మరికల్: వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ కొందరు దళారులు నిరుద్యోగ యువకులకు మాయమాటలు చెప్పి అక్క డకు తీసుకెళ్లిన తర్వాత నానా ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితుల కథనం ప్రకారం.. కోయిల్కొండ మండలానికి చెందిన పి.నరేష్కు ధన్వాడ మండలం తీలేర్కు చెందిన రాజుతో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి పల్లెగడ్డలోని నిరుద్యోగులైన ఆంజనేయులు, రాఘవేంద్ర, మోహన్కు జార్ఖండ్ రాష్ట్రం లోని ప్రోడెక్ట్ కంపెనీలో ఉదోగ్యం కల్పిస్తామని, కంపెనీ నుంచి నెలకు 12 వేల రూపాయల వేతనం చెల్లిస్తామంటూ నమ్మబలికి వారి నుంచి (బ్యాంకు ఖాతా నం.62157561841కు) రూ.తొమ్మిది వేల చొప్పున డీడీ కట్టించుకుని ఈనెల 8న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైల్లో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని హజరాబాగ్కు తరలించి ఓ గదిలో బంధించి తమ కంపెనీలో చేరిన ప్రతి ఒక్కరూ మరో నలుగురితో డీడీ కట్టించాలని ఒత్తిడితెచ్చారు. ఇలా 16 మందిని చేర్పిస్తే ఉన్నతమైన ఉదోగ్యం ఇస్తామంటూ ఆశలు రేపారు. శిక్షణ పొందిన తర్వాత కంపెనీ నుంచి సరఫరా చేసే సబ్బులు, షాంపులు, టూత్పేస్ట్లపై ఎంఆర్ఎఫ్ స్టిక్కర్లు వేయాలని ఉచిత సలహాలిచ్చారు.
ప్రతిరోజూ ఒకేపూట అన్నం పెట్టడమేగాక కుంటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినా బెదిరించేవారు. తమ సెల్ తీసుకోవడంతో అనుమానం వేసిన బాధితులు ఆంజనేయులు, రాఘవేంద్ర వారి నుంచి ఎలాగో తప్పించుకుని ఈ నెల 15న స్వగ్రామానికి చేరుకోవడంతో అసలు విషయం బయటపడింది. కోయిల్కొండ మం డలం కొత్లాబాద్, మక్తల్ మండలం జవ లాపూర్, దేవరకద్ర మండలం గూర కొండకు చెందిన కొందరు నిరుద్యోగు లు ఉన్నారని మంగళవారం ఇక్కడ విలేకరులకు బాధితులు తెలిపారు. కాగా, వారి బారి నుంచి తమ బిడ్డలు ప్రాణాలతో బయటపడటమే తమకు సంతోషంగా ఉందని బాధిత తల్లిదండ్రులు చెప్పారు.
వారం రోజులు నరకం చూపారు
వారంరోజుల పాటు కంపెనీ వారు మాకు నరకం చూపారు. సరైన సమయానికి అన్నం పెట్టే వారుకాదు. కడుపు కాల్చుకుని బిక్కు, బిక్కుమంటూ కాలం వెళ్లదీశాం. ఇది నకిలీ కంపెనీ అని తెలిసిన తర్వాత ఎలాగోలా వారం రోజులక్రితం తప్పించుకుని స్వగ్రామం చేరుకున్నాం. మాతోపాటు వివిధ జిల్లాలకు చెందినవారు సుమారు 200మంది ఉన్నారు. రోజూ ఒకరిద్దరు వచ్చి మరో నలుగురితో డబ్బులు చెల్లించి ఈ కంపెనీలో చేర్పించేలా చూడాలని ఒత్తిడి చేసేవారు. కుంటుంబ సభ్యులతో మాట్లాడితే సెల్ఫోన్ లాక్కునేవారు. బయటకు వెళితే వెంబడి ఏడుగురిని కాపాలా పంపిస్తుండేవారు.
- ఆంజనేయులు, బాధితుడు, పల్లెగడ్డ
జార్ఖండ్లో ఉద్యోగాలిప్పిస్తామని మోసం..!
Published Wed, Jul 23 2014 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement