-
ఓటీటీలో ఆవేశం.. ఆ సీన్పై చర్చ!
ఫహద్ ఫాజిల్.. అప్పుడే హీరోగా చేస్తాడు.. అంతలోనే విలన్గా నటిస్తాడు. ప్రాధాన్యతను బట్టి ఏ పాత్రలో అయినా దూరేస్తాడు. ఇటీవల అతడు హీరోగా నటించిన మలయాళ మూవీ ఆవేశం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఓటీటీలో ఆవేశంబాక్సాఫీస్ దగ్గర హిట్టందుకున్న మూవీ ఓటీటీలోకి రావడంతో సినీప్రియులు ఆత్రుతగా ఆవేశం సినిమా చూసేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సినిమాలోని ఓ సీన్ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. హిందీ భాషను కావాలని పక్కన పడేశారని కామెంట్లు చేస్తున్నారు.ఫైట్ సీన్లో వార్నింగ్ఇంతకీ ఏమైందంటే.. ఓ ఫైట్ సీన్లో రంగ(ఫహద్ ఫాజిల్) తన కాలేజీలోని సీనియర్లు అజు, బిబి, షాంతన్కు వార్నింగ్ ఇస్తుంటాడు. మలయాళం, కన్నడ భాషల్లో వార్నింగ్ ఇస్తాడు. హిందీలో కూడా ఇద్దామనుకునేసరికి హిందీలో అవసరం లేదులే అంటూ రంగ రైట్ హ్యాండ్ అంబాన్ (సాజిన్ గోపు) అతడిని వారిస్తాడు. హిందీ అక్కర్లేదా?అందరికీ చెప్పింది అర్థమైందిగా.. ఇక వెళ్లిపోండి అని ఆదేశిస్తాడు. హిందీలో అవసరం లేదా? అని హీరో అడిగితే అంబాన్ వద్దని బదులిస్తాడు. ఇది చూసిన కొందరు అధికార భాష హిందీని గౌరవించాలి కదా అని అభిప్రాయపడగా.. అయినా ప్రాంతీయ భాషా చిత్రంలో హిందీ అవసరం ఏముందిలే అని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.చదవండి: ఓ మంచి దెయ్యం టీజర్ చూశారా? -
టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
తెలుగు సినిమాలపై స్టార్ హీరో సంయుక్త మేనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక్కడ నటించాలంటే చాలా కష్టమని చెప్పింది. అలానే టాలీవుడ్లో తనకెదురైన కష్టాల్ని, అనుభవాల్ని బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు చిత్రసీమపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. అలానే మలయాళ ఇండస్ట్రీతో పోల్చి చూస్తే ఇక్కడ ఎలా ఉంటుందనేది కూడా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)'మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించడం చాలా కష్టం. భాష రాకపోవడమనేది ఓ కారణమైతే.. మేకప్ మరో రీజన్. వినడానికి సిల్లీగా ఉన్నాసరే నా వరకు ఇది చాలా పెద్ద విషయం. మలయాళ చిత్రాల్లో మేకప్ త్వరగా అయిపోతుంది. చాలా నేచురల్గా వేస్తారు. యాక్టింగ్ కూడా మనకు నచ్చినట్లు చేసేయొచ్చు. కానీ టాలీవుడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్క్రీన్పై ఎలా కనిపిస్తున్నామనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. దానికి తోడు ఎక్కువ మేకప్ వేస్తారు. చాలా చిరాగ్గా.. ముఖంపై ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది' అని సంయుక్త తన కష్టాల్ని చెప్పుకొచ్చింది.2016లోనే నటిగా మారిన సంయుక్త మేనన్... తొలుత మలయాళ, తమిళ చిత్రాలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్లో అడుగు పెట్టింది. 'భీమ్లా నాయక్', 'బింబిసార', 'విరూపాక్ష', 'సర్' చిత్రాలతో వరస హిట్స్ కొట్టి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. కానీ కల్యాణ్ రామ్ 'డెవిల్'తో ఫ్లాప్ అందుకుంది. ప్రస్తుతం నిఖిల్ 'స్వయంభు' మూవీతో పాటు శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోయే కొత్త చిత్రాల్లో నటిస్తోంది. అలానే హిందీలోకి కూడా అడుగుపెట్టాలని ప్లాన్స్ చేసుకుంటోంది.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి పర్సనల్ వీడియో లీక్) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) -
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ దర్శకుడు సంగీత శివన్ (61) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ క్రమంలోనే మలయాళ, హిందీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?)కేరళకు చెందిన సంగీత్ శివన్.. 1990లో 'వ్యూహం' చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యోధ, గంధర్వం, నిర్ణయం, స్నేహపూర్వం అన్న లాంటి మలయాళ సినిమాలతో పాటు అప్నా సప్నా మనీ మనీ, క్లిక్, యమ్ల పగ్ల దీవానా 2 తదితర హిందీ మూవీస్ చేశారు. చివరగా 2019లో 'భారం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు వయసుతో వచ్చిన అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు.సంగీత శివన్ సోదరుడు సంతోష్ శివన్.. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్గా చాలా పేరు తెచ్చుకున్నారు. దర్శకుడిగానూ కొన్ని మూవీస్ చేశారు. ఇక సంగీత్ శివన్ చనిపోయారని వార్త తెలిసిన తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్)Deeply saddened and shocked to know that Sangeeth Sivan Sir is no more. As a newcomer all you want is someone to believe in you and take a chance.. can’t thank him enough for Kya Kool Hai Hum & Apna Sapna Money Money. Soft spoken, gentle and a wonderful human being. Am heart… pic.twitter.com/kvTkFJmEXx— Riteish Deshmukh (@Riteishd) May 8, 2024 -
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
పెళ్లి చేసుకునేది కలకాలం కలిసుండటానికే! విడిపోతారని ముందే తెలిస్తే పెళ్లెందుకు చేసుకుంటారు? ప్రేమ దగ్గరే ఆగిపోతారు. అయినా అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న ఎంతోమంది పలు కారణాల వల్ల ఆ బంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు. అందులో మలయాళ హీరోయిన్ భామ కూడా చేరింది. భర్తతో విడిపోయిన విషయాన్ని తొలిసారి అధికారికంగా వెల్లడించింది.సింగిల్ మదర్ అయ్యాకే..ప్రస్తుతం తాను సింగిల్ పేరెంట్ అని తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'నేను చాలా స్ట్రాంగ్ అని ఇంతవరకూ తెలీలేదు. సింగిల్ మదర్ అయిన తర్వాతే ఈ విషయం తెలిసొచ్చింది. ఇప్పుడు ధృడంగా నిలబడటమే నా ముందున్న ఏకైక ఛాయిస్. నా కూతురికి నేను.. నాకు నా కూతురు' అంటూ తన పాపతో ఆడుకుంటున్న ఫోటో పోస్ట్ చేసింది. ఇది చూసిన జనాలు నువ్వు చాలా ధైర్యవంతురాలివి.. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అని కామెంట్లు చేస్తున్నారు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంకాగా భామ.. 2020లో అరుణ్ జగదీశ్ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. గత కొంతకాలంగా భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే మానేసింది నటి. ఇంతలోనే తను భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. అందుకుగల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈమె తెలుగులో మంచివాడు అనే మూవీలో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Bhamaa (@bhamaa) చదవండి: తమిళంలో ఇటీవలే రిలీజ్.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి! -
ప్రేమలు బ్యూటీ అసలు పేరేంటో తెలుసా? చిన్న పొరపాటు..
మమితా బైజు.. ఇప్పటివరకు 15కు పైగా సినిమాలు చేసింది. కానీ సౌత్లో ఒక్కసారిగా ట్రెండ్ అయింది మాత్రం 16వ సినిమా ప్రేమలుతోనే! ఇప్పటివరకు అన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ప్రేమలు మూవీతో వచ్చింది. ప్రస్తుతం రెబల్ మూవీతో తమిళంలో ఎంట్రీ ఇవ్వనుంది. అసలు పేరు అది కాదు!తెలుగులోనూ అవకాశాలు తలుపుతడుతున్నాయి. అయితే ఈమె అసలు పేరు మమిత కాదట.. నమిత! హాస్పిటల్ సిబ్బంది బర్త్ సర్టిఫికెట్లో ఎన్ అనే అక్షరానికి బదులుగా ఎమ్ అని రాసేశారు. దీంతో నమిత కాస్త మమిత అయిపోయింది. పేరెంట్స్ కూడా దీన్నసలు చూసుకోనేలేదు.ఒక్క అక్షరంబడిలో చేర్పించే సమయంలో మమిత అని పడిందని గమనించారు. అయినా ఈ పేరు కూడా బానే ఉందని అలాగే ఉంచేశారు. మమిత అంటే మలయాళంలో మిఠాయి అని అర్థం. ఈ విషయాన్ని ప్రేమలు బ్యూటీయే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక్క పొరపాటుతో తన జాతకమే మారిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారుచదవండి: ఓటీటీల్లోకి ఏకంగా 17 మూవీస్.. ఆ రెండు స్పెషల్ -
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో వచ్చామా, పనిచేశామా, వెళ్లిపోయామా అనేలా ఉంటారు. మరికొందరు మాత్రం ఊహించని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. భావన అలాంటి హీరోయిన్ అని చెప్పొచ్చు. 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ జీవితంలో కాంట్రవర్సీలు బోలెడు ఉన్నాయి. కిడ్నాప్, లైంగిక దాడికి గురవడం, అబార్షన్ అయిందని రూమర్స్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వచ్చిన పుకార్ల గురించి స్పందించింది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు కిడ్నాప్ అయింది. ఓ స్టార్ హీరోని ఈమెని ఎత్తుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ కేసులో మలయాళ హీరో దిలీప్ని అరెస్ట్ కూడా చేశారు. ఈ రచ్చ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన.. 2018లో నిర్మాత నవీన్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటోంది. తాజాగా ఈమె నటించిన 'నడికర్' అనే మలయాళ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. అప్పట్లో తన అబార్షన్ గురించి వచ్చిన రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది.'అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానని అన్నారు. అలువాలో గర్భస్రావం అయిందని, కొచ్చి-చెన్నైలోనూ అబార్షన్ చేయించుకున్నానని ప్రచారం చేశారు. ఇలా పలుమార్లు జరగడం వల్ల నేను చనిపోయానని కూడా మాట్లాడారు. వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే చిరాకేస్తోంది. అప్పుడు నా గురించి వచ్చిన రూమర్స్ విని మెంటల్గా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్గా నిలబడ్డాను' అని భావన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి) -
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి
సినిమా నచ్చనప్పుడు బాలేదని విమర్శించడం తప్పు కాదు. కానీ కొందరు వారిని వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగతంగా దూషిస్తుంటారు. లుక్కు బాలేదని, లావైపోయావని.. ఇలా ఎన్నో మాటలంటారు. మరీ ముఖ్యంగా నటీమణులపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతుంటారు. దాదాపు ప్రతి హీరోయిన్, నటీమణులు ఎప్పుడో ఓసారి ఇలాంటి పరిస్థితుల బారిన పడినవారే!నటిపై ట్రోలింగ్తాజాగా మలయాళ నటి అన్నా రేష్మ రాజన్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నువ్వు ఎంత లావున్నావో తెలుసా? ఆ బరువుతో డ్యాన్స్ కూడా చేయలేకపోతున్నావ్.. నీకసలు స్టెప్పులేస్తూ రీల్స్ చేయడం అవసరమా? అని వెక్కిరించారు. తాజాగా ఈ ట్రోలింగ్పై నటి స్పందించింది. తాను ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది.వీడియో నచ్చకపోతే..ఇప్పటికే కీళ్లనొప్పులతో బాధపడుతున్నానని, ఇప్పుడిలాంటి కామెంట్స్ చేసి తనను మరింత బాధపెట్టొద్దని కోరింది. నేను లేదా నా డ్యాన్స్ వీడియో నచ్చకపోతే చెప్పండి.. అంతేకానీ హద్దులు దాటి కామెంట్స్ చేయొద్దని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజ్ఞప్తి చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల ప్రేమకు మురిసిపోయిన అన్నా మరో పోస్ట్లో ఇలా రాసుకొచ్చింది. సరిగా డ్యాన్స్ చేయలేకపోయా..నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఓపక్క టైట్ డ్రెస్, మరోపక్క ఎండ వల్ల సరిగా డ్యాన్స్ చేయలేకపోయాను. అలాగే నేనేమీ పెద్ద ప్రొఫెషనల్ డ్యాన్సర్ని కూడా కాదు. కాకపోతే ఇలా స్టెప్పేయడమంటే ఇష్టం. అందుకే నాకు వచ్చినంతలో డ్యాన్స్ చేశాను. నెక్స్ట్ టైమ్ మరింత బాగా చేసేందుకు ప్రయత్నిస్తాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అని రాసుకొచ్చింది. నటి కెరీర్..కాగా అన్నా రాజన్ 2017లో 'అంగమలి డైరీస్' చిత్రంతో మలయాళ చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'వేలిపడింతె పుస్తకం' సినిమాలో నటించింది. సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీలో పృథ్వీరాజ్ భార్యగా యాక్ట్ చేసింది. ఇటీవల రండు, తిరిమలై సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Anna Reshma Rajan (@annaspeeks) చదవండి: ఓటీటీలో 100 సినిమాలు.. ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి -
ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
హీరోయిన్ కావాలంటే గ్లామర్ చూపించాలి. డ్యాన్స్ చేయాలి. అందంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ వాటితో అవసరం లేకుండా కొందరు స్టార్స్ అవుతుంటారు. ఈ పాప కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. ఎందుకంటే సహాయ నటిగా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఈ మధ్య ఓ మూవీతో హిట్ కొట్టి కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు మమిత బైజు. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. రీసెంట్గా 'ప్రేమలు' సినిమాలో హీరోయిన్ ఈమెనే. ఇది మమిత చిన్నప్పటి ఫొటో. ఇందులో నాన్నతో కలిసి అమాయకంగా చూస్తోంది కదా! చిన్నప్పటి నుంచి అదే క్యూట్నెస్ మెంటైన్ చేస్తూ వచ్చింది. సేమ్ ఇలాంటి ఫొటోనే ఇప్పుడు కూడా ఒకటి తీసుకుంది. దిగువన ఉన్న ఫొటో అదే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)కేరళలోని కిడంగూర్ అనే ఊరిలో పుట్టి పెరిగిన మమిత.. ప్రస్తుతం సైకాలజీ డిగ్రీ చదువుతోంది. ఓవైపు చదువుతూ మరోవైపు సినిమాల్లో నటించేస్తోంది. 2017లో 'సర్వోపరి పాలక్కరన్' అనే మలయాళ మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. అనంతరం పలు చిత్రాలు చేసింది. కానీ 'కోకో' అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈమెకు గుర్తింపు దక్కింది. 'సూపర్ శరణ్య', 'ప్రణయ విలాసం' చిత్రాలతో హీరోయిన్ అయిపోయింది. 'ప్రేమలు'తో సోలో హీరోయిన్గా సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ ఓవరాల్గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.మమిత బైజు వ్యక్తిగత విషయానికొస్తే.. తండ్రి డాక్టర్, తల్లి హౌస్ వైఫ్, ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈమె వయసు 22 ఏళ్లే. కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అలానే 'ప్రేమలు' హిట్ వల్ల విజయ్ దేవరకొండ కొత్త మూవీలోనూ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని అన్నారు. కానీ అందులో నిజం లేదని తెలిసిపోయింది. (ఇదీ చదవండి: క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) -
గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
క్లాసికల్ డ్యాన్సర్, ప్రముఖ నటి కపిల వేణుకు చేదు అనుభవం ఎదురైంది. ఓ గుడిలో తన ఫ్రెండ్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటానికి వెళ్లగా.. ఊహించని అనుభవం తనకు ఎదురైందని చెప్పుకొచ్చింది. ఈ మేకరు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అసలేం జరిగిందో చెబుతూనే తనే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందని తనని తాను సముదాయించుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)'నా స్నేహితురాలి డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటం కోసం లోకల్గా ఉండే ఓ గుడికి ఒంటరిగా వెళ్లాను. అక్కడ ఆల్రెడీ ఉత్సవం జరుగుతోంది. దారి తెలియక అందరూ బయటకు వచ్చే దారి నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాను. అయితే అక్కడే ఉన్న ఓ వాలంటీర్.. నన్ను టచ్ చేసి ఆపాడు. చాలా రూడ్గా మాట్లాడాడు. ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా ఇలా చేయడం ఏంటని కాస్త గట్టిగానే అడిగాను. ఇద్దరు మధ్య కాస్త వాదన జరిగింది. ఈ టైంలో మరో ఆరుగురు వాలంటీర్లు మేమున్న చోటుకు వచ్చారు. వాళ్లందరూ కూడా నాదే తప్పన్నట్లు చెప్పారు. సీన్ చేయకుండా, వెంటనే వెళ్లిపోవాలని కామెంట్ చేశారు''దీంతో ఏడుస్తూ పోలీసుల దగ్గర వెళ్లాను. ఆ తర్వాత కమిటీ మెంబర్లలో ఒకాయన వచ్చి వాలంటీర్లతో మాట్లాడి, నా తండ్రి పేరు తెలుసుకుని నన్ను లోపలికి పంపించేశాడు. ఇంకేదో జరుగుతుందనుకుంటే నాన్న పేరు తెలుసుకుని లోపలికి పంపేయడం నాకు నిజంగా నచ్చలేదు. అయినా గుడికి ఒంటరిగా వెళ్లాలనుకోవడం నాది తప్పు. జనాలు ఎక్కువగా వచ్చారు. వాళ్లని కంట్రోల్ చేయడం వాలంటీర్లకు కష్టమే. అయినా సరే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది' అని వేణు కపిల ఇన్ స్టాలో రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య) View this post on Instagram A post shared by Kapila Venu (@kapilavenu) -
ఉల్లిపొర లాంటి చీరలో మాళవిక అందాల జాతర (ఫొటోలు)
-
నటుడితో ప్రేమ? అవమానిస్తున్నారంటూ నటి భావోద్వేగం
సెలబ్రిటీల చుట్టూ పుకార్లు వైఫైలా ఉంటాయి. దాదాపు ప్రతి సెలబ్రిటీ ఎప్పుడో ఓసారి ఇలాంటి గాసిప్ల బారిన పడినవారే! మలయాళ నటి రేఖ రతీశ్ కూడా 42 ఏళ్ల వయసులో ఓ వ్యక్తిపై మనసు పారేసుకుందని, అతడిని మనువాడబోతుందంటూ పుకార్లు వెలువడ్డాయి. తన కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేశాడని రకరకాలుగా కథనాలు అల్లేశారు. ఇది చూసిన రేఖకు ఒళ్లు మండిపోయింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను ఈ మధ్యే కొత్త కారు కొన్నాను.కారు కొన్నా..మీడియా నావెంట వెంటపడతుందనే షోరూమ్కు వెళ్లలేదు. నా కుమారుడు, మేనల్లుడు కలిసి షోరూమ్కు వెళ్లి కారు తీసుకున్నారు. నా సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలని సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాను. అది చూసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టారీతిన కథనాలు అల్లేశాయి. నా కుటుంబంలోకి కొత్త వ్యక్తిని స్వాగతించానంటూ నాతో పని చేసిన ఓ నటుడి ఫోటోను జత చేసి ఏదేదో రాశారు. ఇంత నీచానికి దిగజారుతారా?ఓపక్క చెత్త కామెంట్లు..నాకంటూ ఓ కుమారుడున్నాడు. వీళ్ల వార్తలు చూసి చుట్టూ ఉన్నవాళ్లు అతడిని ఎంత హేళన చేస్తారో మీకేమైనా అర్థమవుతుందా? ఇప్పటికే ఆన్లైన్లో చెత్త కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడిలా ఏది పడితే అది రాయడం వల్ల నా కుటుంబసభ్యులే నన్ను అనుమానిస్తూ అవమానించారు. ఎంతో బాధేసింది. నాతో లింక్ పెట్టిన ఆ నటుడు నన్ను చెల్లి అని పిలుస్తాడు. మీరు నా రిలేషన్షిప్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ నాకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. నా కుమారుడే నా ప్రపంచం' అని నటి కుండ బద్ధలు కొట్టింది. View this post on Instagram A post shared by RekhaRatheesh (@rekharatheesh3) చదవండి: చాహల్.. ధనశ్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశావ్! 'వీడియోలో అతడెవరు?' -
సినిమాయే జీవితం కాదు.. నన్ను లైట్ తీస్కోండి: పుష్ప విలన్
ఫహద్ ఫాజిల్.. తెలుగు, మలయాళ, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితుడే! సొంత (మలయాళ) ఇండస్ట్రీలో హీరోగా నటించే ఈయన ఇతర భాషా చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లు, విలనిజం పాత్రలు పోషిస్తుంటాడు. ఇటీవల ఈయన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ 'ఆవేశం' రూ.100 కోట్ల క్లబ్బులో చేరింది.సినిమానే జీవితం కాదుఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఫహద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూస్తున్నంతసేపే తనను పట్టించుకోవాలే తప్ప తర్వాత తన గురించి ఆలోచించొద్దన్నాడు. అలాగే సినిమాయే జీవితం కాదని ఉపదేశించాడు. అతడు ఇంకా మాట్లాడుతూ.. 'నేను ఏదీ అనుకున్న సమయానికి మొదలుపెట్టను.. పూర్తి చేయను. నేను చేసే సినిమాలు కూడా ముందుగా ప్లాన్ చేసుకున్నవి కాదు. ఎగ్జయిట్గా అనిపిస్తే వెంటనే చేసేస్తానంతే! ప్రేక్షకులు సినిమా చూసి ఆనందించేందుకు నా వంతు నేను కృషి చేస్తాను.నా గురించి ఆలోచించొద్దువాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్టైన్ అవ్వాలి.. అంతేకానీ తర్వాత నేనేం చేస్తున్నాను? నా లైఫ్ ఎలా ఉంది? అని నాగురించి ఆలోచించకూడదు. థియేటర్ లోపల ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించండి.. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక నన్ను సీరియస్గా తీసుకోకండి. ఖాళీ సమయాల్లోనో లేదా తినేటప్పుడో నటీనటుల గురించి వారి పర్ఫామెన్స్ గురించి జనాలు మాట్లాడుకోవడం నాకస్సలు ఇష్టం ఉండదు.ఇంట్లో ఎందుకు చర్చ?కావాలంటే సినిమా చూసి ఇంటికి తిరిగెళ్లే సమయంలో దాని గురించి డిస్కషన్ చేయండి.. అంతే కానీ ఇంట్లో కూడా దాని గురించే ఎందుకు చర్చ? సినిమాను కూడా ఓ హద్దులో ఉంచాలి. కేవలం మూవీస్ చూడటమే కాకుండా జీవితంలో చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని గుర్తుంచుకోండి' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫహద్.. పుష్ప 2 సినిమాతో పాటు వేటయ్య, మారీషన్ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: మూడో పెళ్లి గురించి ప్రశ్న.. స్టార్ హీరో ఆన్సరిదే..! -
వీడియో: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
మరో ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది. కుర్రాళ్ల మనసుల్ని బ్రేక్ చేస్తూ ప్రముఖ నటుడితో ఏడడుగులు వేసింది. హల్దీ, సంగీత్ లాంటి వాటిని గ్రాండ్గా చేసుకున్నారు. పెళ్లి మాత్రం సంప్రదాయ పద్ధతిలో ఓ గుడిలో సింపుల్గా చేసేసుకున్నారు. తాజాగా బుధవారం ఈ పెళ్లి జరగ్గా ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్? పెళ్లి కొడుకు ఎవరంటే?(ఇదీ చదవండి: అతని పెళ్లి కోసం కుటుంబంతో సహా వెళ్లిన విజయ్ దేవరకొండ)దళపతి 'బీస్ట్' సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా దాస్.. ఆ తర్వాత హీరోయిన్గా ఫేమ్ సంపాదించింది. 'దాదా' అనే తమిళ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. గతేడాది తెలుగులో వచ్చిన 'ఆదికేశవ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళంలోనే హీరోయిన్గా ఓ సినిమా చేస్తోంది.సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. కానీ అపర్ణ దాస్ మాత్రం కేవలం 28 ఏళ్ల వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టేసింది. 'మంజుమ్మల్ బాయ్స్'తో పాటు పలు మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీపక్ పరంబోల్ని అపర్ణ పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు హాజరైన పలువురు నటీనటులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కారు కొన్న 'బిగ్బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by Siju Wilson (@siju_wilson) -
అక్కడ స్టార్ హీరోయిన్.. తెలుగులో ఒకే ఒక్క సినిమా!
ఎంత టాలెంట్ ఉన్నా సరే.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఇండస్ట్రీలో లక్ కలిసొస్తేనే అవకాశాలు, ఆర్భాటాలు.. లేదంటే ఇక్కడ పట్టించుకునే నాధుడే ఉండడు. అయితే గుర్తింపు తెచ్చుకోవడం ఒక సాహసమైతే.. ఆ క్రేజ్ను కాపాడుకోవడం కూడా అంతకుమించిన సాహసం. కొందరికి అన్నీ కలిసొచ్చి స్టార్స్గా వెలిగిపోతుంటారు. అది ఎంతకాలమన్నది వారి చేతుల్లోనే ఉంటుంది. పైన కనిపిస్తున్న నటి ఒకప్పుడు మలయాళంలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా? అదే తొలి, చివరి సినిమా తన పేరు సంవృత సునీల్. కేరళలో పుట్టిపెరిగిన ఈమె 2004లో రాసికన్ సినిమాతో మలయాళ చిత్రపరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఉయిర్ మూవీతో కోలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగులో రాజశేఖర్ సరసన 'ఎవడైతే నాకేంటి' సినిమా చేసింది. టాలీవుడ్లో అదే ఆమె తొలి, చివరి సినిమా. మలయాళంలోనే ఎక్కువ మూవీస్ చేసిన ఆమె 2012లో అమెరికాకు చెందిన ఇంజనీర్ అఖిల్ జయరాజ్ను పెళ్లాడింది. వీరికి అగస్త్య, రుద్ర అని ఇద్దరు కుమారులు సంతానం. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంవృత 2019లో ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి గుడ్బై చెప్పింది. 2008లో ఆమె నటించిన కాల్చిలంబు 2021లో రిలీజ్ అవడం విశేషం. వెండితెరపై కనిపించకుండా పోయిన ఈమె ఆమధ్య బుల్లితెరపై జడ్జిగా కనువిందు చేసింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి అమెరికాలోనే ఉంటోంది. అక్కడే మలయాళీల కొత్త సంవత్సరం విషును సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Samvritha Akhil (@samvrithaakhil) చదవండి: మరో అమ్మాయితో నా భర్త ప్రేమ వ్యవహారం.. ఆ ఏడాది మానసికంగా ఎంతో ఒత్తిడి! -
లేడీ సూపర్స్టార్కు గట్టి పోటీ.. ఆమె దెబ్బకు మాలీవుడ్కు!
ప్రస్తుతం నయనతార మాలీవుడ్ వైపు మళ్లుతున్నారా? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. లేడీ సూపర్స్టార్గా వెలుగుతున్న నయనతారకు ఇప్పుడిప్పుడే ఆ పేరు దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చైన్నె సుందరి త్రిష నుంటి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో త్రిష కోలీవుడ్లో సూపర్ స్టార్ హోదాను కైవసం చేసుకోనుందా? ప్రస్తుతం కోలీవుడ్లో గత కొద్దికాలంగా హాట్ టాపిక్ ఇదే. నయనతార గతేడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అయితే బాలీవుడ్లో మరో అవకాశం రాలేదు. ఇక తమిళంలో ఇటీవల ఈమె నటించిన ఇరైవన్, అన్నపూరణి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచాయి. ప్రస్తుతం నవ దర్శకుడు టూయుటూ విక్కీ దర్శకత్వం వహిస్తున్న మన్నాగట్టి, సెంథిల్కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, మాధవన్తో కలిసి టెస్ట్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. నయనతారకు వీటిలో ఏదో ఒకటి హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో విషయం ఏమిటంటే కోలీవుడ్లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు నయన్కు ఇప్పుడిప్పుడే దూరమవుతున్నాయి. నటి త్రిష వైపు వెళుతున్నాయని చెప్పక తప్పడం లేదు. ఆ తరువాత తెలుగులోనూ స్టార్ హీరోలైన చిరంజీవి, అల్లుఅర్జున్లతో కలిసి నటించే అవకాశాలను దక్కించుకున్నారు. అంతేకాకుండా మలయాళంలోనూ నటిస్తున్నారు. దీంతో నయనతార కూడా మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తన మాతృభాష అయిన ఈ చిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకుముందే మమ్ముట్టి, నివిన్బాలీ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు. అలా ఈమె మలయాళంలో నటించిన చివరి చిత్రం గోల్డ్. అల్పోన్స్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2022లో విడుదలై పెద్దగా ఆడలేదు. దీంతో కొంతకాలం మాలీవుడ్కు దూరంగా ఉంటూ వచ్చిన నయనతార తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి డియర్ స్టూడెంట్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో నయనతార టీచర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో నటుడు నివిన్ బాలి హీరోగా నటిస్తున్నారు. -
మోలీవుడ్ గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసిన మోలీవుడ్ హీరోలు
-
విలన్ను కాస్తా కమెడియన్ను చేసేశారు!
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మాతృభాషలో హీరోగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్లో మాత్రం విలన్గా నటిస్తున్న ఈయన ఇటీవల తెలుగులో పుష్ప చిత్రంలో పోలీస్ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన మామన్నన్ చిత్రంలో విలనిజాన్ని పండించారు. అలాగే కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన విక్రమ్ చిత్రంలోనూ కీలక పాత్రలో మెప్పించారు. కమెడియన్ను చేసేశారు తాజాగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో తన పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ.. వేట్టైయాన్ చిత్రంలో దర్శకుడు జ్ఞానవేల్ తనను కమెడియన్గా మార్చారని చెప్పారు. కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ మూవీలో తననే హీరోగా పలువురు భావించారని, అంత ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటించిన తనను వేట్టైయాన్ చిత్రంలో కమెడియన్గా చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అప్పుడే ఒప్పుకున్నా రజనీకాంత్ చిత్రంలో కమెడియన్గానా? అని తాను ఆశ్చర్యపోయానని, అయితే అందులో తన పాత్ర గురించి దర్శకుడు వివరించగా ఆ పాత్రలో నటించడానికి అంగీకరించానని ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. కాగా ఈ క్రేజీ చిత్రం అక్టోబర్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిశ్చితార్థం రోజే నటుడి దుర్మరణం! -
పండగ వేళ మేలిముసుగులో కవ్విస్తున్న ఈ భామ ఎవరు?
-
‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ
టైటిల్: మంజుమ్మల్ బాయ్స్ నటీనటులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు నిర్మాణ సంస్థలు: పరవ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి రచన, దర్శకత్వం: చిదంబరం సంగీతం: సుశీన్ శ్యామ్ సినిమాటోగ్రఫీ:షైజు ఖలీద్ ఎడిటర్: వివేక్ హర్షన్ విడుదల తేది(తెలుగులో): ఏప్రిల్ 6, 2024 కరోనా తర్వాత మలయాళ సినిమాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తే..ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో తెలుగులో మలయాళ సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు. గతవారం సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ రిలీజ్ చేశారు. ఇక ఈ వారం అదే జోనర్లో మరో సినిమాను విడుదల చేశారు. అదే మంజుమ్మల్ బాయ్స్. ఇటీవల మలయాళంలో రిలీజై రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ఇప్పుడు అదే పేరుతో ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా లేదా? రివ్యూలో చూద్దాం. ‘మంజుమ్మల్ బాయ్స్’ కథేంటంటే.. ఈ సినిమా కథ 2006 ప్రాంతంలో జరుగుతుంది. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్(సౌబిన్ షాహిర్), సుభాష్(శీనాథ్ బాసి)తో పాటు మరికొంత మంది స్నేహితులు ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటారు. ఈ గ్యాంగ్కి మంజుమ్మల్ బాయ్స్ అని పేరు పెట్టుకుంటారు. వీరంతా కలిసి ఓసారి తమిళనాడులోని కొడైకెనాల్ టూర్కి వెళ్తారు. అక్కడ అన్ని ప్రదేశాలను చూసి.. చివరకు గుణ కేవ్స్కి వెళ్తారు. అది చాలా ప్రమాదకరమైన గుహ. ఆ గుహల్లో చాలా లోతైన లోయలుంటాయి. వాటిల్లో డెవిల్స్ కిచెన్ ఒకటి. అందులో పడ్డవారు తిరిగిన వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డెంజర్ బోర్డ్ పెట్టి నిషేధిస్తారు అటవి శాఖ అధికారు. కానీ మంజుమ్మల్ బాయ్స్ అధికారుల కళ్లుగప్పి నిషేధించిన ప్రాంతానికి వెళ్తారు. ఆ గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాస్. ఆ తర్వాత ఏం జరిగింది? సుభాష్ని కాపాడటానికి తోటి స్నేహితులు ఏం చేశారు? వారికి పోలీసు శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సహాయాన్ని అందించాయి? చివరకు సుభాష్ ప్రాణాలతో బయటకొచ్చాడా లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించి, హిట్ సాధించడంలో మలయాళ ఇండస్ట్రీయే మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఎక్కువగా యథార్థ కథలతోనే సినిమాను తీసి, దాన్ని ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా చేస్తారు. మంజుమ్మల్ బాయ్స్ కూడా ఓ యథార్థ కథే. 2006లో జరిగిన సంఘటన ఇది. కేరళకు చెందిన కొంతమంది స్నేహితులు కోడైకెనాల్ టూర్కి వెళ్తే..అందులో ఒకరు లోయలో పడిపోతాడు. ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ సాహసం చేసి మరీ తమ స్నేహితుడిని రక్షించుకుంటారు. దీన్నే కథగా అల్లుకొని మజ్ముమల్ బాయ్స్ని తెరకెక్కించాడు దర్శకుడు చిదంబరం. కథగా చూసుకుంటే మంజుమ్మల్ బాయ్స్ చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే తరచు పేపర్లో కనిపించే ఓ చిన్న ఆర్టికల్ అని చెప్పొచ్చు. లోయలో పడిపోయిన తన స్నేహితుడిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతాడు. ఇదే మంజుమ్మల్ బాయ్స్ కథ. ఈ యథార్థ సంఘటనకి దర్శకుడు ఇచ్చిన ట్రీట్మెంట్ ఉత్కంఠకు గురి చేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ లోయలో చిక్కుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల భయం కలిగితే.. మరికొన్ని చోట్ల ‘అయ్యో.. పాపం’ అనిపిస్తుంది. లోయలో పడిపోయిన సుభాష్ పరిస్థితి చుస్తుంటే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. సుభాష్ని కాపాడడం కోసం తోటి స్నేహితులు చేసే ప్రయత్నం, వారు పడే ఆవేదన గుండెల్నీ పిండేస్తుంది. అదే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, ఇతర అధికారులు వ్యవహరించే తీరును కూడా చాలా సహజంగా చూపించారు. కథనం నెమ్మదిగా సాగడం కొంతమేరకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మంజుమ్మల్ బాయ్స్ నేపథ్యాన్ని పరిచయం చేస్తు సినిమా ప్రారంభించాడు దర్శకుడు. కొడైకెనాల్ టూర్ ప్లాన్ చేసే వరకు కథంతా సింపుల్గా సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు కూడా కాకపోవడంతో ఒకనొక దశలో కాస్త బోర్ కొడుతుంది. ఎప్పుడైతే కొడైకెనాల్కి వెళ్తారో అక్కడ నుంచి కథనంలో వేగం పుంజుకుంటుంది. సుభాష్ లోయలో పడిన తర్వాత ఉత్కంఠ పెరుగుతుంది. ఫస్టాఫ్లో కథేమీ లేకున్నా.. మంజుమ్మల్ బాయ్స్ చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ఉత్కంఠను పెంచేలా ఉంటుంది. ఇక సెకండాఫ్ అంతా ఉత్కంఠ భరితంగా, ఎమోషనల్గా సాగుతుంది. మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సుభాష్, కుట్టన్ పాత్రల స్వభావం ఎలాంటివో ఆ సన్నివేశాల ద్వారా చూపించారు. సుభాష్కి ఇరుగ్గా ఉండే ప్రాంతాలు అంటే చిన్నప్పటి నుంచే చాలా భయం..అలాంటిది దాదాపు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోతాడు. చిన్నప్పటి సీన్స్ చూపించిన తర్వాత సుభాష్పై మరింత జాలి కలుగుతుంది. ఇలా మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటి స్టొరీని సర్వైవల్ డ్రామా లింక్ చేస్తూ చూపించిన విధానం బాగుంది. క్లైమాక్స్లో ఆకట్టుకుంటుంది. కథనం నెమ్మదిగా సాగడం మైనస్. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తనమదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. వాళ్లు నటించారని చెప్పడం కంటే జీవించారనే చెపొచ్చు. తెరపై వాళ్లను చూస్తుంటే మనకు కూడా ఇలాంటి స్నేహితులు ఉంటే బాగుండనిపిస్తుంది. వాళ్లు చేసే అల్లరి పనులు అందరికి కనెక్ట్ అవుతుంది. షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాషి పోషించిన పాత్రలు గుర్తిండిపోతాయి. టెక్నికల్గా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. గుణ కేవ్స్ చుట్టే ఈ సినిమా సాగుతుంది. వాటిని షైజు ఖలీద్ తన కెమెరాలో చక్కగా బంధించాడు. సుశీన్ శ్యామ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కాస్త ఓపికతో చూస్తే ఈ సర్వైవల్ థ్రిల్లర్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Kalyani Priyadarshan Unseen Photos: క్యూట్గా కవ్వించే ఈ హీరోయిన్ ఎవరో తెలుసా...! (ఫోటోలు)
-
మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం
హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) అనారోగ్యంతో గురువారం (ఏప్రిల్ 4న) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎర్నాకులంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో మీరా జాస్మిన్ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. జోసెఫ్ ఫిలిప్ భార్య పేరు ఎలియమ్మ. వీరికి సారా, జేని, జార్జ్, జాయ్, మీరా అని ఐదుగురు సంతానం. మీరా జాస్మిన్ అందరిలో కంటే చిన్నది. రీఎంట్రీ మీరా జాస్మిన్.. సూత్రధారన్ అనే మలయాళ చిత్రంలో కెరీర్ ఆరంభించింది. రన్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పందెం కోడి, గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటిపిల్లాడు.. ఇలా అనేక సినిమాలు చేసింది. 2014లో దుబాయ్ ఇంజనీర్ అనిల్ జాన్ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య తగ్గించేసిన మీరా.. గతేడాది విమానం చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: రౌడీ హీరో కామెంట్స్పై ట్రోలింగ్.. నచ్చితే చూడు, లేదంటే మానేయ్ అన్న నిర్మాత -
Aishwarya Lekshmi: చీరలో ఐశ్వర్య లక్ష్మి.. సోయగాలు (ఫొటోలు)
-
రెండో భర్తకు విడాకులిచ్చిన నటి
ప్రముఖ మలయాళ నటి మంజు పిళ్లై విడాకులు తీసుకుంది. 24 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్కు విడాకులిచ్చింది. ఈ విషయాన్ని వాసుదేవ్ స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. '2020వ సంవత్సరం నుంచి మంజు, నేను విడివిడిగానే జీవిస్తున్నాం. విడాకుల ప్రక్రియ పూర్తయింది. తను ఇప్పుడు నాకు భార్య కాదు. అయితే మా మధ్య స్నేహం మాత్రం కొనసాగుతుంది. తనను నా స్నేహితురాలిగానే భావిస్తాను. ప్రస్తుతం మంజు కెరీర్ గొప్ప స్థాయిలో ఉంది. క్లోజ్ ఫ్రెండ్ సక్సెస్ అవుతుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది' అని చెప్పుకొచ్చాడు. ఇది రెండోసారి కాగా మంజు గతంలో నటుడు ముకుందన్ మీనన్ను పెళ్లాడింది. కానీ కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. తర్వాత 2000వ సంవత్సరంలో మంజు.. సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా దయ అనే కూతురు పుట్టింది. గత కొంతకాలంగా వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తుండగా ఇన్నాళ్లకు అవి నిజమేనని ధ్రువీకరించాడు వాసుదేవ్. కెరీర్ సాగిందిలా 1992లో నట ప్రస్థానం ఆరభించింది మంజు పిళ్లై. గోలంతర వార్త, నీ వరువోళం, ఆయుష్మాన్ భవ, నింజగల్ సంతుస్తరను, మిస్టర్ బట్లర్, రావణప్రభు, తేజ్ భాయ్ అండ్ ఫ్యామిలీ, లవ్ 24x7, ఓ మై డార్లింగ్, ద టీచర్, జయ జయ జయ జయహే తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. తమిళంలోనూ రెండు చిత్రాలు చేసింది. వాసుదేవ్ విషయానికి వస్తే కేరళ కేఫ్ చిత్రంతో సినిమాటోగ్రాఫర్గా ప్రయాణం మొదలుపెట్టాడు. అయాల్, మెమొరీస్, దృశ్యం, అమర్ అక్బర్ ఆంటోని, అనార్కలీ వంటి పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించాడు. తెలుగులో మిస్ ఇండియా, ఖిలాడీ, బ్రో, ద వారియర్ సినిమాలకు పని చేశాడు. చదవండి: OTT: సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
ఐశ్వర్య లక్ష్మి.. కిర్రాక్ లుక్స్.. (ఫోటోలు)
-
సింగర్ సుజాత మోహన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement