-
వైద్య సేవల రంగంలో గిరిజన యువత
సాక్షి, అమరావతి: గిరిజన యువతకు ఉపాధి కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్ఎస్డీసీ) ద్వారా చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. గిరిజన యువత కోసం ఏపీ ఎస్ఎస్ఐడీసీ వివిధ ఉపాధి కోర్సులను అందుబాటులోకి తీసుకొచి్చంది. ఇందులో భాగంగా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్తో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో శిక్షణ ఇస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఒక శిక్షణా ల్యాబ్ను ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్లో ఇప్పటివరకు 361 మంది గిరిజన యువత హాస్పిటల్ సర్వీసెస్ కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో 244 మందికి ఇప్పటికే ఉపాధి లభించినట్టు ఏపీ ఎస్ఎస్డీసీ ఈడీ హనుమాన్ నాయక్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రాథమికంగా రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు జీతం లభిస్తోందని తెలిపారు. విశాఖ, బేతంచర్లలో కూడా ఇటువంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో కలిసి నర్సింగ్లో శిక్షణ ఇవ్వడం ద్వారా గిరిజన యువతులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ విధంగా 2020లో 3,300 మందికి శిక్షణ ఇవ్వగా.. ఈ ఏడాది కనీసం 5,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. -
'మెరుగైన విద్యను అందించడమే మా లక్ష్యం'
సాక్షి, ఉయ్యూరు(కృష్ణా) : ఉయ్యూరు మండలం పెద ఓగిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రెడ్డీస్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 200 స్కూళ్లలో స్కాలర్షిప్లు అందజేయడమే గాక, మౌళిక వసతులు లేని స్కూళ్లను ఏంచుకొని వాటి అభివృద్ధికి రెడ్డీస్ ఫౌండేషన్ కృషి చేయడం మంచి పరిణామమని తెలిపారు. అదే విధంగా 'కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ' పేరుతో విద్యార్థులను ప్రోత్సహిస్తూ రెడ్డీస్ ఫౌండేషన్ తమ వంతు ఆర్థిక సాయం చేస్తుందని వెల్లడించారు. తమ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, ఇతర వసతులు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ మేరకు వచ్చే జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లికి రూ.15వేలు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. అధిక ఫీజుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్న వ్యవస్థను మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో విద్యా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి గుర్తు చేశారు. దీంతో తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుందని పార్థసారధి పేర్కొన్నారు. -
నాన్న... సామ్రాజ్యం
ఫస్ట్ పర్సన్ నాన్న డాక్టర్ అంజిరెడ్డి ఒక గొప్ప దార్శనికుడు! అమ్మ సామ్రాజ్యం.. అభిమానాల సామ్రాజ్యం! వీళ్లిద్దరూ పెంచిన మొక్క అనూరాధ! ఇప్పుడు అనూరాధ పెద్ద చెట్టయింది.. ఓ సప్తపర్ణిలా! ఓ కొమ్మన కళ, సంస్కృతి పూలను విరబూయిస్తూ.. మరో కొమ్మన చదువుల ఫలాలను పంచే చెట్టయింది! ఇంటర్వ్యూ చేస్తామంటే వద్దన్నారు.. ఫొటోలు తీస్తామంటే కుదరదు అన్నారు.. నిశ్శబ్దంగా పనిచేయడం ఇష్టమన్నారు! ‘మీ పనితో పదిమంది స్ఫూర్తి చెందితే పదివేలమంది పదిలంగా ఉంటారు’ అని చెబితే ‘సరే’నని ఒప్పుకున్నారు! ‘సాక్షి’కి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫ్యామిలీలోని ఈ కొత్త శీర్షిక ఫస్ట్ పర్సన్కు స్వాగతం. కొంతమంది పిల్లలను చూస్తుంటే మనమెంత అదృష్టవంతులమో అనిపిస్తుంది. వాళ్లకూ చదువుకోవాలనుంటుంది. కాని ఇంట్లో పరిస్థితి అనుకూలంగా ఉండదు. నాన్న తాగుడుకు బానిసై ఉంటాడు, తల్లి ఎక్కడో పనిచేసుకొని వస్తుంది.. ఆ డబ్బులు సరిపోవు.. దాంతో చదువు మధ్యలోనే ఆపేసి ఆ పిల్లలూ ఏదో పనిని వెదుక్కునే అవసరం ఏర్పడుతుంది. అలాంటివి చూసినప్పుడే మనం ఎంత బాగా పెరిగామో.. అనిపిస్తుంది. అందుకే మా నాన్నగారికి (అంజిరెడ్డి) కూతురుగా పుట్టడం నాకు వరం! గర్వంగా ఉంటుంది. ఈ రోజు ‘డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్’ తరపున ఇలాంటి పిల్లలు చదువుకునేలా చేయడం నాన్నగారు ఇచ్చిన అవకాశమే. ఆయనది విశాల దృష్టి. గొప్ప ఆలోచన! అందరూ మంచివాళ్లే అని నమ్మేవారు. అదే మాకూ అబ్బింది. ఆ ఆలోచనా విధానమే ఆయన బలం! మాకూ అదే శక్తి! ఇది చెయ్.. అది చేయకు అంటూ మమ్మల్నెప్పుడూ ఒత్తిడి చేయలేదు. మేము ఏం చేసినా మెచ్చుకునేవారు. దేన్ని ఎలా చేయాలో ప్రత్యేకించి నేర్పలేదు. దేన్నయినా, ఏదైనా ఆయన్ని చూసి నేర్చుకోవడమే. ఆ మాటకొస్తే మాకు అమ్మా, నాన్న ఇద్దరూ గురువులే. అమ్మ కూడా (సామ్రాజ్యం) సింపుల్. నాన్న దగ్గర మేం దృక్పథాన్ని అలవరచుకుంటే అమ్మ దగ్గర నిరాడంబరతను నేర్చుకున్నాం. తాను మొదటి నుంచి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. అమ్మా నాన్న.. ఇద్దరూ కూతురుగా నాకెప్పుడూ ఆంక్షలు విధించలేదు. నేను పెట్టుకున్న పరిమితులే తప్ప వాళ్ల నుంచి అలాంటివి లేవు. గృహిణిగా సంతృప్తి, సంతోషం బీఎస్సీ ఫైనలియర్లో పెళ్లయింది. బిజినెస్ వ్యవహారాలకు నేను మొదటి నుంచీ దూరం. అంత ఆసక్తీ లేదు. ఇల్లు, భర్త, ముగ్గురు పిల్లలు, వాళ్ల చదువుల బాధ్యతలను చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను. మధ్యలోనే బడి మానేస్తున్న పిల్లల కోసం ఏదైనా చేయాలని అనుకుంటుండేవారు నాన్నగారు. ఏది మొదలు పెట్టినా ఇవ్వాళ చేశాం.. రేపటికి అయిపోయింది అన్నట్టుగా కాక.. తను ఉన్నా లేకపోయినా తాను ప్రారంభించిన సంస్థ వృత్తి నైపుణ్యాలతో.. కార్పోరేట్ సంస్థలా కొనసాగాలని అనుకునేవారు. ఆ ఉద్దేశంతోనే 1996లో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ (డీఆర్ఎఫ్)ను ప్రారంభించారు. అప్పుడు తనతోపాటు నన్నూ దానికి ట్రస్టీగా పెట్టారు. ఫౌండేషన్ బాధ్యతలన్నీ నళినీ గంగాధర్ చూసుకునేవారు. పదేళ్లకు (2006లో) నళినీ గంగాధర్ సొంత సంస్థను అభివృద్ధి చేసుకోవాలని ఈ సంస్థ నుంచి వెళ్లిపోయారు. అప్పుడు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ బాధ్యతను నేను తీసుకోవాల్సి వచ్చింది. ఆ పనంతా నాకు కొత్తే! భయంగానే భారాన్ని తలకెత్తుకున్నాను. ఫౌండేషన్ బృందంతో కలిసి పనిచేస్తూనే కొత్త విషయాలను తెలుసుకున్నాను! అయితే ఇక్కడ నా టీమ్ని ప్రశంసించాలి. నాకు చాలా మద్దతుగా నిలబడింది. డీఆర్ఎఫ్... చారిటీ కాదు పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లకు జీవన నైపుణ్యాలు నేర్పించి వారికి ఉపాధి చూపించడం దగ్గర మొదలైంది డీఆర్ఎఫ్ ప్రయాణం. పుడమి పేరుతో 25 పాఠశాలలను నడుపుతున్నాం. ఓ 50 ప్రభుత్వ పాఠశాలలకూ సహకారం ఇస్తున్నాం. బాగా చదువుకునే పిల్లలకు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఒక అవరోధంగా మారకూడదు. డబ్బులేని కారణంగా వాళ్ల చదువు ఆగిపోకూడదు. అందుకే మంచి మార్కులు వచ్చి, ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులకు ఉపకార వేతనాలనూ అందిస్తున్నాం.. ఆ డబ్బుతో వాళ్లు పైచదువులకు వెళ్లడానికి. డీఆర్ఎఫ్లో ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అందులో బోధనా పద్ధతులు, పాఠ్యాంశాలకు సంబంధించిన అధ్యయనం, పరిశోధన జరుగుతుంటాయి. ఇక జీవనోపాధికి సంబంధించి దేశవ్యాప్తంగా వంద కేంద్రాలు పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయి పర్యవేక్షణ కోసం ఆ కేంద్రాలకు వెళ్లినప్పుడు స్థానికుల ఆదరణ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇలా సేవ చేయడం అదృష్టమనిపిస్తుంది. అలాగని దీన్ని చారిటీ అనను. నాన్నగారు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తా. అదే లక్ష్య నినాదం.. అదే అంకిత భావం ఈ ఫౌండేషన్ వల్ల ఎంతోమంది పిల్లలకు మేలు జరుగుతోంది. నాన్నగారికి చాలా ఆలోచనలు ఉండేవి. సమయానుగుణంగా వాటిని అమలు చేసుకుంటూ పోవడమే నా భావి ప్రణాళిక. నాన్నగారు అనుకున్నట్లు ఈ సంస్థ మేం లేకపోయినా నడవాలి. అదే లక్ష్య నినాదంతో.. అదే అంకితభావంతో! అందుకే వీలైనంత వరకు విస్తరిస్తూ పోతున్నాం. ప్రస్తుతం.. రైతులు, వికలాంగుల కోసం పనిచేస్తున్నాం. ఇలా భవిష్యత్తులో కూడా వీలైనన్ని అంశాల మీద దృష్టి పెడతాం. ఈ స్ఫూర్తి కొనసాగేలా చూస్తాం! చేసింది చాలా తక్కువ ఐ నెవర్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. గృహిణిగా ఆ బాధ్యతను చాలా ఇష్టపడ్డాను. డీఆర్ఎఫ్ డెరైక్టర్గా ఈ పనినీ అంతే నిబద్ధతతో నెరవేరుస్తున్నాను. అయితే చేసింది చాలా తక్కువనే భావన. ఇంకా ఏదో చేయాల్సి ఉండిందని.. చేయాలనీ ఉంటుంది. ప్రతివాళ్లకూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. దాన్ని అనుసరించాలి. ఆసక్తి ఉన్న పనిని అలక్ష్యం చేయకుండా చేతల్లోకి దిగాలి. - సరస్వతి రమ సప్తపర్ణి సప్తపర్ణి నా సొంత ఐడియా. పిల్లలకు చదువే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల మీద మీద కూడా శ్రద్ధ కల్పించాలనే ఉద్దేశంతో సప్తపర్ణిని స్థాపించాను. ఈ విషయంలో జిడ్డు కృష్టమూర్తి, విద్యారణ్య పాఠశాల నాకు స్ఫూర్తి. ఎంతసేపూ బిజినెస్.. సోషల్ వర్కే కాకుండా ఆర్ట్ అండ్ కల్చర్ కూడా జీవితంలో భాగం కావాలి కదా! అందుకే ఈ సప్తపర్ణి. అయితే నా ఈ ఆలోచనను బాగా ప్రోత్సహించి దీనికి రూపమిచ్చింది మాత్రం నా భర్త ప్రసాద్. అసలు నేను ఇవ్వాళ ఇన్ని పనులను ఇంత తేలికగా పూర్తి చేయగలుగుతున్నానంటే కూడా కారణం ప్రసాద్ నాకు అండగా ఉండడమే! ఎన్ని చేసినా మనసులో మాత్రం గృహిణి హోదాకే ఎక్కువ మార్కులు వేసుకుంటా! నిజానికి అది చాలా ఇంపార్టెంట్. కుటుంబ బాధ్యతల్ని, సామాజిక సేవనీ రెండిటినీ సమన్వయం చేయడం కష్టం, కానీ ముఖ్యం! -
పరిశోధనలపై మరింత దృష్టి
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఈవో జీవీ ప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఖరీదైన ఔషధాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే దిశగా పరిశోధన సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సహ-చైర్మన్, సీఈవో జీవీ ప్రసాద్ వెల్లడించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్, బెంగళూరుతో పాటు అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఆర్అండ్డీ సెంటర్లను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. గురువారం జరిగిన కంపెనీ 30వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రసాద్ ఈ విషయాలు వివరించారు. ఔషధాలను చౌకగా అందించడంతో పాటు ఇప్పటిదాకా అంతగా ఎవరూ దృష్టి పెట్టని కొన్ని కీలకమైన ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నామని ప్రసాద్ తెలిపారు. హైపర్ టెన్షన్ చికిత్స కోసం ఈ మధ్యే భారత్లో ప్రవేశపెట్టిన ఆప్టిడోజ్ ఆ కోవకి చెందినదేనని వివరించారు. మరోవైపు, కార్పొరేట్ సామాజిక బాధ్యతని (సీఎస్ఆర్) ప్రభుత్వం తప్పనిసరి చేయడానికి చాలా ముందు నుంచే తాము పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రసాద్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ దాదాపు 7,500 మంది రైతులు ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయ వ్యయాలు తగ్గించుకునేందుకు తోడ్పాటు అందించినట్లు వివరించారు. ఇక అర్బన్ లైవ్లీహుడ్ ప్రోగ్రాం కింద ఈ ఏడాది 21,000 పైచిలుకు యువతకు శిక్షణనిచ్చినట్లు తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement