-
దుర్గగుడి హుండీలో కానుకలు చోరీ
ఆలయ అధికారులకు పట్టుబడ్డ యువకుడు సీసీఎస్ సిబ్బందికి అప్పగింత ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తులు సమర్పించిన నగదు కానుకలను చోరీ చేస్తున్న యువకుడు శనివారం ఆలయ అధికారులకు పట్టుబడ్డాడు. ఆలయ ప్రాంగణంలోని రూ.20, శీఘ్రదర్శనం రూ.100 టికెట్ క్యూలైన్ల మధ్య ఇటీవల స్టీల్ హుండీని ఏర్పాటు చేశారు. భక్తులు సమర్పించిన కానుకల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో దాని పైభాగంలో చుట్టూ వస్త్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ వస్త్రంలో భక్తులు వేసిన కానుకలు హుండీలో పడతాయి. అయితే ఈ హుండీలో వేసిన కానుకలు నేరుగా లోపలకు వెళ్లకుండా ఉండేందుకు చిట్టినగర్కు చెందిన శివప్రసాద్ అనే యువకుడు ఓ చిట్కా కనిపెట్టాడు. శనివారం మధ్యాహ్న సమయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో రూ.20 టికెట్ క్యూలైన్లో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాడు. క్లాత్ హుండీలో న్యూస్ పేపర్ వేశాడు. దీంతో హుండీ లోపల మూతి మూసుకుపోవడంతో భక్తులు వేసిన కానుకలు పేపర్పై ఉండిపోయాయి. సుమారు గంట తర్వాత వచ్చిన శివప్రసాద్ పేపర్పై ఉన్న నోట్లను తీస్తుండగా ఆలయ అధికారులు గమనించారు. అతడిని అదుపులోకి తీసుకుని దేవస్థానం ప్రాంగణంలోని పోలీస్ అవుట్పోస్టుకు తరలించారు. అక్కడి నుంచి వన్టౌన్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ సీసీఎస్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. శివప్రసాద్ వద్ద రూ.2 వేలకు పైగా నగదు లభ్యమైనట్లు వారు పేర్కొంటున్నారు. ఈ వ్యవహా రం ఎంతకాలం నుంచి సాగుతోంది? ఆలయాల్లో చోరీలు చేసే ముఠాలతో ఇతడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. -
ట్రస్ట్ ఫైట్
దుర్గగుడి ట్రస్టుబోర్డు ఏర్పాటుకు సర్కారు కసరత్తు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం చైర్మన్గిరీ కోసం టీడీపీ, బీజేపీ పోటాపోటీ సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి ట్రస్టుబోర్డు నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ట్రస్టుబోర్డు పదవుల్ని అధికార పార్టీలోని నిరుద్యోగ నేతలకో, కార్యకర్తలకో కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలో అటు టీడీపీ నేతలు, ఇటు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నేతలు పదవులపై కొండంత ఆశతో పావులు కదుపుతున్నారు. ఈసారి 12 మందికి అవకాశం ప్రతిసారీ దేవస్థానం పాలకమండలిలో తొమ్మిది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. వారిలో ఒకరు చైర్మన్గా వ్యవహరిస్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి గత ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నియమించిన కమిటీ దుర్గగుడి వ్యవహారాలను చూస్తోంది. ఒకసారి బాధ్యతలు చేపట్టిన కమిటీ రెండేళ్లు అధికారంలో ఉండవచ్చు. లేదా తగిన కారణం చూపి ప్రభుత్వం కమిటీని రద్దుచేయవచ్చు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం గత పాలక మండళ్లను రద్దుచేసింది. దీనిపై కొన్ని మండళ్ల సభ్యులు కోర్టును ఆశ్రయించగా, సభ్యుల సంఖ్య పెంచాలన్న యోచనలో సర్కారు ఉంది. రాష్ట్రంలోని పాలకమండళ్ల సభ్యుల సంఖ్యను 9 నుంచి 12కు పెంచుతూ ప్రభుత్వం తయారుచేసిన ఆర్డినెన్స్ గవర్నరు వద్ద పెండింగ్లో ఉంది. దానికి గ్రీన్సిగ్నల్ రాగానే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు ట్రస్టుబోర్డులు నియమిస్తారని దేవాదాయ శాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆశావహుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. పట్టుబిగిస్తున్న బీజేపీ కేంద్రంలో టీడీపీకి అవకాశం కల్పించి, రాష్ట్ర ప్రభుత్వ మంత్రి పదవుల్లో వాటా తీసుకున్నట్లుగానే నామినేటెడ్ పదవుల్లోనూ తమకు వాటా కావాలని కమలనాథులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా దుర్గగుడి ట్రస్టుబోర్డులో స్థానం పొందగోరే వారు దర ఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు బీజేపీకి చెందినవారే కావడంతో కనీసం సగం సీట్ల కోసం పట్టుబట్టాలని, చివరికి నాలుగైనా దక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ఒకేసారి కమిటీలను వేస్తే దుర్గగుడి లాంటి కీలక ఆలయాల చైర్మన్గిరీ కోసం బీజేపీ నేతలు పట్టుబట్టే అవకాశం లేకపోలేదు. చాపకింద నీరులా టీడీపీ తెలుగుదేశం నేతలు చాపకింద నీరులాగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తర్వాత వాటి పరిశీలన, నాయకుల సిఫార్సులు.. ముఖ్యమంత్రి పరిశీలన అన్నీ పూర్తయ్యాక అర్హులైన వారికి పదవులు కేటాయిస్తే అప్పుడు జీవో జారీ అవుతుంది. ఈ తతంగమంతా వేగంగా చేసినా నెల రోజులు పడుతుంది. ఈలోగా ఆశావహులు దుర్గగుడితోపాటు ఇతర దేవాలయాల పదవుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దుర్గగుడి చైర్మన్ కోసం నగరంలోని ఒక బలమైన సామాజికవర్గం నేత ప్రయత్నిస్తుండగా, ముఖ్యమంత్రి సొంత సామాజికవర్గం నాయకులు కూడా తెరపైకి వస్తున్నారు. సుదీర్ఘ కాలం పార్టీకి సేవ చేసినవారికి అవకాశం కల్పించాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. లక్షలు ఖర్చు చేసేవారికి, నేతల పక్కన తిరిగే వారికి కాకుండా పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి తగిన అవకాశం కల్పించాలని ప్రజాప్రతినిధులు అంటున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement