మెదక్ రూరల్ : ఎర్తింగ్ లోపం కారణంగా ఊరంతా విద్యుత్ షాక్ రావడంతో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చౌట్లపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. కాగా కొద్ది రోజులుగా గ్రామంలో ఎర్తింగ్ లోపం కారణంగా విద్యుత్ షాక్ వస్తోంది. శుక్రవారం కూడా ఊరంతా షాక్ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన మిద్దింటి ముత్యం (45) సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గుైరె కిందపడిపోయాడు.
దీంతో కుటుంబ సభ్యులు అతడిని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన చాకలి లింగం సైతం సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. చీమల చంద్రయ్య ఇంట్లో స్విచ్ ఆఫ్ చేస్తుండగా షాక్ తగిలింది. కొంటూర్ భూమయ్య, కొంటూర్ అశోక్, గుంజరి భిక్షపతి, పాతూర్ యాదమ్మలతో పాటు పలువురు విద్యుదాఘాతానికి గురయ్యాడు. శుక్రవారం ఒక్క రోజే సెల్ఫోన్ చార్జర్లు, టీవీలు, రైస్ కుక్కర్లు, డిష్లతో పాటు పలువురి ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు మొత్తం కాలిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాన్స్కో అధికారులు గ్రామంలో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. గత ఆరునెలల క్రితం ఇదే మాదిరిగా షాక్ వచ్చిందని అప్పట్లో ట్రాన్స్కో అధికారులు సమస్యను పరిష్కరించారు. అయితే కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెల కొందని గ్రామస్తులు తెలిపారు.
సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ వినాయక్రెడ్డి, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మి, ట్రాన్స్కో ఏడీ రామచంద్రయ్య, ఏఈ తిరుపతయ్యల గ్రామానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుదాఘాతానికి గుైరె మృతిచెందిన ముత్యం మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రి తరలించారు. మృతుడికి మతిస్థిమితం లేని భార్య లక్ష్మితో పాటు 20 ఏళ్ల లోపు వ యస్సు గల ముగ్గురు కుమారులున్నా రు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ మేకల సునీత, ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్లు కోరారు.
ఎస్ఐ ఔదార్యం : నిరుపేద కుటుంబానికి చెందిన మిద్దింటి ముత్యం విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడగా ఆయన కుటుంబం స్థితిగతులను తెలుసుకున్న రూరల్ ఎస్ఐ వినాయక్రెడ్డి రూ. 5,000 ఆర్థిక సాయాన్ని మృతుడి కుటుంబానికి అందించి ఔదార్యాన్ని చాటుకున్నాడు.
ఎర్త్ లోపం వల్లే షాక్ : గ్రామంలోని పలు ఇళ్లకు విద్యుత్ షాక్ రావడానికి కారణం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ లోపం కారణంగానే గ్రామానికి షాక్వచ్చిందని ట్రాన్స్కో ఏడీ రామచంద్రయ్య తెలిపారు. కాగా విద్యుత్ శాఖ నుంచి రూ. లక్ష మృతుడి కుటుంబానికి ఇప్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఊరంతా విద్యుత్షాక్ : ఒకరు మృతి
Published Fri, Nov 28 2014 11:04 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement