-
ఆ సినిమా తర్వాత సిగరెట్కు బానిసయ్యా.. : విద్యాబాలన్
సినిమా వాళ్ల రూటే సెపరేటు.. వారికి పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉన్నా, లేకున్నా సరే.. కథ డిమాండ్ చేస్తే కళ్లు మూసుకుని ఫాలో అయిపోతారు. ఇష్టం లేకపోయినా ముక్కు మూసుకుని మందు తాగేస్తారు. కష్టంగా ఉన్నా దమ్ము కొడతారు. సినిమా అయిపోయాక మాత్రం వాటిని అంత ఈజీగా వదిలేయలేరు. తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది హీరోయిన్ విద్యాబాలన్.రోజూ సిగరెట్లు..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సిగరెట్ ఎలా తాగుతారో తెలుసు కానీ నేనెన్నడూ ట్రై చేయలేదు. డర్టీ పిక్చర్లో నేను స్మోక్ చేయాలి. ఊరికే తాగుతున్నట్లుగా నటిస్తే ఆ పాత్ర పండదు. అందుకే సిగరెట్ తాగడం నేర్చుకున్నాను. ఆ సినిమా తర్వాత దానికి ఎంత అడిక్ట్ అయిపోయానంటే రోజుకు రెండు, మూడు సిగరెట్లు కాలిస్తే కానీ మనసు శాంతించేది కాదు. కానీ అప్పట్లో ఆడవాళ్లు ధూమపానం చేస్తే ఎంతో పెద్ద నేరంగా చూసేవారు. ఇప్పుడు ఆ ధోరణి కాస్త తగ్గిందనుకోండి.ఆ స్మెల్ ఇష్టంధూమపానం ఆరోగ్యానికి హానికరమేమీ కాదని ఎవరైనా చెప్పుంటే ఇప్పటికీ ఆ అలవాటుకు బానిసగానే ఉండేదాన్ని. ప్రస్తుతమైతే సిగరెట్లు తాగడం లేదు. అయితే కాలేజీ చదివే రోజుల్లో బస్ స్టాప్లో పొగతాగేవారి పక్కన కూర్చున్నప్పుడు ఆ పొగ ఆస్వాదించేదాన్ని. ఆ వాసన నాకు నచ్చేది' అని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. కాగా ఈమె నటించిన దో ఔర్ దో ప్యార్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. మిక్స్డ్ రివ్యూస్ అందుకున్న ఈ చిత్రం వారం రోజుల నుంచి కేవలం రూ.3.32 కోట్లు మాత్రమే వసూలు చేసింది.చదవండి: మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతోందా? -
ఐరన్లెగ్గా ముద్ర.. ఆరునెలలు ముఖం అద్దంలో చూసుకోలేదు!
టీనేజ్లో ఏది ప్రేమ? ఏది అట్రాక్షన్ అని తెలుసుకోవడం చాలా కష్టం.. ఎంతోమంది అట్రాక్షన్నే ప్రేమ అనుకుని ముందుకు వెళ్తుంటారు. తీరా కొంతకాలానికే ఆసక్తి తగ్గిపోయి బ్రేకప్ చెప్పుకుంటారు. అలా గతంలో తాను కూడా ప్రేమలో పడి పెద్ద గుణపాఠం నేర్చుకున్నానంటోంది హీరోయిన్ విద్యాబాలన్. 'కాలేజీలో ఉన్నప్పుడు తొలిసారి ఓ అబ్బాయిని ప్రేమించాను. అతడు పెద్ద పోకిరి అని తర్వాత అర్థమైంది. మేము బ్రేకప్ చెప్పుకున్నాక వాలంటైన్స్ డే రోజు అనుకోకుండా నాకు తారసపడ్డాడు. అతడు నన్ను చూసి.. నేను నా మాజీ ప్రియురాలితో డేట్కు వెళ్తున్నాను అని చెప్పాడు. తొలినాళ్లలో ఎన్నో కష్టాలు అది విని షాకయ్యాను. నాకు పిచ్చెక్కినట్లయింది. ఇలాంటివాడినా ప్రేమించాను అనుకుని బాధపడ్డాను. తర్వాత నేను కూడా కొందరిని ప్రేమించాను. కానీ ఎవరితోనూ డీప్ రిలేషన్కు వెళ్లలేదు. తొలిసారి సీరియస్గా, గాఢంగా ప్రేమించిన వ్యక్తి సిద్దార్థే.. అతడినే నేను పెళ్లి చేసుకున్నాను' అని చెప్పుకొచ్చింది. సినిమాల్లో ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడుతూ.. 'తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డాను. ఆ సమయంలో నా హృదయం ఎన్నిసార్లు ముక్కలైందో! ప్రతిరోజూ ఏడుపే నన్ను రిజెక్ట్ చేస్తుంటే తట్టుకోలేకపోయేదాన్ని.. ప్రతిరోజు రాత్రి ఏడుస్తూ నిద్రపోయేదాన్ని.. ఇక నావల్ల కాదని చేతులెత్తేసేదాన్ని. కానీ తెల్లారి మళ్లీ సినిమా గురించే ఆలోచించేదాన్ని. ఒకసారి మోహన్లాల్తో నేను చేస్తున్న సినిమాను పక్కనపడేశారు. అప్పుడు నా చేతిలో ఉన్న మలయాళ సినిమా కూడా ఆపేశారు. దీంతో అందరూ నన్ను ఐరన్ లెగ్ అని పిలిచారు. నిజంగానే అంత దురదృష్టవంతురాలినా? అని నాలో నేనే కుమిలిపోయేదాన్ని. 'ఐరన్ లెగ్'గా ముద్ర ఐరన్ లెగ్ అనే పదం వల్ల చాలామంది నిర్మాతలు నన్ను సినిమాలో తీసుకున్నట్లే తీసుకుని పక్కనపెట్టేశారు. డజన్లకొద్దీ సినిమాల్లో నాకు బదులుగా వేరే హీరోయిన్లను తీసుకున్నారు. ఒక నిర్మాత అయితే నేను దురదృష్టవంతురాలిని అని చూసేందుకు కూడా ఇష్టపడలేదు. అసలు నా ముఖం హీరోయిన్లా ఉందా? అని నా పేరెంట్స్తో అన్నాడు. అప్పుడు ఆరునెలల దాకా నా ముఖం అద్దంలో చూసుకోలేదు. లగే రహో మున్నా భాయ్ సినిమా చేశాక అదే నిర్మాత నన్ను తన సినిమా చేయమని అడిగాడు' అని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. చదవండి: ఆ విషయంలో ఎన్టీఆర్ను ఫాలో అవుతున్న బన్నీ! -
అయోమయం.. ఆశ్చర్యం
విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, ఇలియానా, సెంథిల్ రామమూర్తి లీడ్ రోల్స్లో నటించిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘దో ఔర్ దో ప్యార్’. శీర్ష గుహ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ‘నేను వీగన్... పాలతో తయారైన వాటిని తినను (విద్యాబాలన్)’, ‘మరి.. మీ ఫేస్వాష్లలో మిల్క్ ఉంటుంది కదా (ప్రతీక్ గాంధీ)!’, ‘మనం డేటింగ్లో ఉన్న వారిలా లేము.. నిజంగా భార్యాభర్తలు ఎలా ఉంటారో అలానే ఉంటున్నాం (ఇలియానా)’ వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ‘ప్రేమ కన్ఫ్యూజ్ చేస్తుంది. సర్ప్రైజ్ చేస్తుంది’ అన్నవి కూడా టీజర్లో కనిపించాయి. -
గాయకుడి అంత్యక్రియల్లో సెల్ఫీ పిచ్చి: ‘కొంచెమైనా సిగ్గుండాలి’!
స్మార్ట్ యుగంలో సెల్ఫీలకున్న క్రేజ్అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సమయం, సందర్భం చూసుకోకుండా.. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తారు. దివంగత ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ అంత్యక్రియల సమయంలో జరిగిన ఘటన దీనికి తాజాగా ఉదాహరణ. అనారోగ్యంతో సోమవారం (ఫిబ్రవరి 26న) కన్నుమూసిన పంకజ్ ఉధాస్కు నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి తరలి వెళ్లారు. తెల్లని దుస్తుల్లో అక్కడున్న వారంతా విషణ్ణ వదనాలతో ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి విద్యాబాలన్ అభిమాని ఒకరు సెల్పీ కోసం వెంటబడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్య ఫ్యాన్ ఒకరు ఆగకుండా విద్యతో కలిసి తన ఫోన్ని చేతిలో పెట్టుకుని సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. పదే పదే వారిస్తున్నా వినకుండా... వెంటబడ్డాడు. అయితే దీనికి ఏమీ స్పందించకుండా, మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయారు విద్యా బాలన్. కొంతమంది విద్యా బాలన్ ప్రవర్తనను కొనియాడగా, మరికొందరు నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొంచెమైనా సిగ్గుండాలి’’ అంటూ ఫ్యాన్పై మండిపడ్డారు. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) కాగా గజల్ మేస్ట్రో అస్తమయంపై యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు తమ అభిమాన గాయకుడిని కడసారి దర్శించు కునేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వచ్చారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గౌరవాన్ని సంపాదించుకున్న నటి విద్యా బాలన్ కూడా పంకజ్ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. విద్యతో పాటు, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ మంగళవారం ఆయనకు అంతిమ నివాళులర్పించారు. -
Bhool Bhulaiyaa 3: ఆమె కళ్లు వేటాడతాయి!
బాలీవుడ్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో ‘భూల్ భూలయ్యా’ ఒకటి. 2007లో విడుదలైన ‘భూల్ భూలయ్యా’, 2022లో విడుదలైన ‘భూల్ భూలయ్యా 2’ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ‘భూల్ భూలయ్యా 3’ చిత్రీకరణ జరుగుతోంది. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘భూల్ భూలయ్యా’ ఫ్యామిలీలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ చేరారు. ‘‘ఆమె నవ్వు భయం పుట్టిస్తుంది. ఆమె కళ్లు వేటాడతాయి... అలాగే !భయపెడతాయి. మిస్టరీ గాళ్’’ అంటూ ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ పాత్రను వివరించారు మేకర్స్. -
Vidya Balan: పోలీసులను ఆశ్రయించిన విద్యాబాలన్!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్లలో విద్యాబాలన్ ఒకరు. తన సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలనూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తూ అభిమానుల ప్రశ్నలకు సరదా సమాధానాలు ఇస్తుంటారు. ఇప్పుడదే కొంతమంది మోసగాళ్లకు బలమైంది. నెట్టింట చురుగ్గా ఉండే విద్యాబాలన్ పేరుతో ఓ నకిలీ అకౌంట్ని క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా విద్యాబాలన్ దృష్టికి వెళ్లడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. జాబ్స్ ఇప్పిస్తానంటూ.. తనదైన అందం అభినయంతో బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విద్యాబాలన్. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్గా ఎదిగారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం పక్కకి పెట్టదు. ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆమె ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పడు ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంటారు. అయితే ఆ మధ్య అచ్చం విద్యాబాలన్ నిజమైన ఇన్స్టాగ్రామ్ ఐడీతోనే ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు కొంతమంది దుండగులు. ఆమె అకౌంట్లోని ఫోటోలు, వీడియోలు అన్ని ఫేక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత అభిమానులతో చాట్ చేస్తూ.. వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. కొంతమందికి జాబ్స్ ఇప్పిస్తామని, అందుకోసం కొంత అమౌంట్ ఖర్చు అవుతుందంటూ పెద్ద ఎత్తున్న డబ్బులు కాజేశారు. ఈ విషయం ఆలస్యంగా విద్యాబాలన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె వెంటనే ఖార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్షన్ 66 (C) ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన ముఠాను కనిపెట్టే పనిలో ఉన్నారు. ఆ మధ్య సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేశారు. Bollywood actress Vidya Balan lodged an FIR against an unknown person for creating a fake Instagram account in her name and asking for money from people. An unknown person who created an identical Instagram ID asked people for money by assuring them of jobs. Khar Police has… — ANI (@ANI) February 21, 2024 ‘భూల్ భూలయ్య 3’లో విద్యా బాలన్ సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు విద్యాబాలన్. కథ, తన పాత్ర నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం భూల్ భులయ్య 3లో నటిస్తున్నారు. అందులో మంజులిక పాత్రను పోషించబోతున్నట్లు హీరో కార్తిక్ ఆర్యన్ ప్రకటించాడు. అనీస్ బజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
విద్యాబాలన్కు ఇంత పెద్ద కూతురా? ఇన్నేళ్లు సీక్రెట్గా దాచిపెట్టిందా?
విద్యాబాలన్.. డర్టీపిక్చర్ సినిమాతో బాక్సాఫీస్ను ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంతో అంతులేని క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ 2012లో నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్ను పెళ్లాడింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇటీవల విద్యాబాలన్ ఓ అమ్మాయితో కలిసి ఉన్న వీడియో తెగ వైరలయింది. ఎయిర్పోర్టులో ఆమె చేయి పట్టుకుని నడిపించింది. తతో పాటు ఫోటోలకు పోజిచ్చింది. ఇది చూసిన జనాలు విద్యాబాలన్ను ఇంత పెద్ద కూతురు ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తనకు కూతురు ఉందన్న విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచింది? అని అనుమానిస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై విద్యాబాలన్ స్పందించింది. ఆ అమ్మాయి పేరు ఐరా అని, ఆమె తన సొంత కూతురు కాదని పేర్కొంది. అయితే తనకు కూతురు వరస అవుతుందని చెప్పింది. తన సోదరికి కవలలు సంతానం అని, అందులో ఒకరే ఐరా అని పేర్కొంది. అనవసరంగా దీన్ని పెద్ద విషయంగా చూస్తున్నారని అభిప్రాయపడింది. సినిమాల సంగతి.. కాగా విద్యాబాలన్ 2005లో సినీప్రయాణం మొదలుపెట్టింది. తన కెరీర్లో ఎన్నో మర్చిపోలేని హిట్లు ఇండస్ట్రీకి అందించింది. 2014లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీని బహుకరించింది. ఇకపోతే విద్యాబాలన్ చివరగా నీయత్ చిత్రంలో నటించింది. ఇందులో ఆమె సీబీఐ అధికారిణిగా నటించింది. ప్రస్తుతం లవర్స్ అనే సినిమా చేస్తోంది. ఇందులో ప్రతీక్ గాంధీ, ఇలియానా కూడా నటించనున్నారు. Vidya Balan with her cute daughter ❤️✨#vidyabalan pic.twitter.com/PtcxQaGUHg — Viral Bhayani (@viralbhayani77) October 6, 2023 చదవండి: ప్రశాంత్ వరస్ట్ కెప్టెన్.. తేల్చేసిన హౌస్మేట్స్.. కన్నీటితో బ్యాడ్జ్ వెనక్కిచ్చేసిన రైతుబిడ్డ! -
విద్యా బాలన్ కళ్ల అందం సీక్రేట్ ఇదే!
బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ అందరికీ తెలిసే ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘ది డర్టీ పిక్చర్’తో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో విద్యా బాలన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. హానీ మూవీతో తనెంటో నిరూపించుకుంది విద్యా బాలన్ అప్పటి నుంచి వరసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. విద్యా బాలన్ సినిమా కెరీర్ గురించి అందరికీ తెలిసినా ఆమె వ్యక్తిగత విషయాలు చాలా వరకూ బయటకు తెలీదు. కళ్ల అభినయంతో నటలో నూటికి నూరు మార్కులు కొట్టేసిన విద్యాబాలన్ ఓ ఇంటర్యూ తన కళ్ల అందం వెనుక దాగున్న రహస్యం గురించి, అందుకోసం తాను వాడే కాజల్ గురించి పంచుకుంది. నవరసనటసార్వభౌమురాలు విద్యాబాలన్ కళ్లకు కాటుక పెట్టందే గడప దాటదు. అది సాదాసీదా కాటుక కాదు.. పాకిస్తానీ పాపులర్ బ్రాండ్ ‘హష్మీ’ కాజల్. తన మీద అదృష్టం దృష్టిపడ్డానికి.. సక్సెస్ తన కెరీర్ అడ్రస్గా మారడానికి ఆ కాజలే కారణం అని విద్యాబాలన్ బలంగా నమ్ముతుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా! (చదవండి: పార్లర్కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్..) -
తొలిచూపులో ప్రేమకు బదులు లస్ట్ పుట్టిందంటున్న స్టార్ హీరోయిన్
ముద్దు సన్నివేశాలు, బెడ్ రూమ్ సీన్స్.. ఇలాంటివి చిత్రీకరించడంలో బాలీవుడ్ ఎప్పటినుంచో ముందు వరుసలో ఉంది. ఇలాంటివి తీయడంలో టాలీవుడ్ వాళ్లు తడబతడారేమో కానీ బాలీవుడ్ మాత్రం పర్ఫెక్షన్ చూపిస్తుంది. ఈ క్రమంలోనే లస్ట్ స్టోరీస్ 2 సినిమా తెరకెక్కించింది. ఇది 2018లో వచ్చిన లస్ట్ స్టోరీస్కు సీక్వెల్. టైటిల్ చూసి మోసపోవద్దని, సినిమాలో ఇంకా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయంది తమన్నా. ఆమె మాటను నమ్మితే మోసపోయినట్లే! ఈ సినిమా టైటిల్కు తగ్గట్లే ఉందని, అంతా బోల్డ్ కంటెంటే అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీర్పు ఇచ్చేశారు. ఇలాంటి మితిమీరిన బోల్డ్ కంటెంట్తో గతంలో వచ్చిన డర్టీ పిక్చర్ బాక్సాఫీస్ను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ అందుకుంది విద్యాబాలన్. తాజాగా ఆమె ప్రేమ, కామం వంటి విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2012లొ సిద్దార్థ్ రాయ్ కపూర్ను పెళ్లాడిన ఆమె తమ మధ్య ముందు అట్రాక్షన్ ఏర్పడిందని పేర్కొంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. 'నిజానికి మొదట్లో నేను పెళ్లి చేసుకోవాలనే అనుకోలేదు. కానీ ఓ వయసు వచ్చాక నాలో చాలా పరిణతి వచ్చింది. 30 ఏళ్లకే నేను ఎంతో సక్సెస్ చూశాను. దాన్ని ఎవరితోనైనా చెప్పుకోవాలనిపించింది. కొంతమందితో డేటింగ్ చేశాను, కానీ వర్కవుట్ కాలేదు. ఒంటరిని అన్న ఫీలింగ్ ఎక్కువైంది. మన మంచిచెడ్డలు, కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఓ వ్యక్తి కావాలనిపించింది. ఈ క్రమంలో కొందరితో లవ్లో పడ్డా ఆ ప్రేమ కథలేవీ సుఖాంతం కాలేదు. కొన్నిసార్లు దారుణంగా మోసపోయాననిపించింది. అప్పుడే నేను అన్నింటినీ సీరియస్గా తీసుకోవడం మానేసి జాలీగా ఉండటం మొదలుపెట్టాను. అటువంటి సమయంలో ఓసారి సిద్దార్థ్ రాయ్ కపూర్ను చూశాను. చూడగానే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడనిపించింది. అదే మా లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. చూడగానే ఒకరికొకరం ఆకర్షితులయ్యాం. ముఖ్యంగా సిద్దార్థ్ నన్ను చూసుకునే విధానానికి ఇంకా పడిపోయాను. అతడే ముందుగా ప్రపోజ్ చేశాడు. నేను కూడా ఓకే చెప్పి కలిసి ముందుకు ప్రయాణించాం' అని చెప్పుకొచ్చింది విద్యాబాలన్. చదవండి: మనోజ్, మౌనిక.. నాన్నను ఎలాగైనా ఒప్పించమని వేడుకున్నా: మంచు లక్ష్మి -
బాలీవుడ్ నటి విద్యాబాలన్కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
బాలీవుడ్ నటి విద్యాబాలన్కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
కాఫీకి పిలిచి రూమ్కు రమ్మన్నాడు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఫేమ్ సాధించింది. అయితే బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా విద్యాబాలన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విద్యా బాలన్ క్యాస్టింగ్ కౌచ్ సంచలన కామెంట్స్ చేసింది. కెరీర్లో తనకెదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించింది. విద్యాబాలన్ మాట్లాడుతూ.. ' దక్షిణాది సినిమాల్లో పని చేసేందుకు ప్రయత్నిస్తున్నా రోజులవి. ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్ను కలిసేందుకు చెన్నై వెళ్లా. అక్కడ కాఫీ షాప్లో మాట్లాడుకుందామని దర్శకుడితో చెప్పా. అయితే అతను నన్ను రూముకి వెళ్లి మాట్లాడుకుందామని అడిగాడు. అప్పుడే అతని ఆలోచన నాకర్థమైంది. అప్పుడే నేను గది లాక్ చేయకుండా కొంచెం తెరిచి ఉంచా. దీంతో ఆ దర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు మిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు.' అంటూ చెప్పుకొచ్చింది నటి. ఆ సమయంలో తాను తెలివిగా వ్యవహరించడం వల్లే తప్పించుకున్నానని పేర్కొంది. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నానని విద్యా బాలన్ చెబుతోంది. ఆ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. వాటితో మానసికంగా ఇబ్బందులు పడ్డానని.. బయట పడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆ సంఘటనతో దర్శకుడు సినిమా నుంచి తొలగించి.. బాడీ షేమింగ్ చేశారని వాపోయింది. కాగా.. 2005లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ.. 2011 లో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ సినిమాతో పాపులర్ అయింది. -
ఇంటర్నెట్ని షేక్చేస్తున్న విద్యాబాలన్ బోల్డ్ ఫోటోషూట్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెండ్ సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె బోల్డ్ ఫోటోషూట్ ఒకటి ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. బాలీవుడ్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ కోసం విద్యాబాలన్ సెమీ న్యూడ్గా ఫోటోలకు ఫోజులిచ్చింది. కేవలం న్యూస్ పేపర్ను అడ్డుపెట్టుకొని కూర్చీలో కూర్చొని ఒక చేతిలో న్యూస్ పేపర్.. మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకొని రొమాంటిక్ స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం విద్యాబాలన్ దిగిన ఈ ఫోటోషూట్పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 40ఏళ్ల వయసులో ఇలాంటివి అవసరమా అంటూ విద్యాబాలన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇది మరో డర్టీ పిక్చర్లా ఉందంటూ తిట్టిపోస్తున్నారు. మరోవైపు ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీని కూడా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. హీరోయిన్లను ఇలా నగ్నంగా చూపించడంలో క్రియేటివిటీ ఏముంది అంటూ అతడ్ని కూడా ఏకిపారేస్తున్నారు. View this post on Instagram A post shared by Dabboo Ratnani (@dabbooratnani) -
ఆ విషయాన్ని సిగ్గులేకుండా అడిగేశా: విద్యాబాలన్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోలతో తనదైన నటనతో మెప్పించింది భామ. న్యూ ఇయర్ వేళ 44వ వసంతంలో అడుగుపెట్టింది సీనియర్ నటి. ఆమె బర్త్డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమె విషెష్ తెలియజేశారు. కెరీర్లో విద్యాబాలన్కు ఎదురైన అనుభవాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో మీడియాతో పంచుకున్నారు. అప్పట్లో ప్రముఖ దర్శకుడు గుల్జార్ సినిమాలో నటించాలని తన కోరిక అని తెలిపింది. ఆయన సినిమాలో నటించేందుకు ఎలాంటి సిగ్గులేకుండా అడిగానని చెప్పుకొచ్చింది. 'ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజియే మేరే సాథ్' అని అడిగానని వెల్లడించింది. (ఇది చదవండి: Chiranjeevi: ఆ విషయంలో చరణ్కు, నాకు పోలికే లేదు) విద్యాబాలన్ మాట్లాడుతూ..' దేవుడి దయ వల్ల నా అవసరాలు తీరాయి. మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛ ఇచ్చారు. మా సోదరి యాడ్ ఏజెన్సీకి వైస్ ప్రెసిడెంట్. నేను సినిమాల్లోకి రావాలనుకున్నా. కానీ నేను ఎప్పుడూ దీర్ఘకాలికమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. నేను భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. దానివల్ల నా జీవితం సంతోషంగా ఉంది. నేను గుల్జార్ సాబ్తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ అతను ఇకపై దర్శకత్వం వహించడని తెలిసింది. చాలాసార్లు గుల్జార్ సాబ్తో 'ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజియే మేరే సాథ్' అని సిగ్గులేకుండా అడిగా. నేను ఉడీ అలెన్తో కూడా పని చేయాలనుకుంటున్నా' అని అన్నారు. 2005లో సంజయ్ దత్ నటించిన పరిణీత చిత్రంతో విద్యాబాలన్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లగే రహో మున్నా భాయ్ (2006), భూల్ భూలయ్యా (2007), ది డర్టీ పిక్చర్ (2011), మిషన్ మంగళ్ (2019) లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. శకుంతలా దేవి (2020) మూవీలోనూ మెరిసింది విద్యా చివరిసారిగా సురేష్ త్రివేణి చిత్రం జల్సాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో షెఫాలీ షా, మానవ్ కౌల్ కూడా నటించారు. ఆమె తదుపరి చిత్రంలో నటుడు ప్రతీక్ గాంధీ సరసన నటిస్తోంది. ఇందులో ఇలియానా డిక్రూజ్, సెంధిల్ రామమూర్తి కూడా నటిస్తున్నారు. కాగా.. గుల్జార్ మౌసం (1975), అంగూర్ (1982), మాచిస్ (1996), హు టు టు (1999) సినిమాలకు దర్శకత్వం వహించారు. (ఇది చదవండి: నిర్మాతతో డేటింగ్.. అఫీషియల్గా ప్రకటించిన నటి) -
ఎంత పిచ్చి ఉంటే మాత్రం భర్తను పట్టించుకోవా?.. నెటిజన్స్ ఆగ్రహం
కెమెరా అంటే సెలబ్రిటీలకు మహా ఇష్టం. షూటింగ్లోనే కాదు, బయట ఎవరైనా ఫోటోలు క్లిక్ చేయడానికి ప్రయత్నించినా ఐయామ్ రెడీ అంటూ వెంటనే పోజులిస్తుంటారు. తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్కు హాజరైన విద్యాబాలన్ కూడా కారు దిగగానే ఇదిగో వస్తున్నా అంటూ నడుముకు చేయి పెట్టుకుని వడివడిగా నడుచుకుంటూ వచ్చి అందంగా ఫోటోలు దిగింది. అంతా బానే ఉంది కానీ విద్యాబాలన్ తన ఫోటోల మీద పెట్టిన దృష్టి భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ మీద పెట్టినట్లు కనిపించడం లేదు. విద్యాతో ఫోటో దిగేందుకు సిద్దార్థ్ రెడీ అయినా ఆమె మాత్రం భర్తను పట్టించుకోలేదు. దీంతో అతడు ఇబ్బందికరంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అవేమీ పట్టించుకోని నటి హ్యాపీ ఎక్స్ప్రెషన్స్తో పోజులివ్వడంలో నిమగ్నమైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఎంత ఫోటోల పిచ్చి ఉంటే మాత్రం భర్తను కూడా మైమరచిపోతారా?', 'అసలు వీళ్ల దాంపత్య జీవితం బాగానే ఉందా?' అని కామెంట్లు చేస్తున్నారు. ఆమెతో కలిసి ఫోటో దిగాలనుకున్న భర్తను విద్యాబాలన్ ఏమాత్రం లెక్క చేయకుండా పొగరు చూపించిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం విద్యాబాలన్ చబ్బీగా ఎంత బాగుందోనని మురిసిపోతున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: అబ్బా, నీ ముఖం చూడలేకపోతున్నాం.. స్టార్ కిడ్పై ట్రోలింగ్ -
అదరహో.. ఫిల్మ్ఫేర్-2022లో మెరిసిన తారలు ఫొటోలు
-
The Dirty Picture Sequel: డర్టీ పిక్చర్ హీరోయిన్ ఎవరు?
‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ రానుందా? అంటే బాలీవుడ్ అవునంటోంది. విద్యాబాలన్ కథానాయికగా ఏక్తా కపూర్ నిర్మించిన ‘ది డర్టీ పిక్చర్’ (2011) గుర్తుండే ఉంటుంది. విద్యా నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దివంగత ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని అంశాలతో రూపొందినట్లుగా టాక్ వినిపించింది. అయితే దర్శక–నిర్మాతలు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఆ సంగతలా ఉంచితే ‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ నిర్మించడానికి ఏక్తా కపూర్ సన్నాహాలు మొదలుపెట్టారని సమాచారం. మరో రచయితతో కలిసి కనికా థిల్లాన్ ఈ సీక్వెల్కి స్టోరీ సిద్ధం చేస్తున్నారట. సీక్వెల్లో విద్యాబాలన్ కాదు... సీక్వెల్లో విద్యాబాలన్ నటించడంలేదు. కాగా ఫస్ట్ పార్ట్ అప్పుడే కంగనా రనౌత్ని కథానాయికగా అడిగారు ఏక్తా కపూర్. అయితే కంగన తిరస్కరించారు. సీక్వెల్కి అడగ్గా.. మళ్లీ తిరస్కరించారట. ఈ నేపథ్యంలో తాప్సీ, కృతీ సనన్ వంటి తారలతో సెకండ్ పార్ట్ గురించి ఏక్తా చెప్పారట. ఇద్దరూ నటించడానికి సుముఖత వ్యక్తపరచారని టాక్. అయితే పూర్తి కథ రెడీ అయ్యాక మరోసారి కలుద్దామని కృతీ, తాప్సీతో అన్నారట ఏక్తా. మరి.. ఇద్దరిలో ‘డర్టీ పిక్చర్ 2’ హీరోయిన్ ఎవరు? అనేది కాలం చెబుతుంది. అలాగే తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిలన్ మలి భాగాన్ని కూడా తెరకెక్కిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. వేరే కథ... ‘ది డర్టీ పిక్చర్’ విద్యాబాలన్ పాత్ర చనిపోవడంతో ముగుస్తుంది. మరి.. సీక్వెల్ కథ ఏంటి? అనే చర్చ జరుగుతోంది. అయితే పూర్తిగా వేరే కథ తయారు చేస్తున్నారట. ఈ ఏడాది చివరికి కథ సిద్ధమవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సీక్వెల్ షూటింగ్ ఆరంభించాలను కుంటున్నారని భోగట్టా. -
రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ?
The Dirty Picture Sequel In The Works But Not Featuring Vidya Balan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో విద్యా బాలన్ ఒకరు. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు, బయోపిక్లతో విద్యా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె నటించిన సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో ఆమె నటనకు గానూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2011లో విడుదలైన ఈ మూవీ విద్యా బాలన్కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తకిర అప్డేట్ చక్కర్లు కొడుతోంది. సుమారు దశాబ్దం తర్వాత 'ది డర్టీ పిక్చర్' సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నట్లు దర్శకనిర్మాతలు ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్ కోసం ఇంకా విద్యా బాలన్ను సంప్రదించలేదట. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కానీ ఈ సీక్వెల్ను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాకు విద్యా బాలన్నే తీసుకుంటారా? ఇంకా ఇతర హీరోయిన్కు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ కాగా మిలన్ లుత్రియా దర్శకత్వం వహించిన 'ది డర్టీ పిక్చర్' చిత్రం రూ. 18 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 117 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో విద్యా బాలన్తో పాటు ఇమ్రాన్ హష్మీ, నసీరుద్ధీన్ షా, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషించగా, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు రానున్న సీక్వెల్ ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. చదవండి: బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
అవి హీరోల చిత్రాలు.. అందుకే ఫ్లాప్ అయ్యాయి: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ ప్రముఖ నటి విద్యా బాలన్ తన రెండు సినిమాలు పరాజయం కావడానికి కారణం హీరోలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె కెరీర్ ప్రారంభ రోజులకు గుర్తు చేసుకుంది. తన నటించిన తొలి ఏడు సినిమాల్లో రెండు ఫ్లాప్ అయ్యాయని, దానికి కారణం అవి హీరోలు ప్రాధాన్యంగా తీసిన సినిమాలని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో నా నిర్ణయాల గురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు నేను సంప్రదాయమైన సినిమాలు చేయలేదు. అందుకే నేను పెద్దగా సక్సెస్ కాలేకపోయాను. సినిమా ప్రమోషన్స్లో కూడా మీరు మరో అన్కన్వెన్షనల్(సంప్రదాయం కానీ సినిమాలు) చేస్తున్నారా? అని ప్రశ్నించేవారు’ అని చెప్పుకొచ్చింది. చదవండి: జిమ్ చేస్తుండగా నటుడికి గుండెపోటు! ఆ తర్వాత ‘అయితే ప్రజల అభిప్రాయాలకు నేను ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ, నా నిర్ణయాలను తిరిగి సమీక్షించుకుంటుంటే మాత్రం ఆశ్యర్యం కలుగుతోంది. సంప్రదాయబద్ధమైన సినిమాలు చేయకపోవడం వల్లే నేను అంతగా సక్సెస్ చూడలేకపోయి ఉండొచ్చు. నేను చేసిన చిత్రాల్లో విజయం సాధించని సినిమాలన్ని మహిళా ప్రాధాన్యం కానీవే!’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా విద్యా బాలన్ పరిణణీత(2005) సినిమాలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. లగే రహో మున్నా భాయ్, గురు, హే బేబీ, భూల్ భూలయ్యా, కిస్మత్ కనెక్షన్, పా చిత్రాల్లో నటించింది. ఇక 2011లో సిల్క్ స్మిత బయోపిక్గా వచ్చిన ద డర్టీ పిక్చర్లో నటించింది. ఇందులో ఆమె నటనకు గానూ జాతీయ అవార్డును గెలుచుకుంది. -
బాత్రూమ్లో లైబ్రరీ ఏర్పాటు చేయించుకున్న హీరో
సెలబ్రిటీల జీవన శైలి అంటే ఆసక్తి చూపనిదెవరు? అందునా పాపులర్ పర్సన్స్ అలవాట్లు, అభిరుచుల పట్ల చెవి రిక్కించని వారెవరు? ఆ గుంపులో మేమూ ఉన్నాం. అందుకే ఈ వివరాలు పోగేసుకొచ్చాం..! శారీ సుందరి.. తెలుసు మీకర్థమైందని! విద్యా బాలనే. ఇక్కడ చెప్పబోయేది కూడా ఆమెకున్న చీరల పిచ్చి గురించే. ఎక్కడ ఏ కొత్త రంగు.. డిజైన్.. నేతలో చీర కనిపించినా అది తన క్లాజెట్లో క్లోజ్ చేసుకునేదాకా నిద్రపోదట విద్యాబాలన్. నిద్రంటే గుర్తొచ్చింది.. రాత్రి కలలో కూడా తను చీరలోనే కనిపించాలని నిద్రపోయేప్పుడూ చీర కట్టుకునే నిద్రకుపక్రమిస్తుందని ఆమె సన్నిహితుల ఉవాచ. అన్నట్టు విద్యాబాలన్ లీస్ట్ బాదర్డ్ థింగ్ ఈజ్ సెల్ ఫోన్. అభిమానులూ.. ఆమె నంబర్ సంపాదించి ఆమెకు మెసేజ్ పెట్టేరూ..! ఆర్నెల్లయినా చూసుకోదట. ఫ్యాన్స్ సందేశాలే కాదు.. ఆమెకు పనిచ్చేవాళ్ల సమాచారాలను కూడా. అలా విద్యా చాలా ముఖ్యమైన భూమికలను, అత్యంత ప్రధానమైన ఈవెంట్లనూ మిస్ అయిన సందర్భాలు బోలెడట. అయినా సెల్ ఫోన్ను అక్కున చేర్చుకోదట. అదేమంటే ఫోన్లో తల దూర్చడం కంటే మనుషులతో మాటలు కలపడమే నాకిష్టం అంటుంది. వాటే టైమింగ్.. కూలీ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్కు యాక్సిడెంట్ అయిన విషయం తెలుసు కదా! ఆ ప్రమాదంలో అతని కుడిచేతిక్కూడా గాయమై కొన్నాళ్లపాటు అది కదలకుండా ఉందట. అప్పుడు అన్ని పనులను ఎడమ చేత్తో చేయడం అలవాటు చేసుకున్నాడు అమితాబ్.. రాయడం సహా. ఇప్పుడు కుడిచేత్తో ఎంత స్పీడ్గా .. సౌకర్యంగా రాయగలడో ఎడమచేత్తోనూ అంతే స్పీడ్గా సౌకర్యంగా రాయగలడు ఆ హీరో. సో వాట్.. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారా? అవును ఆ ప్రాక్టీస్ ఆ మ్యాన్ని ఎంత ఎక్స్పర్ట్ను చేసిందంటే రెండు వేర్వేరు విషయాలను ఏకకాలంలో రెండు చేతులతో రాసేంతగా! దటీజ్ బిగ్ బి.. అంటూ అభిమానులంతా ఆయనకు బిగ్ హ్యాండ్ ఇవ్వడం మొదలెట్టేశారా! గోర్లు బలి ఆందోళన, కంగారు, ఒత్తిడి వగైరాను ఎదుర్కోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కోతరహా. కానీ చాలామందిది ఒకే తరహా. ఏ కాస్త టెన్షన్.. స్ట్రెస్ ఫీలైనా వేలి గోళ్లను కరచుకుని కొరికేస్తుంటారు. ఆ లిస్ట్లో కరీనా కపూర్ కూడా ఉంది. అవును.. పాపం.. ఏ కాస్త కంగారు కలిగినా వేలి గోళ్లను దానికి బలిచ్చేస్తూంటుందట. హమ్మయ్య.. సెలబ్రిటీలూ సామాన్యులే ఈ విషయంలో అని సారూప్యత వెదుక్కోవచ్చు. ఇట్స్ నాటే లై వాష్రూమ్లో వార్తా పత్రికలు చదవడం చాలామందికి అనుభవం. కానీ పుస్తకాలు చదవడం చాలా మందికి కొత్తే! కానీ సైఫ్ అలీఖాన్కు చాలా చాలా పాత అలవాటు. అతను చిన్నప్పటి నుంచీ బాత్రూమ్లోనే పుస్తకాలు చదివేవాడట. సో పెద్దయ్యాకా.. అంటే నటుడిగా స్థిరపడ్డాక.. ఏకంగా బాత్రూమ్లోనే లైబ్రరీని ఏర్పాటు చేయించుకున్నాడు. చదవాలనిపించినప్పుడల్లా వాష్రూమ్లోకి దూరుతున్నాడని కరీనా కపూర్ కంప్లయింట్ చేస్తుందేమో! స్టాంప్సా? కాదు.. .. మరేంటి? సోప్స్! ఊప్స్..! ఎస్.. సల్మాన్ ఖాన్ ఏ కొత్త చోటుకి వెళ్లినా అక్కడ కనిపించిన సోప్స్ను తీసి బ్యాగ్లో వేసుకుంటాడట. ఏంటయ్యా అది? అని అంటే.. సోప్స్ కలెక్షన్ అని ఆన్సర్ చేస్తాడట. అలా తెచ్చుకున్న సోప్స్తో షవర్ ఎక్స్పరిమెంట్స్ చేస్తాడని బాలీవుడ్లో బ్యాడ్ టాక్. చదవండి: చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి 16 ఏళ్ల తర్వాత వెబ్సిరీస్తో నటి రీ ఎంట్రీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
విద్యాబాలన్.. ‘జల్సా’ మూవీ రివ్యూ
క్రైమ్ అండ్ పనిష్మెంట్... పురుష ప్రపంచంలో కనిపించే చర్య... ప్రతిచర్య. కాని స్త్రీల ప్రపంచంలో నేరం తర్వాత శిక్ష ఉంటుందా క్షమ ఉంటుందా? ‘జల్సా’ సినిమా చూడాలి. ఇద్దరు హీరోల రోజులు పోయి ఇద్దరు మహిళా ఆర్టిస్టుల రోజులు వచ్చాయి అని ఈ సినిమా ఎలుగెత్తి చాటుతోంది. విద్యాబాలన్, షెఫాలీ షా... వీళ్ల పోస్టర్తో సినిమా రిలీజ్ కావడం పెద్ద బాలీవుడ్ లీప్. మరో విశేషం సెరిబ్రల్ పాల్సీ ఉన్న తెలుగు పిల్లవాడు సూర్య కాశీభట్ల ముఖ్యపాత్ర పోషించి ఆకట్టుకోవడం. ఈవారం సండే సినిమా. మనిషి ఒక నేరం చేస్తాడు. చట్టం శిక్ష విధిస్తుంది. అన్నిసార్లు చట్టానికి చిక్కకపోవచ్చు. ఆ శిక్ష సాపేక్షం కావచ్చు. అంతమాత్రం చేత ఆ నేరం ఆ మనిషిని ఊరికే ఉంచుతుందా? మానసికంగా అది విధించే శిక్ష ఏమిటి? పశ్చాత్తాపంతో విధించుకునే శిక్ష ఏమిటి? శిక్షను తప్పించుకుందామనుకుని ప్రయత్నిస్తూ ఆ అశాంతి లో వేసుకునే శిక్ష ఏమిటి? మానవ ప్రవర్తన, స్వభావం, ఆలోచన ఎప్పటికప్పుడు వినూత్నం. పరిస్థితులకు ఒక్కోసారి బానిస. అవే పరిస్థితులపై విజేత. ‘జల్సా’ ఒక నేరం చేసిన స్త్రీకి, ఆ నేరం వల్ల నష్టపోయిన స్త్రీకి మధ్య నడిచే కథ. సాధారణంగా సినిమా అనేది వ్యాపారం కాబట్టి ఇలాంటి కథలు మగవారి మధ్య రాసుకుంటారు. ఆ మగవాళ్ల ఇమేజ్తో సినిమాలు ఆడుతాయి. కాని ఇప్పుడు స్త్రీలతో కథ నడిపించవచ్చని నిరూపిస్తున్నారు. ఇది ప్రయోగం. ప్రయత్నం. ముందంజ. కథ ఏమిటి? ముంబై నగరంలో ఉన్నత వర్గానికి చెందిన జర్నలిస్ట్ విద్యాబాలన్. ఆమె విడాకులు తీసుకుంది. ఆమెకు సెరిబ్రల్ పాల్సీ ఉన్న ఒక పన్నెండేళ్ల కొడుకు ఉన్నాడు. తోడుగా వృద్ధురాలైన తల్లిగా రోహిణి హట్టాంగడి. వీరందరికీ వండి పెట్టడానికి రుక్సానా అనే వంట మనిషి షెఫాలీ షా. విద్యా బాలన్ విలువలు ఉన్న జర్నలిస్ట్. ఆమె సత్యాన్ని వెలికి తీయడానికి ఎంతటి వారినైనా ఎదిరిస్తూ ఉంటుంది. కాని ఆమే సత్యాన్ని దాయవలసి వస్తే? ఒకరోజు అర్ధరాత్రి ఆమె డ్యూటీ నుంచి ముగించి కారు డ్రైవ్ చేస్తూ ఒక టీనేజ్ అమ్మాయిని ఢీ కొడుతుంది. ఊహించని ఈ ఘటనకు ఎలా రియాక్ట్ కావాలి? అక్కడ ఎవరూ ఉండరు. దిగి చూసే ధైర్యం లేదు. టీనేజ్ అమ్మాయిని ఆమె ఖర్మానికి వదిలి ఇల్లు చేరుకుంటుంది. కాని మరుసటి రోజు తెలుస్తుంది అలా తాను యాక్సిడెంట్ చేసి మృత్యువు అంచుదాకా (సీరియస్గా గాయపడుతుంది) పంపిన అమ్మాయి తన పనిమనిషి కూతురేనని. ఒక వైపు సంఘంలో పరువు, ఇంకో వైపు జైలు భయం, మరోవైపు ఎలా తప్పించుకోవాలి అనే ఆందోళన, తన సొంత ఇంటి మనిషిలాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాననే గిల్ట్. ఇవన్నీ ఆమెను వెంటాడుతాయి. సత్యాన్ని వెతుకులాడే జర్నలిస్ట్ తానే ఒక సత్యాన్ని తొక్కిపెట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. మరోవైపు పనిమనిషి అయిన షెఫాలీ షాకు ఇదంతా తెలియదు. ఎవరో యాక్సిడెంట్ చేశారు. తన యజమాని వైద్యం చేయిస్తోంది. కూతురు బతుకు బుగ్గిపాలైంది అనే శోకం. కాని ఒక నేరం జరిగితే అందుకు తప్పకుండా శిక్ష ఉంటుంది. చట్టానికి విద్యాబాలన్ దొరక్కపోవచ్చు. కాని షెఫాలీ షాకు దొరికిపోతుంది. తన కూతురికి యాక్సిడెంట్ చేసింది తన యజమానే అని తెలుసుకున్న షెఫాలీ షా ఏం చేసింది? చూడాలి. పరిస్థితులు ఒక ఘటన జరిగినప్పుడు పరిస్థితుల కొద్దీ మనిషి స్వభావం ఎలా మారిపోతుందో ఈ సినిమా చర్చిస్తుంది. విద్యాబాలన్ యాక్సిడెంట్ ముందు వరకూ ఒక మనిషి... అయ్యాక ఒక మనిషి. ఆమెకు తీవ్రమైన మానసిక ఆందోళన మొదలైపోతుంది. లిఫ్ట్లో, నాలుగ్గోడల మధ్య ఉండలేకపోతుంటుంది. పీడకలలు. ఇదంతా సత్యాన్ని దాచడం వల్లే. ఆమె తన స్వభావానికి విరుద్ధంగా ఈ విషయం బయటపడకుండా ఉండాలంటే ఎవరెవరిని ఎంతెంత పెట్టి కొనాలి అనే రంధిలో పడిపోతుంది. మరోవైపు తన కూతురులాంటి అమ్మాయిని జీవచ్ఛవంలా హాస్పిటల్లో చూసి లోలోపల కుమిలిపోతూ ఉంటుంది. అటువైపు షెఫాలీ షా చుట్టూ చాలామంది మూగుతారు. నేరం జరిగినప్పుడు శిక్ష పడాలి అని మొదట అనిపిస్తుంది. కాని పేదవాళ్లు ఆ సందర్భంలో ఒకలాగా శ్రీమంతులు ఒకలాగా వ్యవహరిస్తారని ఈ సినిమాలో చూపిస్తారు. పోలీసులే మధ్యవర్తులుగా మారి నీకో పది లక్షలు ఇప్పిస్తాం... కాంప్రమైజ్ అయిపో అని షెఫాలీని ఒప్పిస్తారు. గమనించండి. పేదవాళ్లు శ్రీమంతులకు నష్టం కలిగిస్తే ఇలాంటి అప్షన్ ఉండదు. వారు జైలుకు వెళతారు. షెఫాలీ అంగీకరిస్తుంది. కాని చివరకు నేరం చేసింది తన యజమానే అనుకున్నాక ఆమె ప్రతిచర్య వేరేగా ఉంటుంది. ఆ ప్రతిచర్య ఏమిటి? స్త్రీ అంటే క్షమ. క్షమించడమే. కాని ఇదంతా గ్రిప్పింగ్గా ఉంటుంది చూడటానికి. ఆ పిల్లాడు ఈ సినిమాలో విద్యాబాలన్ కుమారుడుగా వేసిన సూర్య కాశీభట్ల మరో ముఖ్యపాత్ర. ఈ పాత్ర ఒక సంకేతం కావచ్చు. కన్నకొడుకు సెరిబ్రల్ పాల్సీ (మాట, కదలికల లోపం)తో ఉన్నప్పటికీ విద్యా బాలన్ ఆ పిల్లాణ్ణి ప్రేమించకుండా ఉంటుందా? ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడికి వంట మనిషిగా పని చేసే షెఫాలీ కూడా వాణ్ణి ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడు సంపూర్ణుడు కాడు. లోపం ఉన్నవాడు. తాము ఇష్టపడే మనుషులు సంపూర్ణులు అయి ఉండరు. ఏవో ఒక లోపాలు ఉంటాయి. తప్పులు జరుగుతాయి. పొరపాట్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతమాత్రాన ఆ బంధాలను తెంపేసుకోలేము. కఠినమైన శిక్షలు విధించలేము. క్షమ ఒక మార్గం ఏమో వెతకాలి. ఏమంటే శిక్ష కంటే క్షమ గొప్పది. ఈ సినిమా అలాంటి ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. విద్యా బాలన్, షెఫాలీ... వీరద్దరి గొప్ప నటనను చూడొచ్చు. సూర్య కూడా ఎంతో గొప్పగా నటిస్తాడు. కథ ఇంకా బాగుండొచ్చు. క్లయిమాక్స్ అసంపూర్ణం అనిపించవచ్చు. కాని అసంపూర్ణతను ప్రేమించమనే కదా డైరెక్టర్ సురేశ్ త్రివేణి చెబుతున్నది. అమేజాన్ ప్రైమ్లో ఉంది. -
నిర్మాత నాతో దారుణంగా ప్రవర్తించాడు: విద్యా బాలన్ షాకింగ్ కామెంట్స్
Vidya Balan Open Up On Her Struggles: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో విద్యా బాలన్ ఒకరు. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు, బయోపిక్లతో విద్యా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక కహానీ మూవీతో తనెంటో నిరూపించుకున్న విద్యా బాలన్ అప్పటి నుంచి వరస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలో తను ఎన్నో కష్టాలు పడ్డానని, ఇండస్ట్రీ అంటేనే ఆసహ్యం వచ్చింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: Dhanush-Aishwarya: విడాకుల తర్వాత ఐశ్యర్యపై ధనుష్ తొలి ట్వీట్, నెటిజన్ల అసహనం కాగా ఆమె తాజాగా నటించిన చిత్రం జల్సా. ఈ మూవీ అమెజాన్ ప్రైంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు బడ్డానంటూ విద్యా బాలన్ భావోద్యేగానికి లోనయ్యింది. ‘మొదట్లో ఓ నిర్మాత నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు. నన్ను బాడీ షేమింగ్ చేస్తూ అసహ్యంగా చూసేశాడు. అతని ప్రవర్తల వల్ల నేను 6 నెలల పాటు అద్దంలో చూసుకునేందుకు కూడా భయపడ్డాను. ఇదంత 2003లో జరిగింది. ఆ సమయంలో నేను ఏ సినిమాలకు సంతకం చేయలేకపోయాను. సినిమాలు చేయాలనుకున్న కుదరలేదు. అంతలా ఆ నిర్మాత తీరు నాపై ప్రభావం చూపింది’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: ‘రాధేశ్యామ్’పై వర్మ షాకింగ్ కామెంట్స్, మూవీకి అంత అవసరం లేదు.. అదే సమయంలో కె బాలచందర్ దర్శకత్వంలో రెండు సినిమాలకు సంతకం చేశానని, కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే ఆ ప్రాజెక్ట్స్ నుంచి తనని తొలగించారని చెప్పింది. అంతేకాదు పలు ప్రకటనల నుంచి కూడా తీసేశారంది. అప్పుడు ఈ సంఘటనలు తనని తీవ్రంగా బాధించాయని, చాలా ఏడ్చానని విద్యా పేర్కొంది. అదే బాధలో మెరైన్ డ్రైవ్ నుంచి బాంద్రా వరకు నడుచుకుంటూ వెళ్లానని ఆమె అన్నారు. అలా తనని దాదాపు 13 సినిమాల నుంచి తీసివేశారని విద్యా బాలన్ తెలిపింది. ఆ తర్వాత అందమైన శరీరాకృతి కోసం రోజు గంటల తరబడి వ్యాయమం చేసి బరువు తగ్గాననని పేర్కొంది. ఇక ఇప్పడు నన్ను రిజెక్ట్ చేసిన నిర్మాతలే ఫోన్ చేసి సినిమా చేయాలని అడుగుతున్నారని, అయితే వారి ఆఫర్ను సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు విద్యా బాలన్ చెప్పింది. -
హాట్ ఫొటోషూట్స్ ఎందుకు చేయరన్న నెటిజన్.. దిమ్మతిరిగేలా హీరోయిన్ రిప్లై
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉంటారు. వారికి సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేసుకుంటారు. అప్పుడప్పుడూ ఫ్యాన్స్తో సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్ట్ అవుతుంటారు. ఈ క్రమంలోనే పలువురు యూజర్స్ తమకు తోచిన ప్రశ్నలతో చిరాకు తెప్పిస్తుంటారు. కానీ వాటికి దీటుగా స్ట్రాంగ్ రిప్లైలు ఇస్తుంటారు సెలబ్రిటీలు. ఇలాంటి సంఘటనే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్కు ఎదురైంది. 'డర్టీ పిక్చర్' సినిమాతో ఒక ఊపు ఊపేసిన విద్యా బాలన్ ఇటీవలే శకుంతల దేవి, షెర్నీ చిత్రాలతో మంచి విజయం అందుకుంది. తాజాగా విద్యాబాలన్ నటించిన 'జల్సా' చిత్రంతో మార్చి 18న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటుంది విద్యా బాలన్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే ఉన్నారు. విద్యా తన ఇన్స్టాగ్రామ్లో 'ఏదైనా అడగండి లేదా ఏమైనా చెప్పండి' అనే సెషన్ను నిర్వహించింది. ఈ సెషన్లో ఒక యూజర్ 'మీరు హాట్ ఫొటోషూట్లు ఎందుకు చేయకూడదు?' అని ప్రశ్నించాడు. అందుకు విద్యా 'ఇది (వాతావరణం) వేడిగా ఉంది.. నేను షూటింగ్ చేస్తున్నాను. ఇది హాట్ ఫొటోషూట్ కాదా..' అని గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇలా తన బరువు, ఇతర అంశాలపై ఆమెను ప్రశ్నించగా పలు మీమ్స్తో సమాధానాలిచ్చింది విద్యా బాలన్. -
ఓటీటీలోకి 'జల్సా' చిత్రం.. ముచ్చటగా మూడోసారి
Vidya Balan Jalsa Movie Released In OTT: కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సినిమాలకు ప్రత్యామ్నాయంగా కనిపించినవి ఓటీటీ ప్లాట్ఫామ్స్. తర్వాత కొద్ది రోజులకు చిన్న సినిమాలే కాకుండా పెద్ద సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇవే కాకుండా బడా హీరోలు, అగ్ర నటులు సైతం ఓటీటీకే మొగ్గు చూపారు. బాలీవుడ్లో అత్యుత్తమ ప్రతిభగల నటీమణుల్లో విద్యా బాలన్ ఒకరు. ఒటీటీలో సినిమాను విడుదల చేసి హిట్ కొట్టిన మొదటి బాలీవుడ్ నటి విద్యా బాలన్. ఆమె 2020లో నటించిన 'శకుంతల దేవి' చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. తర్వాత 2021లో 'షేర్ని' మూవీతో ఆ విజయ పరంపరను కొనసాగించింది. తాజాగా 'జల్సా' సినిమాతో తాను హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. జల్సా సినిమాను ఈ నెల 18న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు విద్యా బాలన్ నటించిన 'తుమ్హారీ సులు' డైరెక్టర్ సురేష్ త్రివేణి దర్శకత్వం వహించారు. ఇందులో విద్యా ఒక జర్నలిస్టుగా నటించింది. ఇటీవల విడుదలైన ఈ టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు విద్యా బాలన్ రెండు చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనే విడుదలై విజయం సాధించాయి. మరీ ఈ సినిమా ఓటీటీలో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధిస్తుందో చూడాలి. -
తెరపై గర్బిణీలుగా మెప్పించిన నటీమణులు వీళ్లే..
Top 5 Actresses Who Played Pregnant Women Role: ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడూ ముందుంటారు. పలు ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ బీటౌన్ నటీమణులు తమ సొంత బ్యాంకింగ్ను ఏర్పర్చుకుంటున్నారు. మహిళా ప్రాధాన్యత చిత్రాల నుంచి బోల్డ్ క్యారెక్టర్ల వరకు పేరు తెచ్చుకుంటున్నారు. సినిమాల్లో కేవలం ఒక భాగం, సహాయక పాత్రలకు పరిమితం కాకుండా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా చాలా మంది నటీమణులు తల్లి పాత్రను పోషించారు. ఏ సంకోచం లేకుండా గర్భిణీ పాత్రలకు సైతం మొగ్గు చూపారు. ఈ గర్భిణీ స్త్రీలుగా తెరపై నటించిన బాలీవుడ్ నటీమణులు ఎవరెవరో ఓసారి చూద్దామా ! 1. నుష్రత్ భరుచ్చా (ఛోరీ) హిందీలో వస్తున్న హార్రర్ మూవీ 'ఛోరీ'లో నుష్రత్ భరుచ్చా గర్భిణీగా నటించారు. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. సినిమా షూటింగ్కు సుమారు 25 రోజుల ముందు 'గర్భిణీ బాడీసూట్'ను ధరించడం ప్రారంభించారు. ఈ విషయంపై ఆమె 'ఇప్పుడు నిజ జీవితంలో నేను గర్భివతిని కాలేను. కాబట్టి, ఒక బిడ్డను మోసే స్త్రీ ఎలా ఉంటుంది. ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఏం అనుభవిస్తుందో తెలుసుకోడానికే ఆ బాడీసూట్ను తయారు చేసుకున్నాను. గర్భిణీలకు వచ్చే సమస్యలను తెలుసుకోడానికి సినిమా షూటింగ్ ప్రారంభానికి 20-25 రోజుల ముందు ఆ బాడీసూట్ను ధరించాను. దాంతోనే తినడం, పడుకోవడం, బాత్రూమ్కు వెళ్లడం, చుట్టూ తిరగడం చేశాను.' అని తెలిపారు. 2. విద్యా బాలన్ (కహానీ) భారతీయ చలనచిత్ర రంగంలో మహిళల చిత్రీకరణలో మార్పు తీసుకురావడానికి పేరుగాంచిన నటి విద్యా బాలన్. 'కహానీ' చిత్రంలో గర్భిణీగా నటించి.. అందరి మెప్పు పొందారు. ఇందులో ప్రొస్తెటిక్ బేబీ బంప్ను ధరించి నటించారు విద్యా బాలన్. ఆమె ఎంతో చక్కగా, పరిపూర్ణతో ఆ పాత్రను పోషించారు. ప్రేక్షకులను కంటతడి పెట్టించి, విమర్శకుల ప్రశంసలు పొందారు. ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా పొందారు. దీనికి రీమెక్గా తెలుగులో నయనతార హీరోయిన్గా 'అనామిక' రూపొందించారు. కానీ అందులో ఆమెను గర్భిణీ పాత్రలో చేయలేదు. 3. నీనా గుప్తా (బధాయి హో) 2018లో నటి నీనా గుప్తా, అమిత్ శర్మతో కలిసి 'బధాయి హో' సినిమాలో యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో ఆమె 50 ఏళ్ల గర్భిణీ పాత్రను పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో ఒకటిగా మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాకు. 'పూర్తి వినోదాత్మకంగా అత్యంత ప్రజాధారణ పొందిన ఉత్తమ చిత్రం' విభాగంలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. 4. కరీనా కపూర్ ఖాన్ (గుడ్ న్యూస్) గుడ్ న్యూస్ సినిమాలో దీప్తి బాత్రాగా కరీనా కపూర్ పాత్ర 21వ శతాబ్దపు మహిళలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె ఒక స్వతంత్ర, స్వయం సమృద్ధి గల వ్యక్తి పాత్రను పోషించారు. ఆమె కూడా బిడ్డను కలిగి ఉండాలని కోరుకునే అమ్మాయి కథ. తెరపై గర్భిణీ స్త్రీ పాత్రను వివరిస్తూ, గర్భధారణ సమయంలో స్త్రీ పడే కష్టాలు, ప్రభావాలు తెలిసేలా చక్కగా నటించారు. అందులో కియారా అద్వానీ కూడా గర్భిణీ పాత్రలో కనిపించారు. 5. కృతి సనన్ (మిమి) 'మిమి' చిత్రంలో కృతి సనన్ ఒక సరోగసి తల్లి పాత్రలో నటించారు. ఈ పాత్రతో ఆమె నటనకు మంచి బ్రేక్ వచ్చింది. ఎంతో పరిణితీ ఉన్న నటిగా ఆమె నిరూపించుకుంది. ఆ పాత్ర కోసం కృతి సనన్ సుమారు 15 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement