-
సాక్షి, నమస్తే తెలంగాణలనే ఎందుకు అడ్డుకుంటున్నారు?
కరీంనగర్: ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అవసరమని కరీంనగర్ ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు బి.వినోద్కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్లో వినోద్ కుమార్ మాట్లాడుతూ... మీడియాపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరీపై మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ గురించి బాగా మాట్లాడే చంద్రబాబు... నమస్తే తెలంగాణ, సాక్షి మీడియాను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైనా విషయం జరిగితే గోరంతను కొండంతలుగా రాసే వారు చంద్రబాబు తీరును ఎందుకు ఎండగట్టడం లేదని ప్రశ్నించారు. అక్టోబర్లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని వినోద్ కుమార్ చెప్పారు. -
రోజుకో పార్టీ
రోజుకో పార్టీ ఢిల్లీలో మకాం వేసిన అన్ని పార్టీల నాయకులు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఒక్కొక్కరుగా తిరిగి వస్తున్నారు. తెలంగాణ సాధన లో తామే చాంపియన్లమని చెప్పుకోవడానికి భారీ ఎత్తున విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఒకరికి మించి మరొకరు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి వరుసగా మూడురోజుల పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం జిల్లానేతలు టార్గెట్లు పెట్టుకుని మరీ జనసమీకరణ ప్రయత్నాల్లో పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పార్టీల నేతలు చురుగ్గా పాల్గొన్నా వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఆ మేరకు లబ్ధి చేకూరుతుందా లేదా అన్న సందేహాలు అందరినీ వేధిస్తున్నాయి. విజయోత్సవాల ద్వారా జనాన్ని ఆకర్షించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్, కరీంనగర్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, పార్టీ జిల్లా ఇన్చార్జి బి.వినోద్కుమార్ ఢిల్లీ నుంచి సోమవారం జిల్లాకు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వారిని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జిల్లా నాయకులు ఆహ్వానించనున్నారు. అక్కడనుంచి నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. సాయంత్రం తెలంగాణచౌక్లో జరిగే భారీ బహిరంగ సభలో వారు పాల్గొంటారు. ర్యాలీ, సభలను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు బాధ్యతలు పంచుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ శ్రేణులను పెద్ద సంఖ్యలో సమీకరించడంతో పాటు ఉద్యమ సంఘాలను ఆహ్వానిస్తున్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత సభను నిర్వహించనుంది. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బిల్లుకు ఆమోదం లభించిన తరువాత ఢిల్లీ నుంచి జిల్లాకు వస్తున్న మంత్రి దుద్దిళ శ్రీధర్బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్లకు పార్టీశ్రేణులు పెద్దఎత్తున స్వాగత సన్నాహాలు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు కోసం చర్యలు తీసుకున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, రాహుల్గాంధీ, దిగ్విజయ్సింగ్లకు కృతజ్ఞత తెలిపేందుకు డీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాభవన్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సభను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సభలో పాల్గొనాలని ఆహ్వానించారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ధన్యవాద సభ నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం సంపూర్ణంగా సహకరించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నేరవేరిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ సభను పెడుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్, లోక్సభాపక్ష నేత సుష్మాస్వరాజ్, సీనియర్ నాయకులు ఆరుణ్జైట్లీ, ప్రకాష్ జవదేకర్లకు ఈ సభలో ధన్యవాదాలు తెలుపనున్నారు. జిల్లా ముఖ్య నాయకులు సిహెచ్.విద్యాసాగర్రావు, పి.సుగుణాకార్రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొంటారు. ఈ సభకు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పార్టీ కార్యకర్తలను సమీకరిస్తున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement