→రూ.కోటి విలువైన స్థలం కబ్జాకు యత్నం
→బోరు తీసి, చురుగ్గా నిర్మాణ పనులు
→స్థల రక్షణదారుని ఫిర్యాదుతో బాగోతం బట్టబయలు
→కటకటాల పాలైన భూకబ్జాదారు
పీఎం పాలెం(భీమిలి): సూమారు రూ.కోటి విలువ చేసే భూమిని దర్జాగా కబ్జా చేయడానికి యత్నించి కథ అడ్డం తిరగడంతో ఓ పెద్దమనిషి కటకటాల పాలయ్యాడు. మధురవాడ నార్త్ జోన్ ఏసీపీ నాగేశ్వరరావు సామవారం సాయంత్రం పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ బండారు మహేశ్వరరావు తన కుమార్తె సుమలతకు పీఎం పాలెం తులసీనగర్ సర్వే నంబరు 53/3లో ప్లాట్ నంబరు 77లో 340 చదరపు గజాల స్థలం గిఫ్ట్డీడ్ కింద ఇచ్చారు. ప్రస్తుతం ఆమె భర్తతో పాటు అమెరికాలో ఉంటున్నారు. నగరంలోని పెదవాల్తేరులో నివసిస్తున్న ఆమె మామ చుక్క అప్పలప్రకాశరావు సదరు స్థలం వద్దకు అప్పుడప్పుడూ వస్తూ చూస్తున్నారు.
కబ్జాకు స్కెచ్ ఇలా..
ఇదిలా ఉండగా ఈ భూమిని కొట్టేయడానికి అక్కయ్యపాలెంలో నివసిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన గంధంనేని సూర్యమణిధర్మరాజు కొంతమంది స్థానికుల సహకారంతో పథకం రచించాడు. బండారు మహేశ్వరరావు.. మొయ్యి వాసంతి అనే మహిళకు 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చినట్టు అనామతు పత్రం సృష్టించాడు. సుమారు 10 రోజుల కిందట ఆక్రమించిన భూమిలోకి దర్జాగా ప్రవేశించి బోరు తీయించాడు. అంతటితో ఆగకుండా బేస్మెంట్ నిర్మాణపు పనులు కూడా చేపట్టాడు. విషయం తెలుసుకున్న అప్పల ప్రకాశరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సీఐ కె.లక్ష్మణమూర్తి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సూర్యమణిధర్మరాజును కబ్జా స్థలంలోనే సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రిమాండుకు తరలించామని ఏసీపీ తెలిపారు.
డామిట్.. కథ అడ్డం తిరిగింది
Published Tue, Mar 14 2017 1:40 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement