సెన్సెక్స్ కు 106 పాయింట్ల నష్టం! | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ కు 106 పాయింట్ల నష్టం!

Published Wed, Aug 20 2014 4:14 PM

సెన్సెక్స్ కు 106 పాయింట్ల నష్టం!

హైదరాబాద్: ఆరు రోజుల వరుస నష్టాలకు తెరదించుతూ భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 106 పాయింట్ల నష్టంతో 26314 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి 7875 వద్ద క్లోజయ్యాయి. ఆయిల్ గ్యాస్, ఆటో, కాపిటల్ గూడ్స్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించాయి. 
 
సన్ ఫార్మా, సిప్లా, లుపిన్, టాటా పవర్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ లాభాల్ని నమోదు చేసుకోగా, ఓఎన్ జీసీ, ఐడీఎఫ్ సీ, టాటా మోటార్స్, అల్ల్రాటెక్ సిమెంట్స్, ఎంఅండ్ ఎం కంపెనీలు నష్టాలతో ముగిసాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement