-
వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి..
భోపాల్: మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఓ దళిత కుటుంబంపై దాష్టీకం జరిగింది. వేధింపుల కేసులో రాజీకి రావాలంటూ ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని తల్లిని వివస్త్రని చేశారు. 'నా బిడ్డను విపరీతంగా కొట్టారు. కాపాడుకోలేకపోయా. మా ఇంటిని కూల్చివేశారు. ఇంట్లో వస్తువులన్నీ పాడు చేశారు. అడ్డుగా వెళ్లిన నన్ను వివస్త్రను చేశారు’’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది బాధిత మహిళ. పోలీసులు వచ్చి టవల్ అందించేంతవరకు ఆమె నగ్నంగానే ఉండిపోయారు. తన వేధింపుల కేసులో రాజీకి రావాలని తమ సోదరిపై ఒత్తిడి పెంచారని బాధితురాలి సోదరి తెలిపింది. వేధింపులకు గురిచేస్తున్నారని 2019లో మృతుని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో రాజీకి రావాలని కోరుతూ బాధిత కుటుంబంపై ఓ గుంపు దాడి చేసిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి మరో ఇద్దరు సోదరులను వెతుకుతూ వారి బంధువుల ఇళ్లలో కూడా నిందితులు విధ్వంసం సృష్టించారు. ఇళ్లలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. తమ భర్తలపై దాడి చేసి, పిల్లలను చంపబోయినట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. పోలీసు బలగాలు చేరేవరకు గ్రామంలో అల్లకల్లోలం సృష్టించారని స్థానికులు తెలిపారు. జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి, నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చాక.. మృతునికి అంత్యక్రియలు జరిపారు. మధ్యప్రదేశ్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా దూమారం రేపింది. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళితులకు రక్షణ కరువైందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. దళితులపై దాడుల్లో రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. ఘటనపై స్పందించిన ప్రభుత్వం దోషులపై కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పింది. ఇలాంటి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఎన్నికలు జరనున్న నేపథ్యంలో నేరాలకు రాజకీయ తెరలేపుతోందని ఆరోపించింది. రెండు వర్గాల మధ్య గొడవల తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తాజా ఘటన జరిగిందని మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజకీయంగా ఉపయోగించుకునే కుట్ర పన్నుతోందని అన్నారు. ఇదీ చదవండి: మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి.. -
ఏమైందో తెలియదు..! నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్ని చితక్కొట్టారు..
అమెరికాలోని న్యూయార్క్లో దారుణం జరిగింది. ఐదుగురు యువకులు కలిసి వృద్ధుడైన ఓ క్యాబ్ డ్రైవర్ను దారుణంగా కొట్టారు. నడిరోడ్డులో 60 ఏళ్ల వృద్ధునిపై విచక్షణా రహితంగా పిడిగుద్దులు కురిపించారు. బూటు కాలుతో తంతూ ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులు కలిసి దాడి చేశారు. నగరంలోని సిక్స్త్ అవెన్యూ 34 వ కూడలికి సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. వీడియో ప్రకారం ఐదుగురు కలిసి క్యాబ్ డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి చేశారు. వారి దెబ్బలను తట్టుకోలేక ఆ వృద్ధుడు తనను తాను రక్షించుకోవడానికి తలపై చేతులు పెట్టుకుని దీనంగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఓ మహిళ పిడిగుద్దులను భరించలేక క్యాబ్ వైపు వంగి పడిపోయాడు. ఈ దృశ్యాలు సదరు వీక్షకున్ని ఆలోచింపజేశాయి. ఈ వీడియో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట క్యాబ్ డ్రైవర్కు యువకులకు మధ్య వాగ్వాదం నడిచిందని తెలిపారు. అనంతరం దాడి జరిగినట్లు పేర్కొన్నారు. Just another day in NYC.... A group of thugs beat up a 60 year old taxi cab driver in Manhattan in broad daylight. Last year a 52 year old NYC cab driver was beaten to death by a group of teens. pic.twitter.com/v9SQAkCWcN — Leftism (@LeftismForU) July 28, 2023 తీవ్రంగా గాయపడిన వృద్ధున్ని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. హోవార్డ్ కొలీ, నటాలీ మోర్గాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ బ్రూక్లిన్కు చెందినవారిగా గుర్తించారు. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్ప్రెస్ ట్రైన్ -
Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర ఘటన వెలు గుచూసింది. ఆగ్రాలోని తాజ్మహల్ను చూసేందుకు వచ్చిన ఓ పర్యాటకుడిపై స్థానిక యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. పర్యాటకుడిని వెంబడించి మరీ కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఇదంతా మంగళవారం ఉదయం జరగ్గా.. దాడికి సంబంధించిన దృశ్యాలు ఓ షాప్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాజ్మహల్ చూసేందుకు ఆదివారం ఆగ్రా వచ్చాడు. ఈ క్రమంలో తాజ్గంజ్ ప్రాంతంలోని బసాయ్ చౌకీ వద్ద కారులో వెళ్తుండగా పక్కన నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను తన వాహనం తాకింది. పర్యాటకుడు కారు ఆపి వాళ్లకు క్షమాపణలు చెప్పాడు. అయినా వారు వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు భయంతో అతడు దగ్గర్లోని ఓ స్వీట్ షాప్లోకి పరుగెత్తాడు. అతన్ని వెంబడించిన దుండగులు షాప్లోకి చొరబడి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. తప్పు అయ్యింది, క్షమించాలని వేడుకున్నా వదల్లేదు. కొంత సమయం పాటు అతన్ని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. Video from Agra . Tourist Beaten by Locals. #shameful #SeemaHaider #KiritSomaiya #Agra #DelhiFloods pic.twitter.com/zuXq7qdwLN — देश सर्वप्रथम (@deshsarvpratham) July 18, 2023 దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తమలో ఒకడిని కారుతో ఢీ కొట్టాడన్న కారణంతోనే దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తాజ్మహల్ గొప్ప పర్యటక ప్రాంతమని, దీనిని చూసేందుకు రోజు వేలల్లో టూరిస్టులు వస్తుంటారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. पर्यटक के साथ मारपीट से संबंधित वायरल वीडियो का स्वत: संज्ञान लेकर, #थाना_ताजगंज पुलिस द्वारा तत्काल अभियोग पंजीकृत कर, 03 टीमों का गठन करते हुए, 05 आरोपियों को हिरासत में लिया गया है व अन्य आरोपियों की गिरफ्तारी हेतु लगातार प्रयास किया जा रहा है। pic.twitter.com/yoyjGb6J3d — POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) July 17, 2023 -
బొట్టు పెట్టుకుని స్కూల్కు వచ్చిందని కొట్టడంతో బాలిక ఆత్మహత్య
రాంచీ: ఝార్ఖండ్లోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. నుదుటిపై బొట్టు పెట్టుకుని వచ్చిందని బాలికను ఉపాధ్యాయుడు కొట్టాడు. ఈ ఘటనను అవమానంగా భావించిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అమానవీయ ఘటన ధన్బాద్లోని తెతుల్ మరిలో జరిగింది. ఈ ఘటనపై బాలల హక్కుల జాతీయ కమిషన్ ఛైర్పర్సన్ ప్రియాంక్ కనుంగో స్పందించారు. దర్యాప్తు నిమిత్తం తమ టీం ధన్బాద్కు వెళ్తుందని ట్వీట్ చేశారు. చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ చీఫ్ ఉత్తమ్ ముఖర్జీ కూడా ఈ ఘనటపై స్పందించారు. పాఠశాలకు సీబీఎస్ఈ బోర్డు గుర్తింపు కూడా లేదని చెప్పారు. బాలిక ఆత్మహత్యకు కారణమైన టీచర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇది తీవ్రమైన ఘటన అని అన్నారు. జిల్లా విద్యాశాధికారిని కలిసి ఆయన దృష్టికి తెచ్చామని చెప్పారు.బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించామని ఆయన చెప్పారు. బాలిక మృతిపై బాధిత తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల యాజమాన్యంపై ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. 15 రౌండ్ల కాల్పులు.. కస్టడీలోనే ఖతం చేశారు -
వెంబడించి వేధించడంతో..పోకిరిని చెప్పుతో..
కాలేజీ నుంచి హాస్టల్కి వెళ్తున్న విద్యార్థిని ఓ వ్యక్తి వెంటపడి వేధించడం ప్రారంభించాడు. ఓపిక నశించిన ఆ అమ్మాయి ఆ వ్యక్తిని చెప్పుతో ఎడాపెడా వాయించింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కాలేజీ విద్యార్థిని హాస్టల్ నుంచి కాలేజికి వెళ్తుండగా ఓ యువకుడు ఆమె వెంటపడి వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె కేకలు వేసి చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేసింది. దీంతో స్థానికులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె అందరి ముందే అతడి చెంప చెల్లుమనిపించింది. తన కాలికి ఉన్న చెప్పుతో అతడి ముఖంపై ఎడాపెడా వాయించి తన కోపం తీర్చుకుంది. ఇక ఆ యువకుడు చేసేదేం లేక చూస్తు కూర్చున్నాడు. తనను వదిలేయమని ప్రాథేయపడ్డాడు. అయితే స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని నజీర్గా గుర్తించారు పోలీసులు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అవుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: అదుపుతప్పి..వాహనాలపైకి దూసుకెళ్లి..) -
నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్
దేశ రాజధాని ఢిల్లీ ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఓ కారుని ఫాలో అవ్వుతూ..నడి రోడ్డుపై ఆ కారుని బలవంతంగా ఆపించి గుండాయిజానికి దిగారు. ఆ తర్వాత సదరు కారు డ్రైవర్ని కారులోంచి దిగమని చెప్పి కొట్టడం, తిట్టడం వంటివి చేశారు. ఎందుకు అలా చేస్తున్నారో చెప్పమని కోరినా.. వినిపించుకోకుండా తమ పైశాచికత్వాన్ని అంతా అతనిపై చూపించారు. చివరికి అతను క్షమించమని ప్రాధేయపడటంతో వదిలేశారు. ఈ ఘటన మొత్తం ఢిల్లీలోని నాంగ్లోయ్ మెట్రో రైల్వేస్టేషన్ వద్ద జరిగింది. సదరు బాధిడతుడు ఆ సంఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ సదరు వ్యక్తులపై సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరేంద్ర కే సింగ్ నిందితులను అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు. (చదవండి: ట్రైయిన్లో మరో అసభ్యకర ఘటన.. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్..) -
దొంగను కొట్టి చంపిన గ్రామస్థులు
-
క్లాస్ రూం చుట్టూ పరిగెత్తించి మరీ టీచర్పై దాడి..పేరెంట్స్ అరెస్టు
టీచర్ని చితకబాదిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏకంగా క్లాస్ రూమ్ చుట్టూ పరిగెత్తించి మరీ చితకబాదారు విద్యార్థి తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తమిళనాడుతో స్కూల్లో టీచర్పై రెండో తరగతి విద్యార్థి పేరెంట్స్ దారుణంగా దాడి చేశారు. విద్యార్థి తల్లిందండ్రలు నేరుగా ఉపాధ్యాయుడి క్లాస్ రూం వద్దకు వచ్చి మరీ గొడవకు దిగారు. మా పిల్లలను కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు?..అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ టీచర్ని క్లాస్లోనే విద్యార్థులందరి ముందు పరిగెత్తించి మరీ దారుణంగా కొట్టారు. ఆఖరికి సమీపంలోని ఇటుక రాయిని కూడా తీసుకుని ఆయన మీదకు విసిరే యత్నం చేశారు. అందుకు సంబంధించిన మూడు నిమిషాల వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు బాధిత ఉపాధ్యాయుడుని ఆర్ భరత్గా గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ విద్యార్థి తల్లిదండ్రులతో పాటు ఆచిన్నారి తాతయ్యను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమేగాక దాడికి పాల్పడినందుకు గాను వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విచారణలో..సదరు విద్యార్థి క్లాస్లో సరిగా వినకపోవడం, ఇతర పిల్లలను కొట్టడం వంటివి చేయడంతో టీచర్ ఆమెను సీటు మారమని చెప్పారు. ఐతే సీటు మారుతున్న క్రమంలో ఆ చిన్నారి పడిపోయింది. కానీ ఆ చిన్నారి ఇంటికి వెళ్లి తనను టీచర్ కొట్టాడంటూ.. వాళ్ల తాతయ్యకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు మా పిల్లలనే కొడతావ అంటూ టీచర్పైకి దాడికి దిగారని పోలీసులు తెలిపారు. (చదవండి: ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుకి కలత చెంది యువకుడు బలవన్మరణం) -
భార్యపై చేయి చేసుకున్నానని.. ఆవేదనతో భర్త..
సాక్షి, అల్వాల్: క్షణికావేశంలో భార్యపై చేయి చేసుకున్నానని మనస్తాపానికిలోనైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన సురేంద్రకుమార్ (35) బసంతి దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చారు. సురేంద్రకుమార్ జీడిమెట్లలోని సూపర్ మార్కెట్లో ఉద్యోగం చేస్తుండగా అతడి భార్య బసంతి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేది. ఇటీవల బసంతి ఉద్యోగం మానేసింది. అప్పటికే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో భార్య ఉద్యోగం మానేయడంతో ఆగ్రహానికిలోనైన సురేంద్రకుమార్ ఆదివారం చేయి చేసుకున్నాడు. దీంతో మానసిక వేధనకు లోనైన అతను భార్య, కుమార్తెలను బెడ్రూంలో వేసి బయటి నుంచి గడియ పెట్టి హాల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బసంతి తెలిసిన వారికి ఫోన్ చేసి సమాచారం అందించింది. వారు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్లో కాళ్లను దాచి..) -
Video: ‘తప్పతాగి వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో దంచికొట్టింది’
బెంగళూరు: రోడ్లు, బస్సులు, రైళ్లల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలు, యువతులు మహిళలు అనే తేడా లేకుండా పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఓ మహిళ మందుబాబును ఊరికే వదలకుండా అందరి ముందే బడిత పూజ చేసింది. ధార్వాడ్ జిల్లాలో ఫుల్గా తాగిన ఓ వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్న మహిళలను అడ్డగించి వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. అంతేగాక వారి ఫోన్ నెంబర్లు అడుగుతూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన ఓ మహిళ అతడిని పట్టుకొని ఏకంగా చెప్పుతో కొట్టింది. నడి రోడ్డుపై కూర్చొబెట్టి అతడి తల, ముఖంపై దాడి చేసింది. అందరూ చూస్తుండగానే అతడి ముఖాన్ని పచ్చడి చేసింది. చట్టు పక్కల ఉన్నవారు సైతం ఆమెకు మద్దతుగా నిలిచారు. మహిళ పిచ్చి పిచ్చిగా కొడుతున్నా.. సదరు వ్యక్తి కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీనిని స్థానికులు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. A man in an inebriated state was misbehaving with women in #Dharward. He was going on asking mobile phone numbers of women. He was beaten with slippers. Incident happened at Subhas road. pic.twitter.com/9WlGplQvjL — Imran Khan (@KeypadGuerilla) December 30, 2022 -
కిడ్నాప్ హైడ్రామా.. యువకుడిని చితకబాది కారులో ఎత్తుకెళ్లిన యువకులు
సాక్షి, నిజామాబాద్: యువకుడి కిడ్నాప్ హైడ్రామా జిల్లాలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం క్రేటా కారులో వచ్చిన ముగ్గురు ఫిజికల్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న నరేశ్ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. యువకుడిని చితకబాది కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. అక్కడున్న వారు కారు ఫొటోలను మీడియా, పోలీసులకు పంపించారు. దీంతో మూడోటౌన్ ఎస్సై శ్రావణ్కుమార్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పెట్రోకారు బృందంతో పాటు మరో మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కారు నంబర్ ఆధారంగా బోధన్ వీడీసీ అధ్యక్షుడు బాగ య్యదిగా గుర్తించారు. పోలీసులు బాగయ్యను ఫోన్ లో విచారించగా తన అల్లుడైన అఖిలేష్ యాదవ్ ఉదయం ఇంటి నుంచి కారు తీసుకువెళ్లినట్లు చెప్పారు. అఖిలేష్యాదవ్తో పాటు అతని స్నేహితులు నిఖిల్, సాయికృష్ణ ఉన్నారు. పోలీసులు బాగయ్య కుమారుడు భరత్ను పిలిపించి ఫోన్లో కాన్ఫరెన్స్ కలిపి అఖిలేష్ యాదవ్తో మాట్లాడించగా తాను బోధన్కు వస్తున్నట్లు చెప్పాడు. పోలీసులు అఖిలేష్యాదవ్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. కారును స్వాధీనం చేసుకొని, యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో నరేశ్ను ఎడపల్లి మధ్యలో దింపేశారు. కాగా నన్నెవరూ కిడ్నాప్ చేయలేదని బాధితుడు నరేశ్ పోలీసులకు తెలిపాడు. అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాత ఎడపల్లి మధ్యలో విడిచిపెట్టారని చెప్పాడు. ఎవరినీ తాను టీజ్ చేయలేదని, నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నాడు. ఎస్సై శ్రావణ్కుమార్ మాట్లాడుతూ ఎలాంటి కిడ్నాప్ జరగలేదన్నారు. ప్రేమ వ్యవహారం మాట్లాడినట్లు తెలిపారు. చదవండి: ఇటీవలే యువకుడితో నిశ్చితార్థం.. తల్లి దగ్గరకు వెళ్లొచ్చి.. -
లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు
బెంగళూరు: పిల్లలకు పాఠాలు బోధించాల్సిన హెడ్ మాస్టర్ పైశాచికంగా ప్రవర్తించాడు. స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థినులు అంతా కలిసి అతనికి తగిన బుద్ధి చెప్పారు. తమను వేధిస్తున్న హెడ్ మాస్టర్ వద్దకు కర్రలతో వెళ్లి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కర్ణాటక మండ్య జిల్లా కట్టేరి గ్రామంలోని ఓ పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. #mandya A senior teacher of a govt school in Kattigeri beaten up by students before handing him over to police.There were several complaints of sexual misconduct against Chinmayanand.Yesterday,students got together & hit him with sticks for harassing a girl student #Karnataka pic.twitter.com/ud2WSMCkLx — Imran Khan (@KeypadGuerilla) December 15, 2022 -
యూపీలో దారుణం.. యువకుడ్ని చితకబాది మొహంపై మూత్ర విసర్జన..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ గోండా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడిపై మరికొంతమంది యువకుల గ్యాంగ్ దాడి చేసింది. అనంతరం అతడిపై సదరు గ్యాంగ్లోని వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఘటన జరిగిన రెండు వారాల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన అనంతరం పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడ్ని అరెస్టు చేశారు. అతని పేరు కప్తాన్ సింగ్ అని వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే బాధితుడి ఇంటికివెళ్లి కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే స్థానికంగా ఉండే రెండు గ్యాంగ్లు ఆధిపత్యం కోసం తరచూ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 31న కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గానికి కప్తాన్ సింగ్ నాయకత్వం వహించగా.. మరో వర్గానికి బాధితుడు శివ సింగ్ లీడర్గా ఉన్నాడు. ఈ గొడవలో శివ గ్యాంగ్ ఓడిపోయింది. దీంతో అతడ్ని చితకబాది మూత్ర విసర్జన చేసింది కప్తాన్ సింగ్ గ్యాంగ్. శివ సింగ్, కప్తాన్ సింగ్లపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కప్తాన్ సింగ్ ఇటీవలే బెయిల్పై విడుదలై బయటకి వచ్చినట్లు వివరించారు. ఓ హత్య చేసింది తానే అని ఒప్పుకోవాలని శివ సింగ్ను కప్తాన్ సింగ్ బెదిరించినట్లు పేర్కొన్నారు. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా -
జిన్పింగ్కి వ్యతిరేకంగా నిరసనలు...ఈడ్చుకెళ్లి చితకబాది...: వీడియో వైరల్
బ్రిటన్: యూకేలోని మాంచెస్టర్లోని చైనా దౌత్య కార్యాలయం వద్ద చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి వ్యతిరేకంగా కొంతమంది నిరసనలు చేపట్టారు. ఈ మేరకు ఆ నిరసనకారులు రాయబార కార్యాలయం గేటు వద్ద జిన్పింగ్ ఫోటోతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేసి... ఒక గుంపుగా నిరసనలు చేపట్టి చోరబడేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న మాంచెస్టర్ పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని నియంత్రించే నిమిత్తం వారిపై దాడి చేశారు. చైనాలోని పాలక కమ్యునిస్ట్ పార్టీ చైనాని నాశనం చేస్తుందంటూ విమర్శిస్తూ....కిరీటాన్ని ధరించి ఉన్న జిన్పింగ్ ఫోటో పోస్టర్లను పట్టుకుని నిరసనలు చేశారు. దీంతో మాంచెస్టర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన అక్టోబర్16, 2022న ఆదివారం మధ్యాహ్నా 3 గం.లకు జరిగిందని తెలిపారు. ఈ విషయమై మాంచెస్టర్లోని చైనా దౌత్యకార్యాలయం, బీజింగ్లోని విదేశీ కార్యాలయం ఇంకా స్పందించాల్సి ఉంది. 1) Shocking video showing someone from the #China's Consulate in Manchester, UK, kicking down pro-democracy signs. A protestor then appears to have been dragged behind the Consulate gates and beaten by consulate staff. Via @McWLuke pic.twitter.com/FJ03xMm9fT — Trending News (@Trendings911) October 17, 2022 (చదవండి: ఆ దేవాలయంలో బుద్ధుడికి వైన్ని నైవేద్యంగా ఎందుకు పెడతారంటే......) -
అల్లరి చేస్తున్నారని.. విద్యార్థులను చితకబాదిన హెచ్ఎం
సాక్షి, ఖమ్మం: పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వస్తున్నా... మిగతా వారిలో మార్పు రావడం లేదు. దండన లేని బోధన అందించాలని ప్రభుత్వం, విద్యారంగ నిపుణులు చెబుతున్నా ఉపాధ్యాయులు తీరు మార్చుకోవడం లేదు. ఖమ్మం 4వ డివిజన్ పాండురంగాపురం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాఠశాలలోని 5వ తరగతిలో 22మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, మంగళవారం మధ్యాహ్నం పిల్లలు అల్లరి చేస్తున్నారంటూ తరగతి గదికి చేరుకున్న హెచ్ఎం చంద్రు.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదాడు. ఆ సమయంలో గది తలుపులు మూసి మరీ కొట్టడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా రోదించారు. పిల్లలను విపరీతంగా కొట్టడంతో శరీరంపై వాతలు తేలగా పాఠశాల సమయం ముగిసినా ఇంటికి వెళ్లకుండా రోదిస్తూ కూర్చున్నారు. దీంతో కొందరు తల్లిదండ్రులు చేరుకోగా విషయం తెలియడంతో మిగతా వారికి కూడా సమాచారం ఇచ్చారు. ఈమేరకు తల్లిదండ్రులంతా చేరుకుని ప్రధానోపాధ్యాయుడు చంద్రుపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. కొందరు ఆయనపై చేయి కూడా చేసుకున్నట్లు తెలిసింది. చివరకు హెచ్ఎం దివ్యాంగుడని తోటి ఉపాధ్యాయులు నచ్చచెప్పడంతో తల్లిదండ్రులు రెండు గంటల అనంతరం శాంతించారు. ఇటీవలే ఆయన బదిలీల్లో భద్రాది కొత్తగూడెం జిల్లా నుండి పాండురంగాపురం వచ్చారు. ఈ ఘటనపై ఎంఈఓ శ్రీనివాస్ను ఫోన్ ద్వారా వివరణ కోరగా తనకు విషయం ఇప్పుడే తెలిసిందని, పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకుంటానని వెల్లడించారు. చదవండి: పెంపుడు కుక్క చనిపోయిందని.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య -
డోంట్ బీ ప్రాంక్..సరదా కాస్త సీరియస్ ఇష్యూగా..
సాక్షి, హైదరాబాద్, హిమాయత్నగర్: అది జడ్చర్ల బస్టాండ్. గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా కొందరు యువకులు ప్రత్యక్షమై భిక్షాటన పేరిట ప్రయాణికులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ప్రారంభించారు. డబ్బులు అడుక్కుంటూ మహిళల పాదాల మీద పడ్డారు. వీరి ప్రవర్తన శృతి మించడంతో ప్రయాణికుల్లో సహనం నశించి వారిని పట్టుకుని చితకబాదారు. దాంతో యువకులు ఇదంతా ప్రాంక్ అని రహస్యంగా వీడియో చిత్రీకరణ చేస్తున్నామని వివరించారు. దీంతో మరింత అసహనానికి గురైన ప్రయాణికులు వారిని పోలీసులకు అప్పగించబోయారు. అయితే వారు కాళ్లావేళ్లా పడి బతిమాలాడడంతో వదిలేశారు. ఒకటి కాదు రెండూ కాదు ప్రాంక్ వీడియోల పేరిట పలువురు చెలరేగిపోతున్న సంఘటనలు నగరం చుట్టుపక్కల తరచు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో ప్రాంక్ వీడియో సృష్టించిన వివాదంతో మరోసారి ఈ ప్రాంక్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. . ప్రాంక్...యాక్... ఇలాంటి వీడియోలకు మంచి వ్యూస్ వస్తుండడంతో అనేక మంది యూ ట్యూబర్స్ ప్రాంక్ బాట పడుతున్నారు. వీరిలో కొందరు పరిధిలో ఉండి పెద్దగా ఇబ్బంది పెట్టని ప్రాంక్ వీడియోలు చేస్తుండగా మరికొందరు మాత్రం మరీ బరి తెగిస్తున్నారు. ఓ లేడీ యూట్యూబర్ తాను చేసే ఓ గేమ్షో కోసం జనాల మధ్య వీడియోస్ చేస్తుంది. మెట్రో రైలులో కింద కూర్చుని కర్చీఫ్ వేసుకుని అడుక్కోవడం మొదలుకుని మెట్రో రైలులో వీరి టీమ్కు చెందిన అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకోవడం, ఇతరులను ముద్దు అడగడం వంటివీ చేయిస్తోంది. ఫిర్యాదు చేస్తే చర్యలు... ప్రాంక్ వీడియోల పేరుతో పబ్లిక్ ప్రదేశాలు సహా ఎక్కడా అశ్లీలం, అభ్యంతరకరమైన కార్యకలాపాలకు పాల్పడకూడదు. ఇటీవల ఇలాంటి వీడియోలు యూట్యూబ్లోనూ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ప్రాంక్స్ వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రై మ్ ఏసీపీ -
మహిళతో అసభ్యకర ప్రవర్తన.. పోలీసును చెప్పుతో కొట్టిన వీరనారి..
లక్నో: అతనో పోలీస్.. ప్రజలకు రక్షణగా ఉండాల్సిందిపోయి.. తాగిన మైకంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను బలంగా తోసేశాడు.. చివరకు ఆమె వీరనారిలా పోరాడింది. అందరూ చూస్తుండగానే పోలీసును తన చెప్పుతో చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ పోలీస్ కానిస్టేబుల్ మద్యం సేవించి హల్ చల్ చేశాడు. చార్ బాగ్ రైల్వే స్టేషన్లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ప్రతిఘటనకు దిగింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు, మహిళపై తన ప్రతాపం చూపించాడు. లాఠీతో దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలో మహిళను తోసివేయగా ఆమె కిందపడిపోయింది. అనంతరం పైకి లేచిన సదరు మహిళ.. పోలీసులపై చెప్పుతో దాడికి దిగింది. ఈ సందర్భంలో వారి పక్కనే ఉన్న మరో మహిళా పోలీస్.. అతడిని వారిస్తున్న అదేమీ పట్టించుకోకుండా వారిపై కానిస్టేబుల్ దాడి చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఇతర పోలీసులు వచ్చి అతడిని అడ్డుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ తతంగమంతా అక్కడ ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. Drunk Black Sheep Beaten By Brave People. Sometimes We Need To Fight With Powerful To Raise Our Voice. Incident : Lucknow's Char Bagh station pic.twitter.com/KCPR2XBK2I — Binita Bhil (@BhilBinita) March 18, 2022 -
సెల్ఫోన్ దొంగిలించాడని కొట్టి చంపేశారు
దుండిగల్: సెల్ఫోన్ దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తిని తల్లి కొడుకులు కలిసి తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు.. హత్యానేరం నుంచి తప్పించుకునేందుకు మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు కూపీ లాగడంతో అసలు హంతకులు పట్టుబడిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురానికి చెందిన దండసాయి రమేష్ (35) వృత్తిరీత్యా హోటళ్లల్లో చెఫ్గా పని చేసేవాడు. నగరానికి వలస వచ్చిన అతను సూరారం కాలనీలో ఉంటూ స్థానికంగా ఉంటున్న హోటళ్లల్లో పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితం గండిమైసమ్మలోని జెఎంజే టిఫిన్ సెంటర్లో చెఫ్గా చేరాడు. అయితే డిసెంబరు 26న హోటల్లో సెల్ఫోన్, నగదు చోరీకి గురయ్యాయి. రమేష్పై అనుమానంతో హోటల్ నిర్వాహకుడు రాకేశ్, అతని తల్లి భాగ్యలక్ష్మి అతన్ని చేతులు కట్టేసి కొట్టారు. అయినా ఒప్పుకోకపోవడంతో వెదురు కట్టెలతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో హత్యానేరం నుండి తప్పించుకునేందుకు రాకేష్ అతని స్నేహి తులు వెంకటసాయి, వినయ్, మున్నా, సతీశ్, సంపత్, అజారుద్దీన్లు మృతదేహాన్ని బహదూర్పల్లి సాయినాథ్ సొసైటీలో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. పట్టుబడిందిలా.. సాయినాథ్ సొసైటీలోని రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దుండిగల్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేశారు. కాగా మృతుడి ప్యాంట్జేబులో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రమేష్ పలు హోటళ్లలో చెఫ్గా పని చేసేవాడని తెలుసుకున్నారు. గండిమైసమ్మలోని జెఎంజే హోటల్లో పని చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు స్థానికులను విచారించగా గొడవ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా రమేష్ను కొడుతున్న దృశ్యాలు లభించాయి. దీంతో హోటల్ నిర్వాహకుడు రాకేశ్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందాడని, మృతదేహాన్ని సాయినాథ్ సొసైటీ సమీపంలో పడేసినట్లు అంగీకరించాడు. దీంతో రాకేశ్తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా రాకేశ్ తల్లి భాగ్యలక్ష్మి పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
తప్పతాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ.. మాజీ ఎంపీని చితకబాదిన ఓనర్
చెన్నై: మందుబాబులు తప్ప తాగి.. తమ ఇంటికి బదులు వేరే వాళ్ల ఇంట్లోకి వెళ్లి.. గొడవ చేయడం.. ఆనక ఆ ఇంటి వారి చేతులో దెబ్బలు తినే సన్నివేశాలను ఎక్కువగా సినిమాలో చూస్తుంటా. రియాలిటీలో కూడా అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. మాజీ ఎంపీ ఒకరు తప్ప తాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ రచ్చ చేయడంతో ఆగ్రహించిన సదరు ఇంటి యాజమాని.. మాజీ ఎంపీని చికతబాదాడు. ఆ వివరాలు.. (చదవండి: ‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్ జాబ్ పక్కా’) ఈ సంఘటన దీపావళి పండుగ నాడు చోటు చేసుకుంది. అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్ ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ మత్తులో మదురై నీలగిరి ముత్యాలమ్మన్పేట్లోని ఓ నివాసంలోకి ప్రవేశించారు. వచ్చిన వ్యక్తి ఎంపీ అని వారికి తెలియదు. తాగిన మత్తులో వచ్చి ఉంటాడు అని భావించిన ఆ ఇంటి సభ్యులు బయటకు వెళ్లాల్సిందిగా కోరారు. కానీ గోపాలకృష్ణన్ వారి మాట వినకుండా.. ఆ ఇంట్లో రచ్చ చేశాడు. తాగుబోతు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఆగ్రహించిన ఆ కుటుంబ యజమాని ఎంపీని చితకబాదాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. (చదవండి: మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు... ) ఫిర్యాదుదారుడి ఇంటికి చేరుకున్న పోలీసులు గోపాలకృష్ణన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన మాజీ మంత్రి అని తెలిపారు. అనంతరం గోపాలకృష్ణన్ని కూనూర్ ఆస్పత్రిలో చేర్చారు. చదవండి: ‘దొంగ’ తెలివి.. అమ్మవారికి మొక్కి పని కానిచ్చేశాడు.. వైరలైన దృశ్యాలు -
వీడియో: కన్న కూతురిని చితకబాదుతూ తండ్రి పైశాచిక ఆనందం
సాక్షి, మెదక్: తాగిన మైకంలో కన్న కూతురిని తండ్రి చితకబాదిన ఘటన మెదక్ పట్టణంలో సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు. పట్టణానికి చెందిన మాడిశెట్టి నాగరాజు, భార్య మౌనిక దంపతులకు ఇద్దరు పిల్లలు. రెండు నెలలుగా నాగరాజు మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా భార్యతో ఉంటానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూతురు గగనశ్రీతో మరో మహిళ వద్దకు వెళ్లిన నాగరాజు, చిన్నారిని విచక్షణ రహితంగా చితకబాదాడు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. చదవండి: Gachibowli: భారీ చోరీకి పాల్పడిన ‘నేపాల్’ వాచ్మెన్ దంపతులు -
తాలిబన్ల అరాచకం: జర్నలిస్టులకు చిత్రహింసలు
కాబూల్: తాలిబన్లు రెచ్చిపోయారు. వారికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న మహిళల నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను చితకబదారు. రక్తమొచ్చేలా దాడి చేశారు. వారిని దాడి చేసి బంధించిన చిత్రాలను తాలిబన్లు విడుదల చేశారు. అఫ్గానిస్తాన్లో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయింది. వెస్ట్రన్ కాబూల్లోని కార్ట్-ఈ-చార్ ప్రాంతంలో బుధవారం మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను తాలిబన్లు ఎత్తుకెళ్లిపోయారు. చదవండి: లోకేశ్కి ఎలా అల్లరి చేయాలో చంద్రబాబు శిక్షణ అనంతరం ఓ గదిలో బంధించి చితకబాదారు. వారి దుస్తులు విప్పేసి రక్తమొచ్చేలా తీవ్రంగా దాడి చేశారు. తాలిబన్లు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులు తఖి దర్యాబీ, నిమతుల్లా నక్తీ. జర్నలిస్టు వృత్తిని ఎగతాళి చేస్తూ దారుణంగా హింసించారని బాధిత జర్నలిస్టులు తెలిపారు. తమ పాలనలో మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లదని తాలిబన్లు ప్రకటించారు. అయినా జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారిద్దరితో పాటు మరికొందరు జర్నలిస్టులను ఎత్తుకెళ్లి అనంతరం విడిచి పెట్టారని చెప్పారు. దర్యాబీ, నక్దీ ఓ ఛానల్లో వీడియో ఎడిటర్లుగా పని చేస్తున్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి చెర నుంచి విడుదలైన అనంతరం బాధితుడు నక్దీ మీడియాతో మాట్లాడారు. ‘ఒక తాలిబన్ నా తలపై కాలు పెట్టి నలిపేశాడు. మొఖాన్ని కూడా చిదిమేశాడు. తర్వాత తలపై తన్నాడు. నన్ను చంపేస్తారని అనుకున్నా’ అని వాపోయాడు. ‘నువ్వు వీడియోలు చిత్రీకరించవద్దు’ అని హెచ్చరించినట్లు తెలిపాడు. ఈ ఘటనపై జర్నలిస్టు లోకం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వీరిపై దాడిని జర్నలిస్ట్ లోకం ఖండిస్తోంది. Send our journalists to hospital. pic.twitter.com/W3GQ34BPtl — Zaki Daryabi (@ZDaryabi) September 8, 2021 -
కుటుంబ సభ్యుల క్రూరత్వం, ఫోన్లో మాట్లాడుతున్నారని..
భోపాల్: దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించిన వారి పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా వారి రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు, ఇంకెన్నో కార్యక్రమాలు చేపడుతున్నా అవేవి వారిని కాపాడలేకపోతున్నాయనే చెప్పాలి. ఓ వైపు బయట వాళ్ల నుంచి లైంగిక దాడులు, మరో వైపు కుటుంబ సభ్యుల నుంచి ఆచారాలు పేరుతో ఆగడాలు.. ఇలా వాళ్లపై హింసాకాండలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఓ యువతిని కుటుంబ సభ్యులే చెట్టుకు వేలాడదీసి కర్రలతో కొట్టగా.. తాజాగా సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అనే సందేహం కలిగేలా.. బంధువులతో ఫోన్లో మాట్టాడారని నేపంతో కుటుంబ సభ్యులే యువతులపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఇద్దరు యువతులు వారి బంధువులతో ఫోన్ మాట్లాడుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కోపంతో ఆ యువతులను ఇంట్లోని వారే దారుణంగా హింసించారు. కాగా వీడియో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో.. యువతులు కొట్టకండి అని కుటుంబ సభ్యులను వేడుకుంటున్నా కనికరం లేకుండా వాళ్లను కర్రలు, రాళ్ళతో కొట్టారు. వారిని హింసించిన వారిలో ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం. తాండా పోలీస్ స్టేషన్ అధికారుల ప్రకారం.. ఈ సంఘటన జూన్ 22 న పీపాల్వా గ్రామంలో జరగగా, వీడియో కాస్త జూన్ 25 న పోలీసులకు చేరింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ వీడియో వైరల్గా మారింది. I have received another complaint of a woman being brutally beaten up by a mob. If anyone can update me on this case : wrt location and date. What kind of a barbaric society have we become, the person is laughing while filming this! No fear of the law? Contempt of SC judgments! pic.twitter.com/kl1CNUIs6S— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) July 4, 2021 -
వైరల్: పాపం.. మూగజీవి.. మీరు మనుషులా.. రాక్షసులా..
తిరువనంతపురం: శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. అవి, తన యజమాని పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే, చాలా మంది డాక్టర్లు కుక్కను పెంచుకోవడం వలన మానసిక సమస్యలు, ఒత్తిడి దూరమవుతాయని చెప్తుంటారు. అయితే, ఇలాంటి మూగ జీవిపట్ల కొంత మంది యువకులు ప్రవర్తించిన తీరు షాకింగ్కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. కేరళలోని ఆదిమలాతురా అనే గ్రామానికి చెందిన క్రిస్తురాజ్ అనే వ్యక్తి లాబ్రాడార్ జాతికి చెందిన ఒక శునకాన్ని పెంచుకుంటున్నాడు. దాన్ని ‘బ్రూనో’ అని ప్రేమగా పిలుచుకునేవాడు. ప్రస్తుతం దానికి 9 ఏళ్లు. వారి ఇల్లు బీచ్కి దగ్గరగా ఉంటుంది. బ్రూనోను క్రిస్తురాజ్ కుటుంబ సభ్యులు ప్రతిరోజు బీచ్కి వాకింగ్కి తీసుకెళ్తుంటారు. అది ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉండేది. ఒకవేళ, కుక్క ఎప్పుడైనా, బయటకు వెళ్తె.. క్రిస్తు గట్టిగా పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేసేది. ఈ క్రమంలో ఒకరోజు.. బ్రూనో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. క్రిస్తురాజ్ బ్రూనోను ఎంత పిలిచిన రాలేదు. చాలా సేపు గడిచిపోయింది. దీంతో, క్రిస్తురాజ్ తనశునకాన్ని వెతుక్కుంటూ బీచ్ దగ్గరకు వెళ్లాడు. అయితే, అక్కడ సంఘటన చూసి షాక్కు గురయ్యాడు. అక్కడ ముగ్గురు యువకులు, బ్రూనోను, ఒక కొక్కెనికి వేలాడదీశారు. అంతటితో ఆగకుండా, ఒకరి తర్వాత మరొకరు ఆ కుక్కను అతి క్రూరంగా కొడుతున్నారు. పాపం.. అది ఆ దెబ్బలకు తాళలేక విలవిల్లాడుతూ.. ప్రాణాలను విడిచింది. అది చూడగానే, వణికి పోయిన యజమాని ఏంచేయాలో తెలియక, ఆ సంఘటనను వీడియో తీశాడు. ఇంటికి చేరుకున్న తర్వాత తన సోదరితో జరిగిన దారుణాన్ని చెప్పాడు. వెంటనే వారు, ఆ ముగ్గురు దుర్మార్గులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఆ నిందితులను అదుపులోనికి తీసుకుని, జంతులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద పలు కేసులను నమోదు చేశారు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఆ దుర్మార్గులను చంపేయాలి..’, ‘మూగజీవి పట్ల అంత క్రూరంగా ఎలా ప్రవర్తించారు..’, ‘బ్రూనోకు న్యాయం జరగాలి..’ ‘ఘోరం.. మీరు మనుషులా.. రాక్షసులా..అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అందుకే నా పిల్లలతో కలిసి అశ్లీల వీడియోలు చూస్తా.. -
వైరల్ వీడియో: పోలీస్పై గ్రామస్థుల విచక్షణ రహిత దాడి
-
Viral Video: పోలీస్ అధికారిపై కర్రలతో గ్రామస్తుల దాడి
భోపాల్: విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారిపై స్థానికులు విచక్షణ రహితంగా దాడికి తెగబడిన ఘటన శుక్రవారం మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. భోపాల్కు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛతర్పూర్లోని జామ్తులి గ్రామంలో కోవిడ్ కర్ఫ్యూని ఉల్లంఘించి కొంతమంది వ్యక్తులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన గ్రామంలోని కొంతమంది మూకుమ్మడిగా పోలీస్ దగ్గరకు వెళ్లి అతనిపై దాడికి తెగబడ్డారు. కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొడుతూ విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను జాతీయ మీడియా సంస్థ తన ట్విటర్లో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరలవుతోంది. 7 సెక్షన్ల నిడివిగల ఈ వీడియోలో గాయాలతో పోలీస్ కిందపడిపోయి లేవడానికి ఇబ్బందిపడుతున్నట్లు కనిపిస్తోంది. అంతేగాక పోలీస్ను కొట్టడానికి వచ్చిన వారిలో ఓ వ్యక్తికి తలపై గాయాలయి ఉన్నాయి. కాగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, స్థానికులు మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. అయితే, ఈ దాడికి పాల్పడిన వారిలో ఏ ఒక్కరూ కూడా మాస్క్ ధరించలేదు. దీనికితోడు వారంతా అసభ్య పదజాలంతో మాట్లాడటం కెమెరాలో రికార్డయ్యింది. కాగా పోలీస్ ఓ వ్యక్తి తలపై పోలీస్ గట్టిగా కొట్టాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అందుకే అతనిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. కానీ పోలీసుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తను కేవలం షాప్లు మూసేయాలని చెప్పినందుకు కోపంతో తనపై దాడి చేశారని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై డీఎస్పీ శశాంక్ విలేకరులతో మాట్లాడుతూ.. జామ్తులి గ్రామంలో కోవిడ్ కర్ఫ్యూ ఉల్లంఘించబడుతోందని తమకు సమాచారం అందిందన్నారు. వెంటనే పోలీసులు బృందం అక్కడికి వెళ్లిందని, దుకాణాలను మూసివేయమని చెప్పడంతో కొంతమంది కోపం తెచ్చుకొని సిబ్బందిని కొట్టారని వెల్లడించారు. తామింకా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు, పూర్తి వివరాలు సేకరించగా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement