'పర్యాటక క్షేత్రంగా సింహాచలం' | Sakshi
Sakshi News home page

'పర్యాటక క్షేత్రంగా సింహాచలం'

Published Tue, Sep 1 2015 12:17 PM

Ganta Srinivasa rao visits simhachalam

విశాఖపట్నం: సింహాచల భూములు  క్రమబద్దీకరణ వల్ల దాదాపు 2,500 మందికి లబ్ధి చేకూరిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం విశాఖపట్నం జిల్లా సింహాచలంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ... సింహాచల క్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. తిరుపతి వర్సిటీ తరహాలో 100 ఎకరాలలో వర్శిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని చెప్పారు. సింహాచలం సొరంగ మార్గం ఏర్పాటుపై తర్వలోనే పీఠాధిపతులు, మఠాధిపతులతో సమావేశం కానున్నట్లు గంటా శ్రీనివాసరావు చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement