6న అఖిలేష్ను కలవనున్న వైఎస్ జగన్

6న అఖిలేష్ను కలవనున్న వైఎస్ జగన్ - Sakshi


హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న లక్నో వెళ్లనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను ఆయన కలవనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని యూపీ సీఎంను జగన్ కోరనున్నారు. లక్నో వెళ్లేందుకు జగన్కు సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు అనుమతి మంజూరు చేసింది.



రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడంలో భాగంగా జగన్ రేపు చెన్నైకు వెళ్లనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆయన కలుస్తారు. చెన్నై వెళ్లడానికి సోమవారం కోర్టు అనుమతిచ్చింది. జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడను 5న (గురువారం) బెంగళూరులో కలిసేందుకు అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top