-
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
చివ్వెంల(సూర్యాపేట): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జెడ్పీ సీఈఓ అప్పారావు అన్నారు. గ్రీన్ డే సందర్భంగా శుక్రవారం చివ్వెంల మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామంలో మొక్కలకు నీరు పోశారు. ఆయన వెంట ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంపీఓ గోపి, కార్యదర్శి చలమయ్య తదితరులున్నారు. నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని జెడ్పీ సీఈఓ అప్పారావు అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అక్కలదేవిగూడెం, బి.చందుపట్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆయన వెంట డీసీఓ పద్మ, ఎంపీడీఓ సంతోష్ కుమార్, వ్యవసాయ అధికారి ఆశాకుమారి, ఏఈఓలు ఉన్నారు. -
10 స్థానాల్లో గెలుపు ఖాయం
అర్వపల్లి: రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని, పార్లమెంట్ ఎన్నికల్లో పది ఎంపీ స్థానాల్లో గెలుపు ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ను గెలిపించాలని కోరుతూ శుక్రవారం అర్వపల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అంతకుముందు అర్వపల్లి దేవాలయంలో పూజలు చేశారు. దేవాలయం నుంచి మెయిన్రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో తిరిగే కాంగ్రెస్ నాయకులను హామీలపై నిలదీయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోందని సాగు, తాగు నీటి కోసం రైతులు, ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్నారు. బీసీలు, ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిగా మారిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గోదావరి జలాలు రాకుండా పోయాయన్నారు. ఈసారి ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తీసుకువస్తామన్నారు. ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా.. జగదీష్రెడ్డి, క్యామ మల్లేష్, కిశోర్లను జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్ గజమాలతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే కిశోర్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో బడుగుల లింగయ్యయాదవ్, సూర్యాపేట, భువనగిరి జెడ్పీ చైర్మన్లు గుజ్జ దీపిక, ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్గౌడ్, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట జెడ్పీటీసీలు దావుల వీరప్రసాద్యాదవ్, జీడి భిక్షం, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, బైరబోయిన రామలింగయ్య, బొడ్డు రామలింగయ్య, మొరిశెట్టి ఉపేందర్, కనుకు శ్రీనివాస్, గోసుల విజయ్, వల్లపు గంగయ్య, కడారి నరేష్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
వ్యయ పరిశీలన పకడ్బందీగా ఉండాలి
దురాజ్పల్లి (సూర్యాపేట): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వ్యయ పరిశీలన పకడ్బందీగా చేపట్టాలని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు సాయన్దే బర్మ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తుంగతుర్తి, నకిరకల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వ్యయ పరిశీలకులు, సహాయ వ్యయ పరిశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ రాహుల్ హెగ్డేలతో కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో అకౌంటింగ్ విధానం, సీజర్ కేసులు ఎక్కువగా నమోదు చేయాలని సూచించారు. సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద నిరంతరం నిఘా ఉంచాలన్నారు. పెయిడ్ ఐటమ్స్కు రేట్ కార్డు ప్రకారం ఖర్చు వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో జమ చేయాలని, అదేవిధంగా ప్రకటనలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలోగల ఆరు మండలాల్లోని 31 సమస్యాత్మక ప్రాంతాల్లో 39 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ తుంగతుర్తి పరిధిలో మూడు చెక్పోస్ట్లు ఉన్నాయని, 22 రూట్లుగా విభజించి నిఘా పెంచామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.25 లక్షలు, రూ.31లక్షల విలువ గల లిక్కర్ సీజ్ చేసినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ ప్రియాంక, బీఎస్ లత, ట్రైనీ ఐపీఎస్ రాజేష్ మీనా, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, నోడల్ ఆఫీసర్ సతీష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఫ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు సాయన్దే బర్మ -
కాంగ్రెస్ నాయకుడి కిడ్నాప్ కలకలం !
సూర్యాపేట : బ్లాక్ కాంగ్రెస్ సూర్యాపేట మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య కిడ్నాప్ కలకలం రేపుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి ఎల్లయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేటకు చెందిన అపర్ణ అనే మహిళ గురువారం తమ భార్యాభర్తల పంచాయితీ పరిష్కరించాలని చెప్పి సూర్యాపేటకు వచ్చి వడ్డే ఎల్లయ్యను తీసుకొని ఆయన కారులోనే జగ్గయ్యపేటకు బయలుదేరారు. ఎల్లయ్య స్నేహితుడు కోదాడ పట్టణానికి చెందిన మొగిలిచర్ల అంజయ్య అతడితోపాటు ఇంకో వ్యక్తికూడా కలిసి జగ్గయ్యపేటకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ఎల్లయ్య స్నేహితులు ఇద్దరు కోదాడలో దిగిపోయారు. జగ్గయ్యపేట బస్టాండ్ సమీపంలోకి రాగానే శ్రీనివాస్ అనే వ్యక్తికి అపర్ణ ఫోన్ చేసి ఎల్లయ్యను తీసుకొచ్చానని, ఇక్కడికి రమ్మని చెప్పింది. బస్టాండ్ దగ్గరకు వచ్చిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి మాట్లాడుకుందామని, అక్కడే పెద్ద మనుషులు కూడా ఉన్నారని చెప్పి కారులో శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికి ఎల్లయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతోపాటు అపర్ణ, శ్రీనివాస్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన వడ్డె ఎల్లయ్య చిన్నమ్మ కొడుకు మారెపల్లి సతీష్ శుక్రవారం జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వడ్డే ఎల్లయ్య రెండు రోజులుగా కనిపించకపోవడంతో కిడ్నాప్ అయినట్లు భావిస్తున్నారు. -
రెండో రోజూ స్వల్పమే..
నల్లగొండ: నల్లగొండ లోక్సభ స్థానానికి రెండో రోజైన శుక్రవారం మరో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు నలుగురు అభ్యర్థులు ఆరుసెట్ల నామినేషన్లు దాఖలు చేయగా రెండో రోజు మాత్రం నలుగురు అభ్యర్థులు ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో రెండురోజుల్లో ఎనిమిది మంది అభ్యర్థులు పది సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు నామినేషన్లను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన స్వీకరించారు. నామినేషన్లు సమర్పించింది వీరే.. రెండో రోజు స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో బండారు నాగరాజు, కిన్నెర యాదయ్య ఉన్నారు. అలాగే ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా తలారి రాంబాబు నామినేషన్ సమర్పించారు. మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) అభ్యర్ధిగా వసుకుల మట్టయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి తరఫున ఒక నామినేషన్ సెట్ దాఖలు కాగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఒకటి, ఇద్దరు రెండు సెట్ల చొప్పున, ప్రజావాణి పార్టీ, సోషలిస్టు పార్టీ, ధర్మసమాజ్ పార్టీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తరఫున ఒక్కొక్కరు ఒక్కో సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి ఎంపీ స్థానానికీ అంతంతే.. సాక్షి, యాదాద్రి: లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భువనగిరి స్థానానికి రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్, బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్, సోషలిస్ట్ పార్టీ (ఇండియా) అభ్యర్థిగా రచ్చ సుభద్రారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా మెగావత్ చందునాయక్, రేకల సైదులు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు. మొదటి, రెండో రోజు కలిపి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లు వేశారు. అట్టహాసంగా సీపీఎం అభ్యర్థి నామినేషన్ సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జహంగీర్ వెంట సీపీఎం పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండమడుగు నర్సింహ ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే జన సమీకరణ చేయకుండా సాదాసీదాగా వచ్చి నామినేషన్ వేశారు. నల్లగొండ లోక్సభ స్థానానికి ఎనిమిది నామినేషన్లు రెండు రోజులు నలుగురు అభ్యర్థుల చొప్పున దాఖలు మొత్త పది సెట్ల నామినేషన్లు -
భువనగిరి బీజేపీ అభ్యర్థి ఆస్తుల వివరాలు ఇవీ..
సాక్షి, యాదాద్రి: భువనగిరి లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తన నామినేషన్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. ● చేతిలోనగదు, బ్యాంకుడిపాజిట్ కలిపి : రూ.7,74,90,802.26 ● భార్య పేరుపై రూ.1,45,60147.82 ● స్థిరాస్తులు విలువ రూ.19,85,07,500 (భవనాలు, భూములు, ప్లాట్లు) ● భార్య పేరుపై రూ.10,23,76,250 ● స్వయంగా కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ : రూ 7,43,20,516 ● భార్య పేరుపై ఉన్న ఆస్తుల రూ.27,27,196 ● బ్యాంకు, ఆర్థిక సంస్థల నుంచి, ఇతరుల నుంచి తీసుకున్న రుణాలు రూ.1,28,17,844 భార్య పేరుపై రూ.1,93,83,212 ● బూర నర్సయ్యగౌడ్పై జనగామ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నడుస్తోంది. ఎఫ్ఐఆర్నెంబర్59/ 2004 ప్రకారం బచ్చన్నపేట పోలీస్స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా గుమికూడారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పాత ఇనుప సామగ్రి గోదాములో అగ్నిప్రమాదం
చౌటుప్పల్ : ఓ పాత ఇనుప సామగ్రి గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చౌటుప్పల్ పట్టణానికి చెందిన సురేష్తో పాటు మరికొంత మంది కలిసి పట్టణ శివారులోని శ్రీని ఫార్మా పరిశ్రమ పక్కన ఎకరం స్థలం అద్దెకు తీసుకొని ఓం సాయిరాం స్క్రాఫ్ పేరిట పాత ఇనుప సామగ్రి గోదాం ఏర్పాటు చేసుకున్నారు. మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమల నుంచి పాత సామగ్రిని కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటారు. ఈ క్రమంలో గోదాం వెనుక భాగంలో ఉన్న పత్తిచేనులో ఉన్న చెత్తను రైతులు తగులబెట్టారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో అందులోని నిప్పురవ్వలు ఎగిసివచ్చి పాత ఇనుప సామగ్రి గోదాంలో పడి మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపట్లోనే మంటలు నలుమూలలుగా వ్యాపించి ప్లాస్టిక్ సామగ్రి కావడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. గమనించిన నిర్వాహకులు వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. మంటలు ఆర్పిన ఫైర్సిబ్బంది.. ప్లాస్టిక్ సామగ్రి కావడంతో మంటలు తీవ్రస్థాయిలో వ్యాపించాయి. దీంతో స్థానికంగా ఉన్న ఫైర్ఇంజన్ సరిపోకపోవడంతో పరిసర మండలాల నుంచి మరో రెండు ఫైర్ఇంజన్లను రప్పించారు. వాటితో పాటు స్థానిక దివీస్ పరిశ్రమ నుంచి సైతం అత్యాధునికమైన ఫైర్ఇంజన్ను రప్పించారు. ఈ క్రమంలో వివిధ సేవల కోసం దివీస్ పరిశ్రమ సిబ్బందిని తీసుకువచ్చారు. అదే విధంగా స్థానికంగా ఉన్న ట్రాక్టర్లతో నీటిని తెప్పించి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సామగ్రి పెద్దఎత్తున అగ్నికి ఆహుతి అయినప్పటికీ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఉండడంతో నష్టం చాలా మేరకు తగ్గినట్టయ్యిందని, సుమారుగా రూ.20లక్షల వరకు నష్టం జరిగిందని యజమాని సురేష్ తెలిపారు. విషయం తెలియగానే ఏసీపీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, సీఐ అశోక్రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నామినేషన్ పత్రాలతో పూజలు
భువనగిరి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా భువనగిరి పట్టణంలోని నల్లగొండ చౌరస్తా సమీపంలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో పూజలు చేశారు. అనంతరం సమీపంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం పాల్గొన్నారు. -
పోటెత్తుతున్న ధాన్యం
మంచి ధర వస్తోంది వ్యవసాయ మార్కెట్కు గత పదిహేను రోజులుగా భారీగా ధాన్యం వస్తోంది. తేమ శాతంతో సంబంధం లేకుండా ధర మంచిగానే పలుకుతోంది. దీంతో రైతులు మార్కెట్లో ధాన్యం అమ్మడానికి మొగ్గు చూపుతున్నారు. – శ్రీధర్, మార్కెట్ కార్యదర్శి తిరుమలగిరి (తుంగతుర్తి): తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు గత 19 రోజులుగా ధాన్యం పోటెత్తుతోంది. ఈ సీజన్లో ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 1,35,545 క్వింటాళ్ల (2,08,102 బస్తాలు) ధాన్యం వచ్చింది. ఈ మార్కెట్కు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు యాదాద్రి, భువనగిరి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల నుంచి రైతులు మార్కెట్కు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. గత పది రోజులుగా నియోజకవర్గం చుట్టూ వరి కోతలు ఊపందుకున్నాయి. ఒకేసారి వరి కోతలు వస్తుండటంతో ప్రతిరోజు మార్కెట్కు 20 వేల నుంచి 40 వేలకు పైగా ధాన్యం వస్తోంది. గిట్టుబాటు ధర వస్తుండడంతో..మార్కెట్కు భారీగా ధాన్యం రావడానికి ప్రధాన కారణం గిట్టుబాటు ధర దక్కడమే. దీనికి తోడు మార్కెట్లో ధాన్యం కాంటా కాగానే అదేరోజు సాయంత్రం కమీషన్దారులు రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం రైతులు చేనులో పోసిన ధాన్యాన్ని వెంటనే మార్కెట్కు తీసుకొని వస్తే తేమ శాతం ఎలా ఉన్నా క్వింటాకు రూ.1,700 నుంచి రూ.1,950 వరకు ధర వస్తుండటంతో రైతులు మార్కెట్కు ధాన్యాన్ని తీసుకురావడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.200 నుంచి రూ.300 వరకు తేడా ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు ఆరబోయడం, ఇతర ఖర్చులు రోజుల కొద్దీ సమయం పడుతుండటంతో రైతులు వెంటనే అమ్ముకోవచ్చనే భావనతో మార్కెట్కు తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో సన్న రకం క్వింటాకు గరిష్టంగా రూ.2,327, కనిష్టంగా రూ.1,700, దొడ్డు రకం క్వింటాకు గరిష్టంగా రూ.2,002, కనిష్టంగా రూ.1,650 ధర పలుకుతోంది. మార్కెట్ యార్డుకు రెండు రోజులు సెలవు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు రెండు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం 32,018 బస్తాలు వచ్చాయని, కాంటాలు, ఎగుమతులు ఆలస్యం కావడంతో శనివారం సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఆదివారం వారాంతపు సంత సెలవు ఉన్నందున వ్యవసాయ మార్కెట్ యార్డు తిరిగి సోమవారం తెరవనున్నట్లు తెలిపారు. ఫ తిరుమలగిరి మార్కెట్కు ఇప్పటివరకు 1.35లక్షల క్వింటాళ్ల ధాన్యం రాక ఫ ప్రతిరోజు 20 వేల నుంచి 40 వేలకు పైగా వస్తున్న ధాన్యం బస్తాలు స్థలం కొరతతో ఇబ్బందులు.. తిరుమలగిరి మార్కెట్ యార్డు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 20 వేల నుంచి 25 వేల బస్తాల వరకు క్రయవిక్రయాలు జరగడానికి అనుకూలంగా ఉంటుంది. గత సంవత్సరం మార్కెట్ యార్డు స్థలంలోనే ఇంటిగ్రేటెడ్, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ మార్కెట్ యార్డులో నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఇప్పటికే ఉన్న కొద్ది స్థలంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్కు స్థలం కేటాయించడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ స్థలంలో 5 వేల నుంచి 10 వేల బస్తాల ధాన్యం పోసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. 20వేల నుంచి 40 వేల బస్తాలు మార్కెట్కు వచ్చిన సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంల తరలింపు
తుంగతుర్తి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు జిల్లా కేంద్రం నుంచి తుంగతుర్తి మండల కేంద్రానికి వచ్చాయి. వాటిని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ జీఎస్ లత, ఎన్నికల అధికారులు శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జీఎస్ లత మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గానికి 407 కంట్రోల్ యూనిట్లు, 407 బ్యాలెట్లు యూనిట్లు, 456 వీవీప్యాట్లు వచ్చాయని తెలిపారు. వాటిని వివిధ పార్టీల నాయకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమణారెడ్డి, సీఐ శ్రీను, ఎస్ఐ ఏడుకొండలు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో దొంగలు?
సాక్షి యాదాద్రి : జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారని సమాచారం. రెండు నెలలుగా యాదాద్రిభువనగరి జిల్లాలో 15కు పైగా చైన్స్నాచింగ్లు జరిగాయి. దీంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుకోవడానికి పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు. వలిగొండ మండలం సంగెంకు చెందిన ఇద్దరు యువకులు ఈ వరుస దొంగతనాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన వీరు బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. డీసీసీ రాజేష్ చంద్ర ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. -
ఖైదీలు సత్ప్రవర్తనతో జీవించాలి
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ చివ్వెంల(సూర్యాపేట): ఖైదీలు నేర ప్రవృత్తిని వీడి, సత్ప్రవర్తనతో జీవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నచిన్న ఘర్షణలతో జైలు జీవితం గడిపేవారు.. దీనిని ఒక గుణపాఠంగా భావించి బయటకు వెళ్లాక సమాజంలో మంచి వ్యక్తులుగా జీవించాలని సూచించారు. యువత చేడు వ్యవసనాలకు బానిస కావద్దన్నారు. అనంతరం జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడి వసతులు, బెయిల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడ్వకేట్ను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేని వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించాలని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు వసంత సత్యనారాయణ పిళ్లే యాదవ్, బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, జైలు సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల వ్యయ పరిశీలకుడికి కలెక్టర్ స్వాగతం
నల్లగొండ: లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నల్లగొండ జిల్లాకు నియమితులైన కళ్యాణ్కుమార్దాస్ శుక్రవారం నల్లగొండలోని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వారు లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, వివిధ రకాల ఫారాలు, డిపాజిట్ తదితర అంశాలపై చర్చించారు. వారివెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలి
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని రాజీవ్ ప్రాంగణంలో ఈనెల 21న నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుజూర్నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సభకు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హాజరవుతారని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సభ సవ్యంగా జరిగేలా చూడాలని స్థానిక నేతలకు సూచించారు. నల్లగొండ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు ఆదర్శ వివాహం చేసుకున్న హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఎడ్ల విజయ్–శిరీష దంపతులను మంత్రి ఆశీర్వదించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తన్నీరు మల్లికార్జునరావు, దొంగరి వెంకటేశ్వర్లు, గెల్లి రవి, సుంకరి శివరాం యాదవ్, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, మంజూనాయక్, మజీద్ పాల్గొన్నారు. ఫ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి -
పనులు వేగవంతం చేయాలి
దురాజ్పల్లి (సూర్యాపేట): జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం సూచించారు. శుక్రవారం భద్రాచలం పర్యటన తిరుగు ప్రయాణంలో భాగంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ వెంకటరావుతో కలసి అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విద్యాశాఖ ద్వారా జరిగే అమ్మ ఆదర్శ పాఠశాల పనులకు మినహాయింపు ఇచ్చిందన్నారు. జిల్లాలో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన 536 పాఠశాలల్లోని 59 పాఠశాలల్లో పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన 337 పాఠశాలల్లో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వివరించారు. మద్దతు ధర వచ్చేలా చూడాలితిరుమలగిరి (తుంగతుర్తి): వ్యవసాయ మార్కెట్కు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులకు మద్దతు ధర వచ్చేలా చూడాలని కలెక్టర్ వెంకటరావు కోరారు. శుక్రవారం తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డును ఆయన తనిఖీ చేశారు. రైతులకు తాగు నీటి సౌకర్యం కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర శర్మ, మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, కమీషన్ దారులు, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా నెల్లిబండ తండాలోని అమ్మ ఆదర్శ పాఠశాలను, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి అర్వపల్లి: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. అర్వపల్లిలోని సెర్ఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. అదేవిధంగా సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఏఓ శ్రీధర్రెడ్డి, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీఓ సందీప్కుమార్, ఏఓ శశిధర్రెడ్డి, పీఆర్ ఏఈ అశోక్, ఏపీఎం మల్లేష్, ఏఈఓ శోభారాణి, హెచ్ఎం అనంద పాల్గొన్నారు. లోపాలు సవరించాలి సూర్యాపేట: జాతీయ రహదారులపై ఇంజనీరింగ్ లోపాలు సవరించాలని, సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన జాతీయ రహదారుల భద్రత సంస్థ, జీఎంఆర్ సంస్థ, ఎన్హెచ్ 65 పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్– విజయవాడ రహదారి నిత్యం రద్దీగా ఉంటుందని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ఈ మార్గంలో లోపాలను గుర్తించామన్నారు. గ్రామాల నుంచి వచ్చే లింక్ రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. అధికారులు సమన్వయంతో లోపాలను సవరించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ట్రైనీ ఐపీఎస్ రాజేష్ మీనా, ఎన్హెచ్ 65 టెక్నికల్ మేనేజర్ రాదేశ్యామ్ షైనీ, ఎన్హెచ్ఏఐ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, జీఎంఆర్ అధికారులు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. యాదారద్రిలో లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలు కొనసాగాయి. -
మోత్కుపల్లి నిరసన గళం
సాక్షి, యాదాద్రి : మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సొంత పార్టీపై నిరసన గళం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమ జాతికి జరిగిన అన్యాయాన్ని ఆయన మీడియా, సోషల్మీడియా వేదికల ద్వారా అధిష్టానం దృష్టికితీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మాదిగ సామాజికవర్గానికి టికెట్ లభించలేదని అంటున్నారు. తాను పార్టీలోనే ఉంటూ తమ జాతికి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేస్తానంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన మోత్కుపల్లి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నది వేచిచూడాలి. రేవంత్ పునరాలోచించాలి రాష్ట్రంలో కాంగ్రెస్ అధిష్టానంగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి మాదిగలకు టికెట్లు ఇచ్చే విషయంలో పునరాలోచించాలని మోత్కుపల్లి కోరుతున్నారు. ప్రధానంగా కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని మోత్కుపల్లి తప్పుపడుతున్నారు. తమ జాతికి టికెట్ల కోసం కాంగ్రెస్లో ఉంటూ ప్రయత్నిస్తానంటున్నారు. సామాజిక న్యాయం పాటించడంలో ముందుండే కాంగ్రెస్ పార్టీ.. నామినేషన్లు పూర్తయ్యేలోపు మాదిగలకు టికెట్లు ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నానని మోత్కుపల్లి ‘సాక్షి’తో చెప్పారు. ఉమ్మడి జిల్లాలో మోత్కుపల్లి ప్రభావం మాదిగ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతగా మోత్కుపల్లి నర్సింహులు ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు మెజార్టీగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ మాదిగలకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిందన్న ప్రచారం ఆ వర్గం నుంచి ఇప్పటికే జోరందుకుంది. అగ్గికి వాయువు తోడైనట్లు మాదిగ సామాజికవర్గ నేతలకు మోత్కుపల్లి అండ లభిస్తోంది. దీంతో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ సీట్ల పరిధిలో జరిగే నష్టం ఎంత అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఫ మాదిగలకు ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్తో అంతర్గత పోరు ఫ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలని డిమాండ్ ఫ పార్టీ మారేది లేదంటూనే.. అసమ్మతి రాగం ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభావం చూపనున్న మోత్కుపల్లి నర్సింహులు -
బీఆర్ఎస్ జెండా పట్టే నాయకుడే ఉండడు
మునుగోడు: రానున్న రోజుల్లో గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా పట్టే నాయకుడే ఉండడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మండలంలోని సింగారం, చొల్లేడు, మునుగోడు మాజీ సర్పంచ్లు గుర్రాల పరమేష్, జనిగల మహేశ్వరి, మిర్యాల వెంకన్నలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం రాజగోపాల్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలతో పాటుఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు బయటపడుతుండడంతో ఆ పార్టీలో కొనసాగేందుకు నాయకులు ఇష్టపడడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువులు తప్ప ఆ పార్టీలోని ఇతర నాయకులంతా ఎప్పుడు కాంగ్రెస్లో చేరుదామని ఎదురుచూస్తున్నారన్నారు. త్వరలో మునుగోడు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా చేరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
సీపీఎం అభ్యర్థి ఆస్తులు స్వల్పమే
సాక్షి, యాదాద్రి: భువనగిరి లోక్సభ నియోజకవర్గం సీపీఎం తరఫున పోటీ చేస్తున్న ఎం.డి.జహంగీర్ శుక్రవారం నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలతో పాటు రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. జహంగీర్ భార్యపేర నగదు చేతిలో : రూ.35,000 రూ. 5,000 బ్యాంకు అకౌట్లో : రూ.2,03,067 రూ. 2,500 మోటర్బైక్ విలువ : రూ. 55,000 రూ. 55,000 బంగారు అభరణలు విలువ రూ.7,00,000 స్వాగ్రామంలో వ్యవసాయ భూమి 11 గుంటలు. దాని విలువ రూ.6,00,000 మునిపంపులలో సొంత ఇల్లు విలువ : రూ.25,00,000 -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
నల్లగొండ క్రైం : తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.16లక్షల 24వేల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్రాజు విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విజయవాడలోని బొంబాయి కాలనీ, సీబ్లాక్ ఎఫ్ఎఫ్6లో నివాసం ఉండే దేవరకొండ రాంబాబు పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. రాంబాబు జలస్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఒంటరిగానే చోరీలకు పాల్పడడం ప్రారంభించారు. విజయవాడలో పలు చోరీ కేసుల్లో, గుంటూరులో పలు చోరీలో పట్టుబడి గుంటూరు జైలులో ఏడాది పాటు శిక్ష అనుభవించి 2024 జనవరిలో జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా అతడు తీరు మార్చుకోకపోగా మళ్లీ చోరీలకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఈనెల 10న మిర్యాలగూడ వన్టౌన్ పరిధిలో మౌర చంద్రశేఖర్ తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. గమనించిన రాంబాబు రాత్రి సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.50వేలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలిస్తుండగా మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రాంబాబు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని పట్టుకుని విచారించగా దొంగతనాలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఈ ఏడాది జనవరి 30న మిర్యాలగూడలోని కృష్ణాకాలనీలో, ఫిబ్రవరి 9న కృష్ణా జిల్లా గుడివాడలోని సత్యనారాయణపురం సాయిరాం అపార్ట్మెంట్లో, ఫిబ్రవరి18న ఏపీలోని బాపులపాడు, ఫిబ్రవరి 26న మిర్యాలగూడ రూరల్ పరిధిలోని తుంగపాడ్లో, మార్చి 26న మహబూబ్నగర్లోని కల్వకుర్తిలో, మార్చి 29న మిర్యాలగూడలోని తాళ్లగడ్డలో, ఈనెల 10న మిర్యాలగూడలో హౌజింగ్ బోర్డు కాలనీలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు ఒప్పుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సీ ఐ సుధాకర్, ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, శ్రీను, నాగరాజు, ఐటీకోర్ మధు, ఫింగర్ ప్రింట్ ఏఎస్ఐ శివను డీఎస్పీ అభినందించారు. దొంగతనాల నివారణపై పటిష్ట నిఘా.. జిల్లాలో దొంగతనాలు నివారించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరింత నిఘా పెట్టినట్లు ఎస్పీ చందనా దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు దొంగతనాల పట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలు, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. జైళ్ల నుంచి విడుదలైన వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఫ రూ.16లక్షల 24వేల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం -
కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
సూర్యాపేట : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హ్యాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి సూర్యాపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థ్ధాయి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవదన్నారు. పార్టీ మనుగడ కష్టమని, ఈ పరిస్ధితుల్లో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారని ఉత్తమ్ చెప్పారు. బీఆర్ఎస్కు ఎంపీ ఎన్నికల్లో 15 చోట్ల డిపాజిట్ గల్లంతు అవుతుందన్నారు. మతపరంగా విభజించి రాజకీయంగా బలపడడం బీజేపీ మూల సిద్ధాంతమని విమర్శించారు. 10 ఏళ్లు తెలంగాణను బీఆర్ఎస్ మోసం చేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కనీస న్యాయం జరగలేదన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్ధానాలు గెలిచి రాహుల్గాంధీ ప్రధాని అవుతారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు 15 ఎంపీ స్థానాలు దక్కుతాయని, నల్లగొండ అభ్యర్థి రఘువీర్రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గం కలిసికట్టుగా ముందుకు పోతోందని అన్నారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 8ఏళ్ల క్రితమే హెచ్చరించానని చెప్పారు. సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పడం అభినందనీయమన్నారు. ఇక్కడ గతంలో మంత్రిగా పనిచేసిన జగదీష్రెడ్డికి కనీస అవగాహన లేదన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మాట్లాడుతూ పేటలో కాంగ్రెస్ బలంగా ఉందని, అనుబంధ సంఘాలు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. కాగా.. పలువురు బీఆర్ఎస్ నేతలు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సమావేశంలో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కె.రఘువీర్రెడ్డి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, సూర్యాపేట, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, శంకర్నాయక్, ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, తండు శ్రీనివాస్యాదవ్, చకిలం రాజేశ్వర్రావు, కొప్పుల వేణారెడ్డి, పెద్దిరెడ్డి రాజా, కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ్లెక్సీ వివాదం.. కాసేపు గందరగోళం సూర్యాపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఫ్లెక్సీ వివాదం కారణంగా కాసేపు గందరగోళం నెలకొంది. ఈ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్రెడ్డి ఫొటోను ప్రచురించలేదు. దీంతో సమావేశం ప్రారంభం కాగానే ఆయన వర్గీయులు ఈ అంశాన్ని లేవనెత్తి నినాదాలు చేశారు. దీంతో పోటీగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి వర్గీయులు నినాదాలు చేయడంతో పటేల్ వర్గీయులు సమావేశానికి అడ్డుపడ్డారు. డీసీసీ అధ్యక్షుడితో పాటు రమేష్రెడ్డి, దామోదర్రెడ్డిలు తమ వర్గీయులను సముదాయించినా ఎవరూ వినలేదు. నినాదాలతో హోరెత్తించారు. సీనియర్ నాయకుడు జానారెడ్డి కల్పించుకుని.. ఈ సమావేశంలో ఎవరూ గొడవ చేయొద్దని, ఇష్టం లేనివారు వెళ్లిపోవచ్చంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం సద్దుమణిగింది. -
ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభం
యాదగిరిగుట్ట : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపు కోరుతూ ఆలేరు నియోజకవర్గంలో తిరిగే ఎన్నికల ప్రచార రథాలకు శుక్రవారం యాదాద్రీశుడి వైకుంఠద్వారం వద్ద మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీ తామహేందర్రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, పట్టణ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, కౌన్సిలర్ బూడిద సురేందర్, నాయకులు ఆరె యాదగిరిగౌడ్, మిట్ట వెంకటయ్యగౌడ్, సాయియాదవ్, భాస్కర్గౌడ్, ముక్కెర్ల సతీష్, యాకూబ్, కల్వకొలను సతీష్రాజ్, బండి వాసు, అంకం నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీ భువనగిరి అభ్యర్థిపై భూ కబ్జా కేసు
ఇబ్రహీంపట్నం రూరల్: కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పేర్వాల గ్రామానికి చెందిన కంచర్ల రాధిక, ఆమె భర్త యాదగిరిరెడ్డి తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ సర్వే నంబర్ 500, 501లోని ప్లాట్ నంబర్ 65లో 200 గజాల స్థలాన్ని 2015లో కొనుగోలు చేశారు. అప్పట్లోనే స్థలం హద్దుల మేరకు కడీలు పాతి వదిలేశారు. అయితే, ఫిబ్రవరి 17న చామల కిరణ్కుమార్రెడ్డి, చామర్తి మారుతి రవిశంకర్ అనే ఇద్దరు వ్యక్తులు.. రాధిక దంపతుల ప్లాట్తోపాటు దక్షిణం వైపున్న రోడ్డును ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మించారు. తమకు రాజకీయ అండదండలు ఉన్నాయని, మమ్మల్ని ఏమీ చేయలేరని బెదిరించారు. దీంతో సదరు మహిళ ఇబ్రహీంపట్నం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈ నెల 13న చామల కిరణ్కుమార్రెడ్డి, చామర్తి మారుతి రవిశంకర్పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని బుధవారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం పూర్తిగావించి శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అందంగా ముస్తాబుచేసి ఎదుర్కోళ్ల మహోత్స సంవాదం రక్తిగట్టించారు. అదేవిధంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం , పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రవేశం గావించి నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదనచేశారు. -
నేడు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమావేశం
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా శాఖ కార్యవర్గ సమావేశాన్ని కోదాడ పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో గురువారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సుదర్శన్రెడ్డి, కోశాధికారి ఎస్.ఏ.హమీద్ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డికి ఆత్మీయ సన్మానం ఉంటుందని తెలిపారు. సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సీతారామయ్య హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆబిద్ దురాజ్పల్లి (సూర్యాపేట) : భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సూర్యాపేట పట్టణానికి చెందిన ఎం.డి. ఆబిద్ నియమితులయ్యారు. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అఫ్సర్ పాష ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. బుధవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఆబిద్కు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు నియామకపత్రం అందించారు. అనంతరం ఆబిద్ మాట్లాడుతూ నియామకానికి సహకరించిన వెంకటేశ్వర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, చలమళ్ల నర్సింహ, మల్సూర్ పాల్గొన్నారు. బెల్ట్ షాపులను మూసి వేయాలి దురాజ్పల్లి (సూర్యాపేట) : రాష్ట్రంలో బెల్ట్ షాపులను మూసివేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. శిరోమణి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని విక్రమ్ భవన్లో సంఘం జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బెల్ట్ షాపులను మూసివేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి రద్దు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, ఉపాధ్యక్షురాలు రేణుక, కోశాధికారి మోటకట్ల జయమ్మ, దొంతమల్ల విజయ తదితరులు పాల్గొన్నారు. -
10లక్షల టన్నుల సీఎంఆర్ ధాన్యం మాయం!
పెండింగ్ సీఎంఆర్ మిల్లుల్లో తనిఖీలు ఫ కలెక్టర్ వెంకటరావు దురాజ్పల్లి (సూర్యాపేట) : జిల్లాలో సీఎంఆర్ అందించని కొన్ని మిల్లుల్లో తనిఖీలు నిర్వహించినట్లు కలెక్టర్ ఎస్. వెంకటరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ కమిటీలు ఈనెల 16న పెండింగ్ సీఎంఆర్ ఉన్న మిల్లుల్లో తనిఖీలు చేసి, నిల్వల్లో పెద్దమొత్తంలో తేడాలను గమనించి, పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించామని వివరించారు. తిరుమలగిరి, కోదాడలోని మిల్లులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మిల్లుల యాజమాన్యాలపై ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి మిల్లు నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు పేర్కొన్నారు. ఇంకా కొన్ని మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తామని, పెండింగ్ సీఎంఆర్ అందించకపోతే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ విజిలెన్స్, టాస్క్ఫోర్స్ తనిఖీల్లో గుర్తింపు ఫ మిల్లు లేకున్నా ధాన్యం కేటాయించిన వైనం ఫ ప్రభుత్వానికి నివేదిక అందించిన అధికారులుసూర్యాపేట : సీఎంఆర్ ధాన్యం విషయంలో తవ్వినకొద్దీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకు న్నట్లు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల అండతో మిల్లర్లు అవినీతికి పాల్పడినట్లు తెసుస్తోంది. సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు చివరికి మిల్లు లేకపోయినా ధాన్యం కేటాయించడం గమనార్హం. ఇలా కేటాయింపులు జరిపిన మిల్లులకు సంబంధించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి తలాకొంత బుక్కేసినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా మంగళవారం పలు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించగా రూ.220కోట్ల విలువైన 10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం అయినట్లు తేలినట్లు తెలిసింది. రూ.220కోట్ల ధాన్యం.. జిల్లాలోని తిరుమలగిరి, నాగారం, కోదాడ, చివ్వెంలలోని మిల్లుల్లో టాస్క్ఫోర్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యం ప్రస్తుతం మిల్లుల్లో ఉన్న నిల్వల్లో తేడాలను గుర్తించారు. ఆయా మిల్లుల్లో ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.220కోట్లు విలువ చేసే 10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించినట్లు తెలిసింది. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని మిల్లుల్లో దాదాపు రూ.500కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారుల అంచనావేస్తున్నట్లు సమాచారం. ఎంతకూ ఇవ్వకపోవడంతో.. తిరుమలగిరిలో సంతోషిమాత, రఘురామ, బాలాజీ రైస్ మిల్, శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లతో పాటు ఫణిగిరి వద్ద సంతోషి రైస్ మిల్, హర్షిత రైస్ మిల్ ఉన్నట్లు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య అధికారులతో అగ్రిమెంట్ చేసుకొని ధాన్యం కేటాయింపులు చేయించుకున్నట్లు తెలిసింది. 2022 – 23 యాసంగి, 2023– 24 వానాకాలం సీజన్లలో ఈ మిల్లులకు ధాన్యాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించగా సకాలంలో సీఎంఆర్ అందించలేదు. పలుమార్లు గడువు పెంచినా అప్పటి బీఆర్ఎస్కు చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండతో లేని ధాన్యం ఉన్నట్లు అధికారులను పక్కదోవ పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఎంతకూ కస్టమ్ మిల్లింగ్ రైస్ రాకపోవడంతో అధికారులు మిల్లును తనిఖీ చేశారు. వీటిలో ఫణిగిరి వద్ద సంతోషి రైస్ మిల్, హర్షిత రైస్ మిల్ లేకుండా కూడా ధాన్యం కేటాయింపులు చేసినట్లు ఈ తనిఖీల్లో తేల్చినట్లు తెలిసింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఫిట్నెస్ విత్ బ్యూటీ : సమంతా లేటెస్ట్ ఫోటో వైరల్
పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర జంట (ఫోటోలు)
‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
సక్సెస్ ఊరికే రాదు : వేలకోట్లతో నెక్ట్స్ లెవల్ అంతే! ఎవరీ బిలియనీర్ మహిళ
తెలంగాణలో మరో రెండు రోజులు వానలే
800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
కిర్గిస్తాన్కు మన వాళ్లు ఎందుకు వెళ్తారంటే?
నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉంది: సుకుమార్
అదరగొడుతున్న హారర్ మూవీ.. ఏకంగా వంద కోట్లు..
పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన
తప్పక చదవండి
- Team India Head Coach: బీసీసీఐ ఆఫర్ నిజమే.. కానీ!
- టాప్ 5 దేశాలను వెనక్కి నెట్టిన భారత్!
- మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
- రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
- అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
- Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
- ప్రపంచంలోనే 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాలో రెండు భారతీయ రెస్టారెంట్లకు చోటు!
- Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు
- ఢిల్లీలో ఢిపరెంట్ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement