గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్‌ సీపీ | Sakshi
Sakshi News home page

గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్‌ సీపీ

Published Sun, Sep 3 2017 3:38 PM

విలేకరులతో మాట్లాడుతున్న పార్థసారధి - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వంగవీటి రంగాపై తమ పార్టీ నేత పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ ఖండించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. గౌతంరెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్టీ నేతలు ఏ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డికి వంగవీటి రంగా మంచి స్నేహితుడని గుర్తు చేశారు. వంగవీటి రంగాను తాము ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటామన్నారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని పార్థసారధి తెలిపారు.
 

Advertisement
 
Advertisement