక్షన్ 3(1) ప్రకారం శిక్షార్హులవుతారన్నారు. నేడు షర్మిల నామినేషన్ కడప వైఎస్ఆర్ సర్కిల్: కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్దిగా వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు తెలిపారు. శుక్రవారం నగరంలోని ఇందిరాభవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలో ర్యాలీ నిర్వహించి ఉదయం 11.10 గంటలకు నామిషన్ వేస్తారన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్లో శిక్షణ కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్, మహిళల దుస్తుల తయారీ, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామన్నారు. 18–45 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన మహిళలు ఇందుకు అర్హులన్నారు. ఉచిత శిక్షణతోపాటు భోజన వసతి, సౌకర్యం ఉంటుందన్నారు. ఆసక్తికలిగిన గ్రామీణ ప్రాంతాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 22న తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. ఇతర వివరాలకు 94409 05478, 63028 33546, 94409 33028 నెంబర్లలో సంప్రదించాలన్నారు. నేటి నుంచి డిగ్రీ పరీక్షలు కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా యోగి వేమన యూనివర్సీటీ అనుబంధ డిగ్రీ కళాశాల 1,2,4,6 సెమిస్టర్ విద్యార్థులకు ఈనెల 20వ తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. మొదటి సెమిస్టర్ (2023–24) బ్యాచ్, 2వ సెమిస్టర్, (2016–17), (2020– 21), (2023–24) బ్యాచ్లు, నాలుగవ సమిస్టర్ (2016–17), 2023–24) బ్యాచ్, 6వ సెమిస్టర్, (2016–17) విద్యార్థులకు పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లాలోని 57 పరీక్షా కేంద్రాలలో 31,830 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. నేడు దక్షిణాంధ్ర ధర్మాచార్యుల సమ్మేళనం కడప కల్చరల్: విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ధర్మాచార్యుల సమ్మేళనం శనివారం నిర్వహించనున్నారు. కడప ్లలోని చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ లలితా పంచాయతన దేవాలయంలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ సమ్మేళనం నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు ప్రాంత ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ బెస్తవేముల రామమహేష్, ప్రాంత కార్యదర్శి కాకర్ల రాముడులను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. విద్యార్థులు సామర్థ్యాలను పెంచుకోవాలి కడప ఎడ్యుకేషన్: విద్యార్థులు చదువు పరంగా తమ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ ఎద్దుల రాఘవరెడ్డి సూచించారు. శుక్రవారం కడపలోని కేంద్రియ విద్యాలయంలో జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష సంయుక్త ప్రేరణ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, కథల పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల విద్య ఆర్జేడీ ఎద్దుల రాఘవరెడ్డి, డీఈఓ అనురాధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు జిల్లాస్థాయి పోటీలను నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిలో ఒకరిని ఎంపిక చేసి శిక్షణ అనంతరం జాతీయస్థాయి పోటీల కు పంపుతారన్నారు ఏఎంఓ ధనలక్ష్మి, ఏఏఎంఓ రామాంజనేయులురెడ్డి, రాహుల్మీనా పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలోబిగారి వీధిలో మారం సురేష్, చిన్న వెంకటేష్లపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులైన బొమ్మలమణి, సయ్యద్ రుక్సానాలను శుక్రవారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు వన్టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. కడపలో ఇద్దరు అరెస్ట్ కడప అర్బన్ : కడప నగరంలోని ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో జివిఆర్ టవర్స్ సమీపంలో సుజిత్ అలియాస్ బిన్ని, అభినవ్ అలియాస్ సోనులపై హత్యాయత్నంకు పాల్పడిన సంజయ్ రాహుల్, ఖాదర్వలీ అలియాస్ హాజీలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీఐ సి. భాస్కర్రెడ్డి తెలియజేశారు. మరోవైపు సంజయ్ రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుజిత్ అలియాస్ బిన్ని, అభినవ్ అలియాస్ సోనులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు. ‘చెడ్డీ గ్యాంగ్’ కదలికలపై పోలీసుల నిఘా కడప అర్బన్ : జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రజలు ఎక్కడికై నా ఊర్లకు వెళ్లేటపుడు ఇంటిలో విలువైన బంగారు, వెండి ఆభరణాలనుగానీ, నగదును గానీ జాగ్రత్తపరచుకోవాలని సూచిస్తున్నారు. ప్రధానంగా ఊరి బయట గృహాలున్న వారు ఇంకా అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్తో జాగ్రత్త ఎర్రగుంట్ల : జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ అనే దొంగల ముఠా తిరుగుతోందని, ప్రజలందరు చాలా అప్రమత్తంగా ఉండాలని ఎర్రగుంట్ల పట్టణ సీఐ ఈశ్వరయ్య అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించి వెంటనే పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. కలమల్ల పోలీస్స్టేషన్ పరిధిలో ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కలమల్ల ఎస్ఐ సంజీవరెడ్డి సూచించారు. 532 ఫిర్యాదులు పరిష్కారం కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై మొత్తం 535 ఫిర్యాదులు అందగా 532 ఫిర్యాదులకు పరిష్కారం అందించామని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వేర్వేరు ఫిర్యాదు వేదికల ద్వారా అందిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఫిర్యాదుల పరిష్కార నివేదికను విడుదల చేసిందన్నారు ● సీ–విజిల్ ద్వారా మొత్తం 336 కేసులు నమోదయ్యాయి. అందులో 203 నిజనిర్ధారణ కాగా, 133 నిరాధారమైనవిగా గుర్తించడమైందన్నారు. ● ఎఫ్ఎస్టీ., ఎస్ఎస్టీ, పోలీసు ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ద్వారా చేపట్టిన సీజర్ మేనేజ్మెంట్ ప్రక్రియ ద్వారా కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రూ.3,69, 35,295 ల మేర నగదు, రూ.7,29,25,368 ల విలువైన లిక్కర్, ఇతర వస్తువులను సీజ్ చేయడం జరిగింది. అలాగే 1,011 ఎఫ్ఐఆర్. కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. క్షుద్రపూజల కలకలం బద్వేలు అర్బన్ : టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రపంచం ముందుకు సాగుతున్నా మూఢనమ్మకాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. మండలంలోని కోనసముద్రం పంచాయతీలోని కోనసముద్రం గ్రామ చెరువులో క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేపింది. శుక్రవారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే... కోనసముద్రం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమతో ముగ్గులు వేయడంతో పాటు గుమ్మడికాయలు కోసి ఉండటంతో క్షుద్రపూజల కోసమే ఇలా చేసి ఉంటారని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో గ్రామస్తులు బద్వేలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూరల్ ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. పూర్తిస్థాయిలో విచారించి వాస్తవాలు ఏమిటో గుర్తిస్తామని, ప్రజలు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. తమ్ముడిని కాల్చిన అన్న అరెస్ట్ గుర్రంకొండ : ఆస్తి పంపకం వివాదంలో తమ్ముడ్ని నాటు తుపాకీతో కాల్చిన అన్న జయప్ప (56)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక నాటు తుపాకీతో పాటు మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని టి.పసలవాండ్లపల్లె పంచాయతీ ఎగువహరిజనవాడ గ్రామానికి చెందిన బాలపోగు జయప్ప, బాలపోగు విశ్వనాథ్లు అన్నదమ్ములు. వీరికి గ్రామానికి సమీపంలోనే తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పొలం ఉంది. ఈ ఆస్తి పంపకం విషయంతో గొడవ పడిన నేపథ్యంలో ఈనెల 16న కోపంతో తమ్ముడిని అన్న నాటు తుపాకీతో కాల్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడు జయప్పను శుక్రవారం మండలంలోని ఉదారివాండ్లపల్లె క్రాస్ వద్ద అరెస్ట్ చేసినట్లు వాల్మీకిపురం సీఐ పులిశేఖర్, గుర్రంకొండ ఎస్ఐ నాగార్జునరెడ్డిలు తెలిపారు. న్యాయవాదిపై దాడి కడప అర్బన్: కడప నగరంలోని ఎర్రముక్కపల్లి సమీపంలో పూసల వీధిలో పి. శివ సుధాకర్ అనే న్యాయవాది తనపై శుక్రవారం సాయంత్రం కొందరు దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారించి చర్యలు తీసుకోనున్నట్లు కడప ఒన్టౌన్ సీఐ సి. భాస్కర్రెడ్డి తెలియజేశారు. -
న్యాయం చేసి.. ఓట్లు అడగండి
ఎర్రగుంట్ల : బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తరపున చేస్తున్న ప్రచారంలో ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి. ప్రశ్నల వర్షం కురుస్తోంది. గురువారం సాయంత్రం యర్రగుంట్ల పట్టణంలోని 17,18 వార్డుల్లో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సతీమణి అరుణమ్మ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేవవరెడ్డి స్కూల్ బాధితులు ఆమెతో మాట్లాడుతూ డిపాజిట్లు ఇప్పించడంలో విఫలమైన ఆది ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని, మళ్లీ ఎలా ఓట్లు అడుగుతారని నిలదీశారు. వివరాలు..ఎర్రగుంట్లలోని కేశవరెడ్డి స్కూల్లో చదివిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అప్పట్లో విద్యార్థి పేరు మీద డిపాజిట్ చేస్తే పదోతరగతి పూర్తయ్యాక తిరిగి ఇస్తామని చెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు చాలా మంది రూ. లక్షలలో డిపాజిట్ చేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో కేశవరెడ్డి స్కూల్స్ మూత పడింది. డిపాజిట్లను తిరిగి ఇస్తామని చెప్పారని, అప్పట్లో కేశవరెడ్డి స్కూల్స్ తరపున అదినారాయణరెడ్డి వచ్చారని, డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని బాధితులు వాపోయారు. కొందరు బాధితులు సీఐడీకి కూడా ఫిర్యాదు చేశారు. అప్పట్లో తిరుపతి నుంచి సీఐడీ బృందం ఇక్కడకు వచ్చి విచారణ చేసిందన్నారు. అదినారాయణరెడ్డికి కేశవరెడ్డి స్వయానా వియ్యంకుడే. అయినా మాకు డిపాజిట్లు ఇప్పించలేదని బాధితులు అవేదన చెందారు. ఇప్పుడు మళ్లా ఏవిధంగా వచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతున్నారని బాధితులు నిలదీస్తున్నారు. ఆదినారాయణరెడ్డి సతీమణిని నిలదీసిన కేశవరెడ్డి స్కూల్ బాధితులు మేం కట్టిన డిపాజిట్లు తక్షణమే ఇప్పించాలి -
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
ఓబులవారిపల్లె : మండలంలోని గాదెల వెంకటాపురం దళితవాడలో భర్త వేధింపులు తాళలేక పి. ఓబులమ్మ (38) అనే మహిళ శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. పెనగలూరు మండలం సాతుపల్లి గ్రామానికి చెందిన ఓబులమ్మకు గాదెల వెంకటాపురం దళితవాడకు చెందిన పోలమనేని చంద్రకు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఏడాది నుండి భార్యభర్తల మధ్య గొడవలు ఉండటంతో ఓబులమ్మ తన తల్లిదండ్రుల గ్రామమైన సాతుపల్లెలో ఉంటోంది. ఈ క్రమంలో విడాకులు కావాలని చంద్ర భార్యకు నోటీసులు పంపించాడు. అయితే భర్త, పిల్లలు కావాలని గురువారం సాయంత్రం గాదెల వెంకటాపురం దళితవాడకు వచ్చింది. రాత్రి భార్యా భర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి ఉరివేసుకొని ఓబులమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తన చెల్లెలు మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని మృతురాలి సోదరుడు ఓబులేశు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళ ఆత్మహత్య బద్వేలు అర్బన్ : అప్పులబాధతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని గాండ్లవీధిలో నివసించే షేక్జిలేకా (48) గత కొన్నేళ్ళుగా చీటీల వ్యాపారం నిర్వహిస్తోంది. ఈమె భర్త మాబుసుబాన్ లారీడ్రైవర్గా పనిచేస్తుంటాడు. వీరికి ముగ్గురు సంతానం. అయితే చీటీల వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు అప్పులు అధికం కావడంతో జిలేకా గతంలో ఓ మారు ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతిచెందింది. యువతి ఆత్మహత్యాయత్నం మదనపల్లె : కుటుంబసమస్యల కారణంగా ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో జరిగింది. నిమ్మనపల్లె పంచాయతీ నాగులయ్యగారిపల్లెకు చెందిన ఓ యువతి(17) కుటుంబసమస్యలతో పశువులకు వాడే పిడుదుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని 108లో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
No Headline
కడప పార్లమెంటు నియోజక వర్గం..● చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి (తెలుగుదేశం) ● షేక్ చాంద్బాషా (అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) కడప అవ్వారు మల్లికార్జున (జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ ) షేక్ మహబూబ్బాషా (అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) ఎం.వి.సుధీర్కుమార్– (స్వతంత్ర) ప్రొద్దుటూరు కడింటి పెద్దన్న (సమాజ్వాది పార్టీ) జమ్మలమడుగు అల్లె ప్రభావతి ( స్వతంత్ర) చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి (బీజేపీ) మైదుకూరు శెట్టిపల్లె రఘురామిరెడ్డి (వైఎస్సార్ సీపీ), షేక్ మహబూబ్బాషా (నవరంగ్ కాంగ్రెస్ పార్టీ) శ్రీయపురెడ్డి రాజారామిరెడ్డి (అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) బద్వేలు నిల్ పులివెందుల నిల్ కమలాపురం నిల్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement