-
ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటీ? ఇది ప్రమాదకరమా..?
స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో పలు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లలను వాటికి అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు కూడా. కానీ ఇప్పుడు ఏకంగా వాటి వాడకం వల్లే వేళ్ల సంబంధ సమస్యలొస్తున్నాయంటూ పలువురు ఊదరగొడుతున్నారు. నిపుణులు మాత్రం అది సాధారణ సమస్య అని కొట్టిపారేస్తున్నారు. ఈస్మార్ట్ ఫోన్లను అలా ఉపయోగిస్తేనే సమస్యలు వస్తాయంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు వైద్యులు. మరీ ఇంతకీ ఏంటీ ఐఫోన్ ఫింగర్..ఐఫోన్ ఫింగర్ అంటే..ఐఫోన్ ఫింగర్"ని "స్మార్ట్ఫోన్ పింకీ" అని కూడా అంటారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు పెద్దపెద్ద సైజుల్లో వస్తున్నాయి. వాటిని అరచేతిలో పట్టుకునేటప్పుడు ఫోన్ కింద చిటికెన వేలుతో నొక్కి పట్టుకోవడం సహజం. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోతోందని ఆందోళన చేస్తున్నారు కొందరూ. దీన్నే 'స్మార్ట్ ఫోన్ పింకీ' లేదా 'ఐఫోన్ ఫింగర్' అని అంటారు. ఈ ఆపిల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నప్పుడు భారం చిటికెన వేలుపై పడటంతో ఉంగరం వేలుకి దీనికి గ్యాప్ రావడం లేదా వంకరపోవడం వంటివి జరుగుతున్నాయని పలువురు టెక్ ఔత్సా హికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇది సాధారణ సమస్యే అని కొట్టిపారేస్తున్నారు. క్లీవ్ల్యాండ్ క్లినిక్కి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీటర్ ఎవాన్స్ చిటికెన వేళ్ల మధ్య గ్యాప్లు, వంకరపోవడానికి అదే కారణమని చెప్పలేమని అన్నారు. దీన్ని సాధారణ పింకీ అనాటమీ(చిటికెన వేలు సమస్య)గా చెబుతున్నారు. అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఏప్రిల్ హిబ్బెలర్, రోలినాకు చెందిన హ్యాండ్ సర్జన్ డాక్టర్లిద్దరు సదరు సర్జన్ డాక్టర్ ఎవాన్స్ మాటలతో ఏకీభవించారు. ఐఫోన్, స్మార్ట్ పోన్ల వల్లే ఇది వస్తుందని అధికారిక నిర్థారణ కాలేదని అన్నారు. కానీ వారంతా ఫోన్కు సంబంధించిన కొన్ని అనారోగ్య పరిస్థితుల గురించి హెచ్చరించారు. అవేంటంటే..ఫోన్ సంబంధిత వైద్య పరిస్థితులుస్మార్ట్ వాడకం వల్ల "స్మార్ట్ఫోన్ ఎల్బో" వస్తుందని అన్నారు. వైద్యపరంగా దీన్ని క్యూబిటల్ టన్నెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. టక్స్ట్ టైప్ చేయడానికి ఎక్కువ వ్యవధిలో మోచేతిని 90 డిగ్రీలకు మించి వంచితే ఇది వస్తుందని వివరించారు. బహుశా ఇదే చిటికెన వేలుపై వస్తున్న మార్పులకు సంకేతాలు కూడా కాడొచ్చని అన్నారు. అందువల్లే నరాలు దెబ్బ తిని ఇలా చిటికెన వేలు వంకరపోవడం లేదా గ్యాప్ రావడం జరగుతుండవచ్చు అని అన్నారు. విపరీతంగా బొటనవేలుతో టెక్స్టింగ్ చేసేవాళ్లు మెడ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్మార్ట్ ఫోన్ వినియోగదారులను కోరారు. రోజంతా బొటనవేలుతో స్వైపింగ్, టైప్ చేయడం వంటివి చేస్తే ఈ సమస్యలు అధికమవుతాయని, పైగా అంతర్గతంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలను తీవ్రతరం చేసి బొటనవేలు స్నాయువులలో కొత్త సమస్యలను కలిగిస్తుందని తెలిపారు. ఇక్కడ మనిషి తల బరువు కనీసం 10 నుంచి 12 పౌండ్లు వరకు ఉంటుంది. స్మార్ట్ఫోన్ చూసేందుకు ఎప్పుడైతే తలను వంచుతామో అప్పుడు ఆ భారం అంతా మెడ కండరాలపై పడుతుంది. ఈ అదనపు ఒత్తిడి కండరాల నొప్పికి దారితీసి ఆర్థరైటీస్ వంటి సమస్యల్లో పెడుతుందని వివరించారు సర్జన్ ఎవాన్స్. (చదవండి: ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!) -
Kiara Advani: పింక్ ఔట్ఫిట్లో కియారా అద్వానీ.. అదరహో (ఫోటోలు)
-
ఇన్కమ్ ట్యాక్స్ ఓకే.. మీకు ఈ ‘పింక్ ట్యాక్స్’ గురించి తెలుసా?
బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుందార్ షా ‘పింక్ ట్యాక్స్’ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషులు తమ అందం కోసం వినియోగించే ప్రొడక్ట్ల ధరల కంటే మహిళల ఉపయోగించే ప్రొడక్ట్ల ధరలు ఎక్కువ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అంతేకాదు ఆ తరహా వస్తువుల్ని కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకారం..లింగ ఆధారిత ధరల అసమానతలు అనేక రంగాలలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అధికం. ఉదాహరణకు, మహిళలకు, పురుషుల కోసం ప్రత్యేకంగా విక్రయించే సబ్బులు, లోషన్లు, డియోడరెంట్ ప్రొడక్ట్లు ఉన్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తుతూ సోషల్మీడియాలో వైరలవుతున్న వీడియోపై మంజుదార్ షా స్పందించారు. ఆ వీడియోని 1.5లక్షల మంది వీక్షించారు. ప్రభుత్వం విధించే పన్నుకాదు పింక్ ట్యాక్స్ అనేది అసలు ప్రభుత్వ పన్ను కాదు. ఇది మహిళలకు విక్రయించబడే వస్తువుల ధరను పెంచే వివక్షతతో కూడిన ధరలను సూచిస్తుంది. Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9 — Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024 పింక్ టాక్స్ అంటే ఏమిటి? ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసు. మరి ఈ పింక్ ట్యాక్స్ అంటే? ఉదాహరణకు సమ్మర్ సీజన్లో మహిళలు చర్మం పాడవుకుండా పలు స్కిన్ కేర్ ప్రొడక్ట్లు వాడుతుంటారు. అలాగే పురుషులు కూడా. అయితే మహిళలు కొనుగోలు చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్ ధర రూ.100 ఉంటే, పురుషుల స్కిన్ కేర్ ప్రొడక్ట్ దర రూ.80 ఉంటుంది. అంటే పురుషులు - మహిళలు వినియోగించే ధరల మధ్య వ్యత్యాసం. అలా ధరల మధ్య వ్యత్యాసం ఎందుకనే మంజుదార్ షా అడుగుతున్నారు. ఇలా ఒక్క మంజుదార్ షానే కాదు ఐక్యరాజ్య సమితి సైతం పింక్ ట్యాక్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పింక్ ట్యాక్స్ను తొలగించాలి మహిళలు ఆర్థిక వ్యవస్థలో పూర్తి, సమాన భాగస్వామ్యాన్ని సాధించేలా పింక్ ట్యాక్స్ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. పింక్ టాక్స్ వల్ల ఆర్థిక భారం డబ్ల్యూఈఎఫ్ ప్రకారం.. వివక్షతతో కూడిన ధరల వల్ల మహిళలపై ఆర్థిక భారం పడుతోంది. పురుషుల కంటే మహిళలు తక్కువ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా, పింక్ ట్యాక్స్ విధించే ఉత్పత్తులను కొనుగోలు చేయడం మహిళలపై ఆర్ధిక భారం పెరుగుతోంది. -
లేత గులాబీ చీరలో కుందనపు బొమ్మలా సచిన్ కూతురు!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ముద్దల తనయ సారా టెండుల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎప్పటి కప్పుడూ తన లేటెస్ట్ స్టన్నింగ్ లుక్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. అలానే ఈసారి చీర కట్టులో ముగ్ద మనోహరంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అందులో చమీ అండ్ పాలక్ శారీస్ బ్రాండ్కి చెందిన పింక్ జార్జెట్ చీరలో తళుక్కుమంది. ఈ చీరకు తగ్గట్టు ఎంబ్రాయిడరీ నెక్ బ్లౌజ్తో చాలా అద్భుతంగా కనిపించింది. ఆ ఫ్యాషన్కు తగ్గట్టుగా చెవిపోగులు, పాపిడి బోట్టు, మ్యాచింగ్ గాజులతో కుందనపు బొమ్మలా ఉంది. చక్కగా తెలుగింటి వారి ఆడపడుచులా జడ వేసుకుని కనిపించింది. ఆ లేత గులాబి చీరలో ఉన్న మరో అందమైన గులాబీ ఏమో అనేంత అందంగా ఉంది. ఇక సారా ధరించి ఈ లేత గులాబీ జార్జెట్ చీర ధర రూ. 37,000/-. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు సారా మీరు అద్భుతంగా ఉన్నారని ఒకరూ, కళ్లు చెదిరే అందం మీ సొంతం అని మరోకరూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) (చదవండి: 'నా సామిరంగ’ మూవీ హీరోయిన్ చుడిదార్లో లుక్ మాములుగా లేదుగా!) -
ఏసీబీ అధికారులు గులాబీ రంగు సీసా: ఈ లాజిక్ ఏంటో తెలుసా?
సాధారణంగా కొంతమంది ప్రభుత్వ అధికారులు, కొందరు ఉద్యోగులు, సిబ్బంది లంచాలు తీసుకుంటూ పట్టుబడిన కథనాలు చూస్తూఉంటాం కదా. ఈ సమయంలో కరెన్సీ నోట్లతో పాటు పింక్ రంగులో ద్రావణం ఉండే సీసాలను కూడా ఉంచుతారు అధికారులు. అవేంటో వాటి కథ ఏంటో ఎపుడైనా ఆలోచించారా? అయితే అసలు ఆ సీసాలు ఏమిటి? అందులో పింక్ రంగులో ద్రావణం ఎందుకు ఉంటుంది ? దానికి లంచానికి సంబంధం ఏమిటి ? ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజల కోసంపనిచేయాల్సిన కొందరు అక్రమార్కులు లంచం ఇస్తేనే పని స్థాయికి దిగజారుతారు. లబ్దిదారులు, బాధితులకు అందాల్సినవి అందకుండా, చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తూ జలగల్లా పీడించుకు తింటారు. నిజానికి లంచం తీసుకోవడం, ఇవ్వడమూ రెండూ నేరమే. కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా, వాళ్లకు ఎంతోకొంత ముట్టజెప్పి తమ పని కానిచ్చుకుంటారు. కానీ కొంతమంది అలాకాదు. అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదిస్తారు. వారికి ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు లాంచావతార ఉద్యోగుల ఆటకట్టించేందుకు అవినీతి నిరోధక శాఖ (యాంటీ కరప్షన్ బ్యూరో) రంగంలోకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని శిక్షించడమే ఈ శాఖ పని. ఈ క్రమంలోనే ఫిర్యాదు, లేదా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు బాధితులకు ముందుగానే కొన్ని నోట్లిచ్చి వాటిని లంచం డిమాండ్ చేస్తున్న అధికారి లేదా ఉద్యోగికి ఇవ్వమంటారు. అయితే దీనికంటే ముందే ఏసీబీ అధికారులు ఆ కరెన్సీ నోట్లకు ముందుగా ఫినాల్ఫ్తలీన్ అనే పౌడర్ను రాస్తారు. నిజానికి ఈ పౌడర్ కళ్లకు కనిపించదు,గుర్తించలేం.ఆ నోట్లను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వగానే ఏసీబీ ఆఫీసర్లు దాడి చేసి సదరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటారు. అనంతరం ముందుగా వేసిన వల ప్రకారం వారి దగ్గర్నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది. లంచం తీసుకున్న అధికారి చేతులను సోడియం బైకార్బొనేట్ మిశ్రమంలో ముంచుతారు. అంతకుముందే లంచంగా తీసుకున్న నోట్లకు ఉండే ఫినాల్ఫ్తలీన్ పౌడర్ వారి చేతులకు అంటుకుంటుంది. ఎపుడైతే ఈ ద్రావణంలో చేతులు ముంచుతారో, సోడియం బైకార్బొనేట్ మిశ్రమం కాస్తా పింక్ రంగులోకి మారుతుంది. దీంతో వారు లంచం తీసుకున్నారని ధృవీకరించుకుంటారు. పింక్ రంగులోకి మారిన ఆ మిశ్రమమే కీలక సాక్ష్యంగా ఉంటుంది. -
పెళ్లి చూపులు భామ ధరించిన గూలబీ రంగు చీర ఎంతంటే..
రితు వర్మకు నటన ఒక ప్యాషన్. అందుకే రాశి కన్నా వాసికే విలువ ఇస్తుంది. మంచి పాత్రలతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ విషయంలో కూడా స్టయిల్ కన్నా సౌకర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇండస్ట్రీలో పనిచేస్తున్నామంటే మన లుక్ను పర్ఫెక్ట్గా మెయిన్టేన్ చేయాల్సిందే! అలాగయితేనే ఇండస్ట్రీలో నెగ్గుకురాగలం అంటోంది రితు వర్మ. ఇక ఆమె కంఫర్ట్గా ఫీలయ్యే బ్రాండ్స్లో ఓ రెండిటి గురించి.. మద్దిన్ మధురిత దత్తా, స్తాంజిన్ డాజిస్.. బిజినెస్ పార్ట్నర్సే కాదు మంచి స్నేహితులు కూడా! ఫ్యాషన్ పై వారికి ఉన్న అభిరుచి, ఆలోచనలు ఏకమవడంతో ఇద్దరూ కలసి కెరీర్ను స్టార్ట్ చేశారు. ముంబైలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2012లో తమ ఇద్దరి పేరుతోనే ఫ్యాషన్ హౌస్ను ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్నే ఉపయోగిస్తారు. ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన, సంప్రదాయ డిజైన్స్లో వీరిది పెట్టింది పేరు. ఈ బ్రాండ్ వేర్ ధర కాస్త ఎక్కువే. ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటుంది. శీతల్ జవేరి జ్యూయెల్స్.. నాటి.. ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్లో శీతల్ జవేరి జ్యూయెల్స్ ఒకటి. నాణ్యత, నైపుణ్యమే దీని బ్రాండ్ వాల్యూ. సంప్రదాయ నగలతోపాటు మోడర్న్ డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర క్వాలిటీ, డిజైన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్లోనూ లభ్యం. ఈ శీతల్ జవేరి జ్యూయెల్స్ బ్రాండ్ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: క్యూట్లుక్తో కట్టిపడేసే కృతి సనన్ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..) -
క్యూట్లుక్తో కట్టిపడేసే కృతి సనన్ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..
కృతి సనన్.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురయ్యాయి. అయినా ఎక్కడా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే సినిమా చాన్స్ల కోసం ట్రై చేశాను, సాధించాను. అందుకే ముందు మనల్ని మనం నమ్మాలి అని చెబుతోంది. ఆమె గ్లామర్కే కాదు అభినయానికీ అంతే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకు కనిపించే ఉదాహరణ.. ‘మిమీ’ మూవీ. ఆ తపన, అభిరుచి ఆమె ఫ్యాషన్ స్టయిల్లోనూ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఈ బ్రాండ్సే.. మసాబా గుప్తా... మసాబా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్ల కూతురు అని తెలుసు కదా! కానీ పేరెంట్స్ పేరుప్రఖ్యాతులను తన కెరీర్కి పునాదిగా మలచుకోలేదు. కేవలం తన క్రియేటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జిస్తోంది. ఇప్పుడున్న టాప్ మోస్ట్ డిజైనర్స్లలో మసాబా గుప్తానే ఫస్ట్. 2009లో ‘హౌస్ ఆఫ్ మసాబా’ పేరుతో బ్రాండ్ను ప్రారంభించింది. సృజన, నాణ్యతే బ్రాండ్ వాల్యూగా సాగిపోతోంది. అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. ఎందరో సెలబ్రిటీలు ఆమె డిజైన్స్కు వీరాభిమానులు. ధర కాస్త ఎక్కువే. ఆన్లైన్లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఇక్కడ కృతి సనన్ ధరించి మసాబా గుప్తా కాస్ట్యూమ్ ధర రూ. 18,000/- కళ్యాణ్ జ్యూయెలర్స్... బంగారు, ముత్యాలు, వజ్రాల వ్యాపారంలో వందేళ్లకు పైగా చరిత్ర గల సంస్థ కళ్యాణ్ జ్యూయెలర్స్. దేశంలోనే కాదు గల్ఫ్, యూరోప్, అమెరికా దేశాల్లోనూ శాఖలను తెరిచింది. స్వచ్ఛత, నాణ్యత, నాజూకైన డిజైన్లే దీని బ్రాండ్ వాల్యూ. ధర ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. కళ్యాణ్ జ్యూయెలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. దీపిక కొండి (చదవండి: విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!) -
హైదరాబాద్ : బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్.. గులాబీ వర్ణంలో కట్టడాల వెలుగులు (ఫోటోలు)
-
Ananya Panday : బీచ్లో పింక్ బికినీలో లైగర్ హీరోయిన్ (ఫొటోలు)
-
డేంజర్:వాట్సాప్లో పొరపాటున కూడా ఆ లింక్ను క్లిక్ చేయొద్దు
వాట్సప్లో ఓ కొత్త మోసం వేగంగా వ్యాపిస్తోంది. ఈ వాట్సాప్ పింక్ స్కామ్ ఇప్పటికే చాలా మంది వ్యక్తులను మోసగించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు, సైబర్ నిపుణులు ఈ మోసాలకు వ్యతిరేకంగా ఇప్పటికే హెచ్చరించారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ ‘పింక్ రెడ్ అలర్ట్’తో హెచ్చరించింది. ఇంతకీ వాట్సాప్ పింక్ అంటే ఏంటి? ఈ స్కామ్ ఎలా వ్యాపిస్తోంది. మీరు బాధితులైతే ఏం చేయాలి?! తప్పనిసరిగా తెలుసుకోవాలి. పింక్ వాట్సాప్ అంటే..? స్కామర్లు ‘అదనపు ఫీచర్లతో ఉన్న పింక్ వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకోమని వినియోగదారులకు మెసేజ్లు పంపుతారు.’ ఈ యాప్ నిజానికి ప్రమాదకరమైన మాల్వేర్. వాట్సాప్ పింక్ని డౌన్లోడ్ చేయడంతో స్కామర్లు ఫోన్ డేటాకు యాక్సెస్ పొందుతారు. దీంతో ఈ యాప్ మన ఫోన్ డేటాను పూర్తిగా దొంగిలించడానికి వీలు కల్పిస్తోంది. బ్యాంక్ వివరాలు, కాంటాక్ట్ నంబర్లు, ఫొటోగ్రాఫ్స్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని స్కామర్లు దొంగిలించి ఉండవచ్చు. అనుమానాస్పద లింక్ల పట్ల జాగ్రత్త తెలియని లేదా అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయడం మానుకోవాలి. ప్రత్యేకించి అవి కొత్త ఫీచర్లు లేదా హానికరమైన లింక్లపై క్లిక్ చేసేలా ఆకట్టుకునే మెసేజ్లు ఉంటే అనుమానించాలి. వాట్సాప్ లేదా ఏదైనా ఇతర అధికారిక సంస్థ నుండి వచ్చినట్లు క్లెయిమ్ చేసే మెసేజ్ను యాక్సెస్ చేస్తే ముందు దాని ప్రామాణికతను ధ్రువీకరించాలి. సమాచారం చట్టబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వాట్సాప్ వెబ్సైట్, సోషల్మీడియా అకౌంట్స్, విశ్వసనీయ వార్తా సమాచారాల నుంచి చెక్ చేయాలి. పేరొందిన యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ మొబైల్ పరికరాన్ని సురక్షితంగా ఉంచచ్చు. ఇవి హానికరమైన యాప్లు లేదా లింక్లను గుర్తించి అడ్డుకోవడంలో సహాయపడతాయి. వాట్సాప్, ఇతర యాప్లను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్లకు అప్డేట్ చేయాలి. సేఫ్టీ అప్డేట్ వల్ల బెదిరింపుల నుండి రక్షించుకోవడానికి సహాయపడుతుంది. వాట్సాప్ మీ బ్యాంకింగ్ వివరాల వంటి సెన్సిటివ్ సమాచారాన్ని మెసేజ్ల ద్వారా ఎప్పటికీ అడగదు. తెలియని లేదా నమ్మదగని అకౌంట్స్తో ఎప్పుడూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. వాట్సాప్ కూడా రెండు దశల ప్రామాణికతతో ఉంటుంది. దీనిని సెట్ చేసుకోవడానికి పిన్ నంబర్ ఉంటుంది. కొత్త ఫోన్లో మీ ఫోన్ నంబర్ యాక్సెస్ అవ్వాలంటే ఈ పిన్ నెంబర్ అవసరం అవుతుంది. మీ అకౌంట్ సేఫ్టీని మెరుగుపరచడానికి వాట్సాప్ సెట్టింగ్లలో ఈ ఫీచర్ని ఇప్పుడే ప్రారంభించవచ్చు. వినియోగదారులకు వచ్చే మెసేజ్లు ఇలా ఉంటాయి.. ‘న్యూ పింక్’ వాట్సాప్ కొత్త ఫీచర్లతో అధికారికంగా ప్రారంభించారు. న్యూ పింక్ లుక్ కొత్త ఫీచర్లతో మీ వాట్సాప్ను ఇప్పుడే అప్డేట్ చేయండి. ఈ కొత్త వాట్సాప్ని ఇప్పుడే ప్రయత్నించండి అనే మెసేజ్లు వస్తుంటాయి. ఫోన్ హైజాక్ చేసిన వాళ్లు మీ కాంటాక్ట్ నుండి వచ్చే మెసేజ్లను కూడా డౌన్లోడ్ చేయవచ్చు. యాప్ నకిలీ వెర్షన్ వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేయడమే కాదు, ఇది యాప్ను డౌన్లోడ్ చేయమని మీ పూర్తి కాంటాక్ట్లోని జాబితాకు మెసేజ్లు కూడా పంపుతుంది. వాట్సాప్ పింక్ అనేది హానికరమైన మాల్వేర్. మొబైల్ ఫోన్లను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఓ నకిలీ సాఫ్ట్వేర్. ఓటీపీలు, కాంటాక్ట్స్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర ఆర్థిక విషయాలతో సహా వినియోగదారుల పరికరాల నుండి పూర్తి సమాచారాన్ని దొంగిలించడానికి హ్యాకర్లు దీనిని ఉపయోగిస్తారు. వ్యక్తులు లింక్లు ఓపెన్ చేసినప్పుడు వారి డిజిటల్ పరికరాలలో హానికరమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. థర్డ్–పార్టీ యాప్ స్టోర్లు లేదా APK ఫైల్స్ నుండి ప్రోగ్రామ్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆపిల్ ఫోన్లో అయితే యాక్సెస్ ఉండదు. వాట్సాప్ పింక్ స్కామ్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్పార్టీ యాప్ స్టోర్లు, ఏపీకే ఫైల్స్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. తమ అక్రమ కార్యకలాపాలకోసం హ్యాకర్లు ఫోన్ గ్యాలరీలో వ్యక్తిగత ఫొటోలను తీసి, బ్లాక్ మెయిలింగ్కు ఉపయోగించుకుంటున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థలు, చట్టాన్ని అమలు చేసే అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్లో వాట్సాప్ పింక్ యాప్ డౌన్లోడ్ చేసి ఉంటే ఇప్పుడే దానిని అన్ ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత, మీ ఫోన్ని బ్యాకప్ చేసి ఫార్మాట్ లేదా రీసెట్ చేయండి. మీరు ఈ వాట్సాప్ పింక్ గురించి ఇతరులకు అవగాహన కల్పించండి. తాజా స్కామ్లను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్నేహితుల, కుటుంబ సభ్యులతో సమాచారాన్ని పంచుకోండి. అవగాహన పెంపొందించడం ద్వారా ఇతరుల స్కామ్ల బారిన పడకుండా మీరు సహాయం చేయవచ్చు. మోసానికి గురైతే బాధితులు జ్టి్ట https://www. cybercrime.gov.in/ పోర్టల్లో రిపోర్ట్ చేయవచ్చు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తు.. ‘పింక్ వాట్సాప్’!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా ప్రజల నుంచి భారీగా డబ్బు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలను తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల వినియోగదారుల్లో అత్యధికం మంది ఉపయోగించే వాట్సాప్ ద్వారా మాల్వేర్లను చొప్పించే ప్రణాళికను ఇటీవల కాలంలో అమలు చేస్తున్నారు. ఆకుపచ్చ రంగులో కనిపించే వాట్సాప్... సరికొత్త ఫీచర్లతో గులాబీ రంగులో (పింక్) వచ్చిందంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇందుకోసం వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాలంటూ సైబర్ నేరగాళ్లు లింక్లు పంపుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఎస్ఎంఎస్లతోపాటు వాట్సాప్ మెసేజ్ల రూపంలో ఈ లింక్లు పంపుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ఈ లింక్లను క్లిక్ చేసి అది అడిగే అప్డేట్ కోసం ఫోన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేస్తే ఫోన్లోని ఫొటోలు, కాంటాక్ట్ నంబర్లు, బ్యాంకుల పాస్వర్డ్ల వంటి వివరాలన్నీ సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఆయా వ్యక్తులు సభ్యులుగా ఉండే వాట్సాప్ గ్రూప్లలోకి ఆటోమేటిక్గా పింక్ వాట్సాప్ పేరిట లింక్లు షేర్ అవుతాయని పేర్కొన్నారు. కీబోర్డ్ ఆధారిత మాల్వేర్లను పింక్ వాట్సాప్లోకి చొప్పించడం ద్వారా బ్యాంకు పాస్వర్డ్లను తస్కరించి సైబర్ నేరగాళ్లు డబ్బు కొట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పింక్ వాట్సాప్ పేరిట వచ్చిన లింక్లను ఓపెన్ చేసి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొని ఉంటే వాటిని వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తు న్నారు. అన్ఇన్స్టాల్ చేస్తేనే ఆ నకిలీ లింక్లను షేర్ కాకుండా ఆపగలుగుతామని చెబుతున్నారు. ఒకవేళ మనకు తెలిసిన వారి నుంచి ఇలా పింక్ వాట్సాప్ పేరిట ఏవైనా మెసేజ్లు వస్తే వారిని వెంటనే అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. -
పింక్ డ్రెస్ లో మతి పోగోడుతున్న ప్రియమణి (ఫోటోలు)
-
పింక్ విల్లా అవార్డ్స్ సీజన్-2 లో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
స్త్రీ శక్తి: లండన్ మ్యూజియానికి పింక్ శారీ!
ఎగరడానికి రెక్కలు సవరించిన కాలం అది. ‘పోనీలే’ అని రాజీపడే జీవులు సమరశంఖం కోసం గొంతు సవరించిన కాలం అది. ‘గులాబీ గ్యాంగ్’ అంటే పోరాట చరిత్ర. ఇప్పుడు ఆ చరిత్ర లండన్ మ్యూజియానికి చేరనుంది. ప్రపంచంలోని ప్రఖ్యాత మ్యూజియంలలో లండన్ ‘డిజైన్ మ్యూజియం’ ఒకటి. ప్రపంచ నలుమూలలకు సంబంధించి భిన్నమైన డిజైన్లకు ఇదో వేదిక. ఈ వేదికపై స్త్రీ శక్తిని ప్రతిఫలించే, ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీర సగర్వంగా రెపరెపలాడనుంది. 2006లో.. ఉత్తర్ప్రదేశ్లోని బాందా జిల్లాలో ఏ కొద్దిమందో మహిళలలో తప్ప ఎవరూ ప్రశాంతంగా లేరు. పట్టపగలు రోడ్డు మీదికి వెళ్లాలన్నా భయపడే రోజులు. మరోవైపు కట్నపు వేధింపులు, గృహహింస! అలాంటి సమయంలో ‘మనం ఏం చేయలేమా!’ అనే నిస్సహాయతలో నుంచి పుట్టుకు వచ్చిందే గులాబీ గ్యాంగ్! ‘నువ్వు నేను కాదు... మనం’ అనే నినాదంతో బృందంగా ముందుకు కదిలారు. పింక్ శారీని యూనిఫామ్గా చేసుకున్నారు. ఈ బృందానికి సంపత్పాల్దేవి నాయకత్వం వహించింది. పదుల సంఖ్యతో మొదలైన గులాబీ గ్యాంగ్లో ఇప్పుడు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది సభ్యులు ఉన్నారు. తాజాగా... లండన్ ‘డిజైన్ మ్యూజియం’ క్యూరేటర్ ప్రియా ఖాన్చందాని నుంచి సంపత్పాల్దేవికి ఇమెయిల్ వచ్చింది. అందులో ఉన్న విషయం సంక్షిప్తంగా...‘ప్రియమైన గులాబీ గ్యాంగ్ సభ్యులకు, మీ ధైర్యసాహసాలకు సంబం«ధించిన వార్తలను ఎప్పటికప్పుడు చదువుతూనే ఉన్నాను. నాకు అవి ఎంతో ఉత్తేజాన్ని, బలాన్ని ఇస్తుంటాయి. మీ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీరను ఆఫ్బీట్ శారీ టైటిల్తో మ్యూజియంలో ప్రదర్శించాలనుకుంటున్నాం. ఈ అవకాశాన్ని గర్వంగా భావిస్తున్నాము’ ‘మా పోరాట స్ఫూర్తి విదేశీగడ్డపై అడుగు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. మా సభ్యులలో ఒకరు ధరించిన చీరను పంపబోతున్నాం’ అంటుంది సంపత్పాల్దేవి. -
గులాబీ కలర్ వేసినందుకు ఏకంగా రూ. 19 లక్షలు జరిమానా
ఇంటి ముందర తలుపులకు ఎలాంటి కలర్లు ఉండాలో కొన్ని దేశాల్లో షరతులు ఉంటాయి. ఆయా దేశాల్లో ఏ కలర్ పడితే అది వేస్తే అక్కడ అధికారులు అంగీకరించారు. ఐతే ఒక మహిళ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటి ముందర తలుపులకు తనకు నచ్చిన రంగు వేసింది. దీంతో సదరు కౌన్సిల్ అధికారులు ఈ విషయమై అభ్యంతర వ్యక్తం చేస్తూ సుమారు 19 లక్షలు జరిమానా విధించారు. ఈ వింత ఘటన స్కాట్లాండ్లో చోటు చేసుకుంటుంది. వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఉన్న మిరాండా డిక్సన్ అనే మహిళ తన ఇంటి ముందర తలుపులకు పింక్(గులాబీ) కలర్ వేసింది. దీంతో ఆ సిటీ కౌన్సిల్ ప్లానర్లు ఈ కలర్పై అభ్యంతరరం వ్యక్తం చేస్తూ... తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. కానీ ఆ మహిళ మాత్రం తన ఇంటికి ఆ రంగు ఎంతో అందాన్ని ఇచ్చిందని, చూడముచ్చటగా ఉందని చెబుతోంది. ఆమెకు ఈ ఇల్లు 2019లో తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లభించింది. ఈ ఇంటిని రెండేళ్లపాటు మరమత్తులు చేయించింది. ఐతే చివర్లో ఫినిషింగ్ టచ్గా ఇంటి ముందు ఉండే తలుపులకు మాత్రం గూలాబి రంగు వేసింది. యూకేలోని బ్రిస్టల్, నాటింగ్హిల్, హారోగేట్ వంటి నగరాల్లో ఇంటి ముందు తలుపులు ముదురు రంగులో ఉంటే నా ఇంటి ముఖ ద్వారం మాత్రం ఇలా భిన్నంగా గులాబీ రంగులో ఉండటం తనకు ఆనందంగా ఉంటుందని చెబుతోంది. అదీగాక చాలామంది తన ఇంటి ముందు ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారని, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందని అంటోంది. అంతేగాదు పలువురు తనకు మద్దతు తెలిపారని, ఈ రంగు చాలా బావుటుందంటూ సిటీ కౌన్సలర్లకు నచ్చచెప్పే ప్రయత్నం కూడా చేసింది. కానీ కౌన్సలర్ ప్లానర్లు మాత్రం ససేమిరా అంటూ తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. అంతేగాదు ఒకవేళ తలుపులకు రంగు మార్చనట్లయితే సుమారు రూ. 19 లక్షల వరుకు జరిమాన ఎదుర్కోవాల్సి ఉంటుందని తెగేసి చెప్పారు. (చదవండి: లాక్డౌన్ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం) -
గులాబీ రంగునీళ్లు బాటిలే మెయిన్ ఎవిడెన్స్.. దీని వెనుక కథ తెలుసా?
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): అవినీతి నిరోధక శాఖ(యాంటీ కరప్షన్ బ్యూరో) పలు ఆకస్మిక దాడుల్లో లంచావతారాలను పట్టుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయా అధికారులు లంచాలు తీసుకునే క్రమంలో ముందస్తు పథకం ప్రకారం ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. అయితే ఇలా అవినీతిపరులను పట్టుకున్నప్పుడు కామన్గా కనిపించే ఒక ఇమేజ్ ఎప్పుడైనా గుర్తించారా.? అదే కరెన్సీ నోట్లపై గులాబీ రంగు నీళ్ల బాటిళ్లు ఉంచే ఫొటో. అయితే దీని వెనుక కథ ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయతనించారా? చదవండి: చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్ఎం.. అసలు ఏం జరిగిందంటే? నిజానికి ఈ రంగు నీళ్ల బాటిలే ఆ నేరంలో ప్రధాన సాక్షమని మీకు తెలుసా.? అయితే రండి తెలుసుకుందాం. లంచం డిమాండ్తో విసుగుపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించినప్పుడు ఆయనకు ఇవ్వబోయే కరెన్సీ నోట్లకు ఏసీబీ అధికారులు ముందుగా కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆ నోట్లపై ఫినాప్తలీన్ అనే తెల్లని రసాయన పొడిని ఆ నోట్లపై చల్లి బాధితుడి చేత అవినీతి అధికారికి ఇప్పిస్తారు. బాధితుడి నుంచి అధికారి ఆ నోట్లు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేస్తారు. లంచగొండి అధికారి తీసుకున్న ఆ నోట్లను గుర్తించి వాటిని తొలుత ఆ అధికారి ఎదుటే చేతులతో తాకుతారు. అనంతరం చేతులను సోడియం కార్బోనేట్తో ఓ బౌల్లో కడిగినప్పుడు రసాయన చర్య జరిగి నీళ్లు గులాబీ రంగులోకి మారతాయి. దీంతో ఆ అధికారి లంచం తీసుకున్నట్టు శాస్త్రీయంగా నిర్ధారించడంతో పాటు ఈ ద్రావణాన్ని బాటిళ్లలో సేకరించి నోట్లపై ప్రదర్శిస్తారు. ఆ అవినీతి ఘటనలో ఆ బాటిళ్లలో ద్రావణాన్ని ప్రధాన సాక్షంగా తీసుకుంటారు. -
రంగులు అద్దిన చిత్రం కాదండోయ్.. ప్రకృతి దిద్దుకున్న మనోహర దృశ్యం
ఇది కాన్వాస్పై రంగులు అద్దిన చిత్రం కాదు.. వినీలాకాశంపై ప్రకృతి దిద్దుకున్న ముగ్ధ మనోహర దృశ్యం. దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా వద్ద గులాబీ, ఊదా, నారింజ రంగుల మిశ్రమంతో ఆకాశంపై పరుచుకున్న వర్ణమాలిక. అంటార్కిటికాలోని న్యూజిలాండ్ పరిశోధన కేంద్రం టెక్నీషియన్ స్టువర్ట్ షా ఈ చిత్రాలను క్లిక్మనిపించారు. గగనతల రంగుల వెనకున్న కారణం విచిత్రమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 15న అంటార్కిటికాకు సుమారు 7 వేల కిలోమీటర్ల దూరంలోని టోంగా దీవుల్లో ఉన్న సముద్రగర్భ అగ్నిపర్వతం బద్దలై ఏకంగా 58కి.మీ. ఎత్తుకు బూడిద, దుమ్ము, ధూళిని ఎగజిమ్మిందని చెప్పారు. దీంతో భూ వాతావరణంలోనే నేటికీ కలియతిరుగుతున్న ధూళి తుంపరల్లో కొన్ని సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో కాంతిని అడ్డుకున్నప్పుడు ఆకాశంలో ఇలా రంగురంగుల దృశ్యాలు కనిపిస్తాయని వివరించారు. ఇప్పటికే ఇలాంటి దృశ్యాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వద్ద గగనతలంపై కనిపించినట్లు చెప్పారు. ఈ అగ్నిపర్వత ధూళి తుంపరలు సుమారు రెండేళ్లపాటు భూ వాతావరణంలో ఉంటాయని పేర్కొన్నారు. చదవండి: India: అత్యధిక బిలియనీర్లు ఏ రంగం నుంచి ఉన్నారో తెలుసా? The sky over Antarctica turned pink due to the January eruption of the Hunga-Tonga-Hunga-Haapai volcano in the Pacific Ocean. pic.twitter.com/AhPwWv0Gp1 — Spriteer (@spriteer_774400) July 17, 2022 -
చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప..!
Rare Pink Hand Fish Spotted In Australia: ఆస్ట్రేలియాలో టాస్మానియన్ తీరంలో తొలిసారిగా అరుదైన చేతులతో నడిచే గులాబీ చేప(పింక్ హ్యాండ్ ఫిష్) కనిపించింది. అయితే ఈ పింక్ హ్యాండ్ ఫిష్ను గతంలో 1999లో సముద్రం అడుగున ఈత కొట్టే ఒక డైవర్ గుర్తించారు. అయితే ఇప్పుడు తాజాగా టాస్మానియా దక్షిణ తీరానికి 120 మీటర్ల లోతులో ఈ పింక్ హ్యాండ్ ఫిష్ని ఆస్ర్టేలియా పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు. (చదవండి: పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లక్షల్లో రుణాలు!) ఈ క్రమంలో యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంటార్కిటిక్ అండ్ మెరైన్ స్టడీస్కు చెందిన ప్రొఫెసర్ నెవిల్లే బారెట్ అతని బృందం పగడపు పీతలు, చేప జాతులు గురించి సర్వే చేయడానికి మెరైన్ పార్క్ సముద్రగర్భంలో ఒక కెమెరాను ఉంచింది. అయితే ఆ మెరైన్ స్టడీస్ రీసెర్చ్ అసిస్టెంట్ యాష్లీ బాస్టియాన్సెన్ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నప్పుడు ఆమె ఈ పింక్ హ్యాండ్ఫిష్ను గుర్తించింది. అంతేకాదు ఆ ఫుటేజ్లో ఈ పింక్ ఫిష్ పీతలో దాడి నుంచి తప్పించేకునే నిమిత్తం కంగారుగా వెళ్లుతున్నట్లుగా కనిపించింది. ఈ అత్యధునిక సాంకేతికతో కూడిన కెమెరా తమకు మంచి చిత్రాలతో కూడిన అరుదైన జాతులను గురించి తెలియజేసింది అని ప్రొఫెసర్ బారెట్ అన్నారు. అంతేకాదు ఇలాంటి అరుదైన జాతులు లోతైన ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పరుచుకుంటాయని చెప్పారు. పైగా ఈ పింక్ ఫిష్లు అధిక-పరిమాణ చేతులు కలిగి ఉంటాయని అవి సముద్రగర్భం వెంబడి నడవడం, ఈత కొట్టడం వంటివి చేస్తాయని పేర్కొన్నారు. (చదవండి: పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!) -
పింక్ వాట్సాప్'తో జర జాగ్రత్త.. లింక్ క్లిక్ చేస్తే ఇక అంతే..!
రోజు రోజుకి సైబర్ క్రైమ్ భారీన పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ మధ్య ఫేక్ లింకులు వాట్సాప్ లో ఎక్కువగా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో లింకు కూడా వైరల్ అవుతుంది. వాట్సాప్ థీమ్ను డిఫాల్ట్ ఆకుపచ్చ రంగు నుంచి గులాబీ రంగులోకి మార్చుకోండి అనే లింక్ పేరుతో సందేశం వస్తుంది. అయితే, ఈ లింకులను ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయవద్దు అని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేల ఆ లింక్పై క్లిక్ చేస్తే సైబర్ క్రైమినల్స్ మీ ఫోన్ను హ్యాక్ చేయవచ్చు. మీరు మీ వాట్సాప్ ఖాతాలో లాగిన్ కావడానికి అవకాశం కోల్పోవచ్చు. అలాగే ఫోన్లోని ఫొటోలు, సందేశాలు, కాంటాక్ట్స్ వంటి సమాచారమంతా సైబర్ కేటుగాళ్ల చేతికి వెళ్లిపోతుందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాజశేఖర్ రాజహరియా తెలిపారు. వాట్సాప్ అధికారిక యాప్ను గూగుల్ ప్లేస్టోర్, యాప్స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ వోయగర్ ఇన్ఫోసెక్ డైరెక్టర్ జితెన్ జైన్ పేర్కొన్నారు. పింక్ వాట్సాప్, గోల్డ్ వాట్సాప్ తదితర యాప్స్ నకిలీవని తెలిపారు. నకిలీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: వాట్సాప్ వినియోగదారులకి హెచ్చరిక! -
అబ్బాయిలూ.. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’
మనసును తాకండి. అందమే అంతా కాదు. అబ్బాయిలూ.. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’. ఆశల్ని తుంచేయకండి. నవ్వుల్ని ఆర్పేయకండి. అమ్మాయిల్ని.. జబ్బున పడేయకండి. కొత్త కొరియన్ ‘పాప్’! గర్ల్ బ్యాండ్ పాడుతోంది. ప్రపంచం ఇష్టంగా వింటోంది. ‘‘నీ కళ్ల ముందే కూలిపోతున్నా.. పాతాళంలోకి జారిపోతున్నా.. అయినా రెండు చేతులతో నా ఆశను పట్టుకుని పైకి ఎగబాకుతున్నా.’’పాడుతున్నారు ‘బ్లాక్పింక్’ గర్ల్స్. ‘‘నన్ను చూడు, నీకు ఏమనిపిస్తోంది?’’ అని.. కొనసాగింపుగా అడుగుతున్నారు జెన్నీ, జిసూ, లిసా, రోజ్. ఎవరిని అడుగుతున్నారు! ఆడపిల్లకు ఆశలు కల్పించి పారిపోయే మగధీరుడొకడు ఉంటాడు కదా, అతడిని. కొరియన్ గర్ల్ పాప్ బ్యాండ్ ‘బ్లాక్పింక్’ కొత్త ఆల్బమ్ ‘ది అల్బమ్’ లోని ఎనిమిది పాటల్లో ఒకటైన ‘హౌ యు లైక్ దట్’ లోని కూలిన ఆశల గీతమిది. అక్టోబర్ 2న ఈ నలుగురమ్మాయిల బ్యాండ్ విడుదల చేసిన ‘ది ఆల్బమ్’ అక్టోబర్ 26 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల 20 వేల కాపీలకు పైగా అమ్ముడై చరిత్ర సృష్టించింది. దక్షిణ కొరియా అంటే ఇంతవరకు ఆ ఏడుగురు అబ్బాయిల బి.టి.ఎస్. బాయ్ బ్యాండ్ మాత్రమే. వారే పాప్ హీరోలు, వారే పాప్ కింగులు. ఇప్పుడీ గర్ల్ బ్యాండ్ ‘బ్లాక్పింక్’ ధాటికి ఆ ఏడుగురు 2013 నుంచీ నిర్మించుకుంటూ వస్తున్న ‘పాప్’ లోక దుర్భేద్య మహా సామ్య్రాజ్యం బీటలు వారబోతున్న దృశ్యం లీలగా ఆవిష్కృతం కాబోతున్నట్లే ఉంది. బ్లాక్పింక్ వరుసగా మూడో వారం ‘బిల్బోర్డ్ 200’ లిస్టులో తొలి పదిస్థానాలలో ఉంటూ వస్తోంది! ‘ది ఆల్బమ్’లోని రెండో ట్రాక్ ‘ది ఐస్ క్రీమ్’! ‘దాహంగా ఉన్నట్లున్నావు.. కొంచెం దగ్గరకు రా..’ అని కోన్ల లా మూతిని తెరిచి మూడు నిముషాల మూడు సెకన్లలో అబ్బాయిల్ని ఫ్రీజ్ చేసేసే బ్లాక్పింక్ గర్ల్స్.. మూడో ట్రాక్ ‘ప్రెట్టీ శావేజ్’లో ‘బాయ్స్.. మేం వైలెంట్గానే ఉంటాం. తట్టుకోగలిగితే ఉండండి’ అని కొంచెం రూడ్గానే చెబుతారు. ‘రూడ్ కాదు, అందరికన్నా రూడ్’ అని ఇప్పటికే, ఈ నాలుగేళ్లలో ఈ నలుగురు పిల్లలకు పేరొచ్చేసింది! 2016లో ప్రారంభించారు బ్లాక్పింక్ పాప్ బ్యాండ్ని. ఈ ఎనిమిది ట్రాక్లకు ముందు ఐదు సింగిల్స్ ఉన్నాయి. అసలు వాటితోనే వాళ్లేమిటో చూపించారు. ఆ ఎనర్జీని తట్టుకోవాలంటే మళ్లీ వాళ్ల దగ్గరికే వెళ్లాలి ‘ది ఐస్ క్రీమ్’ కోసం! మొత్తం 174 సౌత్ కొరియన్ గర్ల్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిల్లో పది లక్షల ఆల్బమ్ కాపీలు అమ్ముడై రికార్డు నెలకొల్పిన తొలి బ్యాండ్ ‘బ్లాక్పింక్’! ఏమిటి బ్లాక్పింక్ అంటే?! ఈ అమ్మాయిలు కల్పించిన అర్థం.. ‘అందమే అంతా కాదు’ అని! అమ్మాయిల్ని అందమైన పింక్ గులాబీతో పోలుస్తాం. ‘అందాన్నే చూడకండి’ అంటూ పింక్కి బ్లాక్ని జోడించి బ్లాక్పింక్ అని తమ బ్యాండ్కి పేరు పెట్టుకున్నారు. బ్లాక్పింక్ అని కాకుండా, పింక్బ్లాక్ అంటే మళ్లీ అది బ్లాక్కి పింక్ అందాన్ని అంటు కట్టినట్లు. అందుకే బ్లాక్ని ముందుకు తీసుకున్నారు. తెలివైన అమ్మాయిలే. ‘లవ్సిక్ గర్ల్స్’ ఐదో ట్రాక్. అమ్మాయిల్ని ప్రేమ సతాయింపులు ఎంత జబ్బున పడేస్తాయో చూడండి. ‘ప్రేమ మనల్ని వలపన్ని కిటీకీలు లేని గదిలో బంధించింది. ప్రతిసారీ బాధిస్తోంది. గుండెలు పగిలి ఏడ్చేలా చేస్తోంది. చివరికి ఏడుపు కూడా రానంతగా మొద్దుబారుతున్నాం..’’ అని పాడతారు. ‘బెట్ యు వాన్నా’, ‘క్రేజీ ఓవర్ యు’, ‘లవ్ టు హేట్ మీ’, ‘యూ నెవర్ నో’ మిగతా నాలుగు ట్రాక్స్. ‘ఎక్కడికెళదామో చెప్పు, అన్నీ సర్దుకుని నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను..’ (బెట్ యు వాన్నా), ‘నువ్వంటే నాకు పిచ్చి. నీ మనసులోనూ నేను ఉన్నానని తెలుసు. అయినా కానీ నువ్వు గీసుకున్న గీతను దాటి రానులే’ (క్రేజీ ఓవర్ యు), ‘నెగిటివ్ డేస్, నెగిటివ్ నైట్స్. బేబీ యు ఆర్ వేస్టింగ్ ఆల్ యువర్ టైమ్’ (లవ్ టు హేట్ మీ), ‘నేను ప్రకాశవంతంగా నవ్వుదామని ప్రయత్నించిన రోజు.. చీకటి మరింతగా గాఢమైన నన్ను మింగేయాలని చూస్తుంటుంది ఎందుకనో..’ (యూ నెవర్ నో).. అని జెన్నీ, జిసూ, లిసా, రోజ్.. అమ్మాయిలు ఎంతగా ప్రేమిస్తారో, ఆ ప్రేమ వల్ల అంతగా హర్ట్ అవుతూ ఉంటారని ‘ది అల్బమ్’ ట్రాకులలో పాడతారు. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’ అని చెబుతారు. అందుకే ‘బ్లాక్పింక్’ ఇంతగా హిట్ అయినట్లుంది. -
మానసిక విజయం
సుప్రీంకోర్ట్లో చంద్రచూడ్గారికి అసిస్టెంట్గాపనిచేయడమంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ను గడించడమే.ముఖ్యంగా ఆ మూడు తీర్పులప్పుడు చేసినపరిశోధనతో చాలా నేర్చుకున్నాను. ఆ చారిత్రాత్మకతీర్పులకు నేను ప్రత్యక్ష సాక్షిని. ఇంతకు మించినఆనందం ఏం ఉంటుంది? ఆ మూడు సందర్భాల్లోకోర్టు హాలులో వినిపించిన చప్పట్లు.. కోర్ట్ బయట మీడియాతో సహా సామాన్య జనం జరుపుకున్నసంబరాలు ఎప్పటికీ మరిచిపోలేను. – మానసి హైదరాబాద్.. 2017 సంవత్సరం.. ఒకరోజు రాత్రి పదిగంటల సమయం.. పని ముగించుకొని ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరారు అడ్వకేట్ మానసి చౌదరి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 దగ్గర సిగ్నల్స్ దగ్గర తన కారును ఎవరో ఢీ కొట్టినట్టని పించింది ఆమెకు. పరిస్థితి అర్థమయ్యేలోపే ఇద్దరబ్బాయిలు కారు దిగి ఆమె కారు దగ్గరకు వచ్చి.. కారు అద్దాలను పగలకొట్టారు విండోస్, రేర్ వ్యూ మిర్రర్స్ సహా. ఈ బీభత్సాన్ని చూసి గట్టిగా అరిచారు మానసి. దాంతో ఆమెకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిపోయారు ఆ ఇద్దరూ. వాళ్ల కారు నంబర్ ప్లేట్ను ఫొటో తీసుకొని షీ టీమ్స్కి సమాచారమందించి, దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారామె. తెల్లవారి.. ఆ కుర్రాళ్లిద్దరినీ పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. ఆ అబ్బాయిలిద్దరి నుంచి బేషరతుగా క్షమాపణ రాయించుకున్నారు మానసి. ‘నిజానికి వాళ్ల మీద కంప్లయింట్ చేయాలనేమీ అనుకోలేదు. కాని అలాగే వదిలేస్తే.. ఏం చేసినా ఆడవాళ్లు నోరు మెదపరు, ఏం చేసినా చెల్లుతుంది అనే రాంగ్ మెసేజ్ పోతుంది. అందుకే కంప్లయింట్ ఇచ్చా’ అని జరిగిన సంఘటనను ఒకసారి గుర్తు చేసుకున్నారు ఆమె. అసలు ఈ ప్రస్తావన ఇప్పడు ఎందుకు? రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన హక్కులు, కల్పించిన సమస్త చట్టాలన్నిటినీ ఒక దగ్గర చేర్చి‘పింక్ లీగల్’ అనే వెబ్సైట్ను ప్రారంభించారు మానసి, మొన్న ఎనిమిదో తారీఖు.. అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున (8 మార్చి, 2020). ఈ సందర్భమే పైన ప్రస్తావనకు కారణం. ముందు ఆమెను పరిచయం చేసుకుందాం. ఆమె ముంబైలో పుట్టారు.హైదరాబాద్లో పెరిగారు. ఢిల్లీలోని జిందాల్ గ్లోబల్ లా కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చేసి హైకోర్ట్ లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. యేడాది తర్వాత అంటే 2018లో మళ్లీ ఢిల్లీ వెళ్లారు సుప్రీంకోర్ట్ లాయర్గా అనుభవం గడించడానికి. జస్టీస్ చంద్రచూడ్ అసిస్టెంట్లలో ఒకరిగా చేరారు. ఎల్జీబీటీ సంబంధాలు (ఐపీసీ 377పై సడలింపు) నేరం కాదని, అడల్ట్రీ నేరం కాదని (ఐపీసీ 497), శబరిమల ఆలయంలోకి మహిళలకూ ప్రవేశం ఉండాలని వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుల్లో జస్టీస్ చంద్రచూడ్ కృషి ఉంది. అందులో మానసికీ భాగస్వామ్యం ఉంది. 2019లో మళ్లీ హైదరాబాద్ హైకోర్ట్కి వచ్చేశారు ఆమె. పింక్ లీగల్ ఆలోచన.. ‘లా చదువుతున్నప్పుడే అనుకున్నాను.. మహిళలకు సంబంధించిన అన్ని విషయాలను ఒక్కచోటకు చేర్చే ప్రయత్నమేదో చేయాలని. ఆ ఆలోచన హైదరాబాద్ వచ్చాక కూడా కొనసాగింది. అందుకే 2017లో నల్సార్ లా కాలేజ్ స్టూడెంట్స్తో కలిసి ఆన్ లైన్ సర్వే ఒకటి చేశాను. తమకున్న హక్కులేంటి? తమకోసం ఎన్ని రకాల చట్టాలున్నాయి? అని ఎంతమంది ఆడవాళ్లు తెలుసు అనే విషయం మీద. 80 శాతం మందికి తెలియదని తేలింది సర్వేలో. ఆశ్చర్యం ఏంటంటే వాళ్లలో చాలామంది చదువుకున్న, పట్టణాలు, నగరాల్లో ఉంటున్న మహిళలే! అప్పుడు అనిపించింది నా ఆలోచనను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆచరణలో పెట్టాలని. అయితే ఇతర బాధ్యతల్లో పడి ఆలస్యమై.. ఇప్పటికి సాధ్యమైంది’ అంటూ పింగ్ లీగల్ నేపథ్యం చెప్పుకొచ్చారు ఆమె. ప్రాంతీయ భాషల్లో కూడా.. ప్రస్తుతం పింక్ లీగల్ ఇంగ్లిష్లో ఉంది. త్వరలోనే దేశంలోని ప్రాంతీయ భాషలన్నిటిలోకి అనువదించనున్నారు. ఈ వారం, పదిరోజుల్లోనే రెండువేల మందికి పైగా సబ్స్క్రైబ్ చేశారట. వీళ్లలో అబ్బాయిలూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులు అంటారామె. ‘చదువురాని, గ్రామీణ ప్రాంతం వాళ్లకూ తేలికగా అర్థమయ్యేలా ఈ హక్కులు, చట్టాలను వివరిస్తూ యూ ట్యూబ్ చానెలూ పెట్టాలనుకుంటున్నాను. నా ఈ ప్రాజెక్ట్కు లా స్టూడెంట్స్ సహకారం చాలా ఉంది. మహిళల హక్కులు, చట్టాల మీద మహిళలకే కాదు పురుషులకూ అవగాహన అవసరం. అది హైస్కూల్ స్థాయి నుంచే ఆరంభిస్తే మరీ మంచిది. దీనిని పాఠ్యాంశాల్లో చేర్చాలి’ అంటున్నారు మానసి.– సరస్వతి రమ -
టైటిల్స్ కుదిరాయి
సినిమా ప్రేక్షకుడి దాకా వెళ్లాలన్నా, ప్రేక్షకుడు థియేటర్ దాకా రావాలన్నా ప్రచారం కీలకం. సినిమా ప్రచారంలో మొట్టమొదటి చాప్టర్ సినిమా టైటిల్. పేరు ఎంత బావుంటే, ఎంత క్యాచీగా ఉంటే సినిమాకి అంత ప్లస్సు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ సినిమాలకు టైటిల్స్ ఫిక్స్ అయ్యాయని తెలిసింది. ఆ వివరాలు... ఆచార్య చిరంజీవి చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సామాజిక అంశాలతో కూడుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి ‘ఆచార్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ని బట్టి గమనిస్తే చిరంజీవి ఈ సినిమాలో ఫ్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారని ఊహించవచ్చు. డియర్ ప్రభాస్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ముందు ‘జాన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ‘ఓ డియర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అలాగే ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నారని టాక్. వకీల్ సాబ్ హిందీ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్ను తన రీ ఎంట్రీ కోసం ఎంచుకున్నారు పవన్ కల్యాణ్. ఇందులో లాయర్ పాత్రలో నటిస్తున్నారాయన. ఈ సినిమా కోసం ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ రిజిస్టర్ చేశారట. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మే 15న విడుదల కానుంది. -
పవన్ కల్యాణ్ హీరోయిన్ ఫిక్స్!
పవర్స్టార్ పవన్ కల్యాణ్ వేగం పెంచాడు. రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్.. తాజాగా వరుస సినిమాలతో దూకుడు పెంచాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘పింక్’రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తమిళంలో కూడా హిట్ సాధించిన పింక్ రిమేక్ను పవన్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంజలి, నివేదా థామస్, అనన్య పాండేలు నటిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నారట. కాగా, ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే మరో చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లె పనిలో పవన్ ఉన్నట్లు సమాచారం. ఎప్పటినుంచో ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో పవన్ సరసన ‘కంచె’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ను ఎంపిక చేసినట్లు అనధికారిక సమాచారం. చారిత్రక నేపథ్యంతో పాటు ఓ ఎమోషనల్ విప్లవాత్మకమైన పాయింట్ను కూడా టచ్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. అంతేకాకుండా ఈ చిత్రంలో మంచి కోసం పరితపించే ఓ దొంగ పాత్రలో పవన్ నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు చిత్రాలతో పాటు పూరి జగన్నాథ్ చిత్రం కూడా లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల్లోకి పవన్ రీఎంట్రీతో అయన అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్?
పవర్స్టార్ పవన్ కల్యాణ్కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ట్విటర్ ట్రెండింగ్లో నిలిచింది. ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో బిజీ అయిన పవన్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే పవర్ స్టార్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ‘పింక్’ను తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్, ఎమ్సీఏ’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక హిందీ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై పవన్ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే పవన్ కళ్యాణ్కు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను పరిశీలిస్తే.. షూటింగ్లో భాగంగా హైదరాబాద్లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో పవన్ పాల్గొన్నారని తెలుస్తోంది. సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు మరోటాక్. అయితే ఈ చిత్ర విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఈ ఫోటోలు నిజమై ఆయన షూటింగ్లో పాల్గొంటే పవన్ ఫ్యాన్స్కు నిజంగా పండగే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్కు ఇది 26వ చిత్రం కావడంతో ట్విటర్లో ‘#PSPK26’ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఇక పింక్ రిమేక్తో పాటు క్రిష్, పూరి జగన్నాథ్లతో కూడా సినిమాలు చేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారని సమచారం. -
పింక్ రీమేక్లో అంజలి?
రెండేళ్ల క్రితం బాలీవుడ్లో విడుదలైన ‘పింక్’ చిత్రం సూపర్హిట్గా నిలిచింది. అనిరుద్ధ రాయ్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతీ కల్హరీ, ఆండ్రియా టారియంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత బోనీకపూర్ ‘పింక్’ చిత్రాన్ని గత ఏడాది తమిళంలో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేశారు. ఇప్పుడు ‘పింక్’ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. ‘దిల్’ రాజు, బోనీ కపూర్ నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి. ‘ఓ మై ఫ్రెండ్, ఎమ్సీఏ’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. తమన్ స్వరకర్త. ఈ సినిమాలో కథ రీత్యా ముగ్గురు అమ్మాయిల పాత్రలు ఉంటాయి. వీరిలో ఇద్దరు అమ్మాయిలుగా అంజలి, నివేదా థామస్ నటించబోతున్నారని లేటెస్ట్ టాక్. ఇక హిందీ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement