-
హైదరాబాద్ మేయర్గా రామ్మోహన్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్గా రామ్మోహన్ను, డిప్యూటీ మేయర్గా బాబా ఫసియుద్దీన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండింటినీ కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్ఎస్ 99 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం జీహెచ్ఎంసీ సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్పొరేటర్లు నాలుగు భాషల్లో ప్రమాణం చేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. మేయర్గా చర్లపల్లి కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ పేరును వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవిత ప్రతిపాదించగా, మీర్ పేట్ కార్పొరేటర్ అంజయ్య బలపరిచారు. మేయర్ పదవికి ఇతరులెవరూ పోటీపడకపోవడంతో రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ మేయర్గా బోరబొండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పేరును అమీర్ పేట్ కార్పొరేటర్ శేషుకుమారి ప్రతిపాదించగా, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి బలపరిచారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. -
'గ్రేటర్' మేయర్గా బొంతు రామ్మోహన్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్గా బాబా ఫసియుద్దీన్ లకు పట్టం కట్టడం ఖాయమైంది. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్ఎస్ ఏకంగా 99 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో... మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ ఆ పార్టీకే దక్కాయి. చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్గా బొంతు రామ్మోహన్, బోరబండ కార్పొరేటర్ గా ఫసియుద్దీన్ గెలుపొందారు. కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక భేటీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు కూడా తీసుకున్న మంత్రి కేటీఆర్... టీఆర్ఎస్ కార్పొరేటర్లతో గురువారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని అన్నీ తానై వ్యవహరించిన కేటీఆరే మేయర్ ఎన్నికల బాధ్యతను కూడా చూసుకున్నారు. సీఎం కేసీఆర్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పేర్లను ఖరారు చేయగా కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ వారి పేర్లను ప్రకటించారు. గ్రేటర్ మేయర్గా రామ్మోహన్, డిప్యూటీ మేయర్గా బాబా ఫసియుద్దీన్ పేర్లను మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిపాదించగా, కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ' ౩ నెలల్లో స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. వచ్చే 3 నెలల్లో జీహెచ్ఎంసీలో పదవులు అన్నీ భర్తీ చేస్తాం. ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు ముందుండాలి' అని అన్నారు. భేటీ తర్వాత కార్పొరేటర్లంతా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. -
‘గ్రేటర్’ మేయర్ బొంతు రామ్మోహన్ ?
- డిప్యూటీ మేయర్గా బాబా ఫసియుద్దీన్! - టీఆర్ఎస్ కార్పొరేటర్లతో నేడు మంత్రి కేటీఆర్ ప్రత్యేక భేటీ - ఉదయం 11 గం.కు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక - ఎక్స్అఫీషియో సహా మొత్తం ఓట్లు 217... - ఇందులో టీఆర్ఎస్కు ఉన్నవి 134 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై గులాబీ జెండా గురువారం అధికారికంగా ఎగరనుంది. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్ఎస్ ఏకంగా 99 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో... మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ ఆ పార్టీ చేతుల్లోనే ఉండనున్నాయి. ఈ పదవులు ఎవరిని వరించనున్నాయన్న దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వె లువడలేదు. అయితే పార్టీ వర్గాల సమాచారం మేరకు... చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన బొంతు రామ్మోహన్ను మేయర్ పదవికి, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ను డిప్యూటీ మేయర్ పదవికి దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి పేర్లను పార్టీ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గురువారం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. అంతకంటే ముందు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. నేడు కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక భేటీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు కూడా తీసుకున్న మంత్రి కేటీఆర్... టీఆర్ఎస్ కార్పొరేటర్లతో గురువారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని అన్నీ తానై వ్యవహరించిన కేటీఆరే మేయర్ ఎన్నికల బాధ్యతను కూడా చూస్తున్నారు. మరోవైపు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పేర్లను ఖరారు చేశారని చెబుతున్నారు. గురువారం ఉదయం జరిగే కార్పొరేటర్ల సమావేశంలో వారి పేర్లను ప్రకటించే అవకాశముంది. ఈ భేటీ తర్వాత కార్పొరేటర్లంతా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకుంటారు. పదకొండు గంటలకు జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికకు సంబంధించి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు టీఆర్ఎస్ బుధవారం విప్ జారీ చేసింది. ఏకగ్రీవమే నూటా యాభై డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీలో సగానికిపైగా అంటే 76 డివిజ న్లను గెలుచుకున్న పార్టీ మేయర్ స్థానానికి సరిపడా మెజారిటీ సాధించినట్లు లెక్క. టీఆర్ఎస్ ఏకంగా 99 డివిజన్లలో గెలుపొందింది. టీడీపీ ఒక స్థానంలో, కాంగ్రెస్ రెండు, బీజేపీ నాలుగు, ఎంఐఎం 44 స్థా నాల్లో గెలుపొందాయి. అంటే టీఆర్ఎస్ మినహా ఏ ఇతర పార్టీ పోటీపడే అవకాశం లేకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ఈ ఎన్నికలో జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషి యో సభ్యులుగా ఓట్లున్న ఎమ్మెల్యేలు, ఎం పీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీల ఓట్లు అవసరం ఉండడం లేదు కూడా. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో 67 ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లున్నాయి. వారి ఓట్లనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 217 ఓట్లు అవుతున్నాయి. టీఆర్ఎస్కే అత్యధికంగా 35 మంది ఎక్స్అఫీషియో సభ్యులున్నారు. వీరినీ కలుపుకొంటే టీఆర్ ఎస్ ఏకంగా 134 ఓట్లతో ఇతర పార్టీలకు అందనంత దూరంలో ఉంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక లాంఛనప్రాయమే .
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement