-
ఈ ఒక్క రీజన్తో యాపిల్ యూజర్లు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా?
యాపిల్ కంపెనీ ఈనెల 12 (2023 సెప్టెంబర్ 12)న జరగబోయే ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ లాంచ్ చేయనుంది. అయితే ఇప్పటికే స్మార్ట్ఫోన్ ట్రేడ్-ఇన్ ప్లాట్ఫారమ్ సెల్సెల్ అనే కొత్త సర్వేలో ఎక్కువమంది ఈ మొబైల్ కొనటానికి కారణం USB-C ఛార్జింగ్ పోర్ట్ను ప్రవేశపెట్టడమే అని తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ సెల్సెల్ సర్వే ప్రకారం.. యాపిల్ USB-C ఛార్జింగ్ పోర్ట్తో ఐఫోన్ 15 మోడల్స్ అందించనుంది. ఈ కారణంగా చాలామంది కొత్త వినియోగదారులు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సుమారు 63 శాతం మంది ఐఫోన్ యూజర్లు కొత్త ఐఫోన్ కొనటానికి ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ యూఎస్బీ-సీ ఛార్జర్ ప్రవేశపెట్టడం వల్ల కేవలం ఐఫోన్ వినియోగదారులు మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ యూజర్లు కూడా 15 శాతం ఇటువైపు మొగ్గు చూపుతారని నివేదికలు చెబుతున్నాయి. కేవలం వినియోగదారుడు మాత్రమే కాకుండా కుటుంబంలోని అందరూ ఈ ఛార్జర్ ఉపయోగించవచ్చని, ఇదీ ఒక కారణమని చెబుతున్నారు. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే? విస్తుపోయే నిజాలు.. 2012 నుంచి యాపిల్ కంపెనీ ఐఫోన్లకు ప్రత్యేకమైన చార్జర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూరోపియన్ యూనియన్ నిబంధనల వల్ల మొదటిసారి ఐఫోన్ 15 సిరీస్ యూఎస్బీ-సీ ఛార్జర్తో రానుంది. ఇది వినియోగదారులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. -
యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ పోర్ట్కు బీఐఎస్ ప్రమాణాలు
న్యూఢిల్లీ: యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ పోర్ట్ నాణ్యత ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రకటించింది. మొబైల్స్కు, ధరించగలిగే ఎలక్ట్రానిక్స్ కోసం రెండు ఒకే తరహా (కామన్) ఛార్జింగ్ పోర్ట్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. వినియోగదారుల ప్రయోజనాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు పరిశ్రమ వాటాదారులతో సంప్రదింపులు జరిపిన డిపార్ట్మెంట్ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్ రెండు రకాల సాధారణ ఛార్జింగ్ పోర్ట్లను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. వీటిలో మొబైల్స్, స్మార్ట్ఫోన్స్, టాబ్లెట్ పీసీల కోసం యూఎస్బీ టైప్–సీ ఛార్జర్ ఒకటి కాగా, మరొకటి వేరబుల్ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఇతర సాధారణ ఛార్జర్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)–కాన్పూర్ స్మార్ట్ వాచెస్ వంటి ధరించగలిగే ఎలక్ట్రానిక్ పరికరాల కోసం సింగిల్ ఛార్జింగ్ పోర్ట్ను అధ్యయనం చేస్తోంది. ఐఐటీ కాన్పూర్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత పరిశ్రమతో ఈ విషయమై ప్రభుత్వం చర్చించనుంది. -
మొబైల్ ఫోన్ చార్జర్ల కష్టాలకు చెక్.. ఈ ఐడియా అదిరింది!
న్యూఢిల్లీ: త్వరలో మొబైల్ ఫోన్ చార్జర్ల కష్టాలకు తెరపడనుంది. ఉన్నట్టుండి చార్జింగ్ అయిపోతే, మరొకరి ఫోన్ చార్జర్తో అవసరం గట్టెక్కవచ్చు. ఇందుకు వీలుగా ఒకేరకమైన చార్జింగ్ పోర్ట్ను దశలవారీగా అమలు చేయడానికి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని కేంద్ర విని యోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఏకరూప చార్జింగ్ పోర్ట్ సాధ్యా సాధ్యాలను పరిశీలించడానికి ఉప కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని అంతర్గత మంత్రిత్వశాఖల టాస్క్ఫోర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఏఐటీ, ఫిక్కీ, సీఐఐ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ వారణాసి విద్యా సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు తదితర ఎలక్ట్రానిక్ డివైజ్లను యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ పోర్ట్తో తీసుకొచ్చేందుకు పరిశ్రమ ప్రతినిధులు సమ్మతి తెలిపారు. చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
ఆండ్రాయిడ్ 11తో రానున్న గెలాక్సీ ఎ32 5జీ
శామ్సంగ్ గెలాక్సీ ఎ32 5జీ మొబైల్ అవుట్ అఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో రానున్నట్లు సమాచారం. దీనికి సంబందించిన కొన్ని లీక్స్ బయటకి వచ్చాయి. ఈ ఫొటోలో నాచ్ డిస్ప్లే, చిన్న కెమెరా బంప్ తో రానున్నట్లు కనిపిస్తుంది. మోడల్ నంబర్ ఎస్ఎమ్-ఎ326బితో వస్తున్న ఫోన్ గెలాక్సీ A32 5జీ అని సమాచారం. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ దీని గురుంచి ఎటువంటి సమాచారం తెలపలేదు. ఇది ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ తో వన్ UI 3.0పై పని చేయనుంది. ఇటీవల గెలాక్సీ ఎ32 5జీ యొక్క ఫీచర్స్ గురుంచి కొన్ని రూమర్లు బయటికి వస్తున్నాయి. ఇందులో 6.5-అంగుళాల డిస్ప్లే మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ను చూపిస్తుంది. ఫోన్ ఫ్లాట్ అయిన ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్తో పాటు ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం నాచ్ తో వస్తుంది అని నివేదిక పేర్కొంది. ప్రధాన కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ తో రానున్నట్లు సమాచారం. ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ లేని బ్యాక్ ప్యానెల్ తో ఫ్లష్ గా ఉంటుంది. గెలాక్సీ ఎ 32 5జీ మొబైల్ యుఎస్బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్తో రావచ్చు.(చదవండి: రియల్మీలో స్నాప్డ్రాగన్ 888) -
కొత్త ఫీచర్లతో షావొమీ 'రెడ్మి నోట్ 4'
చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావొమీ మరో స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. 'రెడ్మి నోట్ 4' పేరుతో కొత్త ఫోన్ ను చైనా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లు 2జీబీ, 3జీబీ ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తాయి. 16 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజీ మోడల్ ధర దాదాపు రూ.9 వేలు. 64 జీబీ మోడల్ ధర సుమారు. 12 వేలు. ఆగస్టు 26 నుంచి కంపెనీ ఆన్లైన్ స్టోర్లు, ఎంఐ డాట్ కామ్ లో వీటిని కొనుక్కోవచ్చు. ప్రస్తుతం ఇవి చైనాలో మాత్రమే లభ్యమవుతాయి. యూఎస్బీ టైప్ సీ-మోడల్ ను సపోర్ట్ చేయడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫీచర్ కలిగిన మొదటి స్మార్ట్ఫోన్ తమదేనని షావొమీ పేర్కొంది. రౌండ్ అంచులతో మెటల్ యూనిబాడీని కలిగిన రెడ్మి నోట్ 4 హైబ్రీడ్ సిమ్ స్లాట్ ను సపోర్ట్ చేస్తుంది. గోల్డ్, గ్రే, సిల్వర్ కలర్స్ లో లభిస్తుంది. ఫీచర్లు 2.1 జీహెచ్ జడ్ ప్రాసెసర్ 5.5 ఫుల్ హెచ్డీ స్క్రీన్ 2.5 కర్వర్డ్ గ్లాస్ డిస్ ప్లే 5 మెగా ఫిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫింగర్ప్రింట్ స్కానర్ 4100 ఏంఏహెచ్ బ్యాటరీ 4జీ వోల్టీ సపోర్ట్ ఫోన్ బరువు 175 గ్రాములు
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement