-
ఎన్నికల వింత హామీ.. రేషన్ కార్డుపై విదేశీ మద్యం!
రాబోయే లోక్సభ ఎన్నికలు హోరాహోరీ పోరును తలపిస్తున్నాయి. రాజకీయ నేతలు వీలైనన్ని వాగ్దానాలు చేస్తూ, హామీలనిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రపూర్లో ఎన్నికల వింత వాగ్దానాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చంద్రపూర్ లోక్సభ స్థానానికి ఆల్ ఇండియా హ్యుమానిటీ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగిన వనితా రౌత్ తనను ఎంపీని చేస్తే, రేషన్ కార్డులపై విదేశీ మద్యం అందజేస్తానని, నిరుద్యోగ యువతకు మద్యం కాంట్రాక్టులు కేటాయిస్తానని హామీనిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వనితా రౌత్ చేస్తున్న వాగ్దానాలను ఇంతకు ముందు ఏ అభ్యర్థి కూడా చేసివుండరు. తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే ప్రతి గ్రామంలో బార్లను తెరుస్తానని, తనకు వచ్చే ఎంపీ నిధులతో పేదలకు ఉచితంగా మద్యం అందిస్తానని కూడా ఆమె చెబుతున్నారు. దీనికి ముందు వనితా రౌత్ 2019లో నాగ్పూర్ లోక్సభ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే 2019లోనే చంద్రపూర్ జిల్లాలోని చిమూర్ అసెంబ్లీ నుంచి కూడా ఎన్నికల్లో పోటీకి చేశారు. ఆ సమయంలోనూ ఆమె ప్రజలకు ఇటువంటి హామీలనే ఇవ్వడం విశేషం. -
త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్తగా కార్డులివ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని యూనిక్ నంబర్తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో సబ్ నంబర్ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా అనేకమంది తెల్ల రేషన్కార్డును ఆధారం చేసుకొనే ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్టు దృష్టిసారించింది. ఈ మేరకు లబ్దిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్ద భారం కాదన్న భావనలో సర్కారు ఉంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న వారూ చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులతో అందరికీ సార్వజనీన ఆరోగ్య సేవలు అందించవచ్చని సర్కారు యోచిస్తోంది. వంద శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం రాష్ట్రంలో 293 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి అర్హులుగా 77.19 లక్షల మంది పేదలు ఉన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. వీటికి సుమారు మరో వంద శస్త్రచికిత్సలను చేర్చే అవకాశం ఉంది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల కవరేజీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద కవరేజీ రూ. 2 లక్షలు ఉండగా, ఆయుష్మాన్ భారత్ పథకం రావడంతో దాన్ని రూ. 5 లక్షలు చేశారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. దీనికి ప్యాకేజీ సొమ్ము కూడా పెంచితే ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈహెచ్ఎస్ పథకంపై తేలని నిర్ణయం ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇస్తామని పేర్కొన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందు రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశాయి. ఆసుపత్రుల్లో తమకు వైద్యం అందనందున ఈ ప్రక్రియకు ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. బ కాయిలు పేరుకుపోవడంతో పాటు ఆరో గ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నా యి. దీంతో ఆరోగ్యశ్రీ లబ్దిదారులు, ఈ హెచ్ఎస్ బాధితులు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు పెరగడంతో చాలామంది ప్రైవేట్ ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఉద్యోగులైతే రీయింబర్స్మెంట్ పద్ధతిలో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నా రు. అయితే బిల్లుల సొమ్ము మాత్రం పూ ర్తి స్థాయిలో రావడంలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పెద్దఎత్తున బిల్లులు పే రుకుపోవడం వల్లే తాము వైద్యం అందించలేకపోతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల లెక్క ప్రకా రం దాదాపు రూ.500 కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి తమకు రావాల్సిన బిల్లుల బకా యిలు పెండింగ్లో ఉన్నాయని అంటున్నాయి. మరోవైపు వివిధ వ్యాధులకు 2013లో నిర్ధారించిన ప్యాకేజీ ప్రకారమే ఆసుపత్రులకు సొమ్ము అందుతోంది. అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యాధులు, చికిత్సలకు ప్యాకేజీ సవరణ జరగలేదు. ఈ రెండు కారణాల వల్ల తాము ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాల కింద వైద్యం చేయలేకపోతున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
హామీ ప్రకారం గ్యారంటీల అమలు
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వ గృహజ్యోతి పథకం ఫేమస్ అని, కేసీఆర్ ప్రభుత్వ 24 గంటల కరెంట్ మొత్తం బోగస్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన నల్లగొండలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. ఇ చ్చిన హామీ ప్రకారం 90 రోజుల్లోపే నాలుగు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ధ్వజమెత్తారు. పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వని బీఆర్ఎస్.. నేతలు నేడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 25 వేల మంది నిరుద్యోగులకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చామని, డీఎస్సీ, గ్రూప్–1 నోటిఫికేషన్లు ఇచ్చామని వివరించారు. రాబోయే రెండేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్లగొండ జిల్లాకు తాగు, సాగు నీటి కష్టాలు లేకుండా చేస్తామన్నారు. 11 నుంచి ఇందిరమ్మ ఇళ్లు.. ఈనెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని.. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వమే మామిల్లగూడెంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. రూ. వేల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. బైక్ నడిపిన మంత్రి కోమటిరెడ్డి.. నల్లగొండలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్వయంగా బైక్ నడిపి హల్చల్ చేశారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డిని బైక్పై ఎక్కించుకుని పట్టణంలోని పలు వార్డుల్లో తిరిగారు. హైదర్ఖాన్గూడ అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ హరిచందనతో కలసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన తిప్పర్తి మండలం మర్రిగూడ, కనగల్ మండలాల్లోని పలువురు గృహజ్యోతి లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి బిల్లుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ బచ్చా.. ఆయనతో పోటీ ఏంటి! ‘కేటీఆర్ ఒక బచ్చా.. ఆయన తండ్రి చాటు కొడుకు. ఆయనతో నాకు, సీఎం రేవంత్కు పోటీ ఏంటి’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నల్లగొండ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా.. కేటీఆర్పై పోటీ చేస్తున్నారా? అని మీడియా అడగ్గా పైవిధంగా స్పందించారు. ‘కేటీఆర్.. కేసీఆర్ సీఎం అయి, టికెట్ ఇస్తే అమెరికా నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిండు. మా లెక్క కష్టపడి రాలేదు’అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా గెలిచి అక్కడ నుంచి ఎమ్మెల్యే, ఎంఎల్సీగా, ఎంపీగా అయి, ముఖ్యమంత్రి వరకు ఎదిగారన్నారు. తాను కూడా ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్లో కొట్లాడి ఎమ్మెల్యే అయ్యానని, తమది వ్యవసాయ కుటుంబమని.. కేటీఆర్ తండ్రి వ్యవసాయం చేయడం లేదని స్పష్టం చేశారు. అలాంటి బచ్చాతో మాకు పోటీయా? అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. పార్లమెంట్ టికెట్ల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని, నల్లగొండ, భువనగిరిలో తమ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థులే మోదీ కంటే అత్యధిక మెజారీ్టతో విజయం సాధిస్తారని అన్నారు. -
Hyderabad: ‘గ్యాస్’ బెనిఫిట్.. 10 లక్షల మందికే..
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ వంట గ్యాస్ స్కీంకు రేషన్కార్డు మెలిక పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత (రేషన్) కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మహానగర పరిధిలోని గృహోపయోగ వంటగ్యాస్ కనెక్షన్దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడడం, కొత్త రేషన్కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది. అది కాస్తా సబ్సిడీ వంట గ్యాస్ అర్హతకు సమస్యగా తయారైంది. 10 లక్షల కనెక్షన్లకే సబ్సిడీ వర్తింపు గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు 10 లక్షల గ్యాస్ కనెక్షన్లకే సబ్సిడీ వంట గ్యాస్ వర్తించనుంది. ప్రసుత్తం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అధికారికంగా గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు కలిగిన సుమారు 30 లక్షల కుటుంబాలకు మాత్రమే నగదుగా బదిలీ అవుతోంది. మరోవైపు ఉపాధి, ఇతరత్రా కోసం వలస వచి్చన కుటుంబాలతో మరో పది లక్షల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఇటీవల జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 19.01 లక్షల కుటుంబాలు సబ్సిడీ వంట గ్యాస్ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాగా, అందులో తెల్లరేషన్ కార్డులు కలిగిన గ్యాస్ కనెక్షన్ దారులు కేవలం 10 లక్షల వరకు మాత్రమే ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. ఉజ్వలకు వర్తింపు ? ప్రధాన మంత్రి ఉజ్వల కల్యాణ్ యోజన పథకం కింద గల కనెక్షన్లకు సబ్సిడీ వర్తింపుపై అయోమయం నెలకొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న కుటుంబాలకు సిలిండర్పై రూ.300ల సబ్సిడీ వర్తింపజేస్తోంది. మహానగరం మొత్తం మీద లక్ష వరకు కనెక్షన్లు ఉన్నట్లు ప్రధాన ఆయిల్ కంపెనీల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉజ్వల పథకం ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తిస్తోంది. కొత్త పథకం వర్తిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ రెండు విధాలుగా నగదు బదిలీ జమ అవుతుందా? లేక సబ్సిడీ సొమ్ము తగ్గుతుందా? అనేది స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం సబ్సిడీ ఇలా కేంద్ర ప్రభుత్వం గృహోపయోగ వంటగ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం రూ.40.17 పైసలు సబ్సిడీ అందిస్తోంది. గత రెండేళ్లుగా వంట గ్యాస్ ధరతో సంబంధం లేకుండా సబ్సిడీలో మాత్రం ఏలాంటి మార్పు లేకుండా వర్తింపజేస్తోంది. వాస్తవంగా వంట గ్యాస్ సిలిండర్పై వర్తింపజేసే సబ్సిడీ వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ చేసే డీబీటీఎల్ పథకం 2014 నవంబర్ 10న అమల్లో వచి్చంది. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం పూర్తి మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే అనంతరం వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ నగదు జమ జరిగేది. డీబీటీ పథకం అమలు తొలిరోజుల్లో సబ్సిడీ బాగానే వర్తించేంది. తాజాగా సిలిండర్ ధరతో నిమిత్తం లేకుండా సబ్సిడీ నగదు జమ రూ 40.71 పైసలకు పరిమితమైంది. -
‘గ్యారంటీ’గా ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ‘గ్యారంటీ’గా రావాలంటే.. రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో వాటి కోసం అర్హులైన లక్షలాది కుటుంబాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి రేషన్కార్డు నిబంధన లేదు. అయితే, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకానికి మాత్రం రేషన్కార్డు తప్పనిసరి చేశారు. ఇటీవల మరో రెండు గ్యారంటీలు..రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీల అమలుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ పథకాలకు కూడా రేషన్కార్డునే ప్రామాణికంగా తీసుకొంది. దీంతో రేషన్కార్డు లేని అర్హులైన లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్కార్డులు జారీ చేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రజాపాలనలో భాగంగా రేషన్కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరించారు. కానీ కొత్త కార్డుల విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను ప్రకటించడం కానీ, ఎప్పటి నుంచి కార్డులు జారీ చేస్తారన్న సమాచారం ఇవ్వడం కానీ చేయకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు ప్రక్రియలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు ఆధార్, రేషన్కార్డు నంబర్లు సిద్ధంగా ఉంచుకోవాలంటూ సందేశాలు పంపిస్తుండటంతో రేషన్ కార్డులు రానివారు ఆందోళనకు గురవుతున్నారు. 20 లక్షల దరఖాస్తులు.. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లోనే ఆరు గ్యారంటీలకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రతి గ్రామం, పట్టణం నుంచి వార్డుల వారీగా 1.28 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా రేషన్కార్డుల కోసం అర్హులైన కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. దీంతో రేషన్కార్డుల కోసం కూడా విడిగా దరఖాస్తులు స్వీకరించారు. అలా సుమారు 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అనధికారిక లెక్క. కాగా పౌరసరఫరాల శాఖ.. కొత్త రేషన్కార్డుల దరఖాస్తులు తమకు అందలేదని స్పష్టం చేస్తుండటంతో ప్రజాపాలనలో ప్రజలు రేషన్కార్డుల కోసం చేసిన దరఖాస్తుల పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రజాపాలనలో వచ్చిన 1.28 కోట్ల దరఖాస్తుల్లో కూడా రేషన్కార్డు జిరాక్స్ కాపీ లేకుండా అందజేసినవే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో కొత్త రేషన్కార్డులు ఇవ్వకుండా ఆరు గ్యారంటీలను అమలు చేయడం అంటే అర్హులకు అన్యాయం చేయడమే అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్కార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తెలుపు, గులాబీ కార్డులను జారీ చేసింది. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు రకాల కార్డులను రద్దు చేసి, ఆహార భద్రతా కార్డు పేరుతో కొత్త కార్డులు జారీ చేసింది. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 54.48 లక్షల కార్డులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. మొత్తం 90.14 లక్షల కార్డుల ద్వారా 2.83 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువున (బీపీఎల్) ఉన్నట్టు తెలుస్తోంది. కాగా కొత్తగా పెళ్లిళ్లయి కుటుంబాల నుంచి వేరుపడిన వాళ్లు, వివిధ కారణాల వల్ల కార్డులు పొందలేని వాళ్లు లక్షల సంఖ్యలో ఇప్పుడు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరు కాకుండా రేషన్కార్డుల్లో పుట్టిన పిల్లల పేర్లు చేర్చడానికి కూడా లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వెంటనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ, కార్డుల్లో అడిషన్స్ (చేర్పులు) చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. -
రేషన్కార్డే ప్రామాణికం! లేకపోతే నో
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలలో భాగంగా ఈ నెలలోనే అమలు చేయాలని భావిస్తున్న మరో రెండు గ్యారంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (గృహజ్యోతి) హామీల అమలు ప్రక్రియ ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు హామీలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికకు రేషన్కార్డు (ఆహార భద్రతా కార్డు)నే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు కూడా ప్రారంభించింది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు సంబంధించి విద్యుత్ శాఖ, రూ 500కు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ప్రక్రియపై పౌరసరఫరాల శాఖ విధి విధానాలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు అందినప్పటికీ, నేరుగా వినియోగదారుల నుంచి అర్హతకు సంబంధించిన పత్రాలు తీసుకోవాలని ఆయా శాఖలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను మంగళవారం నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. కోత తప్పదా? రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ (గృహ వినియోగ) గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 1.23 కోట్ల గృహావసర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రస్తుతం రేషన్కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద జారీ అయిన ఆహార భద్రతా కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రతా కార్డులు కలిపి 90,14,263 రేషన్కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం వీరందరికీ రెండు గ్యారంటీలను అమలు చేయాల్సి వస్తే ఎలాంటి అభ్యంతరాలు, నిబంధనలు లేకుండా అమలు చేయాలి. కానీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలనే అర్హులుగా పరిగణించాలని భావిస్తే మాత్రం గణనీయంగా కోత తప్పదని ఓ అధికారి తెలిపారు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారుడి ఆర్థిక, సామాజిక స్థితి గతులను కూడా పరిగణనలోకి తీసుకొని రెండు గ్యారంటీలను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే వచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే కార్యక్రమం ఓవైపు సాగుతుండగా, విద్యుత్ శాఖ, పౌరసరఫరాల శాఖ తరఫున మరోసారి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ సాగనున్నట్లు సమాచారం. బిల్లులు ఎవరు కడితే వారి పేరుపైనే.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని అమలు చేసేందుకు మంగళవారం నుంచే విద్యుత్ శాఖ రంగంలోకి దిగనుంది. ఈనెల కరెంటు బిల్లు లెక్కలు తీసుకునేందుకు వచ్చే వ్యక్తి బిల్లు కోసం వచ్చినప్పుడే మీటర్ నంబర్ యాక్టివేట్ అవుతుంది. ఆ బిల్లుకు సంబంధించి ఉన్న ఇంటి యజమాని ఆధార్, రేషన్కార్డు (ఆహారభద్రతా కార్డు), ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఎంట్రీ చేసే కార్యక్రమం కొనసాగనుంది. ఒకవేళ ఇంటి యజమాని కాకుండా అద్దెకు ఉన్న వ్యక్తులు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నట్టయితే, ఆ కిరాయిదారు పేరు మీద మీటర్ను యాక్టివేట్ చేస్తారు. రేషన్కార్డు లేని వారి నుంచి వివరాలు తీసుకోరు. ఈ వివరాలతో పాటు ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తుల్లోని వివరాలు కూడా పరిశీలించి ప్రభుత్వం అర్హులను ఎంపిక చేయనుంది. ఉచిత విద్యుత్ పథకానికి ఏటా రూ.4 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. ఏడాదికి ఆరు సిలిండర్లు! గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి.. సిలిండర్ బుక్ చేసినప్పుడు డెలివరీ కోసం వచ్చిన వ్యక్తి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కేవైసీ తరహాలో లబ్ధిదారుల వివరాలను సేకరించడంతో పాటు గ్యాస్ సిలిండర్, ఆధార్, రేషన్కార్డు నంబర్లను తీసుకుంటారు. వీటితో పాటు ఆర్థిక స్థోమతను అంచనా వేయడానికి కుటుంబ వివరాలను కూడా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇలావుండగా ఒక కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు రూ.500 చొప్పున సరఫరా చేయాలనే అంశంపై స్పష్టత రావలసి ఉంది. అయితే ఒక పేద కుటుంబానికి ఏడాదికి 6 సిలిండర్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. సంవత్సరానికి 6 సిలిండర్లు రూ.500 చొప్పున ఇచ్చినా రేషన్కార్డుల లెక్క ప్రకారం ఏడాదికి రూ.3,245 కోట్లు సబ్సిడీ రూపంలో వెచ్చించాల్సి వస్తుందని అంచనా. అయితే దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది. -
Andhra Pradesh:కొత్త రేషన్ కార్డులొచ్చాయ్
సాక్షి, భీమవరం: క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన వారందరికీ ఎప్పటికప్పుడు తెల్లరేషన్ కార్డుల మంజూరుచేయడం ద్వారా ఇంటింటా సంక్షేమ కాంతులు నింపుతోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. తాజాగా జిల్లాలో 4,935 రేషన్కార్డులు మంజూరు కాగా మొత్తం తెల్లరేషన్ కార్డుల (బియ్యం కార్డులు) సంఖ్య 5,70,956 చేరింది. ఈనెల నుంచే కొత్త కార్డుదారులకు ప్ర భుత్వం రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభించడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో తెల్లరేషన్ కార్డులదే ప్రధానపాత్ర. గత టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోత పెట్టేందుకు అరకొరగా రేషన్కార్డులు మంజూరు చేసింది. దీంతో కొత్త కార్డుల కోసం పేదలు అప్పటి జన్మభూమి కమిటీలు, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం జగన్ సర్కారు రేషన్కార్డుల మంజూరుకు నిబంధనలను సరళతరం చేసింది. కుటుంబంలో ఎవరైనా ఉద్యోగి ఉంటే వారి వల్ల తల్లిదండ్రులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారన్న ఉద్దేశంతో కార్డు నుంచి వారిని తొలగించే వీలు కల్పించింది. కొత్తగా పెళ్లయిన వారుంటే స్పిట్లింగ్ ద్వారా కార్డుల మంజూరుకు వెసులుబాటు ఇచ్చింది. ప్రతి ఆరు నెలలకు అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తుండటంతో జిల్లాలో కార్డుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉచితంగా బియ్యం పునర్విభజన అనంతరం జిల్లాలో 5,53,519 రేషన్కార్డులు ఉండగా గతేడాది జనవరిలో 3,090, జూలైలో 9,372 కొత్త కార్డులు మంజూరయ్యాయి. తాజాగా ఈనెలలో 4,935 కార్డుల మంజూరు చేయడంతో జిల్లాలో కార్డుదారుల సంఖ్య 5,70,916కు పెరిగింది. వీటిలో 31,944 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల బియ్యం ఉచితంగా, రూ.13.50కు కిలో పంచదార అందిస్తున్నారు. తెల్ల రేషన్కార్డుదారులకు రూ.67కు కిలో కందిపప్పు, రూ.17కు అరకిలో పంచదార, రూ.16కు కిలో గోధుమ పిండిలతో పాటు కుటుంబంలోని ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇంటి వద్దకే సరఫరా రేషన్ డిపోకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ సరుకులను అందిస్తోంది. తూకంలో కచ్చితత్వం, ఈపోస్ యంత్రాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడంతో సరుకుల అక్రమ రవాణకు తెరదించింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎక్కడైనా సమస్యలుంటే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఎండీయూ వాహనాలపై 1967 టోల్ఫ్రీ నంబర్ను ముద్రించింది. ఎండీయూ వాహనాలు క్రమం తప్పకుండా నిర్దేశిత ప్రాంతాలకు వెళ్లేలా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని సివిల్ సప్లయీస్ అధికారులు చెబుతున్నారు. వలంటీర్ సాయంతో త్వరితగతిన.. మా ఇద్దరు అమ్మాయిలకు వివాహాలు కావడం, వారు ఆదాయపు పన్ను పరిధిలో ఉండటంతో 8 నెలల క్రితం రేషన్ కార్డు రద్దయ్యింది. నేను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే వలంటీర్ సాయంతో కొత్త రేషన్ కార్డు పొందాను. కొత్త రేషన్ కార్డుతో పాటు ఈనెల రేషన్ సరుకులు కూడా ఇచ్చారు. అసలే వృద్ధాప్యం, ఆపై ఒంటరిగా ఉంటున్న నాకు రేషన్ సరుకులు అందడం ఆనందంగా ఉంది. –కల్లేపల్లి పుష్పావతి, తేతలి, తణుకు మండలం -
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు 40 రోజులే గడువు!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే నెల రోజులు పూర్తి అయిపోయాయి. నెల రోజుల పాలన పూర్తయినందుకు కాంగ్రెస్ నేతలు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నా.. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజలకు చెప్పిన గడువు దగ్గరపడుతోందనే ఆందోళన కూడా వారిలో కనిపిస్తోంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రజలకిచ్చిన 14 హామీల్లో ఇప్పటివరకు కేవలం రెండు మాత్రమే అమలు కాగా మిగిలిన నాలుగు గ్యారంటీల్లోని 12 హామీల అమలు పెండింగ్లో ఉండటంతో.. మిగిలిన 70 రోజుల్లో ఇవి అమల్లోకి వస్తాయా అన్న సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎప్పుడైనా పార్లమెంటు ఎన్నికల కోడ్ (షెడ్యూల్) అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని, అదే జరిగితే ప్రభుత్వానికి నికరంగా మిగిలిన గడువు 40 రోజులే అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. కోడ్ వస్తే కష్టమే! ఎన్నికల కోడ్ వచ్చిందంటే గ్యారంటీల అమలు సాధ్యం కాదని, షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని ముందే తెలుసు కనుక, ఆ పేరిట గ్యారంటీల అమలును వాయిదా వేస్తే ప్రజలు హర్షించరనే భయం పార్టీ నేతలను వెంటాడుతోంది. ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు అమలు చేయాల్సిన హామీల్లో మరికొన్నిటిని సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రకటిస్తుందనే ఆశాభావంలో ప్రజలు ఉన్నారు. అదే సమయంలో పింఛన్లు, రైతుబంధుకు సంబంధించిన డేటా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని, ఈ సమాచారం ఆధారంగా వెంటనే చేయూత పింఛన్లు రూ.4 వేలకు (దివ్యాంగులకు రూ.6 వేలు) పెంచి ఇచ్చేందుకు, పెంచిన రైతుభరోసా మొత్తాన్ని జమ చేసేందుకు అవకాశం ఉన్నా ప్రజా పాలన పేరిట అన్ని పథకాలను ఒకేగాటన కట్టి తాత్సారం ఎందుకనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినవారి జాబితా కూడా సర్కారు వద్ద రెడీగానే ఉందని అంటున్నారు. ఇప్పటికి దరఖాస్తుల ప్రక్రియే పూర్తి 100 రోజుల గడువు ప్రకారం చూస్తే మిగిలిన గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వానికి మార్చి 15వ తేదీ వరకు గడువుంది. అది లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకపోతే. లేదంటే ప్రకియ మొత్తాన్ని వేగవంతం చేసి ఎన్నికల కోడ్ వచ్చే నాటికే గ్యారంటీల్లో పేర్కొన్న అన్ని పథకాలను అమల్లోకి తేవాల్సి ఉంది. ప్రస్తుతం ప్రజాపాలన కింద దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మాత్రమే ముగిసింది. ఈ నెల 17 వరకు ఈ దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరణ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత మిగిలే కాలంలో 12 పథకాల అమలుకు మార్గదర్శకాలు ఖరారు చేయడంతో పాటు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ పథకాలను వర్తింపజేసినప్పుడే మొత్తం ఆరు గ్యారంటీలు అమలైనట్టని, కానీ మిగిలిన సమయం ఇందుకు సరిపోయే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ లాంటి పథకాల అమలు పారదర్శకంగా చేయాల్సి ఉంటుందని, ఈ క్రమంలో వచ్చే సందేహాలు, సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుని ముందుకెళ్లడం అంత సులభమేమీ కాదని వారంటున్నారు. మరోవైపు ఆర్థికంగా ప్రభుత్వంపై భారీగా భారం పడే కొన్ని పథకాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం రైతుబంధు అమలు కోసమే ప్రభుత్వం దగ్గర నిధుల్లేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పథకాల అమలుకు ఖజానా సహకరిస్తుందా? అనే అనుమానాలు ఇటు అధికార వర్గాలు, అటు పార్టీ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి. మార్గదర్శకాలపై చర్చోపచర్చలు ఆరు గ్యారంటీల అమలుతో పాటు వాటిని అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాల ఖరారు విషయంలో ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంభిస్తుందనేది రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రజలు, అధికార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మార్గదర్శకాల ఖరారు కూడా అంత సులభమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొత్త రేషన్కార్డుల జారీ ప్రధానంగా చర్చకు వస్తోంది. సాధారణంగా పేదలకు అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్కార్డునే గీటురాయిగా తీసుకుంటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్కార్డులు ఇవ్వలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరించింది. ఆ మేరకు కొత్తగా కార్డులు ఇస్తారా? పాత కార్డుల ఆధారంగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటారా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ అంత సులభమేమీ కాదని, కేంద్ర ప్రభుత్వ పరిమితుల మేరకు ఈ కార్డులను జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. మిగిలిన గడువులోగా కొత్త కార్డులు కూడా జారీ చేయలేమని స్పష్టం చేస్తున్నారు. సోమవారం జరిగే కీలక సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక నెలకు రూ.2,500 నగదు సాయం విషయంలో మహిళల అర్హతను ఎలా నిర్ణయిస్తారనేది కూడా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కుటుంబంలో ఒక మహిళకు ఇస్తారా? ఎంతమంది మహిళలున్నా ఇస్తారా? అసలు ఈ పథకానికి అర్హులను ఎలా నిర్ధారిస్తానే సందేహాలు మహిళల్లో వ్యక్తమవుతున్నాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఆరు గ్యారంటీల్లో చెప్పినప్పటికీ ఏడాదికి ఇన్ని సిలిండర్లేనన్న పరిమితి విధించనున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం అమలుకు రేషన్కార్డును తప్పనిసరిగా ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తుందని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు కావాల్సిన పథకాలివే: – నెలకు ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం – రూ.500కే గ్యాస్ సిలిండర్ – రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం – వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు – వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ – గృహ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ – తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు అడుగుల ఇంటి స్థలం – ఇంటి స్థలం ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం – విద్యాభరోసా కింద విద్యార్థులు చదువుకునేందుకు రూ.5 లక్షల విలువైన కార్డు – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు – చేయూత కింద పింఛన్లు రూ.4 వేలకు పెంపు -
ఆన్లైన్లోకి.. ప్రజాపాలన దరఖాస్తులు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కార్వాన్, గోషామహల్, మెహిదీపట్నం సర్కిళ్ల పరిధిలో రోజూ 30 కేంద్రాల ద్వారా అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద సాయం చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ► బస్తీలు, కాలనీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధిలో ఈ నెల 5వ తేదీ నాటికి 50 వేల అభయహస్తం దరఖాస్తులు తీసుకున్నారు. ► జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఈ నెల 6వ తేదీ నాటికి 3.80 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ► వచి్చన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రత్యేకంగా 60 మంది డీటీపీ ఆపరేటర్లను నియమించారు. ► వీరికి ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. ► ఇప్పుడు ఉన్న డీటీపీ ఆపరేటర్లు సరిపోకపోతే ప్రైవేటు వాళ్లను నియమించాలని ఆదేశాలు అందాయి. ఈ నెల 17వ తేదీ వరకు నమోదు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. ► పలు పథకాలకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి అర్హులైన వారిని ఎలా ఎంపిక చేస్తారనే మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు. ► వచ్చేనెల నుంచి మహిళలకు రూ. 2,500లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో వేలాది మంది మహిళల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ► అధికారులు అర్జీల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. అయితే ఈ సర్వే ఎప్పుడు చేస్తారు.. లబ్ధిదారులు ఎప్పుడు ఎంపిక చేస్తారు.. దీనికి ప్రాతిపదిక ఏమిటీ.. ఏయే అర్హతలు చూస్తారు.. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డుల్లో దేనిని పరిగణలోనికి తీసుకుంటారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ► దరఖాస్తు చేసుకున్నవారంతా తమకు లబ్ధి చేకూరుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు దరఖాస్తులు 80 శాతం తెల్లరేషన్కార్డు కోసమే పెట్టుకోగా, ఆ తర్వాత స్థానం రూ. 500 గ్యాస్ సిలిండర్ కోసం పెట్టుకున్నారు. ► అయితే తెల్ల రేషన్కార్డు లేనివారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటే తమకు పథకాలు అందవేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. గడువులోగా నమోదు పూర్తిచేస్తాం ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం డీటీపీలకు జోనల్ కార్యాలయంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరు ప్రజలు ఇచి్చన దరఖాస్తులను ఎలా నమోదు చేయాలనే విషయంపై అవగాహన పెంచుకుంటారు. దానికి సంబంధించిన పోర్టల్ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. శనివారం నుంచే నమోదు ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెలత 17వ తేదీ లోపు పూర్తిచేయాలనే ఆదేశాలు ఉండగా నిరీ్ణత సమయంలో పూర్తిచేస్తాం. ఇందుకోసం రెండు రోజుల నుంచే పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. ఇప్పుడున్న ఆపరేటర్లతో పాటు కొత్తగా వచి్చన వారితో నమోదు ప్రక్రియను ముమ్మరంగా చేపడతాం. – ప్రశాంతి, డీసీ, జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్ -
నేటితో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్: ఆరు గ్యారంటీల పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ప్రజాపాలనలో భాగంగా పదిరోజులుగా అర్జీలను తీసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో 150 వార్డుల్లోని 600 ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీ పథకాలతోపాటు ఇతరత్రా పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. శుక్రవారం నాటికి 21,52,178 దరఖాస్తులు అందాయి. వీటిలో 4,53,100 వరకు కొత్త రేషన్ కార్డు, ఇతరత్రా అర్జీలు ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం దరఖాస్తుల్లో 30 శాతం హైదరాబాద్ పాత బస్తీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. కంటోన్మెంట్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అత్యల్పంగా నమోదయ్యాయి. తొలి రెండు రోజులు దరఖాస్తుల తాకిడి అధికంగా కనిపించి క్రమంగా తగ్గుముఖం పట్టింది. గ్రేటర్లో 40 లక్షలపైగానే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 40 లక్షలకుపైనే కుటుంబాలు ఉన్నట్లు పలు సర్వే సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో ఆదాయ వర్గాలకు సంబంధించిన 10 లక్షలు మినహా మిగిలిన 30 లక్షల కుటుంబాలు పేద, మధ్యతరగతి వర్గాలే. సంపన్న వర్గాలు మినహా మిగతా కుటుంబాలకు ఆరు గ్యారంటీల పథకాల్లో మహాలక్షి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2,500, రూ. 500 వంట గ్యాస్ రాయితీ, గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవంగా మహా నగర పరిధిలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు 17.21 లక్షల వరకు ఉన్నాయి. మరో పది లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. మిగిలిన 2.79 కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఇప్పటి వరకు దరఖాస్తులు సమర్పించిన వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు సమాచారం. చివరి రోజు శనివారం భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మళ్లీ నాలుగు నెలల తర్వాతే.. ఈసారి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని కుటుంబాలు రెండోసారి జరిగే కార్యక్రమంలో అర్జీలు సమర్పించే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మరో నాలుగు నెలల తర్వాత రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనుంది. మొదటి విడత ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీల ప్రక్రియ తక్షణమే ప్రారంభం కానుంది. ఈ నెల 17వ తేదీ వరకు పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డాటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగనుంది. డాటా ఎంట్రీలో దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, తెల్లరేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు సమాచారం. -
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. జనవరి 31 లాస్ట్ డేట్!
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఈ-కేవైసీ గడువును పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ 'దేవేంద్ర సింగ్ చౌహాన్' ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో రేషన్ మాత్రమే కాకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందుకోవడానికి ఈ-కేవైసీ తప్పనిసరి. కాబట్టి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలందరూ తప్పకుండా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడానికి పలుమార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు ఇంకా ప్రక్రియను పూర్తి చేయని లబ్ధిదారులకు ఉపశమనం కలిగిస్తూ మరో నెల రోజులు అవకాశం కల్పించారు. రేషన్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి గడువును 2024 జనవరి 31 పొడిగించారు. ఈ గడువు లోపల ఈ-కేవైసీ పూర్తి చేసుకొని వారికి రేషన్ కట్ అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గత రెండు నెలలుగా రేషన్ డీలర్లు ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దీని కోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తులు వంటివి తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: బ్యాంక్ హాలిడేస్ జనవరిలో ఎన్ని రోజులంటే.. నిర్దిష్ట గడువు లోపల ఈ-కేవైసీ అప్డేట్ పొందని రేషన్ కార్డులను, నకిలీ రేషన్ కార్డులుగా గుర్తించి.. వాటిని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రేషన్ కార్డు క్యాన్సిల్ అయితే ప్రజలు అప్పటి వరకు పొందుతున్న ప్రయోజనాలు ఆగిపోతాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. 2023 డిసెంబర్ 30 వరకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు 70.80 శాతం అని తెలుస్తోంది. ఇందులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో (87.81 శాతం) ముందు వరుసలో ఉన్నట్లు.. అతి తక్కువ నమోదైన జిల్లాలో వనపర్తి (54.17 శాతం) ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. -
ఇండ్లు.. రేషన్కార్డులకే ఎక్కువ!
కరీంనగర్: ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం అర్జీల స్వీకరణ జాతరను మరిపిస్తోంది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాలు, వార్డులు, డివిజన్లలో దరఖాస్తులు స్వీకరించగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డుల కోసం ఎక్కువ అర్జీలొచ్చాయి. ఈ నెల 28న ప్రక్రియ ప్రారంభం కాగా తొలిరోజు 28,452 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం 48,230 వేల దరఖాస్తులు రాగా.. శనివారం 46 గ్రామాలతో పాటు 22 డివిజన్లలో ‘ప్రజాపాలన’ నిర్వహించనున్నారు. రేషన్కార్డు లేనివారికి అవకాశం! రేషన్కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశఽం కల్పించింది. వీరి కోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. రేషన్ కార్డులేనివారు ఆధార్ కార్డులను జత చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా.. ప్రభుత్వమే రూపొందించి ఇచ్చిన దరఖాస్తుఫారం నింపే క్రమంలో చాలామంది అయోమయానికి గురయ్యారు. మహాలక్ష్మి పథకానికి కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది ఉండటంతో ఒకే దరఖాస్తులో వివరాలు రాయాలా.. వేర్వేరు అందించాలా అన్న అయోమయానికి గురయ్యారు. రైతుభరోసాలో కౌలు రైతులు దరఖాస్తు చేసినప్పటికి ఫారంలో భూ యజమాని పట్టా పాసుపుస్తకం వివరాలు అందించలేకపోయారు. సబ్ మీటర్ లేకుండా అద్దె ఇళ్లలో ఉన్నవారు గృహజ్యోతికి కాలం పూరించే క్రమంలో సర్వీస్ నంబర్ లేకుండా దరఖాస్తు అందించారు. గ్రామసభల్లో పాల్గొన్న అధికారులు సైతం సరైన సమాచారం ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. కరీంనగర్లో ఎక్కువ కొత్తపల్లిలో తక్కువ కరీంనగర్ సిటీలో అత్యధిక దరఖాస్తులు 15,551 రాగా.. కొత్తపల్లి మున్సిపాలిటీలో అత్యల్పంగా 332 వచ్చాయి. చొప్పదండి మున్సిపాలిటీలో 843, హుజూరాబాద్లో 1,956, జమ్మికుంటలో 1,955 దరఖాస్తులు వచ్చాయి. మండలాలవారీగా చూస్తే ఇక చిగురుమామిడి మండలంలో 1,253, చొప్పదండిలో 1,928, ఇల్లందకుంటలో 1,158, గంగాధరలో 2,311, గన్నేరువరం 1,391, హుజూరాబాద్ 1,826, జమ్మికుంట 2,067, కరీంనగర్ రూరల్ 1,605, కొత్తపల్లి 2,587, మానకొండూరు 2,170, రామడుగు 1,952, శంకరపట్నం 1,320, తిమ్మాపూర్ 1,458, సైదాపూర్ 2,183, వీణవంక మండలంలో 2,384 దరఖాస్తు వచ్చాయి. నేడు ప్రజాపాలన జరగనున్న ప్రాంతాలివే.. చిగురుమామిడి మండలంకొండాపూర్, లంబాడిపల్లి, ముదిమాణిక్యం, ముల్కనూరు, చొప్పదండి మండలం కొలిమికుంట, కోనేరుపల్లి, కుర్మపల్లి, మంగళపల్లి, ఇల్లందకుంట మండలం మల్లన్నపల్లి, మల్యాల, మర్రివానిపల్లి, పాతర్లపల్లి, గంగాధర మండలం హిమ్మత్నగర్, ఇస్లాంపూర్, కాచిరెడ్డిపల్లి, కాసారం, గన్నేరువరం మండలం హన్మాజిపల్లి, జంగపల్లి, ఖాసీంపేట, మాదాపూర్, హుజూరా బాద్ మండలం కాట్రపల్లి, మందాడిపల్లి, పెదపాపయ్యపల్లి, పోతిరెడ్డిపేట, జమ్మికుంట మండలం నాగంపేట, నగురం, పాపయ్యపల్లి, పాపక్కపల్లి, కరీంనగర్ రూరల్లో దుబ్బపల్లి, దుర్శేడ్, ఎలబోతారం, కొత్తపల్లి మండలంలో కమాన్పూర్, ఖాజీపూర్, మానకొండూరు మండలంలో చెంజర్ల, దేవంపల్లి, ఈదులగుట్టపల్లి, గట్టుదుద్దెనపల్లి, రామడుగు మండలం వెలిచాల, చిప్పకుర్తి, దత్తోజి పేట, శంకరపట్నం మండలంలో చింతలపల్లి, ధర్మారం, ఎరడపల్లి, గద్దపాక, తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్, జుగుండ్ల, కొత్తపల్లి, లక్ష్మీదేవిపల్లి, సైదాపూర్ మండలంలో గొడిశాల, గుజ్జులపల్లి, గుండ్లపల్లి, జాగిర్పల్లి, వీణవంక మండలం బ్రహ్మణపల్లి, దేశాయిపల్లి, ఎలబాక, గంగారం, కొత్తపల్లి మునిసిపాలిటీలో 5, 6వ వార్డులు, చొప్పదండిలోని 5,6వ వార్డులు, కరీంనగర్ నగరపాలకలో 3, 8, 16, 22, 27, 30, 35, 37, 48, 51 డివిజన్లు, జమ్మికుంట మునిసిపాలిటీలో 9, 10, 11, 12వార్డుల్లో, హుజూరాబాద్లో 9, 10, 11, 12 వార్డుల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. జిల్లాలో గ్రామాలు: 313, మునిసిపాలిటీలు: 5, జిల్లా మొత్తంగా వచ్చిన అర్జీలు: 76,682, శుక్రవారం వచ్చినవి: 48,230, కవరైన నివాసాలు: 2,13,218, దరఖాస్తులు స్వీకరించిన గ్రామాలు: 90, వార్డులు: 48 ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్రాజ్ -
6 గ్యారంటీలకు తెల్ల కార్డే కీలకం
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల కింద లబ్ధి దారుల ఎంపికకు అర్హతగా తెల్లరేషన్కార్డును ప్రామాణికం(థంబ్రూల్)గా పెట్టుకుంది. ‘ప్రజాపాలన’పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజల గుమ్మం దగ్గరే గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర కేబినెట్ మంత్రులతో కలిసి ఆదివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను 28వ తేదీకి ముందే స్థానిక అధికారులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. తక్కువ సమయం ఉందని, రద్దీ ఎక్కువగా ఉందని, దరఖాస్తు ఇవ్వలేదని ఆందోళన అక్కర్లేదన్నారు. అందరి దరఖాస్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. వన్సైడ్ బ్యాటింగ్ చేయం.. సలహాలు స్వేచ్ఛగా ఇవ్వండి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అన్న అంశంపై వారి ఆలోచనలు, అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో వన్సైడ్ బ్యాటింగ్ చేయమని, ఏదైనా ఇబ్బందులు, సలహాలుంటే స్వేచ్ఛగా తెలియజేయాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరినట్టు చెప్పారు. ]అధికారులు కూడా మంచి సలహాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఐపీఎస్. ఐఏఎస్ అధికారులే అని స్పష్టం చేశామన్నారు. విద్య వైద్యం, ఇతర రంగాల్లో ప్రభుత్వ ఆలోచనలను, విధానాలను వారికి వివరించామన్నారు. చాలా సౌకర్యవంతంగా అధికారులు ఫీల్ అయ్యారని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం చేసుకున్నారన్నారు. వ్యక్తులు, వ్యవస్థల పట్ల కక్షపూరితంగా వ్యవహరించమని, తప్పు చేస్తే ఎంత పెద్ద వారినైనా ఊపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచిపెడతాం ధరణి పోర్టల్ను అడ్డంపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు, తొత్తులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఇంకా కొన్ని భూములకు సంబంధించిన ఫైల్స్ సర్క్యులేషన్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణిలో ఒకటే కాలమ్ ఇచ్చారని, ఒక సారి కలెక్టర్/ సీసీఎల్ఏ లాగిన్ అయితే పోర్టల్లో ఐటం కనబడదన్నారు. ’’ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు గత ప్రభుత్వం కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెడ్తాం. ధరణిలో తప్పులను సరిదిద్ది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ధరణిపై కసరత్తు ప్రారంభించాం.. స్పష్టత వచ్చాక ప్రక్షాళన చేస్తాం. అన్ని ఆధారాలతో ఒక రోజు ధరణిపై మీడియా ముందుకు వస్తాం’’అని పొంగులేటి ప్రకటించారు. -
కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు... డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు
హైదరాబాద్: తెలంగాణలో 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో సోమవారం (డిసెంబర్ 18) కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి మంత్రులు, కాంగ్రెస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి. రేషన్ కోసమే కాకుండా, ఆరోగ్యశ్రీ తదితర సేవలకూ రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. -
రేషన్ కార్డులు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం
-
కార్డులేని 10 లక్షల కుటుంబాల పరిస్థితేంటి?
హైదరాబాద్: మళ్లీ అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో తెల్లరేషన్్ కార్డులకు మరింత ప్రాధాన్యం పెంచినట్లయింది. కేవలం పీడీఎస్ బియ్యానికే పరిమితం కాకుండా రేషన్ కార్డు బహుళ ప్రయోజనకారిగా తయారు కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తే కార్డుదారులకు పీడీఎస్ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం, రైతు బీమా తరహాలో అర్హులైన పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా హామీ అమలైతే హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు 21.22 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అయితే.. మరో పది లక్షల పేద కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. మూడేళ్లుగా దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ లాగిన్ కూడా నిలిచిపోయింది. అంతకు ముందు దరఖాస్తుల్లో కేవలం 40 శాతం పెండెన్సీ మాత్రమే క్లియర్ అయింది. మరోవైపు కార్డులో కొత్త సభ్యుల చేర్పులు, మార్పుల దరఖాస్తులకు అవకాశం ఉన్నప్పటికీ ఆమోద ప్రక్రియ ఆరేడేళ్ల నుంచి పెండింగ్లో మగ్గుతోంది. అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. బీమాతో ధీమాగా.. అధికార బీఆర్ఎస్ ప్రకటించిన హామీతో పేద కుటుంబాలకు బీమా ధీమాగా మారనుంది. బీమా కోసం తెల్ల రేషన్ (ఆహార భద్రత) కార్డు అర్హత కార్డుగా మారనుంది. అర్హత గల కుటుంబాలకు రైతు బీమా తరహాలోనే.. ఎలాంటి మరణం సంభవించిన ఎల్ఐసీ ద్వారానే ద్వారా రూ.5 లక్షల బీమా ఆర్థిక సాయం వర్తింపజేయనుంది. మరణం సంభవించిన పది రోజుల్లో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందనుంది. ప్రభుత్వం అర్హులైన వారి పేరిట ప్రీమియం చెల్లించి బీమా వర్తింపజేసే విధంగా ఎల్ఐసీ ఒప్పందం కుదుర్చుకొనున్నది. ఈ నిబంధనలు పేద కుటుంబ సభ్యులకు బీమా వర్తింపును దూరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా బీమా నిబంధనల ప్రకారం 60 ఏళ్లలోపు వారే అర్హులు. కార్డులు ఇలా మహానగరంలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లో 22 లక్షలు ఉండగా అందులో ఇతరప్రాంతాల నుంచి వచ్చి రేషన్ పోర్టబిలిటీతో ఇక్కడే రేషన్ సరుకు డ్రా చేస్తున్న కుటుంబాలు నాలుగు లక్షల వరకు ఉండవచ్చని అంచనా. మొత్తమ్మీద కార్డుల్లో సుమారు 66 లక్షల సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. బీమా నిబంధనలు అమలైతే తెల్ల రేషన్న్కార్డుదారుల్లో 60 దాటిన వారంతా బీమాకు అనర్హులే. కార్డు హోల్డర్ పేరిట బీమా వర్తింపజేస్తే.. మొత్తం కార్డు దారుల్లో 20 శాతం మంది పైగా అర్హత కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ వర్తింపు.. ఇప్పటికే ఆరోగ్యశ్రీ – ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత చికిత్సలకు ఆహార భద్రత కార్డును కూడా చెల్లుబాటు చేస్తూ నిర్ణయం తీసుకోగా, తాజాగా ఆరోగ్యశ్రీ పథకం రూ. 15 లక్షల పెంపు హామీతో మరింత ఉపశమనం కలుగనుంది. సన్నబియ్యం పంపిణీ.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రేషన్న్న్కార్డుదారులకు సన్నబియ్యం అందనుంది. ప్రస్తుతం దొడ్డుబియ్యం పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ సష్టించి ఆర్థిక సంక్షోభం కారణంగా గత మూడేళ్లుగా ఉచితంగా పీడీఎస్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. కేంద్రం వాటాకు అదనంగా రాష్ట్రం వాటా కలిపి పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ప్రతి కార్డులోని యూనిట్కు ఆరుకిలోల చొప్పున కోటా ఉండగా కోవిడ్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కోటాను పెంచారు. -
కేవైసీ కోసం క్యూ... రేషన్కు ఈ–కేవైసీ తప్పనిసరే!
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ దుకాణాల నుంచి బియ్యం, ఇతర సరుకులు తీసుకునేందుకు కేవైసీ (నో యువర్ కస్టమర్– మీ వినియోగదారుని తెలుసుకోండి) నమోదు తప్పనిసరి కాబోతుంది. రేషన్ దుకాణాల్లో అప్డేట్ చేసిన ఈపాస్ మిషన్ల ద్వారా కార్డులో నమోదైన వారందరి వేలి ముద్రలు తీసుకొని, వారి వివరాలు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా ఈ కేవైసీకి ఈనెల 5వ తేదీ నుంచి శ్రీకారం చుట్టారు. వేలి ముద్రలు వేయకుంటే రేషన్ కార్డులో పేరుండదు అనే ప్రచారం నేపథ్యంలో జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా వచ్చి ఈ కేవైసీ కోసం రేషన్ దుకాణాల వద్ద బారులుతీరి మరీ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కూడా కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈపాస్ మిషన్లను అప్గ్రేడ్ చేసి, కార్డుదారుల వేలి ముద్రలు తీసుకోవలసిందిగా అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రేషన్ దుకాణాల్లో కార్డు దారుల వేలి ముద్రలు తీసుకుంటున్నారు. మంత్రి లేఖకు స్పందించని కేంద్రమంత్రి రేషన్కార్డులో పేర్లు ఉన్న వారంతా వేలిముద్రలు వేయాల్సిన నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉన్న వారు రాలేకపోతున్నారు. ఈ మేరకు ఈ కేవైసీ వల్ల తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఇటీవల సుదీర్ఘ లేఖ రాసి, ప్రభుత్వ ప్రతినిధి ద్వారా ఢిల్లీలో అందజేశారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. కాగా ఈ విషయమై మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్కార్డుల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని , కార్డుదారుల పేర్లు ఎవరివీ తొలగించడం జరగదని స్పష్టం చేశారు. కేవైసీ విషయంలో మరోసారి సీఎంతో చర్చించి తమ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేస్తామని తెలిపారు. గడువు తేదీ ఏమీ లేదు: అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ఈ కేవైసీకి తుది గడువు అంటూ ఏమీ లేదని పౌరసరఫరాల సంస్థ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ‘సాక్షి’కి తెలిపారు . కేవైసీలో వివరాలు ఇవ్వని కార్డుదారుల పేర్ల విషయంలో ఎలాంటి ఆదేశాలు లేవని, దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే వేలి ముద్రలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్డుల నుంచి ఎవరి పేర్లు తొలగించబోమని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. -
మా రేషన్ కార్డు ఎప్పుడు వస్తది సారు..?!
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వలేదు. 2016లో మాత్రం ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. ఆ సందర్భంలో చాలా మంది కొత్తగా కార్డులు, పేర్ల మార్పిడి, పిల్లల పేరు ఎక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అలాంటి సమస్యలు అన్ని పరిష్కారం కాకపోను చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఆతరువాత ప్రభుత్వం రేషన్ కార్టులకు సంబంధించి ఆన్లైన్ సైట్ను బందు పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే అధికారులు రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెబుతుండడంతో చాలామంది పేదలు పథకాలకు దూరమవుతున్నారు. రేషన్ కార్డుల్లేక.. వేలాది దరఖాస్తుల తిరస్కరణ.. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తోంది. ఇందుకోసం ఇటీవల జిల్లా వ్యాప్తంగా పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 78,890 మంది దరఖాస్తు వచ్చాయి. అందులో నియోజకవర్గానికి 3 వేల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 వేల మందికి మొదటి విడతగా లబ్ధి పొందనున్నారు. అయితే ఈ పథకానికి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో కేవలం 11 వేల మందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో తెల్ల రేషన్ కార్డులు లేక చాలా మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇదిలా ఉంటే బీసీ కులవృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ పథకానికి మొత్తం41,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కూడా రేషన్ కార్డులేని వారి వేలాది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీటితోపాటు మైనార్టీ బంధు పథకంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా తాము ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డులతోపాటు పేర్ల మార్పులు, కొత్తగా పిల్లల పేర్లు ఎక్కించి కొత్త కార్డులు పంపిణీ చేయాలని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోరుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే.. ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన గృహలక్ష్మి, బీసీలకు ఆర్థిక సాయం, మైనార్టీ బంధు, దళిత బంధు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిఒక్క దరఖాస్తుదారు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. లేదంటే దరఖాస్తు చేసుకున్నా కూడా ఆన్లైన్లో తీసుకోని పరిస్థితి. అయినా కొందరు ఆన్లైన్లో కాకుండా కొన్ని పథకాలకు నేరుగా తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తుల ఆధారంగా అక్కడ ఆన్లైన్ చేశారు. కానీ, రేషన్ కార్డులేక పోవడంతో చాలా మంది దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. రేషన్ కార్డు అందించాలి తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో మేము గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోలేక పోయాము. గతంలో డబుల్ బెడ్రూం ఇల్లు కూడా రాలేదు. 2016లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఉంటేనే పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా రేషన్ కార్డు ఇచ్చి ఆదుకోవాలి. – అంబటి సంధ్య, పెద్దదేవులపల్లి తెల్ల రేషన్కార్డు లేక దరఖాస్తు చేసుకోలేదు నాకు రేషన్ కార్డు లేదు. చాలా కాలం క్రితం దరఖాస్తు చేసుకున్నాను. అయినా కార్డు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుంది. కానీ, రేషన్ కార్డులేక నేను దరఖాస్తు చేసుకోలేక పోయాను. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి చేసి పేదలకు అవి పంపిణీ చేయకపోవడంతో పథకాల ఫలాలు అందరికీ అందడం లేదు. – శ్రీకాంత్, హనుమాన్ పేట, మిర్యాలగూడ -
మంత్రి ఈశ్వర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్పై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితుల సంక్షేమం అమలైందన్న విషయాన్ని ఈశ్వర్ గుర్తుంచుకోవాలని అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో, గత మూడేళ్లలో ఎంతమందికి దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్కు దమ్ముంటే డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిన చోట్ల ఓట్లు అడగాలన్నారు. గత నాలుగేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. దళితుల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ మాట తప్పారని, వాటిని తాము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆయన ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కాకుండా దళితులకు అన్యాయం చేసిన కేసీఆర్ను ఈశ్వర్ ప్రశ్నించాలని జీవన్రెడ్డి సూచించారు. -
కొత్తవి ఇవ్వరు..పాతవాటిలో చేర్చరు
కొత్త రేషన్కార్డుల ఊసే లేదు. పాత కార్డుల్లో కుటుంబసభ్యుల పేర్ల నమోదు చేస్తారా అంటే అదీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా 10,34,018 మంది కొత్తగా పేర్లు చేర్చాలంటూ దరఖాస్తు చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతీదానికి రేషన్కార్డు ప్రామాణికం కావడంతో లక్షల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – సాక్షి, సిద్దిపేట మీసేవ కేంద్రాల్లో 2021 ఆగస్టు నుంచి కొత్త రేషన్కార్డు ల దరఖాస్తుల ఆప్షన్ తొలగించారు. అప్పటి నుంచి కొత్త రేషన్కార్డుల ప్రక్రియ నిలిచిపోయింది. పెళ్లి తర్వాత ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడి..కొత్త కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. అయి తే వీరు రేషన్కార్డులకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న దళితబంధు, బీసీ, మైనార్టీ బంధులకు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే అర్హులని ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్డులు లేక అనేకమంది నష్టపోతున్నారు. ♦ రాష్ట్రంలో 90,04,563 రేషన్ కార్డులుండగా ఇందులో అంత్యోదయ కార్డులు 5,63,447, ఆహారభద్రత కార్డులు 84,35,654, అన్నపూర్ణ కార్డులు 5,462 ఉన్నాయి. ♦ ఆహార భద్రత (రేషన్) కార్డుల్లో పేర్లు సులభంగా తొలగిస్తున్నా, చేర్పులు చేపట్టకపోవడంతో కొత్త కోడళ్లకు నమోదు కావడం లేదు. పుట్టిన పిల్లలకు సైతం అవకాశం ఇవ్వలేదు. ♦ పెళ్లికాగానే కొందరు యువతులు స్వచ్ఛందంగా పేర్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. పేర్లు తొలగించినంత ఈజీగా అత్తారింటి కార్డులో పేర్లు చేర్చడం లేదు. ♦ కొత్త కోడళ్ల పేర్ల నమోదుకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తున్నా..అడుగు కూడా ముందుకు పడడం లేదు. ♦ ఆరోగ్యశ్రీ , ఇతర ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డుల్లో పేర్లు లేకపోవడంతో అవి వర్తించడం లేదు. దీంతో అమ్మగారిఇంట్లో కార్డు పేరు ఎందుకు తొలగించుకు న్నామా అని తలలు పట్టుకుంటున్నారు. ♦ పేర్లు తొలగించుకున్న కొత్త కోడళ్లకు బతుకమ్మ చీరలు కూడా అందడం లేదు. ఆరుసార్లు దరఖాస్తు చేశా.... నా ఇద్దరు పిల్లలపేర్లు రేషన్కార్డులో నమోదు చేయాలని మీ సేవలో ఆరుసార్లు దరఖాస్తు చేశా. ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్కార్డులో మా పిల్లల పేర్లు నమోదు చేయాలి. –బోలుమల్ల మహేందర్, రాంచంద్రాపూర్, కోహెడ రాష్ట్రవ్యాప్తంగా రేషన్కార్డుల్లో చేర్పులకు పెండింగ్ దరఖాస్తులు ఇలా (ఆయా లాగిన్లలో) ♦ రెవెన్యూ ఇన్స్పెక్టర్ 5,67,927 ♦ తహసీల్దార్ 68,462 ♦ డీఎస్ఓ 3,97,629 మీ సేవ సర్వర్ దరఖాస్తు తీసుకోవడం లేదు.. నాకు ముగ్గురు పిల్లలు. రెండేళ్ల క్రితం రెండోబాబు పుట్టిన తర్వాత రేషన్కార్డులో పేరు నమోదుకు దరఖాస్తు చేశా. అది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇంతలోనే మూడో బాబు పుట్టిన తర్వాత మళ్లీ పేరు నమోదుకు మీసేవ కేంద్రానికి వెళ్లితే సర్వర్ అప్లికేషన్ తీసుకో వడం లేదు. పాత అప్లికేషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. దీంతో కొత్తగా తీసుకోవడం లేదు. – రంగు ఆంజనేయులు, పాలమాకుల -
కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. వాళ్లందరికి రేషన్ కార్డు రద్దు!
శివాజీనగర: వైట్బోర్డు కారు కలిగినవారి బీపీఎల్ కార్డు (రేషన్ కార్డు) రద్దు చేస్తామని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప వెల్లడించారు. అయితే ఉపాధి కోసం కారు కొనుగోలు చేసిన వారి కార్డును రద్దు చేయబోమని చెప్పారు. శుక్రవారం విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం 5కేజీల బియ్యం, మిగతా ఐదు కేజీలకు బదులుగా నగదు ఇస్తున్నామని, దీర్ఘకాలం నగదు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. సెప్టెంబర్ నుంచి బీపీఎల్ కార్డుదారులకు 10 కేజీల బియ్యం ఇస్తామన్నారు. బియ్యం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. బియ్యంతో పాటు రాగి, జొన్నలు పంపిణీ చేసే విషయంపై కూడా యోచిస్తున్నామన్నారు. ఇందుకోసం 2023–24వ సంవత్సరంలో 8 లక్షల టన్నుల రాగులు, 3 లక్షల టన్నుల జొన్నలు కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. చదవండి మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్కు దేహశుద్ది! -
కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్!
టెక్నాలజీ పెరడగడంతో ప్రతిదీ డిజిటలైజేషేన్ అవుతున్నాయి. ఇలా చేయడం ద్వారా అవినీతితో పాటు అక్రమాలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే సర్కారు అందించే సేవలను ఆన్లైన్ వైపు తీసుకెళ్లడంతో పాటు అనుసంధానం ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ వంటి ఎంతో ముఖ్యమో చెప్పక్కర్లేదు. అందుకే వీటిని అనుసంధానం ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కేంద్రం ప్రభుత్వం. తాజాగా రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి ఉన్న గుడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం రేషన్ కార్డుదారులకు ఊరటనిస్తూ ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి గతంలో ఉన్న జూన్ 30 గడువును పెంచుతూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అంతోదయ అన్న యోజన, ప్రాధాన్య గృహ పథకం కింద లబ్ధిదారులకు రేషన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించడం తప్పనిసరి. తెల్లకార్డు ఉన్నవారు ముందుగా తమ రేషన్కార్డును డిజిటలైజ్ చేసి, ఆ తర్వాతే ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం “వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” విధానాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి రేషన్ కార్డును ఆధార్తో లింక్ చేయడంపై దృష్టి సారిస్తోంది. రేషన్ కార్డుకు సంబంధించి జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్డును దుర్వినియోగం చేసి వివిధ చోట్ల 2-3 రేషన్కార్డులు పొందిన వారు చాలా మంది ఉన్నారు. రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయడానికి సమీపంలోని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలి. లేదా ఆన్లైన్లో కూడా రేషన్ కార్డుకి ఆధార్ కార్డును లింక్ చేయడానికి ఈ కింది పాటిస్తే సరిపోతుంది. ►మీ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ►రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ చేయాలని ఉన్న లింక్ పైన క్లిక్ చేయాలి. ►ఆ తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, నమోదిత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ►అనంతరం మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ►ఓటీపీ ఎంటర్ చేయగానే మీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డ్ లింక్ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: ఈ వీడియో చూస్తే.. రెస్టారెంట్లో చికెన్ కర్రీ ఆర్డర్ చేయరు! -
రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నావు కాబట్టి.. రేషన్ కార్డులు ఇస్తానంటున్నావా?
-
కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను ఇప్పట్లో జారీ చేసే అవకాశం కనిపించడం లేదు. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జూన్ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభించనున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో కొత్త రేషన్కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది దీనిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. కానీ ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ఎలాంటి ప్రతిపాదన లేదని.. ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఆలోచనేదీ లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబాలను మించి కార్డులు రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల కన్నా అత్యధిక సంఖ్యలో ఆహార భద్రత కార్డులు ఉన్నాయని పలు సర్వేలు తేల్చాయి. అనర్హులకు ఇచ్చిన కార్డులను ఏరివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు సార్లు ఆలోచించినా.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో మిన్నకుండి పోయింది. 2018 ఎన్నికలకు ముందు రేషన్కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. సుమారు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను పరిశీలించిన సర్కారు.. 2021 వరకు పలు దఫాల్లో 3.11 లక్షల కార్డులను జారీ చేసింది. ఆ తర్వాత కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే కుటుంబంలో ఎవరైనా మరణిస్తే.. రేషన్ కార్డు నుంచి సదరు వ్యక్తి పేరును తొలగిస్తున్న అధికారులు, కొత్తగా జన్మించిన వారి పేర్లను చేర్చడం లేదు. ఈ మార్పులు చేర్పుల కోసం ఎఫ్ఎస్సీఆర్ఎం వెబ్సైట్లో చేసుకుంటున్న దరఖాస్తుకే ఇప్పటివరకు మోక్షం కలగలేదు. 90.14 లక్షల ఆహార భద్రత కార్డులు ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 90,14,263 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో ఉన్న యూనిట్ల (కుటుంబ సభ్యుల) సంఖ్య 2.83 కోట్లు. అంటే రాష్ట్ర జనాభాలో మూడింట రెండొంతుల మేర ప్రజలు వీటి పరిధిలో ఉన్నారు. ఇక రేషన్ కార్డుల్లో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 48.86 లక్షల కార్డులు, అంత్యోదయ అన్నయోజన పథకం (ఏఏవై) కింద 5.62 లక్షల కార్డులు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి సబ్సిడీ భరిస్తూ ఇచ్చిన ఆహార భద్రత కార్డులు (ఎఫ్ఎస్సీ) 35.66 లక్షల మేర ఉన్నాయి. ఇందులో 5,211 కార్డులు అన్నపూర్ణ పథకం కింద వినియోగంలో ఉన్నాయి. అన్నపూర్ణ పథకం కింద కార్డుకు 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తారు. ఏఏవై, అన్నపూర్ణ మినహా మిగతా రేషన్ కార్డులపై ప్రతినెలా కుటుంబంలోని ఒక్కొక్కరికి రూపాయికి కిలో చొప్పున 6 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కరోనా ప్రబలిన నేపథ్యంలో 2021 నుంచి ఉచితంగానే బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఆ ప్రచారంలో నిజం లేదు గత ఎన్నికల ముందు ప్రభుత్వం కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లుగానే.. ఈసారి కూడా అవకాశం ఇచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జూన్ నుంచే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు ప్రభుత్వం నిర్ణయించిందన్న ప్రచారమూ జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పౌర సరఫరాల శాఖ తోసిపుచ్చింది. కొత్త రేషన్కార్డుల కోసం ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ‘సాక్షి’కి స్పష్టం చేసింది. (చదవండి: అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులతో వాన) -
కేంద్రం కీలక నిర్ణయం!..రేషన్ కార్డు దారులకు గుడ్న్యూస్!
రేషన్ కార్డ్ హోల్డర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేసే గడువును మార్చి 31 నుంచి జూన్ 30,2023కి పొడిగించింది. ఈ పొడిగింపుపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (డీఎఫ్పీడీ) అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిత్యవసర వస్తువుల్ని రేషన్ కార్డు ద్వారా సబ్సీడీగా పొందవచ్చు. దీంతో పాటు పాస్పోర్ట్, పాన్ కార్డ్ ఎలా గుర్తింపు కార్డ్గా వినియోగించుకుంటామో.. ఈ రేషన్ కార్డ్ను అలాగే ఉపయోగించుకునేందుకు వీలుంది. అయితే దేశంలో నిజమైన రేషన్ కార్డ్ లబ్ధి దారుల్ని గుర్తించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డ్కు ఆధార్ కార్డ్ను జత చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డ్లు ఉంటే వాటిని రద్దు చేయడం, ఎక్కువ ఆదాయం అర్జిస్తూ రేషన్ కార్డు వినియోగిస్తుంటే ఆ రేషన్ కార్డ్లను క్యాన్సిల్ చేయనుంది. నిజమైన లబ్ధిదారులకు నిత్యవసర వస్తువుల్ని అందించనుంది. రేషన్ కార్డ్కు ఆధార్ లింక్ ఇలా చేయండి ♦ ముందుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్)వెబ్సైట్ను సందర్శించాలి. ♦ అందులో ఆధార్ కార్డ్ నెంబర్,రేషన్ కార్డ్ నెంబర్ తో పాటు ఫోన్ నెంబర్ వంటి వివరాల్ని నమోదు చేయాలి. ♦ అనంతరం కంటిన్యూ ఆప్షన్పై ట్యాప్ చేయాలి ♦ కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ♦ ఓటీపీ ఎంటర్ చేస్తే రేషన్ కార్డ్కు ఆధార్ లింక్ అవుతుంది ఆఫ్లైన్లో రేషన్ కార్డ్ - ఆధార్ లింక్ ఇలా చేయండి ♦ కుటుంబసభ్యుల ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు, రేషన్ కార్డ్ జిరాక్స్లు, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో రేషన్ కార్యాలయానికి వెళ్లాలి ♦ అక్కడ ఆధార్ కార్డ్ డేటా బేస్లో మీ వివరాలని గుర్తించేలా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి ♦ ఆధార్ డేటా బేస్లో ఉన్న మీ వివరాలు మ్యాచ్ అయితే ఎస్ఎంఎస్ వస్తుంది. ♦ అనంతరం రేషన్ కార్డ్కు ఆధార్ కార్డ్ను జత చేస్తారు. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి గుడ్ న్యూస్!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement