ఆ ముఖ్యమంత్రి తప్పుకోవాల్సిందే: కాంగ్రెస్ | Sakshi
Sakshi News home page

ఆ ముఖ్యమంత్రి తప్పుకోవాల్సిందే: కాంగ్రెస్

Published Tue, Jun 30 2015 4:55 PM

ఆ ముఖ్యమంత్రి తప్పుకోవాల్సిందే: కాంగ్రెస్

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాజస్థాన్లోని దోల్పూర్ ప్యాలెస్ ప్రభుత్వ ఆస్తి అని, రాజె కుటుంబం దీన్ని అక్రమంగా పొందారని పునరుద్ఘాటించింది. ఈ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది.

దోల్పూర్ ప్యాలెస్కు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కొత్త  డాక్యుమెంట్లను విడుదల చేశారు. దోల్పూర్ ప్యాలెస్లోని చరాస్థులపై మాత్రమే రాజె కొడుకు దుష్యంత్ సింగ్, ఆయన తండ్రి హేమంత్ సింగ్ ఓ అంగీకారానికి వచ్చినట్టు దస్తావేజుల్లో ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ప్యాలెస్ ప్రభుత్వానికి సంబంధించినదేనని చెప్పారు.

Advertisement
Advertisement