-
ఇదేంది బాబూ..!
- ప్రతిపక్ష నేత జిల్లాపై చంద్రబాబు వివక్ష - జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీలకు నిధుల కోత - సాగునీటి ప్రాజెక్టులకు అంతంతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ జిల్లా అంటేనే ఎందుకో గిట్టనట్లుంది. సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయలేదనే ఏకైక కారణంతో జిల్లాపై వివక్ష చూపుతున్నారు. వైఎస్ హయాంలో ఇబ్బడిముబ్బడిగా నిధులు విడుదల చేసి జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయకుండా జిల్లాను తిరోగమనంలోకి నెడుతున్నారు. సాక్షి,కడప : రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపక్ష నేతల నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు విషయంలో వివక్ష చూపుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాలకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ వచ్చారు. అయితే, సీఎం చంద్రబాబు త మ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చిన నియోజకవర్గాలను ఒక విధంగా, ప్రతికూల ఫలితాలు వచ్చిన సెగ్మెంట్లను మరో రకంగా చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. అనంతపురం, కాకినాడ జేఎన్టీయూ కళాశాలలకు భారీగా బడ్జెట్లో నిధులు కేటాయించడాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతోపాటు మాజీ సీఎం కిరణ్ సొంత నియోజకవర్గమైన పీలేరుకు కూడా బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీలకు నిధుల కోత గ్రామీణ పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చి వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని భావించిన దివంగత సీఎం వైఎస్సార్ పులివెందులలో జేఎన్టీయూను నెలకొల్పగా, 2012లో మాజీ సీఎం కిరణ్ పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జేఎన్టీయూను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఇతర జేఎన్టీయూలకు ఇబ్బడి ముబ్బడిగా కావాల్సిన నిధులు కేటాయించిన కొత్త సర్కార్.. కొత్తగా ఏర్పాటైన కలికిరిలోని జేఎన్టీయూ కళాశాలకు రూ. 212 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపితే, కేవలం రూ. 12 కోట్లు మాత్రమే మొక్కుబడిగా కేటాయించి చేతులు దులుపుకుంది. అలాగే అనంతపురం జేఎన్టీయూకు రూ. 24 కోట్లతో బ్లాక్ గ్రాంటుతోపాటు అదనంగా రూ. 5.71 కోట్లు కేటాయించారు. అదే పులివెందుల జేన్టీయూకు బ్లాక్ గ్రాంట్ కింద వచ్చే రూ. 24 కోట్లలోనే కోత విధించారు. దాదాపు రూ. 22 లక్షలను కోత పెట్టడంతో పాటు కొత్త నిధులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ బ్లాక్ గ్రాంటుతో కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది జీతభత్యాలతోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రతియేటా ఈ గ్రాంటు కింద నిధులను విడుదల చేస్తుంది. ఇక వేంపల్లె సమీపంలోని ఇడుపులపాయలో నెలకొల్పిన ట్రిపుల్ ఐటీకి కూడా పెద్దగా ప్రాధాన్యత కల్పించలేదు. కొత్తగా నిధులేమీ విడుదల చేయలేదు. యోగి వేమన యూనివర్సిటీకి బడ్జెట్ విడుదల కాక.. అభివృద్ధి లేక యూనివర్సిటీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రిమ్స్కు కూడా బడ్జెట్లో ఒరిగిందేమీ లేదు. కనీసం ఎయిమ్స్ స్థాయికి విస్తరిస్తారని ఆశించినా దాని ఊసే లేదు. పరిశ్రమల స్థాపనకు ఏదీ బడ్జెట్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ జిల్లాలో పరిశ్రమలకు చంద్రబాబు సర్కార్ పెద్దగా బడ్జెట్ కేటాయించ లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనలో భాగంగా ప్రకటించిన ఒక్క సెయిల్ మినహా ఎలాంటి పరిశ్రమలకు నిధుల కేటాయింపులు లేవు. పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన వైఎస్సార్ జిల్లాలో అగ్రిజోన్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఎలాంటి నిధులు కేటాయింలేదు. ఆస్బెస్టాస్, ముగ్గురాయి, నాపరాయి లాంటి ఖనిజ సంపద కలిగిన జిల్లాలో కనీసం ఆ స్థాయి పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహం చూపకపోవడంతో పారిశ్రామికవేత్తల్లో నిరుత్సాహం నెలకొంది. ఐజీ కార్ల్లో పరిశోధనలు కరువు 650 ఎకరాల్లో రూ. 385 కోట్లతో చేపట్టిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు కరువయ్యాయి. వైఎస్ హయాంలో వంద కోట్ల బడ్జెట్ను కేటాయించేవారు. ప్రస్తుత టీడీపీ సర్కార్ కేవలం రూ. 15.18 కోట్లను విడుదల చేయనుంది. అయితే రూ. 15 కోట్లతో టీకాల ఉత్పత్తి, గడ్డి పెంపకం, లేగదూడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎంతోమంది ఉన్నత స్థాయి అధికారులు వచ్చి అది చేస్తాం..ఇది చేస్తామని చెప్పారేగానీ ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికీ పాడుబడ్డ భవనాలు, దుమ్ము ధూళితో నిండి లోపల అధ్వానంగానే ఐజీ కార్ల్ దర్శనమిస్తోంది. రూ.15 కోట్లతో అధికారులు ఎలాంటి పరిశోధనలు చేస్తారో వేచి చూడాల్సిందే. సాగునీటి ప్రాజెక్టులకు అంతంత మాత్రమే పులివెందుల నియోజకవర్గంతోపాటు జిల్లాలోని ప్రాజెక్టులకు కూడా బడ్జెట్లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వైఎస్సార్ హయాంలో జిల్లా అభివృద్ధికి నిధుల వర్షం కురిస్తే..నేడు అంతంత మాత్రంగానే టీడీపీ సర్కార్ బాబు మార్క్ బడ్జెట్ను చూపుతోంది. తెలుగుగంగ ప్రాజెక్టుకు 2012-13లో రూ. 160 కోట్లు, 2013-14లో రూ. 195 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు మాత్రం రూ. 89 కోట్లతో మాత్రమే సరిపెట్టారు. అలాగే జీఎన్ఎస్ఎస్కు సంబంధించి 2012-13లో రూ. 419.86 కోట్లు, 2013-14లో రూ. 380 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయిస్తే ప్రస్తుతం రూ. 55.14 కోట్లు ఆధునికీకరణకు కేటాయించారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)కి సంబంధించి 2012-13లో రూ. 279.39 కోట్లు, 2013-14లో రూ. 90 కోట్లు వైఎస్సార్ అందించగా, టీడీపీ సర్కార్ ప్రస్తుతం రూ. 27.81 కోట్లను మాత్రమే కేటాయించింది. అలాగే మైలవరానికి రూ. 8.16 కోట్లు, కేసీ కెనాల్కు రూ. 8.40 కోట్లు అంతంతమాత్రంగానే అందించారు. హంద్రీ-నీవాకు గతంలో వందల కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించి సాగునీటి రంగానికి కావాల్సిన పూర్తి స్థాయి బడ్జెట్ను అందించలేదు. -
వేలం నోటీసులపై ఆందోళన
గుంటూరు: రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రకరకాల సాకులతో కాలయాపన చేస్తుండటంతో బ్యాంకర్లు తమ పని తాము చేసుకుపోతున్నారు. రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామని నోటీసులు జారీ చేస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. రుణమాఫీ అవటంతో రైతులు పండుగ చేసుకుంటున్నారని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ మంత్రులు ఇప్పుడేం సమాధానం చెబుతారని అన్నివర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం కారణంగా గత నెల 26న నోటీసులందుకున్న పెదనందిపాడు మండలం వరగాని గ్రామస్తులు సోమవారం ఎస్బీఐ శాఖ ముందు ధర్నాకు దిగారు. ఇక సోమవారం నోటీసులందుకున్న మంగళగిరి మండలం నిడమర్రు రైతులు తీవ్ర కలవరానికి గురయ్యూరు. పెదనందిపాడు బంగారంపై తీసుకున్న పంట రుణాలను కూడా మాఫీ చేస్తామని టీడీపీ ప్రభుత్వం ఓవైపు ప్రకటనలు చేస్తున్నా.. సొమ్ము కట్టాల్సిందేనని బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేరే దారిలేక రోడ్డెక్కుతున్నారు. తాజాగా సోమవారం వరగాని గ్రామంలోని స్టేట్బ్యాంక్ శాఖ ముందు పలువురు మహిళలు, రైతులు ధర్నాకు దిగారు. నోటీసులు ఇవ్వటంపై బ్యాంక్ మేనేజర్ను నిలదీశారు. వివరాలు.. బంగారంపై రుణం తీసుకున్న 44 మంది వరగాని గ్రామస్తులకు గత నెల 26న ఎస్బీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆగస్ట్ 2వ తేదీలోగా రుణాలు చెల్లించకపోతే 11వ తేదీన బంగారాన్ని వేలం వేస్తామని అందులో పేర్కొన్నారు. దీంతో ఆందోళన చెందిన లబ్ధిదారులు సోమవారం బ్యాంకు శాఖ ముందు ధర్నా చేశారు. మేనేజర్ వి.కృష్ణమూర్తి చాంబర్లోకి వెళ్లి ఆయన్ను నిలదీశారు. బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే ఇలా నోటీసులు జారీ చేయటమేమిటని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, బ్యాంకు నిబంధనల ప్రకారం రుణం తీసుకుని మూడేళ్లు గడిచినవారికి నోటీసులు ఇచ్చామని మేనేజర్ చెప్పారు. రుణం చెల్లించకపోతే బంగారం వేలం వేయకతప్పదని స్పష్టం చేశారు. ఏడాది దాటాక రుణం చెల్లిస్తే నాలుగు శాతానికి బదులు 12 శాతం వడ్డీ కట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ధర్నాలో పి.వెంకటప్పయ్య, యర్రం రామ్మోహనరావు, జి.నాని, కొల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికిప్పుడు ఎలా కట్టేది..?.. ఈ సందర్భంగా వరగాని రైతు గల్లా సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ బంగారంపై తాను రూ.17 వేలు తీసుకోగా వడ్డీతో కలిపి రూ.22,600 అరుుందని.. ఇప్పటికిప్పుడు కట్టమంటే ఎక్కడ నుంచి తేవాలని వాపోయూరు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఎదురుచూస్తుంటే ఈ సమస్య వచ్చిపడిందన్నారు. 11న వేలం జరిగితే బంగారం దక్కదేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement