'ఒవైసీకి తగిన సమాధానం చెప్పారు' | Sakshi
Sakshi News home page

'ఒవైసీకి తగిన సమాధానం చెప్పారు'

Published Wed, Apr 15 2015 5:16 PM

'ఒవైసీకి తగిన సమాధానం చెప్పారు'

ముంబై: ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీకి ముస్లిం ఓటర్లు తగిన విధంగా సమాధానం ఇచ్చారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. తమ పార్టీకి భారీగా ఓట్లు వేసి ఎంఐఎం స్థానం ఏమిటో చూపించారని ఎద్దేవా చేశారు. బాంద్రా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో శివసేన అభ్యర్థి తృప్తి సావంత్ భారీ మెజార్టీతో గెలుపొందారు.

శివసేన పార్టీ పులి అని, తమను ఆపడం ఎవరి తరం కాదని ఈ విజయం రుజువు చేసిందన్నారు. ఈ గెలుపు ఘనత తమకు ఓటేసిన ప్రజలు, పార్టీ కార్యకర్తల, విధేయులకు చెందుతుందని ఠాక్రే అన్నారు. అయితే తన ఓటమికి ఎవరినీ నిదించనని శివసేన చేతిలో పోడిన కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ రాణె అన్నారు. గెలుపోటములు ఎన్నికల్లో భాగమేనన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement