-
ఆ ముగ్గురి చేరిక నిలిపివేత!
ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరేళ్లపాటు పార్టీ బహిష్కరణకు గురైన జిల్లా కేంద్రానికి చెందిన పీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్రెడ్డిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.ఇటీవల జగ్గారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈ ముగ్గురు ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్రెడ్డిని కూడా కలిశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఈ ముగ్గురు నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవద్దంటూ కంది శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ దహనం చేయడంతో పాటు నోటికి నల్లగుడ్డలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను గమనించిన పార్టీ నాయకత్వం వారి చేరికలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో కంది వర్గీయుల పోరాటం ఫలించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఆదేశాల మేరకు ఆ నాయకుల చేరికలను నిలిపివేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీమెంబర్ జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాయకత్వంతో చర్చించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు వారి చేరిక నిలిపివేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు.ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు.. -
పీకే మాటలకు విలువే లేదు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రశాంత్కిషోర్ (పీకే) మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, బతుకు దెరువు కోసం సర్వే సంస్థ పేరుతో రోజుకో మాట మాట్లాడుతాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. గాం«దీభవన్లో మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల పీకే సర్వేల పేరిట చెపుతున్న జోస్యాలను కొట్టిపారేశారు. పీకే మాటలకు విలువ లేదని తేల్చి చెప్పారు. దేశంలో గెలిచేది బీజేపీ అని ఓసారి, ఇంకోసారి కాంగ్రెస్ అని అంటాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్పాడని, కానీ కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. పీకే సర్వేలకు, మాటలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పారీ్టకి 12 నుంచి 14 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ పాలనకు వంద మార్కులు రేవంత్ పాలనకు వంద మార్కులు వేస్తున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటే బాగుంటుందనే రేవంత్రెడ్డి కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో కింగ్, కింగ్ మేకర్ రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. కరువు కాంగ్రెస్తో వచి్చందని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు వర్షాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలుసుకునే తెలివి లేదా అని విమర్శించారు. కేసీఆర్ ఇంకా ఓటమి ఫ్ర్రస్టేషన్లోనే ఉన్నారన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డికి ఏ విషయంపైనా కనీస అవగాహన ఉండదని విమర్శించారు. బీజేపీ బౌండరీలో మంద కృష్ణ రాజకీయాలు బీజేపీ బౌండరీలో ఉండి మంద కృష్ణ మాదిగ రాజకీయాలు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. న్యూట్రల్గా ఉంటే ఆయన ఏం అడిగినా సమాధానం చెప్పేవాళ్లమన్నారు. బీజేపీ తెలంగాణలో మాదిగను రాజ్యసభ సభ్యుడిని చేయమని గానీ కేంద్ర మంత్రిని చేయాలని గానీ మంద కృష్ణ అడిగారా అని ప్రశ్నించారు. బంగారు లక్ష్మణ్ని నవ్వులపాలు చేసినప్పుడు మంద కృష్ణ కనీసం స్పందించలేదని గుర్తు చేశారు.పార్టీ ఫిరాయింపులపై తాను మాట్లాడలేనని, ఎందుకంటే తానే పార్టీలు మారి వచ్చానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. -
‘కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు’
సాక్షి, హైదరాబాద్: తాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) పదవి అడగడం కొత్త కాదని.. అవకాశం వచ్చిన ప్రతి సారి తాను అడుగుతానని కాంగ్రెస్ నేత జాగ్గారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియా చిట్చాట్లో మాట్లాడారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పీసీసీ అవకాశం ఇస్తే ఓకే. రెడ్డిలలో ఎవరికైనా అవకాశం ఇస్తే ఆ పోటీ పడే లిస్ట్లో నేను ఉంటాను. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు అడ్డదారులు తొక్కలేదు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ. రాజ్యాంగం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. విషయ అవగాహన లేని మంత్రి కిషన్ రెడ్డి. ఆర్థిక వనరుల సమీకరణ, బతుకు తెరువు కోసం పీకే సర్వే సంస్థ ఏర్పాటు చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు. మాదిగలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. దామోదర రాజనర్సింహకు, మీరా కుమార్కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి లాభం చేకూర్చేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారు. వర్షాకాలంలో వర్షాలు పడుతాయి. ఎండ కాలంలో వర్షాలు పడవు. కనీసం బుద్ధి లేకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఒక కాంగ్రెస్ అభిమానిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఆయన రాజే. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. మా వంద రోజుల పాలన గురించి మమ్మలని అడగకండి. ఆర్టీసి బస్సులలో ప్రయాణం చేసే మహిళలను అడగండి వాళ్ళు చెపుతారు. ఫిరాయింపుల మీద నేను మాట్లాడలేను. నేను కూడా రెండు సార్లు పార్టీ మారాను. పదవుల కోసం నేను కక్కుర్తి పడను’అని జగ్గారెడ్డి అన్నాఉ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ ఉందని, రాజ పూజ్యం 16, అవమానం 2 ఉందని తెలపారు. -
మేడిగడ్డనో... బొందల గడ్డనో తేల్చాలి
సాక్షి, హైదరాబాద్: అది మేడిగడ్డనో, బొందలగడ్డనో ముందు కేసీఆర్ తేల్చాలని, ఆ తర్వాతే బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్లాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి స్పష్టం చేశారు.మేడిగడ్డలో పిల్లర్లు కుంగింది నిజం కాదా అని ప్రశ్నించారు. బుధవారం గాందీభవన్లో టీపీసీసీ ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ నేతలు కోట్ల శ్రీనివాస్, చరణ్కౌశిక్ యాదవ్తో కలిసి జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏం పీకడానికి మేడిగడ్డ వెళుతున్నారంటూ నల్లగొండ సభలో కేసీఆర్ ప్రశ్నించారని గుర్తు చేసిన జగ్గారెడ్డి.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ చేసిన అవినీతిని పీకడానికి, కట్టిన డబ్బు సంచులు పీకడానికి వెళ్లామని బదులిచ్చారు. బీఆర్ఎస్ నేతలు ముందుగా మంచి బుద్ధి తెచ్చుకోవాలని, మీరు ఒకటి అంటే మా కార్యకర్తలు వంద అంటారన్న విషయం మర్చిపోద్దని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్నుద్దేశించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, ఆయన వెంటనే క్షమాపణలు చెపితే వివాదం ఇంతటితో ముగిసిపోతుందన్నారు. బాల్కసుమన్ చిన్నపిలగాడు.. కడియం గాలిపటం మాదిరి బాల్కసుమన్ చిన్నపిలగాడని, పిలగాడు పిలగాడి తీరులోనే ఉండాలని జగ్గారెడ్డి హితవు పలికారు. కడియం శ్రీహరికి రాజకీయ జ్ఞానం లేదని గాలిపటం లాంటి వాడని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో పనిచేసినా ఆ పార్టీ అధినేతల లైన్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని, అది కూడా తెలియని కడియం శ్రీహరి తన వద్దకు వస్తే క్లాసులు చెపుతానని వ్యాఖ్యానించారు. తన టైం బాగాలేక సంగారెడ్డిలో ఓడిపోయాయని, ఐదేళ్లు రెస్ట్ ఇచ్చినందుకు సంగారెడ్డి ప్రజలకు కృతజ్ఞతలని చెప్పిన జగ్గారెడ్డి తాను మెదక్ ఎంపీగా పోటీ చేయడం లేదని, ఈ అంశంలోకి మరోమారు తనను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. -
అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణపై ప్రేమతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించలేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేవలం రాజకీయం కోసమే పెట్టాడని మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియా చిట్చాట్లో మాట్లాడారు. ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నా ధైర్యం చూసి.. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా కాకుండా బీఆర్ఎస్, బీజేపీ పనిచేస్తుంది. రాష్ట్రంలో 14 సీట్లు గెలవడమే మా టార్గెట్. దాన్ని అడ్డుకోడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. ..లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పుడు బండి సంజయ్.. కవిత అరెస్ట్ అవుతుందని చెప్పిండు ఏమైంది. ఇప్పుడు కవితకు నోటీసుల విషయం కూడా అంతా డ్రామానే. అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరాను. గాంధీ కుటుంబంపై ప్రేమతోనే కాంగ్రెస్లో చేరాను. రాహుల్ అంటే నాకు పిచ్చి.. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. రాహుల్ను ప్రధానమంత్రి చేయడం కోసం నిర్విరామంగా పనిచేస్తా’ అని జగ్గారెడ్డి తెలిపారు. -
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలపై విచారణ జరపాలని ఏఐసీసీ కిసాన్సెల్ వైస్చైర్మన్ ఎం.కోదండరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిసారీ చేసింది కాంగ్రెస్ నేతలయితే, కేసీఆర్ కుటుంబం సెంటిమెంట్ను వాడుకుని రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ఆరోపించారు. సోమవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్లతో కలిసి ఆయన మాట్లాడుతూ, హెచ్ఎండీఏలో ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ పట్టుకుంటే పెద్దోళ్లు బయటకు వస్తున్నారని అన్నారు. ఈ శాఖను కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నిర్వహించిన నేపథ్యంలో ఈ అవినీతిలో ఎవరెవరు ఉన్నారన్నది బట్టబయలు చేయాలని కోరారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన చరిత్ర తమదని, తెలంగాణ రైతాంగానికి కూడా రుణమాఫీ చేస్తామని, రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. నాడు పోపో అంటే... నేడు రా.. రా అంటున్నారు: జగ్గారెడ్డి ధరణి పోర్టల్ లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, రైతులకు ఉపయోగపడని ధరణిని రద్దు చేయాలని రాహుల్గాం«దీనే చెప్పారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్ల తర్వాత అసెంబ్లీలో మూడున్నర గంటలపాటు చర్చ జరిగిందని, అసెంబ్లీలో ఏం జరుగుతోందన్నది తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోందన్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిని పోపో అని నోరు మూసేవారని, ఇప్పుడు సీఎం రేవంత్ మాత్రం రా..రా.. అంటున్నా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారం ఇవ్వకపోతే కేసీఆర్ అసెంబ్లీకి రాడా అని ప్రశ్నించారు. ప్రజలిచ్చిన తీర్పును కేసీఆర్ అవమానపరుస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. -
సీఎం రేవంత్తో జగ్గారెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి వెళ్లిన జగ్గారెడ్డి 20 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య రాజకీయ అంశాలపైనే చర్చ జరిగిందని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవితో పాటు, రానున్న లోక్సభ ఎన్నికల్లో జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల పోటీ, నెల రోజుల కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన కార్యక్రమం తదితర అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం. -
పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి
సాక్షి,హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని, రాహుల్ గాందీని ప్రధాన మంత్రిని చేయాలని టీపీసీసీ నేతలు పిలుపునిచ్చారు. గురువారం గాంధీ భవన్లో 139వ అఖిల భారత జాతీ య కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సేవా దళ్ వందేళ్ల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్కుమార్గౌడ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, పార్టీ ఫిషరీస్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ జెండాను మహేశ్కుమార్గౌడ్ ఆవిష్కరించగా.. సేవాదళ్ ర్యాలీని జగ్గారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మా ట్లాడుతూ, 1885లో బొంబాయిలో 72 మందితో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ.. నేడు 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్య్రం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిందన్నారు. స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఒకవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం, మరోవైపు దేశాన్ని పటిష్టం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసిన సేవలను ప్రజలు మరవలేరన్నారు. సోనియా గాం«దీ, పీవీ, మన్మోహన్సింగ్ లాంటి వారు దేశం కోసం నిరంతరం శ్రమించారన్నారు. మంత్రి జూపల్లి శుభాకాంక్షలు భారత్.. ప్రపంచంలో సగర్వంగా నిలబడిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్లెనని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. మతతత్వ శక్తుల చేతిలో దేశం బందీగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి : మంత్రి హరీశ్రావు
సాక్షి, సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి కావాలో అందరివాడుగా పేరొంది నిత్యం అందుబాటులో ఉంటున్న చింతా ప్రభాకర్ కావాలో నియోజకవర్గ ప్రజలు తెల్చుకోవాలని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి, జహీరాబాద్లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఎన్నికల బూత్ కమిటీల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గతంలో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న జగ్గారెడ్డి గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఐదు సార్లు అయినా సంగారెడ్డికి రాకుండా ముఖం చాటేశారన్నారు. ఎన్నికల హామీల్లో గల్లికో ఏటీఎం, ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం అని చెప్పి ఇంతవరకు కనిపించకుండా పోయారన్నారు. తిరిగి డ్రామాలు చేయడానికి కల్లబొల్లి మాటలతో వస్తాడు! జాగ్రత్తగా ఉండాలని హితవుపలికారు. ముఖ్యనాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ మౌనం వీడి, మొహమాటం పక్కన పెట్టి రంగంలో దిగితే జగ్గారెడ్డి గాల్లో కలిసి పోతారన్నారు. ఇటీవల పట్టణంలో జరిగిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే బహిరంగ సభలో ఉన్న దాని కంటే ఎక్కువ మంది కేవలం ముఖ్యకార్యకర్తల ఈ మీటింగ్లోనే ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసుకున్న జగ్గారెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తెలంగాణ వస్తే సంగారెడ్డిని కర్ణాటకలో కలపాలని చెప్పిన ఆయనకు సంగారెడ్డి ప్రజల ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉండగా.. రేవంత్ లాంటి రాంగ్ లీడర్లకు మద్దతు ఇవ్వొదని ఉద్ఘాటించారు. మూడోసారి సైతం కేసీఆర్ సీఎం అవుతారన్నారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ సైతం 50 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు. నాయకులు బాగా పని చేయాలి! ఈసారి కార్యకర్తలు, నాయకులు బాగా పని చేసి చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే సంగారెడ్డిని మరింత అభివృద్ధి చేస్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఆయనకు అనారోగ్యంగా ఉన్న విశ్రాంతి లేకుండా ప్రజల కోసం అహర్నిశలు పనిచేసిన మంచి నాయకుడన్నారు. కాంగ్రెస్ చెప్పే మాయమాటలను నమ్మి మోసపోతే గోసపడేది ప్రజలేనన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. బీజేపీ డకౌటయితే కాంగ్రెస్ ఇట్ వికెట్ గా నిలిచిపోతుందని చెప్పారు. సంగారెడ్డికి రూ. 570 కోట్లతో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల తీసుకువచ్చామని స్పష్టం చేశారు. రూ.70 కోట్లతో సంగారెడ్డిని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. అనంతరం చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజలే నా బలం నా బలగం అన్నారు. తామే అభ్యర్థిగా భావించి తనను గెలిపించాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యం.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి హరీశ్రావు అన్నారు. పార్టీకి 75 పైగా సీట్లు వస్తాయని, అన్నీ సర్వేలు చెబుతున్నాయన్నారు. జిల్లాలో ఉన్న పదికి పది సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అవి గెలిపించుకుని కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంట్ కట్ అవుతుందన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే 5 గంటల కరెంట్ ఇస్తామని ఇటీవల తాండూర్ సభలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారని, తెలంగాణలో 24 గంటల సరఫరా ఉందన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలన్నారు. ఉత్తమ్కుమార్ రెడ్డి.. రైతు బంధు బంద్ చేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు అడ్డా కూలీలని, బీరుబిర్యానీలకు అమ్ముడుపోతారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అవమానపరిచారన్నారు. ఆ పార్టీ నాయకులకు ఎంత గర్వమో ప్రజలు ఆలోచించాలన్నారు. సమావేశాల్లో ఎంపీ.బీబీపాటిల్, టీఎస్ ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ వైస్చైర్మన్ పట్నం మాణిక్యం, డీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, నాయకులు డాక్టర్ శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, విజేందర్రెడ్డి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్ దేవిప్రసాద్, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కోడ్ ఉల్లంఘనలపై కొరడా.. డీజేలు, పోస్టర్లున్న వాహనాలు సీజ్! -
సంగారెడ్డి కాంగ్రెస్ తొలి జాబితాలో ఈ ముగ్గురు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని ము గ్గురు నేతలకు చోటు దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జాబితాలో అందోల్ నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్లు ఉంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ పేరు కూడా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఉండే అవశాలున్నాయి. అందోల్ టిక్కెట్ కోసం దామోదర రాజనర్సింహతోపాటు ఆయన కూతురు త్రిష మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి జగ్గారెడ్డితో పాటు మరో నలుగురు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, జగ్గారెడ్డి పేరు తొలిజాబితాలో చోటు దక్కనుంది. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో చంద్రశేఖర్తో పాటు స్థానికంగా ఉండే ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ టిక్కెట్ హామీతోనే చంద్రశేఖర్ పార్టీలో చేరడంతో తొలిజాబితాలోనే ఆయన పేరు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలను ఖరారు చేసే ప్రక్రియను ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చేపట్టింది. ఆయా నియోజకవర్గాల టికెట్ల కోసం గతనెల 25 వరకు అందిన దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో టికెట్లు ఎవరికి దక్కుతాయోనని ఆసక్తి నెలకొంది. ఆ రెండు చోట్ల పీటముడి.. పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాల విషయంలో పీటముడి నెలకొంది. పటాన్చెరువు నియోజకవర్గం టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్కుమార్ ఆశిస్తున్నారు. తొలి జాబితాలోనే తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు కాటా శ్రీనివాస్గౌడ్ కూడా ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు గాలి అనిల్ కూడా నర్సాపూర్ టికెట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ గాలి అనిల్కు నర్సాపూర్ టికెట్ ఖరారైతే పటాన్చెరు టికెట్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పటాన్చెరులో కాటా తోపాటు శశికళాయాదవ్రెడ్డి, ఎం.సప్పాన్దేవ్.. ఇలా మొ త్తం తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. నర్సాపూర్ నియోజకవర్గానికి గాలి అనిల్తో పాటు, ఆవుల రాజిరెడ్డి, శివన్నగారి ఆంజనేయులుగౌడ్, రవీందర్రెడ్డి తదితరులు ఆశిస్తున్నారు. మలిజాబితాలో.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ సురేష్షెట్కార్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి మధ్య పంచాయితీ తేలితే ఇక్కడి అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మెదక్లో నియోజకవర్గానికి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, చౌదరి సుప్రభాత్రావు, మ్యాడం బాలకృష్ణలతో కలిసి ఏకంగా 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ కొత్త నాయకుడు పార్టీలో చేరే అవకాశాలుండటంతో మెదక్ అభ్యర్థిత్వం తొలిజాబితాలో ఉండే అవకాశం లేదు. ఆ నాలుగు చోట్ల.. దుబ్బాక టికెట్ కోసం చెరుకు శ్రీనివాస్రెడ్డి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడ కత్తి కార్తీకగౌడ్, శ్రావణ్కుమార్రెడ్డి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వారికే సాధారణ ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వాలనే పార్టీ నిబంధన ఉన్నందున తనకే టికెట్ తనకే దక్కుతుందని శ్రీనివాస్రెడ్డి భావిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ద్వారా శ్రావణ్కుమార్రెడ్డి ప్రయ త్నాలు చేస్తున్నారు. సిద్దిపేట టిక్కెట్ కోసం ఏకంగా 15 మంది దరఖాస్తు చేసుకోగా, గజ్వేల్ టికెట్కూ పోటాపోటీ నెలకొంది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిపై పోటీ చేసే అభ్యర్థి కావడంతో కాంగ్రెస్ ఆచీతూచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో తొలి జాబితాలో మూడు పేర్లు మాత్రమే ఉండే అవకాశాలున్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
TS Election 2023: కాంగ్రెస్లో సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి..! కానీ ఇప్పుడు..?
సంగారెడ్డి: కాంగ్రెస్లో సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అన్నట్లుగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి మారింది ఈ అసెంబ్లీ స్థానం టికెట్ కోసం పోటాపోటీ నెలకొంది. తనకు ఎదురు లేదనుకున్న చోట తొలిసారిగా నలుగురు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఉపముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు దామోదర రాజనర్సింహ ప్రధాన అనుచరుడు, మరికొందరు, జగ్గారెడ్డి తరపున ఆయన సతీమణి నిర్మలా దరఖాస్తు చేసుకున్నారు. అయితే టీడీపీలో వివిధ పోస్టుల్లో పనిచేసిన సంగమేశ్వర్, రాజనర్సింహ వెంటే ఉంటున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనూ పేరు తెరపైకి రాగా కేటాయించాలని దామోదర సూచించినట్లు అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు ఈ విషయమై ఆసక్తికరంగా మారింది. తొలిసారిగా.. తొలిసారిగా సంగారెడ్డి టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై అసమ్మతి గళం వినిపించి, పలుమార్లు మంత్రి కేటీఆర్ను కలవడంతో గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమైందనే అభిప్రాయం కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమైంది. పార్టీలో చేర్చుకోవద్దని, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్కే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గానికి చెందిన గులాబీ శ్రేణులంతా సమావేశమయ్యారు. హైదరాబాద్ వెళ్లి మంత్రి హరీశ్రావునూ కలిశారు. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ప్రభాకర్కే దక్కింది. దీంతో జగ్గన్న అధికార పార్టీలోకి చేరుతున్నారనే ప్రచారానికి తెరపడింది. తాను పార్టీ మారడం లేదని, రాహుల్గాంధీతోనే రాజకీయ ప్రయాణం ఉంటుందని వివరణ ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు నాయకులు దరఖాస్తు చేసుకోవడం పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేవంత్ వర్గం నుంచి కూడా.. పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొత్తిరెడ్డిపల్లికి చెందిన పొన్న శంకర్రెడ్డి అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలను ప్రత్యేకంగా చేస్తుంటారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వర్గానికి చెందిన అనుచరుడిగా పేరుంది. ఇప్పుడు ఆయన కూడా దరఖాస్తు చేసుకున్నారు. మరో ఇద్దరు.. జిల్లా కేంద్రానికి చెందిన అడ్వొకేట్ ఎంఏ ముఖీం, తెలంగాణ జనసమితి (టీజేఎస్) నాయకుడు తుల్జారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ముఖీం.. మనబీన్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాగా టీజేఎస్ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు లేదా విలీనమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. -
'పార్టీ మారడం లేదు.. ఇలాంటి పుకార్లలో టీడీపీ దిట్ట..'
హైదరాబాద్: తాను పార్టీ మారడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తాను పార్టీ మారతానని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని చెప్పారు. ఏడాదిగా ఈ దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇంత శాడిజం ఎంటో తనకు అర్థం కావట్లేదని అన్నారు. బీఆర్ఎస్తో కొట్లాడి గెలిచానని చెప్పారు. తాను పార్టీ మారతానని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా కల్చర్ టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ అయిందని పేర్కొన్నారు. దీన్ని వాడటంలో టీడీపీ దిట్ట అని ఆరోపించారు. టీడీపీ కల్చర్ కాంగ్రెస్ను భ్రష్టు పట్టించిందని అన్నారు. ఇదీ చదవండి: Bholakpur Scrap Godown Blast: బోలక్పూర్లో పేలుడు.. -
సంగారెడ్డి: బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితి!
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత ఆసక్తిని రేపే నియోజకవర్గం ఇది. ఇక్కడి ప్రజాతీర్పు భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక.. బీఆర్ఎస్ రెండు సార్లు, బీజేపీ, టీడీపీ ఒక్కోసారి అధికారంలోకి వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ పట్టు సాధించేనా? కాంగ్రెస్లో స్ట్రాంగ్ లీడర్గా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(అలియాస్ జగ్గారెడ్డి) 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండ తన సొంత క్యాడర్తో దూసుకుపోయాడు. 2004లో ఆయన తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. ఆ తర్వాత 2009, 2018లో మాత్రం కాంగ్రెస్ తరఫున గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు వరకు కాంగ్రెస్ సంగారెడ్డి అడ్డాగా ఉండేది. కానీ 2014 ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారింది. అక్కడ గులాబీ జెండ ఎగరింది. దాంతో సంగారెడ్డిలో కాంగ్రెస్ వీక్ అయ్యి బీఆర్ఎస్ బలపడినట్లు అనిపించింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలుపొందడంతో సంగారెడ్డిపై మళ్లీ హస్తం పట్టు సాధించింది. ఇక తాజా పరిణామాలు ప్రకారం.. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో రాబోయే సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలిక సంగారెడ్డిలో ఉత్కంఠత నెలకొంది. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : మహబూబ్ చెరువు, మంజీర డ్యామ్ రాజకీయానికి అంశాలు బీఆర్ఎస్లో అయోమయం కార్ ఓవర్ లోడ్ అధిక పోటీలో బిఆర్ఎస్ నాయకులు MLA జగ్గారెడ్డి బిఆర్ఎస్లోఇక వెళ్ళే సూచనలు ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు: రియల్ వ్యాపారం హైదరాబాద్కి దగ్గర ఉన్నా నియోజక వర్గంలో మౌలిక వసతుల విషయంలో పెద్దగా అభివృద్ధి లేకపోవడం రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు బీఆర్ఎస్ చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే) కాంగ్రెస్ జగ్గారెడ్డి బిజేపి రాజేశ్వర్ రావు దేశ్ పాండే (బిజేపి నియోజక వర్గ ఇంచార్జ్) శివరాజ్ పాటిల్ నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : నదులు : మంజీర నది ఆలయాలు : వైకుంట పురం ఆలయం / ఇస్మాయిల్ ఖాన్ పేట భవానీ మాత ఆలయం -
ఈటలతో కేటీఆర్ ఆప్యాయ పలకరింపు.. అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను మంత్రి కేటీఆర్ అప్యాయంగా పలకరించారు. ఈటల సీటు వద్దకు వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. నేతలు ఒకరినొకరు హత్తుకున్నారు. దాదాపు పది నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. అదే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డీతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. పలు అభివృద్ది పనుల కోసం కేటీఆర్ చాంబర్లో మంత్రికి సంగారెడ్డి ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. జగ్గారెడ్డిని చూడగానే పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లా అన్న అంటూ కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. అప్పటికే జగ్గారెడ్డితో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉండగా.. మీ ఇద్దరి దోస్తాన్ ఎక్కడ కుదిరిందని కేటీఆర్ అడిగారు. మాది ఒకే మంచం, ఒకే కంచం అంటూ మామిళ్ల బదులివ్వగా.. అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తవా అని కేటీఆర్ ప్రశ్నించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తానని.. మన దగ్గరకు (బీఆర్ఎస్లోకి) పట్టుకొస్తానని మామిళ్ల రాజేందర్ నవ్వుతూ చెప్పారు. ఈ సంభాషణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. చదవండి: 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ మీటింగ్లో నిర్ణయం -
సంగారెడ్డి నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?
సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన సీనియర్ నేత తూర్పు జయప్రకాస్ రెడ్డి మూడోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్పై 2589 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. జగ్గారెడ్డి 2004లో టిఆర్ఎస్ పక్షాన గెలిచి కాంగ్రెస్ ఐలో చేరారు. 2009లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచి విప్ అయ్యారు. తదుపరి మెదక్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికలో బిజెపి పక్షాన పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ ఐ లోకి వచ్చి అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. జగ్గారెడ్డికి 76572 ఓట్లు రాగా, చింతా ప్రభాకర్కు 73983 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన రాజేశ్వరరావు దేశ్ పాండేకి 7600 పైగా ఓట్లు వచ్చాయి. రెడ్డి వర్గానికి చెందిన నేత జగ్గారెడ్డి. సంగారెడ్డిలో పదకుండు సార్లు రెడ్డి నేతలు గెలుపొందగా, రెండుసార్లు బిసి నేతలు విజయం సాధించారు. ఒకసారి ఎస్.సి, మరోసారి బ్రాహ్మణ నేత గెలు పొందారు. ఇక్కడ మొత్తం కాంగ్రెస్, కాంగ్రెస్లు కలిసి ఆరుసార్లు గెలిస్తే, టిడిపి ఒకసారి, రెండుసార్లు టిఆర్ఎస్ గెలిచాయి. నలుగురు ఇండిపెండెంట్లు గెలవడం విశేషం. సంగారెడ్డిలో అత్యధికంగా ఐదుసార్లు గెలిచిన ఘనత పి.రామచంద్రారెడ్డికి దక్కింది. ఈయన 1989లో కొంతకాలం స్పీకర్గాను, మరికొంత కాలం నేదురుమల్లి క్యాబినెట్లో మంత్రిగాను పనిచేసారు. 2004లో ఈయన బిజెపి తరుపున లోక్సభకు పోటీచేసి ఓడిపోయారు. సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కాంగ్రెస్ బలం, బలహీనతలను ఠాక్రేకు వివరించా: జగ్గారెడ్డి
-
కాంగ్రెస్పై కోమటిరెడ్డి కామెంట్స్.. జగ్గారెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కామెంట్స్ తెలంగాణలో పొలిటికల్ హీట్ను పెంచాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పందిస్తూ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్తో పొత్తకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. కాంగ్రెస్లో ముఖ్య నాయకుడు.. పార్టీలో కోవర్డులు ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్టార్లు, సూపర్ స్టార్లు ఇలా మాట్లాడుతుంటే ఎవరికీ ఏమీ చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్. బీజేపీకి మాపై ఆరోపణలు చేస్తే అర్హత లేదు. కేంద్రం తెచ్చిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్తోనే కాంగ్రెస్ పోరాటం అని స్పష్టం చేశారు. మరోవైపు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మల్లు రవి కూడా స్పందించారు. మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తుందనడం హాస్యాస్పదం. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి లేఖ రాస్తాం. గతంలో కోమటిరెడ్డికి షోకాజ్నోటీసులు ఇస్తే చెత్తబుట్టలో వేశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కు నష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుంది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్కు నష్టం చేసేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కేడర్ను గందరగోళంలో పడేశాయి. పార్టీని రక్షించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా తప్పుపట్టారు. అటు టీపీసీసీ రేవంత్ రెడ్డి వర్గం కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. -
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో స్ట్రెయిట్ టాక్
-
తెలంగాణాలో కన్ఫ్యూజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి : జగ్గారెడ్డి
-
వీర్ సావర్కర్ పై రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో తప్పులేదు : జగ్గారెడ్డి
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులకు బాధ్యులు ఎవరు ??
-
జగ్గారెడ్డిని ఈడ్చుకెళ్తున్న పోలీసులు
-
కేసీఆర్ మాటన్నీ హాస్యాస్పదమే: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
-
అధిష్టానం ‘అలయ్ బలయ్’!
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధిష్టానం అల్లంత దూరమనే భావన తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు దూరమవుతోందా? తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దగ్గరవుతున్నారా? గత మూడు రోజులుగా ఢిల్లీ వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణ నేతలు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రత్యేకంగా మకాం వేసి మరీ అధిష్టానం పెద్దలను కలుస్తుండడం, వీహెచ్, జగ్గారెడ్డి తదితర నాయకులకు ఢిల్లీ అగ్రనేతలు వరుసగా అపాయింట్మెంట్లు ఇస్తుండడం, త్వరలో రాష్ట్రానికి రానున్న రాహుల్గాంధీ పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరుస భేటీలు తెలంగాణలో పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను గతంలో ఎన్నడూ లేనివిధంగా 40 మంది రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్గాంధీ సమావేశం కావడంతో భేటీల పరంపర మొదలయింది. అంతకుముందే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సమావేశమయ్యారు. రాహుల్తో సమావేశం ముగిసిన మరుసటి రోజే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డిలు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ను జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. ఈలోపే రాహుల్గాంధీ కూడా జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. జగ్గారెడ్డితో పాటు టీపీసీసీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ను కూడా కలిసేందుకు అంగీకరించారు. కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు జగ్గారెడ్డి.. తన భార్య, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కుమారుడు భరత్సాయిరెడ్డి, కుమార్తె జయారెడ్డిలతో కలిసి వెళ్లి రాహుల్ను కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇక మహేశ్కుమార్గౌడ్ తన కుమారుడు, లా విద్యార్థి ప్రణవ్గౌడ్ను వెంటబెట్టుకుని రాహుల్ను కలిశారు. ఇద్దరు నేతలు రాహుల్ను కలిసినప్పుడు కూడా రాజకీయ అంశాల కంటే పిల్లల చదువులు, కుటుంబ అంశాలపైనే రాహుల్ మాట్లాడినట్టు సమాచారం. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి కూడా రాహుల్తో భేటీ అయ్యారు. రాహుల్తో భేటీ తర్వాత జగ్గారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నియోజకవర్గ నేతలను కూడా ఢిల్లీకి తీసుకువచ్చి రాహుల్ను కలిసి ఫొటోలు దిగేలా ప్రయత్నం చేస్తానని చెప్పడం గమనార్హం. గతానికి భిన్నంగా.. కాంగ్రెస్ పెద్దలను ఢిల్లీ వెళ్లి కలవడం ఎంత కష్టమో.. రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా అంతే కష్టమనే భావన రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఉంది. రాహుల్ లేదా సోనియా లేదా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఎవరు వచ్చినా కీలక నాయకులు మినహా ఎవరికీ వారిని కలిసే అవకాశముండేది కాదు. పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు కూడా కాంగ్రెస్ పెద్దలను కలవడం ఓ టాస్క్లాగానే ఉండేది. అయితే ఈసారి అందుకు భిన్నంగా రాహుల్గాంధీ తెలంగాణ పర్యటన ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈనెలాఖరులో రాష్ట్రానికి రానున్న రాహుల్ రెండ్రోజులు ఇక్కడే ఉంటారని, ఒకరోజు బహిరంగ సభకు హాజరు కానుండగా, మరోరోజు రాష్ట్రానికి చెందిన అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నేతలందరినీ కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక సంస్థలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న నాయకులు, సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన వారితో కూడా రాహుల్తో కలిపించాలనే భావనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అందని ద్రాక్షలు కాదు..! ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అందని ద్రాక్షలేమీ కాదని, అందరితో కలివిడిగా ఉంటారనే భావనను పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లాలనేది రేవంత్రెడ్డి యోచనగా కనిపిస్తోంది. ఆ భావన కలిగించడం ద్వారా జరగబోయే ఎన్నికల్లో మరింత క్రియాశీలంగా కేడర్ పనిచేస్తుందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. -
ఉగాది వేడుకల్లో జగ్గారెడ్డి సందడి
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణంలోని రామ మందిరంలో శనివారం జరిగిన ఉగాది ఉత్సవాల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. ఉగాది సందర్భంగా ఈ మందిరంలో వినూత్న ఆచారం కొనసాగుతోంది. భక్తుల పైకి ప్యాలాల లడ్డూలు (ప్రసాదం) విసురుతూ వందలాది మంది భక్తులకు అందిస్తారు. 40 ఏళ్లుగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్యాలాల లడ్డూలు విసిరే కార్యక్రమం కొనసాగుతోంది. మొదట లడ్డూలకు పూజ చేసిన అనంతరం భజన చేస్తూ లడ్డూలను ఊరేగించారు. ఈ ఊరేగింపులో ఎమ్మెల్యే డోలక్ వాయిస్తూ పాటలు పాడుతూ భక్తులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆలయంపై నుంచి ఆయన భక్తులపైకి లడ్డూలు విసిరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ భద్రాచలంలో శ్రీరాముని కల్యాణం, తలంబ్రాలు అయ్యాక ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
విజయం వైఎస్సార్ సీపీదే
20న ఎడ్ల బండలాగుడు పోటీలు
No Headline
ఓటేసిన 15,89,412 మంది
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement