-
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
మురికి కాలువ పక్క నిద్రించిన విలన్.. భార్య చనిపోతే డబ్బుల్లేక!
సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కోట్లు వెనకేస్తారనుకుంటారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని భ్రమిస్తుంటారు. కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొన్ని దశాబ్దాలు వెనక్కు వెళ్తే ఒకప్పుడు నటులు ఎంత దుర్భర జీవితం అనుభవించారో కళ్లకు కట్టినట్లు వివరించాడు దివంగత విలన్ అజిత్ తనయుడు షెహజాద్ ఖాన్. అతడు మాట్లాడుతూ.. 'సూపర్ హిట్ మూవీ నయా డౌర్(ఈ మూవీకి అజిత్ సహాయక నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నాడు) తర్వాత నాన్న కెరీర్ పతనం కావడం ప్రారంభమైంది. నాలుగైదేళ్లపాటు అతడికి అవకాశాలు రాలేదు. ఏ పనీ చేయలేదు. హీరోల వల్లే నాన్నకు కష్టాలు.. ఇందుకు ప్రధాన కారణం.. హీరోలకున్న భయమే! నాన్న సినిమాలో ఉంటే ఎక్కడ వారిని డామినేట్ చేస్తాడో అని భయపడ్డారు. ఆయనతో పని చేస్తే తనకే గుర్తింపు వస్తుంది, తనకే అవార్డులిచ్చేస్తారు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోరని ఫీలయ్యారు. అందుకని అవకాశాలివ్వలేదు. అలా ఎన్నో కష్టాలు చూశాడు. కెరీర్ ప్రారంభంలో అయితే అంతకన్నా ఎక్కువే చూశాడు. ఓరోజు ముంబైలో మొహమ్మద్ అలీ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడున్న మురికి కాలువను చూపిస్తూ దీని పక్కనే పడుకున్నానని చెప్పాడు. ఆస్తులు లాక్కున్న బంధువులు హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చిన కొత్తలో రోడ్డుపైనే నిద్రపోయానన్నాడు. తన కాలేజీ పుస్తకాలు అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుతో ముంబైకి వచ్చాడు' అని తెలిపాడు. మొదట్లో కష్టాలతోనే సావాసం చేసిన అజిత్ సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కాడు. 1960, 70వ దశకంలో టాప్ విలన్గా రాణించాడు. 1998లో మరణించాడు. కొంతకాలానికి ఆయన మూడో భార్య సారాకు క్యాన్సర్కు సోకింది. ఆ సమయంలో ఆమె వైద్య ఖర్చులు భరించడానికి షెహజాద్ అన్నయ్య ముందుకురాలేదట! ఆస్పత్రి బిల్లు కూడా కట్టలే! 'నాన్న పోయాక ఆయన కూడబెట్టిన డబ్బునంతా అన్నయ్య, బంధువులే పంచుకున్నారు. దీంతో అమ్మకు మంచి వైద్యం అందించడం నాకెంతో కష్టమైంది. అమ్మ చనిపోయినప్పుడు రూ.5000 ఆస్పత్రి బిల్లు కట్టడానికి కూడా అన్నయ్య నిరాకరించాడు. కానీ ఆమె ఆస్తులు, నగలు మాత్రం అన్నీ తీసుకున్నాడు' అని విచారం వ్యక్తం చేశాడు. కాగా షెహజాద్ అందాజ్ అప్నా అప్నా అనే సినిమాలో భల్లా అనే పాత్రతో ఫేమస్ అయ్యాడు. ఇతడు కూడా నటుడిగా రాణిస్తున్నాడు. చదవండి: సౌత్ ఇండస్ట్రీలో నటికి చేదు అనుభవం.. ఆఫీసుకు రమ్మని చివరకు.. -
ఎన్టీఆర్ విలన్ పాత్ర వెనుక పెద్ద స్కెచ్చే ఉంది
-
మెచ్చుకున్నారే కానీ తెలుగులో అవకాశాలు ఇవ్వలేదు: విలన్
సంక్రాంతి పోటీ భలే రంజుగా మారింది. నాలుగు సినిమాలు పందెం కోళ్లలా బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నాయి. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, నా సామిరంగ చిత్రాలు సంక్రాంతిని క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యాయి. ఇకపోతే రేపు (జనవరి 12న) గుంటూరు కారం, హనుమాన్ రిలీజ్ అవుతుండగా, సైంధవ్ జనవరి 13న, నా సామిరంగ ఆ మరుసటి రోజున విడుదల కానున్నాయి. అయితే గుంటూరు కారం, నా సామిరంగ చిత్రాల్లో విలన్గా నటించిన మధుసూదన రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు. నాకు తెలియకుండానే సినిమా పూర్తి చేశాడు 'అమ్మది ఖమ్మం, నాన్నది ఒంగోలు. నేను పుట్టిపెరిగింది, చదువుకుందంతా కర్ణాటకలో! నన్ను విలన్గా గుర్తించిన డైరెక్టర్ దేవ్ కట్టా. ఆయన దర్శకత్వం వహించిన ఆటో నగర్ సూర్య సినిమా తర్వాత ఇక్కడ దశ మారుతుందనుకున్నాను. అందరూ అద్భుతంగా చేశావని చెప్పేవారే తప్ప అవకాశాలు మాత్రం ఎక్కువగా ఇవ్వలేదు. అందుకే తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించాను. నా భార్య శృతి కూడా విలన్గా యాక్ట్ చేసింది. మాకు ఇద్దరు కుమారులు సంతానం. ఓ కుమారుడు ప్రీతమ్ నాకు తెలియకుండానే సినిమా చేశాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే చిత్రంలో నటించాడు. అంతా అయ్యాక సినిమా చేశానని చెప్పడంతో షాకయ్యాను. తను కళ్ల ముందే ఎదుగుతున్నందుకు ఉప్పొంగిపోయి ఆనందంతో ఏడ్చేశాను. అయితే నా పేరు ఎక్కడా వాడకూడదని తనకు కండీషన్ కూడా పెట్టాను. కానీ . రోజంతా కష్టపడితే.. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. రోజంతా పని చేస్తే రూ.300 వచ్చేవి. కెప్టెన్ విజయ్కాంత్ అంటే చాలా ఇష్టం. ఆర్మీ నుంచి యాక్టింగ్లోకి వచ్చాను. ఇన్నేళ్లలో వందల కోట్లు సంపాదించాననుకుంటారు. కానీ అంత సీన్ లేదు. లక్ష రూపాయలు వస్తే అందులో 30% జీఎస్టీ పోతుంది. నా మేనేజర్కు, మేకప్మెన్కు.. వారికి డబ్బులివ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఎవరికైనా డబ్బు కావాలంటే సాయం చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, భోజ్పురి భాషల్లో నటించాను. ఈసారి బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది' అని చెప్పుకొచ్చాడు మధుసూదనరావు. చదవండి: కమల్, శ్రీవిద్య లవ్స్టోరీ.. పెళ్లి చేసుకుంటానన్న కమల్.. కానీ! -
Ramachandra Raju-Jeest : తిరుమలలో కేజీఎఫ్ విలన్, బెంగాలీ స్టార్ నటుడు సందడి (ఫోటోలు)
-
Shine Tom Chacko Engagement: లేటు వయసులో పెళ్లికి రెడీ అయిన దసరా విలన్.. ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
సిగ్గుండాలి.. 9 నెలలవుతున్నా డబ్బు ముట్టలేదు: డెవిల్ విలన్ ఫైర్
బింబిసార సినిమాతో తిరిగి ఫామ్లోకి వచ్చాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. అయితే ఆ తర్వాత త్రిపాత్రాభినయంతో చేసిన అమిగోస్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఇతడు డెవిల్ అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. మాళవికా నాయర్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా స్వీయదర్శకత్వంలో నిర్మించాడు. మొదట్లో అతడు.. తర్వాత ఇతడు ఈ సినిమా ఆది నుంచి ఏదో ఒక వివాదంలో చుట్టుకుంటూనే ఉంది. మొదట్లో ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకుడు అని చెప్పారు. రిలీజైన పోస్టర్లోనూ అతడినే డైరెక్టర్గా ప్రస్తావించారు. తర్వాత టీజర్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం దర్శకుడి స్థానంలో అభిషేక్ నామా పేరును పెట్టేశారు. తాజాగా ఈ సినిమాలో విలన్గా నటించిన యాక్టర్ మార్క్ బెనింగ్టన్ చిత్రయూనిట్పై తీవ్ర విమర్శలు చేశాడు. నాకు డబ్బులివ్వలేదు మార్క్ మాట్లాడుతూ.. 'డెవిల్ సినిమా షూటింగ్ మొదట్లో బాగానే జరిగింది. చివరి షెడ్యూల్ జరిగేటప్పుడు మాత్రం కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. నా పాత్ర షూటింగ్ అయిపోయి 9 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు నాకు డబ్బులు ముట్టనేలేదు. అంతేకాదు, నా పాత్రకుగానూ వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించారు. అది నేను ట్రైలర్లో చూసి చాలా బాధపడ్డాను. ఇలా చేయడం నాతో చేసుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించడమే అవుతుంది' అని మండిపడ్డాడు. ఇలాంటి పని చేయడానికి కాస్తైనా సిగ్గుండాలంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోనూ డెవిల్ నిర్మాతలపై ఫైర్ అయ్యాడు. మెంటల్ టార్చర్.. తాజాగా ఈ విషయంపై డెవిల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత మోహిత్ రాల్యాని స్పందించాడు. నటుడి పోస్ట్కు కామెంట్ చేస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. 'నీ మేనేజర్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడో ఇచ్చేశాం. అయినా కూడా ఇంకా డబ్బు కావాలంటూ మానసికంగా వేధిస్తున్నారు. నీ పాత్రకు వేరేవారితో డబ్బింగ్ చెప్పిన విషయానికి వస్తే.. నువ్వు తెలుగు మాట్లాడగలవా? లేదు.. అలాంటప్పుడు ఇంగ్లీష్ డైలాగులకు నీ వాయిస్, తెలుగు డైలాగులకు వేరొకరి వాయిస్ ఎలా వాడగలం? అగ్రిమెంట్లో ఆ రూల్ లేదు.. పైగా మీడియాలో మా నిర్మాణ సంస్థ ప్రతిష్ట దిగజార్చేలా వార్తలు ప్రచారం చేయిస్తున్నావు. నీ వాయిస్ వాడలేదని మమ్మల్ని కించపరుస్తున్నావు. నీ మాటలు నమ్మిన కొందరు నిజానిజాలు తెలుసుకోకుండానే వార్తలు రాసేస్తున్నారు. అసలు అగ్రిమెంట్లో నీ పాత్రకు నువ్వే డబ్బింగ్ చెప్పాలన్న నిబంధనే లేదు. ఎప్పుడేం చేయాలనేది నిర్మాత ఇష్టం. మనం ఇలా అందరి ముందు గొడవపడుతుండటం అసహ్యంగా ఉంది. నీపై నాకు చాలా గౌరవం ఉంది. ఆ విషయం నీక్కూడా తెలుసు. నీ నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తుంటా' అని రాసుకొచ్చాడు. ఈ గొడవ సద్దుమణిగిందో మరేంటో కానీ కాసేపటి క్రితమే మార్క్ బెనింగ్టన్ డెవిల్ చిత్రయూనిట్ను తిడుతూ పెట్టిన పోస్టులను డిలీట్ చేశాడు. డెవిల్ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. చదవండి: ఏడాది తిరగకముందే భార్యకు కటీఫ్.. నాలుగోసారి ప్రేమలో మ్యూజిక్ డైరెక్టర్.. -
హీరోగా చేస్తున్న సమయంలో విలన్గా ఆఫర్.. అయినా ఓకే!
నిరోజ్ పుచ్చా హీరోగా ధీన రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భారతీయన్స్’. శంకర్ ఎన్. అడుసుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ అయింది. శనివారం విలేకరుల సమావేశంలో నిరోజ్ పుచ్చా మాట్లాడుతూ– ‘‘2019లో వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్తో నా యాక్టింగ్ జర్నీ మొదలైంది. ‘భారతీయన్స్’ చేస్తున్నప్పుడే నాకు విలన్గా చాన్స్ వస్తే, ఓకే చెప్పాను. ఎందుకంటే హీరోనా? విలనా అని కాదు.. యాక్టర్గా నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
4సార్లు జైలుకు.. ఎలుకలు పడ్డ పప్పు తిన్న టాలీవుడ్ విలన్ ఎవరంటే?
ఏదో ఒక వివాదంలో నానుతూ ఉండే నటుడు అజాజ్ ఖాన్. దురుసు వ్యాఖ్యలతో, డ్రగ్స్ వివాదంతో ఎప్పుడూ హెడ్లైన్స్లో ఉండే ఈయన కొద్ది నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. 2021లో డ్రగ్స్ కేసులో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేయగా రెండున్నరేళ్లపాటు జైలుజీవితం గడిపాడు. మే 19న బెయిల్పై బయటకు వచ్చిన అతడు ఇటీవల తన అనుభవాలను చెప్పుకొచ్చాడు. 400 మందికి నాలుగే బాత్రూమ్స్ 'ఈ రెండు సంవత్సరాలు నాకెంతో కష్టతరమైనవి. నేను నిజం మాట్లాడాను.. ఫలితంగా దగ్గరివాళ్లే నన్ను దూరం పెట్టారు. 26 నెలలపాటు నా కుటుంబానికి, అనారోగ్యంతో ఉన్న నా తండ్రికి దూరంగా ఉన్నాను. నా కుటుంబం కోసం నన్ను ఇంకా బతికే ఉంచినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదంటే.. ఎండిపోయిన చపాతీలు, రాళ్ల అన్నం తినేవాడిని. 400 మంది ఖైదీలకు నాలుగంటే నాలుగే బాత్రూమ్స్ ఉండేవి. బయటకు వచ్చాక సాధారణ జీవితానికి అలవాటు పడటానికి నెల రోజులు పట్టింది. ఒకరిపై మరొకరు పడుకుంటారు మంచి ఆహారం తీసుకోవడం, శుభ్రమైన బాత్రూమ్లో స్నానం చేయడం.. ఇంకా కొత్తగానే ఉంది. జైలులో ఎలుకలు, పురుగులు పడ్డ పప్పునే తిన్నాను. పురుగులు, కీటకాలతోపాటు నేలపై పడుకునేవాడిని. ఇక్కడ జైళ్లు ఎంత రద్దీగా ఉంటాయంటే.. స్థలం లేక ఒకరిపై మరొకరు పడుకుంటారు. 800 ఖైదీల సామర్థ్యం ఉన్న జైల్లో 3000 మందిని కుక్కుతారు. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పేరు కూడా ఓ కేసులో జైలుకు వచ్చాడు. కానీ ఏమైంది? సింపుల్గా బయటపడ్డాడు. అతడికి, రాజ్కుంద్రాకు నేను జైలులో సాయం చేశాను. అయినా ఇప్పుడు దేని గురించీ మాట్లాడాలనుకోవడం లేదు. నేను ఒకటే ఆశిస్తున్నాను. నేను నటుడిని, నాకు పనివ్వండి.. నా కుటుంబాన్ని పోషించుకోవాలి' అని అర్థిస్తున్నాడు అజాజ్ ఖాన్. నాలుగుసార్లు కటకటాలపాలు అజాజ్ ఖాన్ను తొలిసారి డ్రగ్స్ కేసులో 2018లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేసినందుకు 2019 జూలైలో, ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్ట్ను అప్లోడ్ చేసినందుకు 2020 ఏప్రిల్లో మరోసారి అరెస్టు చేశారు. ఇన్నిసార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఈ నటుడు 2021 డ్రగ్స్ కేసులో మరోసారి కటకటాలపాలయ్యాడు. ఈసారి మాత్రం కఠిన కారాగార శిక్ష ఎదుర్కొన్నాడు. రెండున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపాడు. ఈ ఏడాది మే 19న బెయిల్తో బయటకు వచ్చాడు. అజాజ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. అజాజ్ ఖాన్.. లకీర్ కా ఫఖీర్, అల్లా కీ బండే, హై తుజే సలాం, ఫర్కీ రిటర్న్స్.. ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. టాలీవుడ్లో రక్త చరిత్ర, దూకుడు, బాద్షా, హార్ట్ ఎటాక్ వంటి సినిమాల్లో విలన్గా యాక్ట్ చేశాడు. అలాగే బుల్లితెరపై.. దివ్య ఔర్ బాతీ హమ్, మట్టి కీ బన్నో, కారమ్ ఆప్నా ఆప్నా.. వంటి అనేక సీరియల్స్లో నటించాడు. ఇకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 'బిగ్ బాస్' సీజన్-7 లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే 8వ సీజన్లో కూడా కనిపించాడు. చదవండి: ఇస్రో ప్రయోగం.. దేశానికి మీరు గర్వకారణం: మహేశ్బాబు -
పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ విలన్.. భార్యకు మాత్రం హీరోనే అంటూ!
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ విలన్గా పేరు గడించిన నటుడు కబీర్ దుహాన్ సింగ్ ఓ ఇంటివాడయ్యాడు. హర్యానాకు చెందిన సీమ చాహల్తో ఏడడుగులు నడిచాడు. ఫరీదాబాద్లోని ఓ హోటల్లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి వైభవంగా జరిగింది. ఈ కొత్త జంటకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా కబీర్ దుహాన్ సింగ్ మాట్లాడుతూ.. 'జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు, నా అభిమానులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు, ఆశీర్వాదాలు అందిస్తున్నారు. మీ ఆశీర్వాదాలు నా భార్య సీమకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవితంలో నేను బెస్ట్ హీరోగా ఉండాలనుకుంటున్నాను. నేను సీమాను కలిసిన క్షణంలోనే తనే నా అర్ధాంగి అనిపించింది. నన్ను, నా కుటుంబాన్ని బాగా అర్థం చేసుకోగలదన్న నమ్మకం కలిగింది. తను ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. నేనెప్పుడూ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకున్నా. అదే నిజమైంది. తనతో కలిసి కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు కాగా హర్యానాలో పుట్టి పెరిగిన కబీర్ దుహాస్ సింగ్ మొదట మోడల్గా పని చేశాడు. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించాడు. జిల్ సినిమాలో తన సత్తా చూపించి టాలీవుడ్కు ఒక కొత్త విలన్ దొరికాడని అందరూ అనుకునేలా చేశాడు. వేదాళం సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులనూ భయపెట్టాడు. ఈ రెండు భాషల్లోనే కాకుండా కన్నడ, హిందీ భాషల్లోనూ చిత్రాలు చేస్తున్నాడు. సౌత్లో విలన్గా అదరగొడుతున్న అతడు ఇటీవల వచ్చిన శాకుంతలం సినిమాలో అసుర రాజుగా మెప్పించాడు. -
బ్యాచ్లర్ లైఫ్కు ఫుల్స్టాప్.. పెళ్లికి టాలీవుడ్ విలన్ రెడీ!
జిల్, కిక్ 2, స్పీడున్నోడు, సర్దార్ గబ్బర్ సింగ్, సుప్రీం.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాల్లో విలన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కబీర్ దుహాన్ సింగ్. హర్యానాలో పుట్టి పెరిగిన అతడు మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించాడు. జిల్ సినిమాతో తన సత్తా చూపించి టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ విలన్గా మారిపోయాడు. వేదాళం సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులనూ విలన్గా భయపెట్టాడు. తెలుగు, తమిళంలోనే కాకుండా కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. సౌత్లో విలన్గా రఫ్ఫాడిస్తున్న ఇతడు ఇటీవలే శాకుంతలం సినిమాలో అసుర రాజుగా మెప్పించాడు. తాజాగా కబీర్ పెళ్లికి బ్యాచ్లర్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టేసి పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన యువతిని పెళ్లాడబోతున్నాడట! జూన్ 23న హర్యానా సూరజ్ఖండ్లోని గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఈ వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాలు సహా బంధుమిత్రులు, ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ శుభకార్యం జరగనుంది. ఈ రోజు మెహందీ ఫంక్షన్తో పెళ్లి సంబరాలు షురూ కానున్నాయట! శుక్రవారం పెళ్లయిపోగానే అదే రోజు రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సినీప్రముఖులు సైతం హాజరు కానున్నారట! కాగా కబీర్ పెళ్లాడబోయే అమ్మాయి సీమా చాహల్ అని, తను వృత్తి రీత్యా టీచర్ అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Kabir Singh Duhan (@kabirduhansingh) చదవండి: ప్రేమలో అదే పెద్ద సమస్య: రకుల్ ప్రీత్ సింగ్ -
హీరోలు చితకబాదేవారు, నాపై నాకే అసహ్యం వేసేది: నటుడు
తెలుగు, తమిళ, హిందీ, పంజాబీ, మలయాళ భాషల్లో కలిపి 300కు పైగా చిత్రాల్లో నటించాడు శరత్ సక్సేనా. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా సత్తా చాటిన ఆయన టాలీవుడ్లో ఘరానా మొగుడు, ఎస్పీ పరశురాం, సింహాద్రి, బన్నీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కెరీర్ మధ్యలో బాలీవుడ్ను పక్కన పెట్టి సౌత్ ఇండస్ట్రీలో బిజీ అయిన ఆయన అందుకు గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. హీరోల ఇంట్రడక్షన్ సీన్లో కొట్టించుకోవడమే పని.. ముంబైలో నాకు మంచి పని దొరకడం లేదు, అందుకే సౌత్లో పని చేస్తున్నాను. అక్కడ నాకు కేవలం ఫైట్ సీన్లు మాత్రమే ఇచ్చేవారు. పొద్దున్నే లేచి అద్దం ముందుకు వెళ్లి చూసుకుంటే నాపై నాకే అసహ్యం కలిగేది. ఎందుకంటే ఇప్పుడు రెడీ అయి సెట్స్కు వెళ్లగానే హీరోలతో దెబ్బలు తినాలి. అందుకే నా ముఖం కూడా నాకు నచ్చేది కాదు. చాలామటుకు హీరోలను పరిచయం చేసే సీన్లో మమ్మల్ని ప్రవేశపెడతారు. అప్పుడు అతడు వచ్చి మమ్మల్ని చితకబాది హీరో అవుతాడు. గత 30 ఏళ్లుగా ఇదే నా పని. చిరంజీవిని కలిశా.. ఒకరోజు నేను హిందీలో సినిమాలు మానేద్దామనుకున్నా.. నా భార్యను మనదగ్గర డబ్బుందా? అని అడిగాను. ఉంది, దానితో ఏడాదిపాటు బతికేయొచ్చు అని చెప్పింది. ఆరోజు నుంచే నేను హిందీ సినిమాలు మానేశాను. కానీ దేవుడి దయ వల్ల నేను ఆ నిర్ణయం తీసుకున్న రెండు, మూడు రోజులకే కమల్ హాసన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. గుణ(1991) సినిమాలో నాకు మంచి పాత్రతో పాటు అందుకు సరిపోయే డబ్బు కూడా ఇచ్చారు. హిందీలో గూండా రాజ్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవిని కలిశా. అలా తెలుగులోనూ వర్క్ చేశాను. పది, పదిహేను చిత్రాలు చేశాను. నాగార్జునతోనూ కలిసి పని చేశా. మలయాళంలో ప్రియదర్శన్తో కలిసి ఐదారు సినిమాల్లో నటించాను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: హీరో విజయ్ది రియల్ హెయిరా? విగ్గా? క్లారిటీ ఇదే! -
ఫస్ట్ సినిమాకే లక్ష అడిగా... కానీ చిరంజీవి..: పొన్నంబలం
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోని అందరు సూపర్స్టార్లతో ఫైట్ చేశాడు పొన్నంబలం. విలన్గా తన లుక్స్తోనే భయపెట్టించే అతడు సినిమాల్లో రాక్షసాన్ని చూపించేవాడు. విలన్గా సినిమాల్లో ఇతరుల జీవితాలను మట్టుబెట్టేందుకు ప్రయత్నించేవాడు. కానీ నిజ జీవితంలో మాత్రం అతడి సొంత తమ్ముడే పొన్నంబలం పాలిట విలన్ అయ్యాడు. అతడికి తెలియకుండా స్లో పాయిజన్ ఇచ్చి చంపాలనుకున్నాడు. ఈ విషయం అతడికి తెలిసే సమయానికే తన రెండు కిడ్నీలు పాడై తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి అతడికి ఆర్థిక సాయం చేయడంతో వెంటనే చికిత్స చేయించుకుని తిరిగి కోలుకున్నాడు. లక్ష ఇస్తేనే ఫైట్.. తాజాగా పొన్నంబలం అప్పటి దీనమైన పరిస్థితితో పాటు తన మొదటి సినిమా విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 'జిమ్నాస్టిక్స్ నేర్చుకుని అందులో పర్ఫెక్ట్ అయ్యాను. తమిళంలో సినిమాలు చేస్తున్నప్పుడు నాకు తెలుగులో ఘరానా మొగుడు సినిమా ఆఫర్ వచ్చింది. ఇక్కడ అదే నా తొలి చిత్రం. అయితే ఎవరు లక్ష రూపాయలు ఇస్తారో వాళ్లతోనే సోలో ఫైట్ చేస్తానని చెప్పాను. మా ఫైట్ మాస్టర్ వచ్చి ఒక్క ఫైట్కే లక్ష అడుగుతావేంటి? అని ఆశ్చర్యపోయాడు. ఘరానా మొగుడు టీమ్ మాత్రం అంత గొప్పగా ఫైట్ చేస్తాడా? చూద్దాం.. అని నన్ను పిలిపించారు. ఏంటి, లక్ష అడుగుతున్నావని అడిగారు. చిరంజీవి గిఫ్ట్.. సర్, మీరు నాకు డబ్బులు ఇవ్వొద్దు.. ఫైట్ చేశాక బాగా వస్తేనే లక్ష ఇవ్వండి అని చెప్పాను. నాలుగు రోజులు ఫైట్ సీన్ షూట్ జరిగింది. బాగా చేశానని మెచ్చుకుని రూ.1 లక్ష ఇచ్చారు. ఘరానా మొగుడు 175 రోజులు ఆడింది. తర్వాత ఓసారి ఆఫీస్కు రమ్మని ఫోన్ వచ్చింది. వెళ్తే డబ్బులిచ్చారు. నెక్స్ట్ సినిమా కోసం ఇచ్చారేమో అనుకున్నాను. తీరా ఆ డబ్బులు లెక్కపెడ్తే రూ.5 లక్షలున్నాయి. పొరపాటున వేరేవాళ్లకు ఇవ్వాల్సింది నాకిచ్చారేమోనని కాల్ చేస్తే చిరంజీవి ఇచ్చారని చెప్పారు. ఘరానా మొగుడు సినిమాకు అంత డబ్బు గిఫ్ట్గా ఇచ్చారు' అని చెప్పుకొచ్చాడు. నాకోసం అరకోటి దాకా ఖర్చు.. తమ్ముడు విషప్రయోగం చేసిన సంఘటన గురించి మాట్లాడుతూ.. 'నా ఎదుగుదల ఓర్వలేక సొంత తమ్ముడే ఆహారంలో, డ్రింక్స్లో స్లో పాయిజన్ కలిపాడు. అది తెలియక వాడిని నమ్మి ఉద్యోగం కూడా ఇచ్చాను. కానీ నా ఎదుగుదల చూసి ఓర్వలేక నన్నే చంపాలని చూశాడు. స్లో పాయిజన్ వల్ల రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఆ సమయంలో చిరంజీవి నన్ను కాపాడాడు. ఆ భగవంతుడు చిరంజీవి రూపంలో వచ్చి సాయం చేశాడు. చిరంజీవి కోడలు ఉపాసన కూడా ఫోన్ చేసి మాట్లాడింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం చిరంజీవి దాదాపు రూ.50 లక్షల దాకా ఖర్చుపెట్టాడు' అని తెలిపాడు. చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ హీరో? ఆమె రియాక్షన్ ఇదే! -
అలాంటి పాత్రలు చేసి నిరాశ పర్చను: ఏజెంట్ విలన్
అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈనెల 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ చిత్రంలో అందరి దృష్టి మాత్రం అతనిపైనే ఉంది. ఎందుకంటే ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారాయన. ఇంతకీ అతనేవరో తెలుసుకుందాం. డినో మోరియా గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఏజెంట్ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ది గాడ్ అలియాస్ ధర్మ పాత్రలో అదరగొట్టారు. బాలీవుడ్లోనూ వెబ్ సిరీస్ ది ఎంపైర్లో ఆయన చివరిసారిగా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డినో మోరియా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (ఇది చదవండి: మీకు హీరోలను అడిగే ధైర్యం ఉందా?.. శ్రియా కామెంట్స్ వైరల్) డినో మోరియా మాట్లాడుతూ.."నిజం చెప్పాలంటే.. నేను ఇక్కడ ఏదో చేయాలని వచ్చా. నాకు బాలీవుడ్లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. నాకు వస్తున్న పాత్రలు నాకు నచ్చడం లేదు. ఒకవేళ వాటికి నేను ఒప్పుకుంటే నా అభిమానులు నిరాశకు గురవుతారు. 'ఏంటి నువ్వు ఇలాంటి పాత్రలు చేస్తున్నావా? అని ప్రశ్నిస్తారు. నా కెరీర్ని ఐదడుగులు వెనక్కు లాగే క్యారెక్టర్స్ కాకుండా.. ఒక్క అడుగు ముందుకు వేసే మంచి పాత్రలను ఎంచుకోవాలి. ఏజెంట్ మూవీ షూటింగ్పై తన అనుభవాలను పంచుకున్నారు. డినో మాట్లాడుతూ.. 'ఒమన్లో షూటింగ్ చాలా సవాళ్లతో కూడుకున్నది. అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. షూటింగ్ సమయంలో 4 పొరల దుస్తులు ధరించి ఎండలో నటించా. ఆ సమయంలో తాము ఉడికిపోయినట్లు అనిపించింది. అయినా కూడా షూటింగ్ పూర్తి చేశాం. నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. ఇలాంటి సాహసోపేతమైన పాత్రతో తెలుగు అరంగేట్రం చేస్తున్నందుకు థ్రిల్గా ఫీలయ్యా.' అని వెల్లడించారు. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా నటించారు. (ఇది చదవండి: సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు?) కాగా.. డినో 1999లో ప్యార్ మే కభీ కభీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కందుకొండైన్ కందుకొండైన్, జూలీ, సోలోతో సౌత్ సినిమాల్లో నటించారు. ఏజెంట్ మూవీ షూటింగ్ బుడాపెస్ట్, హైదరాబాద్, ఒమన్లో జరిగింది. -
ఇండియన్ సినిమాలు... ఫారిన్ విలన్లు!
భారతీయ కథలు ఇప్పుడు దేశీ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విదేశీ ఫైట్ మాస్టర్స్ ఇండియన్ సినిమాలకు ఫైట్స్ కంపో జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫారిన్ ఆర్టిస్టులు కూడా అరంగేట్రం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సరసన ఫారిన్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటించారు. అంతకుముందు అమీ జాక్సన్ వంటి తారలు కూడా వచ్చారు. ఇప్పుడు ఫారిన్ విలన్లు వస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం. హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో 1996లో వచ్చి న ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. కమల్– శంకర్ కాంబోలోనే సెట్స్పై ఉన్న ఈ సీక్వెల్లో ముంబై బేస్డ్ బ్రిటిష్ యాక్టర్ బెనెడిక్ట్ గారెట్ ఓ కీ రోల్ చేశారు. ఆల్రెడీ ఆయన క్యారెక్టర్ తాలూకు షూటింగ్ కూడా పూర్తయింది. ‘‘ఇండియన్ 2’లో నా వంతు షూటింగ్ను పూర్తి చేశాను. అద్భుతమైన అనుభవం దక్కింది. ఈ సినిమా తెర మీద ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు బెనెడిక్ట్. కాగా ఈ చిత్రంలో బెనెడిక్ట్ది విలన్ రోల్ అనే ప్రచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక కోలీవుడ్లో సుమారు ఆరేళ్ల క్రితం సెట్స్పైకి వెళ్లి ఇంకా రిలీజ్కు నోచుకోని చిత్రం ‘ధృవనక్షత్రం’. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పై యాక్షన్ ఫిల్మ్ ఇది. గతంలో ఆగిపో యిన ఈ సినిమా షూటింగ్ని ఇటీవలే మళ్లీ ఆరంభించారు. ‘ఇండియన్ 2’లో నటించిన బెనెడిక్ట్ గారెట్ ఈ మూవీలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంగ్లిష్ యాక్టర్ డేనియల్ కాల్టాగిరోన్ ఓ ప్రధాన పాత్రపో షిస్తున్నారు. ఆయనది ప్రతినాయకుడి పాత్ర అని కోలీవుడ్ టాక్. ఇక ‘తంగలాన్’ విడుదల తేదీపై త్వరలోనే సరైన స్పష్టత రానుంది. ఇలా... రానున్న రోజుల్లో మరికొందరు ఇంగ్లిష్ యాక్టర్స్ ఇండియన్ సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. -
కొడుకు చనిపోయినా షూటింగ్లో పాల్గొన్నా: వాల్తేరు వీరయ్య విలన్
సినిమాలో విలనిజం బాగా పండితేనే హీరోయిజం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. అందుకే సినిమాల్లో హీరోలెంత ముఖ్యమో విలన్లు కూడా అంతే ముఖ్యం. ఇక ఫైట్ సీన్లలో వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. అయితే ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఎంత కష్టమైనా పడతానంటున్నాడు విలన్ రెమో అలియాస్ రహీమ్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విలన్గా రాణిస్తున్నాడు రెమో. ఇప్పటివరకు దాదాపు వందకుపైగా సినిమాల్లో నటించాడు. 18 ఏళ్లలో దాదాపు ప్రధాన హీరోలందరితోనూ నటించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి ఉండేది. వెంకీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పొద్దున్నుంచి రాత్రివరకు అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాను. నన్ను గమనించిన రవితేజ.. టెర్రరిస్టువా? ఏంది? అలా చూస్తున్నావని అడిగితే యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పాను. సినిమాలు చేయాలంటే మంచి బాడీ ఉండాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి అని చెప్పాడు. నేను ఏడ్చుకుంటూ వెళ్తుంటే రవితేజ పిలిచి తన నెంబర్ ఇచ్చాడు. ఫిట్గా అయి, యాక్టింగ్ నేర్చుకున్నాక ఫోన్ చేయమన్నాడు. ఆ నెంబర్ వల్లే నేనీ స్థాయికి వచ్చాను. మహేశ్బాబు, బాలకృష్ణ, పవన్కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా దాదాపు అందరు హీరోలతోనూ సినిమాలు చేశా. డీజే షూటింగ్లో ఓ ఫైట్ సీన్లో అల్లు అర్జున్కు, నాకు గాయాలయ్యాయి. నేను బాగా కష్టపడ్డానని నన్ను పోస్టర్లలో వేయించారు. ఆ పోస్టర్ వైరల్ అవడంతో తర్వాత 35 సినిమాలు చేశా. పుష్ప 2లో ఆయనతో మళ్లీ కనిపిస్తా. మొదటిసారి మెగాస్టార్తో కలిసి నటిస్తున్నా. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో నటించే ఛాన్స్ వచ్చింది. కాకపోతే అప్పుడు నా జీవితంలో ఓ విషాదం జరిగింది. నా భార్య, బాబుకు ఆరోగ్యం బాలేకపోతే ఆస్పత్రిలో జాయిన్ చేశాను. బాబును ఐసీయూలో ఉంచారు. ఆరోజు నన్ను వాల్తేరు వీరయ్య షూటింగ్కు పిలిచారు. వెళ్లకపోతే ఛాన్స్ మిస్ అవుతుందేమోనన్న భయంతో వెళ్లాను, డైలాగ్స్ చెప్పాను. ఇంతలో బాబు చనిపోయాడంటూ ఫోన్ కాల్.. ఫస్ట్ డే షూటింగ్... ఉండాలా? వెళ్లిపోవాలా? అర్థం కాలేదు. షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లాను. నెక్స్ట్ డే కూడా సెట్స్కు వెళ్లాను' అంటూ విషాద ఘటనను పంచుకున్నాడు విలన్ రెమో. చదవండి: యాంకరింగ్కు బ్రేక్? స్పందించిన బ్రేక్ -
మరోసారి విలన్గా బాహుబలి కట్టప్ప సత్యరాజ్
తమిళ సినిమా: తొలి రోజుల్లో ప్రతి నాయకుడిగా దుమ్ము రేపిన నటుడు సత్యరాజ్ తరువాత కథానాయకుడిగా అవతారం ఎత్తి స్టార్ హీరోగా రాణించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ బిజీ అయ్యారు. విలన్ పాత్రలు చేయనని చెప్పిన సత్యరాజ్ తాజాగా అలాంటి పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈయన డేర్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం అంగారకన్. నటుడు శ్రీపతి కథానాయకుడిగా పరిచయం అవుతూ, స్క్రీన్ ప్లే, క్రియేటివ్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సాఫ్ట్వేర్ సంస్థ అధికారి అయిన ఈయన సినిమాపై ముఖ్యంగా నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించారు. మోహన్ డచ్చు ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మలయాళ నటి నియా కథానాయకిగా కోలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో నటుడు అంగాడితెరు మహే‹Ù, రైనాకారత్, రోషన్, అప్పు కుట్టి, దియా, నేహా రోస్, గురుచంద్రన్, కేసీపీ ప్రభాత్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలియన్, జెరోమా ఇంటర్నేషనల్ పతాకంపై జోమోన్ పిలిప్, జీవా జోమోన్ నిర్మిస్తున్నారు. కె కార్తీక్ సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఆర్.కలైవానన్ జాగ్రహం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం ముమ్మరంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2023 సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఆర్ఆర్ఆర్పై బ్రిటిషర్ల విమర్శలు, రాజమౌళి స్ట్రాంగ్ కౌంటర్
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్చి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. అన్నివర్గా ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల వసూళు చేసి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ మూవీపై కొందరు బ్రిటిష్ నెటిజన్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను తక్కువ చేసిన చూపించారంటూ విమర్శలు రావడంతో తాజాగా వాటిపై స్పందించారు జక్కన్న. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్ గురించి ఏమన్నదంటే.. ఈ సినిమాలో బ్రిటిషన్లని విలన్లుగా చూపించినంత మాత్రాన బ్రిటిషర్స్ అందరూ విలన్స్ అయిపోరని, ఒకవేళ అందరూ అలాగే అనుకుంటే బ్రిటన్లో ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించేది కాదంటూ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ‘స్క్రీన్పై ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు వచ్చే గమనిక(డిస్ల్కైమర్) అందరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ అనేది ఓ సినిమా కథ మాత్రమే. పాఠం కాదు. ఈ విషయం సినిమాలో నటించిన నటీనటులందరికీ తెలుసు. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా విషయం అర్థమై ఉంటుంది. అయితే.. ఓ స్టోరీ టెల్లర్గా ఈ విషయాలన్నీ అవగాహన ఉంటే.. వేరే విషయాల గురించి ఆలోచన చేసే అవసరం లేదు’ అంటూ రాజమౌళి వివరణ ఇచ్చారు. చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే! ఒక ట్రోలర్స్ను ఉద్దేశిస్తూ సినిమాను.. సినిమాగానే చూడాలని, అప్పుడే దాన్ని ఎంజాయ్ చేయగలుగతారంటూ జక్కన్న సూచించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ నామినేషన్పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ను ఆస్కార్స్కు పంపకుండా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతి చిత్రం ఛైలో షోను నామినేట్ చేయడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే అమెరికాలో ఆర్ఆర్ఆర్ను డిస్ట్రిబ్యూట్ చేఇసన వేరియల్స్ ఫిలిం సంస్థ ఆర్ఆర్ఆర్ ఆస్కాన్ నామినేషన్స్కు పరిశీలించాలని ఆకాడమిని కోరింది. అన్ని కేటగిరీలకు సంబంధించి ఓటింగ్ నిర్వహించేలా ప్రణాళిక రచిస్తోంది. -
మహేశ్ కోసం ‘కోబ్రా’ విలన్ను రంగంలోకి దింపిన త్రివిక్రమ్?
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్న సంగతి తెలిసిందే. మహేశ్ 28వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్, స్క్రిప్ట్ వర్క్ను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి రానుంది. చెప్పాలంటే ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు కానుందని వినికిడి. ఇందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుతున్నాయట. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: రీసెంట్గా విడాకుల ప్రకటన.. ఫ్యాన్స్కి గుడ్న్యూస్ చెప్పిన బాలీవుడ్ జంట ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకిగాను తివిక్రమ్ మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ విలక్షణ నటుడిని రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాలో విలన్గా కొంతమంది పేర్లు బయటకు రాగా అందులో తెలుగు నటుడు తరుణ్ పేరు కూడా వినిపించింది. అయితే ఇందులో వాస్తవం లేదని తరుణ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూను త్రివిక్రమ్ విలన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రోషన్ మాథ్యూ ఎవరో కాదు .. రీసెంట్గా విడుదలైన చియాన్ విక్రమ్ 'కోబ్రా' సినిమాలోని మెయిన్ విలన్. చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్గా మారిన సూసైడ్ నోట్ 2015లో మాలీవుడ్లో నటుడిగా కెరియర్ మొదలు పెట్టిన రోషన్ అనతి కాలంలోనే విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. ఇక 'కోబ్రా' సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. నాని 'దసరా' సినిమాలోను రోషన్ మాథ్యూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోషన్ను మహేశ్ మూవీలో మెయిన్ విలన్ పాత్రకి గాను త్రివిక్రమ్ తీసుకున్నాడని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా వెలుడనుంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమా మహేశ్ సరసన పూజ హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే. -
పూరీ కంటే చార్మీ ఎక్కువ కష్టపడింది: లైగర్ విలన్
హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ల పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'లైగర్' ఆగస్ట్ 25న విడుదల కానుంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన నటుడు విష్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన పంచుకున్న లైగర్ చిత్ర విశేషాలివి.. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో మీ ప్రయాణం? పూరీ గారిని కలవక ముందే ఆయన సినిమాలకు అడిక్ట్ అయ్యాను. కాలేజ్ ఎగ్గొట్టి ఆయన సినిమాలు చూస్తుండేవాడిని. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. నా మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ చూసి నన్ను పిలిపించారు. 2015లో ఆయన్ని కలిసా. మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో సినిమా చేద్దామని అప్పుడే లైగర్ ఐడియా చెప్పి టచ్ లో వుందామని చెప్పారు. ఎట్టకేలకు లైగర్ తో నా కల తీరింది. పూరి గారు, విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ, మైక్ టైసన్ .. ఒక డ్రీం కాంబినేషన్. చాలా అదృష్టంగా భావిస్తున్నా. పూరి కనెక్ట్స్ సిఈవో ఎలా అయ్యారు? పూరి గారి దగ్గరికి రాకముందు కొన్ని సినిమాలు చేశాను. జోష్ తన తొలి చిత్రం. అందులో ఒక చిన్న నెగిటివ్ పాత్ర చేశా. తర్వాత ప్రొడక్షన్, సహాయ దర్శకుడిగా కూడా పని చేసి ఇండస్ట్రీని అర్ధం చేసుకున్నాను. మెహబూబా ప్రొడక్షన్ నేనే చేశా. పూరి గారు నాపై నమ్మకం వుంచి సిఈవోని చేశారు. విజయ్, మైక్ టైషన్ లాంటి బలమైన పాత్రల మధ్య మీ రోల్ ఎలా ఉండబోతుంది? విజయ్, నా పాత్రల మధ్య శత్రుత్వం ఏమిటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. లైగర్లో ఒక లెజెండ్ ఫైటర్ పాత్ర అవసరం ఏర్పడింది. లెజెండ్ అంటే మనకి మైక్ టైషన్ గుర్తుకువస్తారు. ఆయన కంటే బెస్ట్ ఆప్షన్ కనిపించలేదు. ఆయనకి కథ అద్భుతంగా నచ్చి ప్రాజెక్ట్ లోకి రావడం ఆనందంగా అనిపించింది. మైక్ టైసన్ నుంచి ఏం నేర్చుకున్నారు ? చిన్నప్పటినుంచి మైక్ టైసన్కి ఫ్యాన్ బాయ్ నేను. ఆయన ఫైట్స్ చూస్తూ పెరిగాను. పదేళ్ళ చిన్న పిల్లాడు ఎలా ఉంటారో ఆయన అంత స్వీట్గా ఉన్నారు. నీకు సంతోషాన్ని ఇచ్చేదే చెయ్ అని చెప్పేవారు. మైక్ టైసన్ ని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది ? పూరి గారిదే. అయన రెబల్. ఆయనకి సరిహద్దులు వుండవు. పరిమితులు ఎప్పుడూ పెట్టుకోరు. నేను కూడా ఆయనలానే లిమిట్స్ పెట్టుకోను. అయితే మైక్ని ప్రాజెక్ట్ లోకి తీసుకురావడానికి చార్మీగారు ఎక్కువ కష్టపడ్డారు. ఈ క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. మిగతా స్పోర్ట్స్ డ్రామాలకు లైగర్ కు వున్న ప్రత్యేకత ఏమిటి ? లైగర్ స్పోర్ట్స్ డ్రామా కాదు. లైగర్ పక్కా మాస్ మసాలా యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్. అలాగే మైక్ టైసన్ కూడా మీరు గమనిస్తే బాక్సింగ్ రింగ్ లో కనిపించరు. కౌబాయ్ గెటప్ లో వున్నారు. ఆయన కమర్షియల్ పాత్రలో కనిపిస్తారు. కరణ్ జోహార్ సినిమా చేస్తున్నారా? లైగర్ ట్రైలర్ రిలీజైన తర్వాత రోజే కరణ్ జోహార్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. నరేషన్ గురించి రమ్మన్నారు. అలాగే తమిళ్ నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి. పూరీ గారితో చెప్పాను. ట్రైలర్ లో ఒక్క గ్లింప్స్ కే ఇలా వుంటే సినిమా విడుదలైన తర్వాత ఎలా వుంటుందో చూడు అన్నారు. పూరి గారు నా గురువు. ఆయనతో అన్నీ పంచుకుంటా. ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఎలా జరిగింది? ఇంటర్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చేశాను. ఈ ప్రయాణం అంత తేలికగా జరగలేదు. చాలా ఎత్తుపల్లాలు చూశాను. కానీ నా ఈ జర్నీని ఎంజాయ్ చేశాను. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి ? మాది చేవెళ్ళ దగ్గర కడుమూరు. అయితే పుట్టిపెరిగింది హైదరాబాద్ లోనే. నాన్న వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ హోం మేకర్. ఇద్దరు సిస్టర్స్ విదేశాల్లో వున్నారు. నేను పెళ్లి చేసుకోలేదు. ఈ సినిమాను మా ఫ్యామిలీకి అంకితం చేస్తున్నా. నెగిటివ్ పాత్రలు చేయడానికే ఇష్టపడతారా ? నటుడిగా అన్ని పాత్రలు చేస్తాను. నేను ఒక తెల్లకాగితం. దర్శకుడు దానిపై ఏది రాస్తే అది అవుతా. వెబ్ సిరీస్ ఆలోచనలు ఉన్నాయా ? పూరీ గారి దగ్గర చాలా కథలు వున్నాయి. నేను కూడా రాస్తాను. మంచి ఉత్సాహం వున్న టీమ్ తో కలసి పని చేయాలనీ వుంది. కంటెంట్ టీం ఏర్పడటానికి సమయం పడుతుంది. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలు జనగణమన, లైగర్ చేస్తున్నాము. చాలా ఆలోచనలు వున్నాయి. రిజినల్, వెబ్ సిరిస్లు పాన్ ఇండియా సినిమాలు చేయాలి. అలాగే పూరి గారితో ఒక హాలీవుడ్ సినిమాకి డైరెక్షన్ చేయించాలి. చదవండి: ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో నందమూరి బాలకృష్ణ ఆ యాంకర్తో కొణిదెల హీరో ఎంగేజ్మెంట్! -
విలన్గా మారుతున్న స్టార్ హీరోలు.. కొత్త కండీషన్ అప్లై
టాలీవుడ్లో ఒకప్పుడు విలన్ అంటే.. గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్లు, భారీ శరీరంతో గంభీరంగా ఉండేవారు. వారి పాత్రకి అంతగా రెస్పెక్ట్ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పటి విలన్స్ మాత్రం హీరోకి సమానంగా రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. ‘సర్’ అని పివాల్సిందేనని పట్టుబడుతున్నారు. గతేడాది రిలీజైన బ్లాక్ బస్టర్ పుష్పలో ఫస్టాఫ్ మొత్తం ఎదురులేకుండా ఎదుగుతూ వెళ్తుంటాడు పుష్పరాజ్.కానీ విలన్ భన్వర్ సింగ్ షేకావత్(ఫహద్ ఫాజిల్) ఎంట్రీ ఇచ్చిన తర్వాత పుష్ప స్పీడ్ తగ్గతుంది. పుష్పకు, భన్వర్ కు మధ్య కేవలం ‘సర్’ అనే పాయింట్ పైనే అసలు వైరం మొదలవుతుంది. ఒక్కటి తగ్గుతోంది పుష్పా అంటూ భన్వర్.. ఇది సర్ నా బ్రాండ్ అంటూ పుష్ప చెప్పే డైలాగ్స్.. వీరిద్దరి వైరాన్ని సీక్వెల్ వరకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా భన్వర్ సింగ్ షెకావత్ తనని సర్ అని పిలవాల్సిందే అని పట్టుబట్టే సీన్,ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఒక ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్తో దూసుకెళ్తున్న కమల్ హాసన్ ‘విక్రమ్’లో విలన్ది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఈ చిత్రం క్లైమాక్స్లో విలన్గా ఎంట్రీ ఇచ్చాడు తమిళ స్టార్ హీరో సూర్య. రోలెక్స్ క్యారెక్టర్ లో సూర్య విలనీజం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెంటింగ్ టాపిక్.పుష్ప మాదిరే విక్రమ్లో కూడా విలన్ రెస్పెక్ట్ కోరుకున్నాడు.తన మనుషులే తనని పేరు పెట్టి పిలవడం జీర్ణించుకోలేకపోతాడు.రోలెక్స్ సర్ అని పిలవాల్సిందే అని పట్టుబడతాడు.ఈ సీన్ కూడా సినిమాకే హైలైట్ గా నిలిచింది. మొత్తంగా విలన్ గా మారుతున్న హీరోలు కొత్త కండీషన్ పెడుతున్నారు. హీరోల చేతిలో తన్నులు తిన్నా సరే రెస్పెక్ట్ మాత్రం తగ్గేదేలేదంటున్నారు.సర్ అని పిలవకపోతే సీక్వెల్ వరకు ఆ వైరం కొనసాగుతుందని చెప్పుకొస్తున్నారు. -
నాలాంటి దరిద్రపు వాళ్ల వల్లే ఇండస్ట్రీ నాశనమైపోతుందన్నారు
టాలీవుడ్లో ప్రతినాయకుడిగా మెప్పించినవారిలో నటుడు సత్య ప్రకాశ్ ఒకరు. ఈయన తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విజయనగరంలో పుట్టిన తాను ఒడిశాలో పెరిగానని, ఆ తరువాత బ్యాంకులో ఉద్యోగం చేశానని చెప్పుకొచ్చాడు. తానేదో పిచ్చిపనులు చేస్తుంటే ఓ డైరెక్టర్ రా బాబు అంటూ పిలిచి మరీ సినిమాలో వేషం ఇచ్చారని, కానీ ఆయన తనను ఆర్టిస్టును చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నారని నవ్వుతూ పేర్కొన్నాడు. తనను ఆర్టిస్టును చేసి జీవితంలో పెద్ద తప్పు చేశానని ఫీల్ అవుతున్నారని సరదాగా చెప్పుకొచ్చాడు. ఇప్పటిదాకా దాదాపు 600 సినిమాల్లో నటించానని చెప్పుకుంటూ ఉంటానన్నాడు. తనను సెట్స్లో అవమానించిన సంఘటనను తలుచుకుంటూ.. 'ఒక సినిమా షూటింగ్లో సుమన్తో ఫైట్ సీన్లో నటించాలి. ఆయన కొట్టినప్పుడు రియాక్షన్ ఇవ్వాలి. కానీ నేనివ్వలేదు. అప్పుడు అక్కడున్న కో డైరెక్టర్ నన్ను ఉద్దేశించి.. ఇలాంటి దరిద్రపువాళ్లంతా ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. అందుకే ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది' అన్నారు అని వాపోయాడు సత్య. -
బాలయ్య చిత్రంలో అర్జున్ విలన్ ?
-
పుష్పరాజ్ కోసం వాళ్లని సెట్ చేసిన సుకుమార్
Villains In Allu Arjun Pushpa Movie:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఊరమాస్ లుక్లో పుష్పరాజ్గా అవతారం ఎత్తాడు. బన్నీ కెరీర్లోనే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్ను సెట్ చేశాడు సుకుమార్. హీరో పాత్రను పాన్ ఇండియా లెవల్లో ఎలివేట్ చేయాలంటే విలన్లు అంతకుమించిన స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే పుష్పరాజ్కు ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్ను సెట్ చేశాడు సుకుమార్. విలన్ పాత్రల్లో హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఉండటం విశేషం. ఈ లిస్ట్లో మొదటగా చెప్పుకోవాల్సింది ఫాహద్ ఫాజిల్. అప్పటివరకు మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఫాహద్ కరోనా సమయంలో వరుస హిట్లతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటివరకు హీరోగానే చేస్తూ వచ్చిన ఈ మలయాళ స్టార్ హీరో పుష్ప సినిమా కోసం తొలిసారిగా పవర్ఫుల్ ప్రతినాయకుడిగా మారారు. ఇక 'భైరవగీత' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధనుంజయ్ ఆ తర్వాత శాండల్వుడ్లో బిజీ అయ్యాడు. ఇప్పుడు ఈ హీరో కూడా పుష్పరాజ్తో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇక ఒకప్పటి టాలీవుడ్ కమెడియన్ సునీల్ కూడా విలన్గా మారోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సినిమాలో మంగళం శ్రీనుగా సర్ప్రైజ్ చేస్తానంటూ ఊరిస్తున్నాడు. అలాగే యాంకర్ అనసూయ,అజయ్ ఘోష్, శత్రు వంటి విలన్లు కూడా పుష్పరాజ్ను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. -
విలన్ గా దూసుకుపోతున్న సునీల్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement