-
Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్!
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దెబ్బకు ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కొత్త మద్యం పాలసీని పక్కన పెట్టి పాత విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. 2022-23 కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఇంకా చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు పాత విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022-23 ముసాయిదా ఎక్సైజ్ పాలసీని ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదానికి పంపించలేదు. అయితే.. ఇప్పటికే 2021-22 ఎక్సైజ్ పాలసీని మార్చి 31 తర్వాత రెండు సార్లు పొడిగించింది ఢిల్లీ ప్రభుత్వం. అది జులై 31తో ముగియనుంది. తాజాగా తీసుకొచ్చే కొత్త పాలసీలో లిక్కర్ హోమ్ డెలివరీ వంటీ కీలక మార్పులను ప్రతిపాదించింది ఆబ్కారీ శాఖ. ఈ విషయంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు.. కొత్త పాలసీ అమలులోకి వచ్చే వరకు మరో ఆరు నెలల పాటు పాత విధానాన్ని అమలులో ఉంచాలని గత గురువారమే సిసోడియా ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు.. 2021, నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీకి ముందు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు కార్పొరేషన్లు నిర్వహించిన లిక్కర్ లావాదేవీల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నాలుగు కార్పొరేషన్లు నగరంలో మొత్తం 475 లిక్కర్ దుకాణాలను నడుపుతున్నాయి. ఇదీ చదవండి: కొత్త మద్యం పాలసీలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేం -
ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే..
-
ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే..
► లెఫ్ట్నెంట్ గవర్నరే అక్కడ పరిపాలనాధికారి ► ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ.. ► ఎల్జీ అనుమతి లేని ప్రభుత్వ నోటిఫికేషన్లు చట్టవిరుద్ధమని ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: అధికారాల విషయమై కేంద్రంతో పోరాడుతున్న కేజ్రీవాల్ సర్కారుకు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత రాజ్యాంగం ప్రకారం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగుతుందని, దానికి పరిపాలనాధికారి లెఫ్ట్నెంట్ గవర్నరే(ఎల్జీ) అని ఢిల్లీ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఆర్టికల్ 239ను ఢిల్లీ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆర్టికల్ 239ఏఏ తగ్గించేందుకు అవకాశం లేదని, పాలనాంశాలకు సంబంధించి ఎల్జీ ఆమోదం తప్పనిసరి అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, న్యాయమూర్తి జస్టిస్ జయంత్నాథ్ల బెంచ్ తన 194 పేజీల తీర్పులో పేర్కొంది. ఆర్టికల్ 239ఏఏలోని 69వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఢిల్లీపై పాలనా బాధ్యతలు అంతిమంగా రాష్ట్రపతికే ఉంటాయని తేల్చింది. 239ఏఏ ప్రకారం ఎల్జీ.. సీఎం, కేబినెట్ సలహా మేరకు వ్యవహరించాలని ఆప్ సర్కారు చేసిన వాదనను బెంచ్ తోసిపుచ్చింది. ఎల్జీ అనుమతి లేకుండా ఢిల్లీ ప్రభుత్వం ఏ చట్టం చేయలేదని, ముందస్తు అనుమతి తర్వాతే ప్రభుత్వం చట్టాలను రూపొందించాలని స్పష్టం చేసింది. రాష్ట్రాల గవర్నర్లకంటే ఢిల్లీ ఎల్జీ విచక్షణాధికారాల పరిధి ఎక్కువని, ఆయన కేబినెట్ సలహా ప్రకారం కాక.. సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చంది. శాసనాధికారాలు, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీపై పరిపాలనాధికారం తదితర అంశాలకు సంబంధించి కేంద్రం, ఢిల్లీ సర్కారు వేసిన పలు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి సంబంధించిన పిటిషన్ మినహా మిగతా అన్ని పిటిషన్లలో ఆప్ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది.ఎల్జీ అనుమతి లేకుండా ఆప్ ప్రభుత్వం సీఎన్జీ ఫిట్నెట్ కిట్ల స్కాం, ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవకతవలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీలు చెల్లవని కోర్టు చెప్పింది. ప్రైవేటు డిస్కమ్లకు డెరైక్టర్ల నియామకానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పక్కనపెట్టింది. తమ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) సక్రమంగా పనిచేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని, కేంద్ర ప్రభుత్వ అధికారులపై దర్యాప్తు జరపకుండా నోటిఫికేషన్ జారీ చేసిందనే అంశంపైనా ఢిల్లీ ప్రభుత్వానికి ఊరట లభించలేదు. సర్వీసుకు సంబంధించి అంశాలు అసెంబ్లీకి వెలుపలివని, దీనిపై కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ సరైనదేనని పేర్కొంది. ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రత్యేక సర్వీస్ కేడర్ లేదని పేర్కొంది. కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలకు సంబంధించిన ప్రతిదాన్నీ సుప్రీంకోర్టు మాత్రమే విచారించజాలదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఆప్ ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ ఎల్జీ ఆధ్వర్యంలో నడుస్తుంటే.. రాజ్యాంగానికి సవరణ చేసి అసెంబ్లీని ఎందుకు ఏర్పాటు చేశారని . ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు వల్ల అవినీతికి అడ్డుకట్ట వేసే చర్యలకు విఘాతం కలుగుతోందన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను ఎల్జీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తీర్పుపై బీజేపీ స్పందిస్తూ.. రాజ్యాంగపరమైన చట్టాల గురించి ఢిల్లీ సీఎం శిక్షణ తీసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేసింది. తీర్పు కేజ్రీవాల్కు చెంపపెట్టు అని, ఆయన రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని లేకుంటే రాజీనామా చేయాలని సూచించింది. -
'సరి-బేసి'ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు తలపెట్టిన సరి-బేసి వాహన విధానాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. 1988నాటి మోటారు వాహనం చట్టాన్ని సరిగ్గా అమలుచేయకుండా, కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై ఈ చట్టం కింద కఠిన చర్యలు చేపట్టకుండా.. అందుకు బదులుగా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే 'సరి-బేసి' విధానాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం గతంలో 15 రోజులపాటు సరి-బేసి విధానాన్ని అమలుచేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాలుష్య పరీక్షలు ఒక ప్రహసనంగా మారిపోయాయని, ప్రభుత్వానికి, ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధం లేకుండానే వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లు జారీచేస్తున్నారని ఈ పిల్ దాఖలు చేసిన స్వచ్ఛంద సంస్థ హైకోర్టుకు నివేదించింది. దీనిపై చీఫ్ జస్టీస్ జీ రోహిణి, జస్టీస్ జయంత్తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ మార్చి 30 లోపు వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్న్కు నోటిసులు ఇచ్చింది. సరి-బేసి విధానాన్ని ఏప్రిల్ 15 నుంచి 30 వరకు మరోసారి అమలుచేయనున్నట్లు సీఎం క్రేజీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
సినిమా లవర్స్కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement