-
ఈ ఆరు అటాక్స్ ప్రపంచాన్ని గడగడలాడించాయి..
డిజిటల్ ప్రపంచం.. ముందస్తు కంటే శరవేగంగా విస్తరిస్తున్న కొత్త లోకం. ఈ ప్రపంచం ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే స్పీడుగా దానిపై సైబర్ అటాక్స్ కూడా విజృంభిస్తున్నాయి. ఈ అటాక్స్ కొత్తమీ కాకపోయినా... వీటి సంఖ్య పెరగడం ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు సైబర్ అటాక్స్ విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా.. వీటి సంఖ్య పెరగడమే కానీ, తగ్గుముఖం పట్టడం లేదు. ప్రతి రోజు ఆన్లైన్లో దొంగలించే సమాచారం పెరిగిపోతోంది. ఈ ఏడాది ర్యామ్సమ్వేర్ అటాక్స్ వల్ల ఏర్పడిన నష్టం 5 బిలియన్ డాలర్ల(రూ.32,091 కోట్లకు పైన) పైగే ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఖర్చు తదుపరి ఏళ్లలో మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా సైబర్ సెక్యురిటీ ఖర్చులు కూడా వచ్చే నాలుగేళ్లలో 1 ట్రిలియన్ డాలర్లకు పైన ఉంటుందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో 2017లో ప్రపంచాన్ని వణికించిన ఆరు క్రూరమైన సైబర్ అటాక్స్ ఏమిటో ఓ సారి చూద్దాం.. షాడో బ్రోకర్స్.... షాడో బ్రోకర్స్. ఇదో సైబర్ గ్యాంగ్. అమెరికా నిఘా సంస్థ ఎన్ఎస్ఏ నుంచి ఏప్రిల్ నెలలో ఈ షాడో బ్రోకర్స్ ఓ సైబర్ ఆయుధాన్ని చోరీ చేశారు. మైక్రోసాఫ్ట్ విండోస్ను వాడుకుని ఆ ఆయుధంతో ఎటువంటి కంప్యూటర్ను అయినా హ్యాక్ చేయవచ్చు. వాస్తవానికి ఎటర్నల్ బ్లూ పేరుతో హ్యాకింగ్ ఆయుధాన్ని అమెరికా భద్రతా సంస్థ తయారు చేసింది. ఆ హ్యాకింగ్ టూల్నే షాడో బ్రోకర్స్ ఎత్తుకెళ్లారు. ఆ ప్రమాదకరమైన బగ్ను ఏప్రిల్ 14వ తేదీన షాడో గ్యాంగ్ కంప్యూటర్లపై వదిలింది. దాంతో కంప్యూటర్ సిస్టమ్లు అన్నీ కరప్ట్ అయ్యాయి. షాడో బ్రోకర్స్ అనేది ఓ రహస్య సంస్థ. వాళ్ల ఆచూకీ ఎక్కడా ఉండదు.అయితే సిరియాపై అమెరికా బాంబు దాడి చేసినందుకే ఆ గ్యాంగ్ ఈ బగ్తో కంప్యూటర్లను హ్యాక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ గ్యాంగ్కు రష్యాతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. వాన్నక్రై.... ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా వ్యాపించిన ర్యామ్సమ్వేర్ అటాక్స్లో వాన్నక్రై మాల్వేర్ ఒకటి. భారత్ సహా దాదాపు 100 దేశాలను ఈ వాన్నక్రై గడగడలాడించింది. కంప్యూటర్లలోని డేటాను ఎన్క్రిప్ట్ చేసి, సొమ్ము చెల్లిస్తేగానీ దాన్ని విడిచిపెట్టబోమంటూ ప్రపంచాన్ని హడలెత్తిచింది. బాధిత దేశాల్లోని ఆసుపత్రులు, పోలీసు శాఖలు, ప్రజా రవాణా వ్యవస్థలు, టెలికం సంస్థలు, కంపెనీలు, యూనివర్సిటీలపై దీని ప్రభావం పడింది. ఈ తరహా సైబర్దాడిలో ఇది ప్రపంచంలోనే అతిపెద్దదని నిపుణులు చెప్పారు. ఈ దాడుల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన 102 సిస్టమ్స్ కూడా ప్రభావితమయ్యాయి. 24 గంటల్లో లక్షకుపైగా కంప్యూటర్ వ్యవస్థలు ఈ వైరస్ బారిన పడినట్లు మాల్వేర్టెక్ ట్రాకర్ సంస్థ కనుగొంది. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ వ్యవస్థలో బలహీనతలను ఇది సొమ్ము చేసుకుంటోందని నిపుణులు చెప్పారు. నాట్పెట్యా..... ఈ ఏడాది ప్రపంచాన్ని కుదిపివేసిన మాల్వేర్లో నాట్పెట్యా ఒకటి. 2016 ర్యామ్సమ్వేర్ పెట్యాకు దీనికి చాలా పోలికలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంప్యూటర్లకు ఇది దాదాపు విస్తరించింది. అమెరికాలోని కార్పొరేట్ దిగ్గజాలు, ఫార్మాస్యూటికల్ కంపెనీ మెర్క్, డానిష్ షిప్పింగ్ కంపెనీ, రష్యన్ ఆయిల్ దిగ్గజం రోస్నేఫ్ట్ వంటివి దీని బారిన పడ్డాయి. ఉక్రేయిన్లో పవర్ కంపెనీలను, ఎయిరఫోర్టులను, పబ్లిక్ ట్రాన్సిస్ట్ను, ఈ దేశ సెంట్రల్ బ్యాంకును నాట్పెట్యా గడగడలాడించింది. ఆసియా-పసిఫిక్లో నాట్పెట్యాతో ఎక్కువగా ప్రభావితమైనది భారత్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాలు దీని బారిన ఎక్కువగా పడ్డాయని సైబర్ సెక్యురిటీ సంస్థ సిమాంటెక్ పేర్కొంది. జోమాటో హ్యాక్... జోమాటో.. భారత్లోని అతిపెద్ద రెస్టారెంట్ అగ్రిగేటర్లలో ఒకటి. ఈ సంస్థ భారీ హ్యాకింగ్కు గురైంది. ఈ సంస్థకు చెందిన170 లక్షలకు పైగా యూజర్ల అకౌంట్ల సమాచారాన్ని హ్యాకర్లు డార్క్ వెబ్లో విక్రయించారు. ఈ డేటా బేస్ లో రిజిస్ట్రర్డ్ జోమాటో యూజర్ల ఈ-మెయిల్స్, పాస్ వర్డ్ లు ఉన్నాయి. దొంగలించిన డేటా జుమాటోకి చెందినదేనని నిరూపించడానికి నమూనా డేటాను కూడా ఆ విక్రయదారుడు షేర్ చేశాడు. దీంతో జోమాటో భద్రతా వైఫల్యాలతో తీవ్ర సతమతమైంది. అదృష్టశాత్తు యూజర్ల పేమెంట్ వివరాలు వేరే ప్రాంతంలో నిక్షిప్తం చేయడంతో, యూజర్లు ఆర్థిక నష్టం బారిన పడలేదు. ది హెచ్బీఓ హ్యాక్... గత దశాబ్దం కాలంగా స్క్రీన్లపై సంచలనం సృష్టిస్తున్న అత్యంత పాపులర్ టెలివిజన్ షో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'. దీనిపై కూడా హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. ఈ షోకు చెందిన స్క్రీప్ట్లను, 1.5 టెర్రాబైట్స్ డేటాను ''మిస్టర్ స్మిత్'' అనే హ్యాకింగ్ గ్రూప్ దొంగతనం చేసింది. డేటాను దొంగతనం చేసిన హ్యాకర్లు కంపెనీ నుంచి ఆరునెలల వేతనాన్ని డిమాండ్ చేశారు. అంటే 6 మిలియన్ డాలర్లకు పైగా వారు కోరారు. తమ డిమాండ్ను నెరవేర్చకపోతే ఎక్కువ మొత్తంలో ఫైల్స్ను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. అయితే హ్యాకర్లు డిమాండ్ చేసిన మొత్తాన్ని హెచ్బీఓ చెల్లించిందో లేదో చెప్పడాన్ని మాత్రం ఆ సంస్థ చాలా సీక్రెట్గా ఉంచింది. ఈక్విఫ్యాక్స్... అమెరికాలో అతిపెద్ద క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీలో ఒకటి ఈక్విఫాక్స్. ఈ ఏడాది జూలైలో ఈ క్రెడిట్ ఏజెన్సీపై హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. 145 మిలియన్ ప్రజల వ్యక్తిగత డేటాను వీరు దొంగతనం చేశారు. హ్యాకింగ్ బారిని పడిన అత్యంత చెత్త సంఘటనలో ఈక్విఫ్యాక్స్ దొంగతనం ఒకటి. కీలకమైన సమాచారం(క్రెడిట్ కార్డు నెంబర్లు, బర్త్డే వివరాలు, సోషల్ సెక్యురిటీ నెంబర్లు) హ్యాకర్లు దొంగలించారు. -
చైనా సైబర్ దాడులను తిప్పికొట్టలేమా..?
భారత కంపెనీలు, ప్రభుత్వ సంస్థలపై చైనా హ్యాకర్లు విరుచుకుపడితే దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా లేదని సైబర్ భద్రతా నిపుణులు రాహుల్ త్యాగి హెచ్చరించారు. ఈ తరహా దాడులకు ప్రభుత్వ సంస్థలు సులభంగా టార్గెట్ అవుతాయని, దురదృష్టవశాత్తూ ఈ దాడులను మనం గుర్తించగలిగే పరిస్థితిలో కూడా లేమని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో మనకు సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో అక్కడి నుంచి సైబర్ దాడులు జరగుతున్నాయని భ్రమింపచేసేలా చైనా హ్యాకర్లు ఐపీలతో మాయాజాలం చేస్తారని అన్నారు. ఐపీ అడ్రస్ ద్వారా ప్రతి కంప్యూటర్ను అది ఉపయోగించే ఇంటర్నెట్, దాని లొకేషన్ను గుర్తించవచ్చని, ఈ తరహా దాడులను పసిగట్టే సామర్ధ్యం మన ప్రభుత్వానికి లేదని ఎథికల్ హ్యాకర్ కూడా అయిన త్యాగి పేర్కొన్నారు. ఈ తరహా దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు కొంత సమయం, నిధులను ప్రభుత్వం వెచ్చించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సైబర్ దాడులను పసిగట్టి, నిరోధించేలా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. మరోవైపు యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ గుర్తించకుండా ఉండేలా హార్డ్వేర్లో మాల్వేర్(వైరస్)ను చైనా కంపెనీలు ప్రవేశపెట్టాయని గతంలో వార్తలు వచ్చాయి. భారత్ హార్డ్వేర్ కోసం అధికంగా చైనా దిగుమతులపైనే ఆధారపడటం కూడా ఆందోళన కలిగిస్తున్నది. -
ట్విట్టర్ డౌన్! వన్నాక్రై దాడి జరిగిందా?
సామాజిక మాధ్యమంగా ఎక్కువమంది యూజర్లు వాడే ట్విట్టర్ డౌన్ అయింది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ట్విట్టర్ కు ఏమైందో తెలియదు? చాలామంది యూజర్లకు ట్విట్టర్ లో పోస్టింగ్స్ చేయడానికి తెగ ఇబ్బందులు పడ్డారట. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ట్విట్టర్ లో ట్వీట్స్ పోస్టు చేసేటప్పుడు, ఇంటర్నల్ ఎర్రర్, ఇతర మెసేజ్ లు చూపించాయని రిపోర్టులు వెల్లువడ్డాయి. దీంతో ఒక్కసారిగా యూజర్లలో ఆందోళన రేకెత్తిందని తెలిసింది. వారం క్రితం జరిగిన భారీ సైబర్ దాడి ముప్పున ట్విట్టర్ కూడా పడిందేమోనని యూజర్లు తీవ్రంగా ఆందోళన పడ్డారు. ట్విట్టర్ లోకి వెళ్లిన 15-20 నిమిషాలకు వరకు సర్వర్ డౌన్ లోనే ఉందని కొంతమంది యూజర్లు ఫిర్యాదు చేశారు. ట్వీటింగ్, రీట్విటింగ్ వంటి వాటిల్లో సమస్యలు వచ్చాయని వారు పేర్కొన్నారు. గత 20 నిమిషాల వ్యవధిలో అసలు ట్వీట్ చేయడానికి వీలుపడలేదని ఓ ట్విట్టరియన్ చెప్పారు. 25 నిమిషాల వరకు ట్విట్టర్ డౌన్ అయిందని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. ఒకవేళ ట్విట్టర్ వన్నాక్రై బారిన పడిందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాబ్లమ్ కొన్ని ప్రాంతాల్లోనే వచ్చిందని వెల్లడైంది. Twitter was just down for about 25 minutes. I couldn't believe there were no tweets for that long. — Brian (@briant1701) May 19, 2017 Is Twitter also attacked by WannaCry baby? — Ashwini Dodani (@AshwiniDodani) May 19, 2017 Twitter is down! Ransomware attack?? — sarbasis bisoyi (@sarbasis007) May 19, 2017 So, apparently #Twitter is partially down, I couldn't tweet during the last 20 minutes#AT #TwitterDown — Vree (@vreethesergal) May 19, 2017
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్ ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement